పోస్ట్‌లు

అక్టోబర్ 10, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సౌదీ మహిళలకు సర్కార్ బంపర్ ఆఫర్

చిత్రం
అరబ్ దేశాలు అంటేనే జనం జడుసు కుంటారు. కారణం ఏమిటంటే ఆయా దేశాలలో ఎక్కడా లేని రీతిలో చట్టాలు, కఠినతరమైన నియమ నిబంధనలు ఉంటాయి. అది జగమెరిగిన సత్యం. ఏదైనా లేదా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చావు పలకరిస్తుంది. జనం ముందే శిక్షలు అమలు చేస్తుంది అక్కడి ఆర్మీ. ప్రపంచంలోని ప్రతి కంట్రీ కూడా ఇదే పద్దతిని అనుసరిస్తూ వస్తోంది అనాదిగా. అయితే సౌదీ అరేబియా మిగతా ముస్లిం దేశాలకు భిన్నంగా, విస్తు పోయేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అక్కడి యువరాజు ప్రజలకు మేలు చేకూర్చే పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో మహిళలు బయటకు రావాలంటే నానా ఇబ్బందులు పడేవారు. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటం, పరదాలు లేకుండా ప్రయాణం చేయడం, షాపింగ్ లాంటివి చేయకూడదు. క్రీడల్లో వీరు పాల్గొనేందుకు ప్రవేశం ఉండేది కాదు. కానీ సౌదీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మహిళలు పరదాలు ధరించకుండానే ఎక్కడికైనా వెళ్లవచ్చంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని, విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటే తమ ప్రభుత్వం అందుకు తగ్గట్టు సహాయం కూడా చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు అక్కడి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. యువరాజు పై తమ కృతజ్ఞత...

సామాన్యుల కోసం మహాప్రసాదం

చిత్రం
ప్రపంచంలోనే సంపన్నమైన దేవదేవుడిగా పేరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రతి రోజు లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. కోట్లాది మందికి ఆయన ఇష్టదైవం. కాలి నడకన ప్రతి రోజు వేలాదిగా నడిచి క్యూ ద్వారా దర్శించుకుంటారు. కొన్ని తరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. లెక్కించ లేనంతగా నోట్ల కట్టలు, దాచు కోలేనంతగా ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, కోట్లు పలికే ఆస్తులు, స్థలాలు, ఆలయాలు ఉన్నాయి. సామాన్యుల నుంచి బడా బాబులు, ధనవంతుల దాకా స్వామి, అమ్మవార్ల కృప కోసం వేచి చూస్తారు. గతంలో దివంగత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలను పలుమార్లు దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన భక్తుల ఇబ్బందులను దగ్గరుండి చూసి చలించి పోయారు. ఎక్కడినుంచో, సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసల కోర్చి తిరుమలకు వస్తే ఇక్కడ కనీస వసతులు లేకపోవడం ఏంటని ఈవోను ప్రశ్నించారు. అంతే కాకుండా నిత్యం అన్నదానం జరిగేలా చూడాలని ఈఓ కేఆర్కే ప్రసాద్ ను ఆదేశించారు. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధ మానమై వేల భక్తుల నుంచి లక్షకు చేరుకుంది. దీంతో పాటు తిరుమలకు వచ్చే వారిని ఎక్కువగా ఆకట్టుకునేది లడ్డు ప్రసాదం. ఇక...

అమ్మ దయ కోసం భక్తజనం

చిత్రం
విజయదశమి ముగిసినా ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన దుర్గామాత దర్శనం కోసం భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రద్దీ పెరిగింది. కాగా యథావిధిగా నిజ రూపంలోనే అమ్మ వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాధారణ భక్తులతోపాటు భవానీ దీక్ష చేపట్టిన భక్తులు భారీ సంఖ్యలో అమ్మ వారి కృప కోసం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు అమ్మ వారి నినాదాలతో దద్దరిల్లాయి. కేశ ఖండనశాల, స్నాన ఘాట్‌లు భక్తులతో పూర్తిగా నిండి పోయాయి. గత నెల 29న దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా జగన్మాత కనకదుర్గమ్మ తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా, రెండవ రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో, మూడవ రోజు గాయత్రీ దేవిగా దర్శనం ఇచ్చారు. ఇక నాల్గవ రోజు అన్నపూర్ణ గా, ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి రూపం లో, ఆరవ రోజు మహాలక్ష్మి గా , ఏడవ  రోజు సరస్వతీదేవి గా, ఎనిమిదో రోజు దుర్గాదేవి గా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని అలంకారాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. విజయదశమి రోజు  రాజ రాజేశ్వరి దేవిగా భక్తులను కరుణించింది. దశమి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారి ప్రధాన ఆలయంలో నిలుపుదల చేసిన నిత్య ఆర్జిత సేవలను పునర...

మయాంకా..మజాకా..!

చిత్రం
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియాదే పై చేయి సాధించింది. మొదటి టెస్ట్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న భారత జట్టు రెండో టెస్టు లోను తన సత్తా చాటింది. మొదటి టెస్ట్ లో శతకాలతో దుమ్ము రేపిన రోహిత్ శర్మ ఆరంభం లోనే వెనుదిరిగినా, విశాఖ లో డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ మరోసారి తన ఫామ్ ను కొనసాగించాడు. రెండో టెస్టులో మరో సెంచరీ సాధించాడు. మయాంక్ తో చటేశ్వర్ పుజారా తోడవ్వడంతో టీమిండియా పటిష్టమైన స్థితికి చేరుకుంది. వీరిద్దరూ పెవిలియన్ దారి పట్టాక బరిలోకి దిగిన జట్టు సారథి విరాట్ కోహ్లీ, ఉప సారథి అజింక్యా రహానే సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. కాగా వెలుతురు సరిగా లేక పోవడంతో తొలి రోజు ఆటను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపి వేశారు. పుజారా, కోహ్లీ లు ఆఫ్ సెంచరీలు చేశారు. మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేశారు. ఈ మొత్తం ఆటలో ప్రధానంగా మయాంక్ అగర్వాల్ మెరిశాడు. తన ఆట తీరుతో అభిమానులను అలరించాడు. తనకు అచ్చోచ్చిన పూణే పిచ్ పై రెచ్చి పోయాడు. మైదానం నలువైపులా షాట్స్ కొట్టాడు. 195 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 1...

సర్కార్ తీరుపై హైకోర్టు సీరియస్

చిత్రం
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని సార్లు కోర్టు మెట్టి కాయలు వేసినా చలనం కనిపించడం లేదు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. సంస్థలో పనిచేస్తున్న వారంతా మాజీ ఉద్యోగులేనని, ఇక వారు సంస్థ ఉద్యోగులు కారని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంబంధిత మంత్రి అజయ్ కుమార్ తో పాటు రవాణా, ఆర్టీసీ, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదే అదనుగా జనం నుంచి ప్రైవేట్ వాహనదారులు అందినంత దోచుకుంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం దాని వైపు కన్నెత్తి చూడటం లేదు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, పిలిస్తే వస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేసినా స్పందించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మొత్తం కార్మికులు, సిబ్బంది రోడ్డెక్కారు. తమ ఆందోళనను ఉదృతం చేశారు. అకారణ సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే సమ్మెను విరమించేలా చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన స్టూడెంట్ హైకోర్టు లో రిట్ పిటిషన్ దా...

సమ్మె తీవ్రతరం..తగ్గని ప్రభుత్వం..పరిస్థితి ఉద్రిక్తం

చిత్రం
తెలంగాణాలో రోజు రోజుకు బతికే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని తరాల పాటు కాపాడుకుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు అంపశయ్యపై నిలబడింది. గత పాలకుల అవినీతికి తోడు ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం వేలాది మంది కార్మికులు సమ్మె చేసేలా, ఆందోళనలు చేపట్టేలా చేసింది. గతంలో పలుసార్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం తో పాటు రాష్ట్ర కార్మిక శాఖకు అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కార్మికులు పోరాటబాట పట్టారు. పండుగ వేళ పస్తులున్నారు. తమ సంస్థను ప్రభుత్వ పరం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నోటీసులో పేర్కొన్నారు. అయినా సీఎం డోంట్ కేర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరం చేయబోమని, 50 శాతం ప్రైవేట్ పరం చేస్తున్నట్లు సెలవిచ్చారు. దీనిపై ప్రజాప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు. ఇరు వైపు వాదనలు విన్న కోర్టు 15 వరకు తీర్పు వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్, వాహనాలలో అధిక చార్జీలు వసూలు చేస్తూ జనా...

అదును చూసి దెబ్బకొట్టిన ఆర్ఐఎల్

చిత్రం
భారతీయ టెలికాం రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సబ్ స్క్రైబర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముంబైలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రిలియన్స్ జియో ఊహించని రీతిలో ప్రత్యర్థి కంపెనీలను దెబ్బ కొట్టింది. తక్కువ ఖర్చుకే ఎక్కువ డేటా వినియోగం తో పాటు అపరిమితంగా ఏ టెలికాం ఆపరేట్ కైనా ..లేదా ఏ నెట్ వర్క్ కైనా ..ఎక్కడినుంచి..ఎక్కడికైనా మాట్లాడు కోవచ్చు అంటూ ఆఫర్స్ ప్రకటించింది. దీంతో బంపర్ ఆఫర్స్ కు ఆకర్షితులైన లక్షలాది మంది ఇతర నెట్ వర్క్ ల నుండి జియో నెట్ వర్క్ కు మారి పోయారు. ఒక్క ఏడాదిలోనే 34 కోట్లకు చేరుకుంది వీరి సంఖ్య. ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ , టాటా టెలికాం, భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ నుంచి అధిక శాతం టెలికాం వినియోగదారులు రిలయన్స్ జియో కు మారారు. దీంతో ఆర్ఐఎల్ జియో షేర్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఓ వైపు భారతీయ మార్కెట్ పూర్తిగా కుదుపునకు లోనవుతున్న తరుణంలో ఆర్ఐఎల్ షేర్స్ మాత్రం దూసుకు వెళ్లాయి. ఇదే సమయంలో  అంతా ఫ్రీ అనే సరికల్లా జనం విరగబడి జియో ను ఎంచుకున్నారు. ముంబయిలో ఆర్ఐఎల్  కంపెనీ భారీ ఎత్తున లాంచ్ చేసింది. ఈ సందర్బంగా ఎంతో ఆర్భాటంగా ఆఫర్స...

కత్తుల కరచాలనం కానుందా శాంతివనం

చిత్రం
దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. అంతర్జాతీయ వేదికపై యుఎన్ సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై నిప్పులు చెరిగారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిరాధారమైన విమర్శలు గుప్పించారు. అయినా ఇండియా ఎక్కడా చెక్కు చెదరలేదు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులను పెంచి పోషిస్తున్న తీరును ఎండగట్టింది. అంతే కాకుండా ఆధారాలతో నిరూపించింది. దెబ్బకు అప్పటి దాకా బీరాలు పలికిన ఇమ్రాన్ ఖాన్ కు సభ్యదేశాలు సైతం మద్దతివ్వలేదు. దీంతో పాక్ కు ఒక్క చైనా తప్పా ఏ అరబ్ కంట్రీ కూడా డోంట్ కేర్ అన్నాయి. నిన్నటి దాకా వంత పాడిన అమెరికా సైతం ఇండియాకు సపోర్ట్ గా నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండియాతో సమావేశమై సమస్యను పరిష్కరించు కోవాలని సూచించింది. ఆ మేరకు మోడీకి పూర్తి మద్దతు ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. దీంతో పాటు మరో అగ్ర రాజ్యం రష్యా సైతం ఇండియాకు మద్దతు తెలిపింది. జమ్మూ, కాశ్మీర్ అన్నది భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేశారు ప్రెసిడెంట్ పుతిన్. దీంతో ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఒంటరిగా మిగిలి పోయింది. ఇదే సమయంలో నిన్నటి దాకా పాక్ కు వంత పాడిన చైనా ఉన్నట్టుండి త...

మెగాస్టార్ పై తమిళసై ప్రశంసల జల్లు

చిత్రం
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహ్మ రెడ్డి సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుని కలెక్షన్స్ లో సునామి సృష్టిస్తోంది. అయిదు భాషల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. రాయలసీమకు చెందిన మొదటి సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమాను తీశారు. దాదాపు కొన్నేళ్లుగా ఈ కథ నడుస్తూ ఉన్నది. చరిత్ర పుటల్లో ఉన్నప్పటికినీ రావాల్సినంత ప్రచారం రాలేదు ఆ మహా యోధుడికి. ఒక పాలేరుగా ఉంటూ బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన వీరుడిగా ఇప్పటికీ రాయలసీమలో కథలు కథలుగా చెప్పుకుంటారు అక్కడి జనం. ఆనోటా ఈనోటా విని తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్ మెగాస్టార్ చెవిలో పడేశారు. ఎన్నేళ్లయినా సరే ఆ ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి కథను నువ్వు మాత్రమే చేయగలవని చెప్పారు. దీనిని చిరంజీవి సీరియస్ గా తీసుకున్నారు. కానీ సినిమా తీయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. వందల కోట్ల బడ్జెట్. వేరే వాళ్ళు రాని పరిస్థితి. ఇంతగా ఖర్చు చేసి తీస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న అనుమానం ఇంకో వైపు. అన్నిటికంటే ఆ పోరాటపు యోధుడి గురించి ఎవరు తీయగలరు అని పలుమార్లు చిరంజీవి ఆలోచించారు. సడన్ గా ఆయన తన ఆలోచనలను కొడుకు...

అందం అద్భుతం..నటన మహాద్భుతం

చిత్రం
ఎక్కడ ఉన్నదో తెలియదు. కానీ సహజమైన నటనకు ప్రతి రూపంగా నిలిచింది అనన్య. ఐటి ఉద్యోగం చేస్తున్న ఆమెను మల్లేశం సినిమాలో నటించేలా చేశాడు దర్శకుడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. జాతీయ స్థాయిలో అవార్డు కూడా దక్కించుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణకు చెందిన చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందింది. పూర్తిగా సామాజిక బాధ్యతతో దీనిని తీశారు దర్శకుడు. ఈ చిత్ర కథ 1980-1990 ల మధ్య కాలం లోనిది. నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామం. ఆ గ్రామస్తుల్లో మల్లేశం కుటుంబం నేత పని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా ఆ గ్రామంలో చాలా మంది ఇదే వృత్తిలో జీవనం సాగిస్తూ అప్పుల్లో కూరుకు పోతారు. అయితే మల్లేశం చిన్నతనం నుంచి అమ్మ లక్ష్మీ ఆసు పని చేయడంతో చేయి నొప్పి లేస్తుంటుంది. భుజం కూడా పడి పోయే స్థితికి వస్తుంది. ఆ ఊర్లో చాలా మందిది అదే పరిస్థితి. అమ్మ పడే కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. మల్లేశం పెద్దయ్యాక ఒక్కొక్క ఆలోచనతో ఆసు యంత్రం వైపు అడుగులు వేస్తాడు. ఆ యంత్రాన్ని తయారు చేయడానికి ఊర్లో అప్పులు చేస్తాడు. ఆసు య...

అమెరికాను దాటేసిన సింగపూర్

చిత్రం
ప్రపంచ పోటీతత్వ సూచీలో ఊహించని రీతిలో అగ్ర రాజ్యం అమెరికాను దాటేసింది సింగపూర్ కంట్రీ. కాగా గత ఏడాది ఐదు పాయింట్లు సాధించిన భారత దేశం మాత్రం మరోసారి నిరాశ పరిచింది. ఏకంగా పది స్థానాలు దిగజారి 68 వ స్థానానికి పడి పోయింది. ప్రతి ఏటా ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రపంచ వ్యాప్తంగా ర్యాంక్ లు ఇవ్వడం పరిపాటిగా వస్తూనే ఉన్నది. తాజాగా 2019 సంవత్సరానికి గాను ఆయా దేశాలకు సంబంధించిన ప్లేస్ లను వెల్లడించింది. 71 వ స్థానంతో బ్రిక్స్ దేశాలలో బ్రెజిల్ చివరి స్థానంలో నిలిచింది. ఇక 28 వ ప్లేస్ లో చైనా ఉండగా, శ్రీలంక 84 వ స్థానంతో సరి పెట్టుకుంది. బాంగ్లాదేశ్ 105 స్థానంతో సరి పెట్టుకోగా నేపాల్ కంట్రీ మాత్రం 108 ప్లేస్ లో వుండి పోయింది. మార్కెట్ పరంగా , స్థూల ఆర్ధిక వ్యవస్థలో ఇండియా స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థను కుంగదీస్తున్న నిరర్ధక ఆస్తులు, రుణాలు ఎగవేతదారుల సమస్యలు ఇబ్బందులు పెడుతున్నప్పటికినీ భారత్ ప్రగతి దారుల్లో అడుగులు వేస్తోందని స్పష్టం చేసింది ఈ సంస్థ. ఇక కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా చూస్తే ఇండియా గణనీయమైన స్థానాన్ని సాధించింది. ఏకంగా 15 వ ప్లేస్ లో నిలిచింది. షేర్ హ...