ఆర్టీసీకి లైన్ క్లియర్..విలీనానికి జగన్ ఒకే

తాను మాటా మీద నిలబడే వ్యక్తినని మరోసారి ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు. మాట ఇచ్చినట్టు గానే ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖ గా మార్చేందుకు మొదటి అడుగు పడింది. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ, వీసీ నేతృత్వంలో విజయవాడ ఆర్టీసీ బస్ భవన్ లో జరిగిన పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీలో పని చేస్తున్న ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి కార్మికుడు వరకు మొత్తం 52 వేల మందిని పీటీడీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సిబ్బంది పదవీ విరమణ వయస్సుని 60కి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికీ పాలక మండలి పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న 2015 నాటి సర్క్యులర్ను రద్దు చేసినట్లు సమాచారం. అదే విధంగా గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చే ఇంక్రిమెంట్ను శాశ్వతం...