పోస్ట్‌లు

ఆగస్టు 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బిగ్ పై కన్నేసిన అమెజాన్ ..?

చిత్రం
ప్రపంచం లోని లాజిస్టిక్ రంగంలో టాప్ పోజిషిన్ లో ఉన్న అమెజాన్ కంపెనీ ప్రత్యర్థి కంపెనీల నుండి పోటీని తట్టుకునేందుకు పావులు కదుపుతోంది. వ్యాపార రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న సదరు కంపెనీ ఇండియాలో మొదటి శ్రేణి లో కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇప్పుడు ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే లభిస్తోంది. రిటైలింగ్ సెగ్మెంట్ పరంగా  తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది . తాజాగా ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో వాటా కొనడానికి ఈ ఈకామర్స్ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది మొదట్లో ఉన్నప్పటికి త్వరలో డీల్ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇండియా రిటైల్‌‌ మార్కెట్‌‌లో స్థానం సంపాదించు కోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చర్చలు ఫలవంతం అయ్యే దిశలో ఉన్నప్పటికీ ..ధర , వాల్యూ విషయం లోనే ఇంకా సందిగ్థత నెలకొంది . మార్కెట్ లో ఇప్పటికే బిగబజార్ కు భారీ ఎత్తున వినియోగదారులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఊరికి అమెజాన్ తన వస్తువులను డెలివర్ చేస్తోంది. ఒక రోజు లేదా రెండు రోజుల్లో చేరవేస్తుంది. ఇందు కోసం లేటెస్ట్ టెక్నాలజీ ని అమెజా...

మహిళలకు వీ - హబ్ వెన్ను దన్ను

చిత్రం
ఐడియా వుంటే చాలు ఇక రుణాల కోసం , డబ్బుల కోసం , పెట్టుబడి కోసం ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు. మీదైన ఆలోచన సమాజానికి ఉపయోగ పడేలా , జీవితానికి మేలు చేకూర్చేలా..పధి మందికి ఉపాధి కల్పించేలా ..మోర్ ఇన్నోవేటివ్ గా వుంటే చాలు ..మీరు ఆంట్రపెన్యూర్స్ గా మారేందుకు వీ - హబ్ తోడ్పాటు అందిస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచలు కలిగిన వారి కోసమే టి - హబ్ ను ఏర్పాటు చేసింది . అది సక్సెస్ కావడంతో ప్రత్యేకించి కేవలం మహిళల కోసమని వీ - హబ్ కు శ్రీకారం చుట్టింది . దీంతో సాంకేతికంగా ఐడియా ఉందా లేదా అన్నది ముందుగా అనుభవం కలిగిన టీం పరిశీలిస్తుంది . అది వయబుల్ అనిపిస్తే వెంటనే కావాల్సినవన్నీ అక్కడే సమకూరేలా చేస్తుంది. దీని వల్ల టైం సేవ్ అవుతుంది. కేపిటల్ దొరకదన్న బెంగ ఉండదు. దీంతో ఎవరైతే డిఫరెంట్ గా ఆలోచిస్తారో , తమ ఆలోచన రేపటి రోజుల్లో పనికి వస్తుందని భావిస్తారో వారు తప్పకుండా ప్రయత్నం చేస్తే మంచి సపోర్ట్ ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ పైరవీలు, దళారీల వ్యవస్థ ఉండదు. జస్ట్ మీకు మీరే పరిశీలించుకుని ముందుకు ధైర్యంతో వెళ్లగలిగితే చాలు వీ - హబ్ తోడుగా నిలుస్తుంది. అంతే కాకుండ...

సేమ్ సీన్ .. ఇండియానే విన్..!

చిత్రం
మాంచి ఊపు మీదున్న టీమిండియా జట్టు వెండీస్ పై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది . ఎప్పటి లాగానే సారధి కోహ్లీ సెంచరీ సీజేయగా శ్రేయస్ అయ్యర్ 65 పరుగులు చేసి రాణించారు . ముందుగా మైదానంలోకి దిగిన విండీస్  35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్ గేల్, లూయిస్ లు రెచ్చి పోయారు. భారత బౌలర్ల భరతం పట్టారు . వర్షం రావడంతో ఓవర్లను కుదించారు . డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోహ్లీ సేన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైంది. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగి రెండు ఓవర్లు ముగిసే లోపే వర్షం రావడం ..తిరిగి స్టార్ట్ కావడం జరిగింది . 22 ఓవర్‌లో మరోసారి వాన రావడంతో కొద్దీ సేపు ఆగి పోయింది . గేల్  కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. నిర్దేశించిన  ఓవర్లలో వెస్టిండీస్‌ 7 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. టార్గె...

కవ్విస్తున్న పాక్..సై అంటున్న భారత్

చిత్రం
ఓ వైపు స్వాతంత్ర దినోత్సవ వేళ .. దాయాది పాకిస్తాన్ కవ్వింపులకు దిగుతోంది. యుద్దానికి సిద్ధమేనంటూ సంకేతాలు ఇస్తోంది. ఈ మేరకు ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాతో వార్ కు రెడీగా ఉన్నామని , ఇందు కోసం దేశ సైనికులు , ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధమంటూ వస్తే అంతు తేలుస్తామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దెబ్బకు దెబ్బ తప్పదని , గుణపాఠం చెప్పేందుకు తమ ఆర్మీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోందని చెప్పారు. తాజాగా ఇండియా జమ్మూ , కాశ్మీర్ ను మూడు విభాగాలుగా చేసింది. ఈ విషయంపై అటు అమెరికాకు , యుఎన్ఓ కు ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేక పోయింది.  తాము కోరితే తప్పా ఎలాంటి  జోక్యం చేసుకోబోమని ఆ దేశ ప్రెసిడెంట్ ట్రాంప్ స్పష్టం చేశారు . నిన్నటి దాకా తమకు అండగా ఉంటుందని భావించిన పాక్ కు  యుఎస్ కోలుకోలేని షాక్ ఇచ్చింది . రష్యా కూడా ఇండియా చేసింది కరెక్టేనని, అది ఆ దేశ ఆంతరంగిక వ్యవహారమని ప్రెసిడెంట్ పుతిన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికపై దీనిని ఓ సమస్యగా చిత్రీకరించాలని అనుకున్న పాకిస్థాన్ కు గర్వభంగం కలిగింది. చైనా కూడా మౌనం వహించింది. మోడీ మాత్రం దీని గురించి పల్లె...

ప్రకృతి ప్రకోపం..కడలి కల్లోలం..బతుకంత కష్టం

చిత్రం
నిన్నటి దాకా వర్షాల కోసం ఎదురు చూసిన జనం ఇప్పుడు వరుణదేవుడు దెబ్బకు తల్లడిల్లి పోతున్నారు. ఎటు చూసినా నీళ్ళే..ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రెండు తెలుగు రాష్ట్రాలు నిండు కుదనల్ని తలపింప చేస్తున్నాయి. భారీ ఎత్తున ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణమ్మ ఇటు తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. బీచుపల్లి వద్ద శివాలయం వరకు నీళ్లు రాగా, పసుపుల వద్ద ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ , జూరాల , శ్రీశైలం కు వరద నీరు పోటెత్తింది. దీంతో ఆయా ప్రాజెక్టుల నీటి పారుదల అధికారులు గేట్లను ఎత్తి వేశారు. గత కొంత కాలంగా ఆశించినంత మేర వానలు పలకరించలేదు. ఎన్నడూ లేనంతగా ఎండలు దెబ్బకొట్టాయి. వర్షపు జాడలు లేక జనం అల్లాడి పోయారు . సాగు మాట దేవుడెరుగు , కనీసం తాగేందుకు నీళ్ళయినా ఈసారి వస్తాయో లేదోనని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కృష్ణ జిల్లాలోని దిగువ ప్రాంతాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే  26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో తో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది .దీంతో దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు నీటిని వదిలారు. టెయిల్ పాండ్ మీదుగా పులిచింత...

నర్సాన్నా నీకో సలాం..!

చిత్రం
ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు..తరాలకు సరిపడా సంపాదించుకుంటున్న రోజులివి. కానీ ఆయన మాత్రం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాదా సీదాగా ఉంటారు .హంగు ఆర్భాటం అంటూ ఏదీ ఉండదు. వచ్చిన నాలుగు డబ్బులు పార్టీ కోసం ఇస్తారు . ఉన్న పొలం చేసుకుంటూ వచ్చిన దానితో బతుకుతున్నారు. ధర్మం గతి తప్పి , నీతి , నిజాయితీ అంటూ లేకుండా పోయిన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. ఎందరికో స్ఫూర్తి కలిగిస్తూ పదవి అంటే హోదా కోసమో , డబ్బులు సంపాదించుకునేందుకు కాదని..ప్రజలకు సేవ చేయడమేనని చేసి చూపిస్తున్నారు..ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. పలు మార్లు శాసన సభ్యుడిగా గెలుపొందినా ఏరోజు రాజసాన్ని ప్రదర్శించ లేదు. గెలిచినప్పుడు గర్వ పడ లేదు. ఓడి పోయినప్పుడు దిగులు చెందలేదు. పని చేయడం , ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉండటం . జనం కోసం పని చేయడమే పెట్టుకున్నారు. పని మీద హైదరాబాద్ కు వచ్చినప్పుడు నర్సయ్య బస్సులో వస్తారు. లేదంటే రైలులో ప్రయాణం చేస్తారు. ఎమ్మెల్యేలైనా, మాజీ లైనా మంది మార్బలం తో పాటు లెక్క లేనన్ని వాహనాలు ఉంటాయి . కానీ ఆయన ఒక్కరే వస్తారు. ఒంటరిగానే వెళతారు . తాజాగా నగరంలో అరుదైన ...

అతడంటే హడల్ .. పేరు చెబితే హల్ చల్

చిత్రం
ఇండియాలో కంటే దాయాది దేశాలకు అతడి పేరు చెబితే చాలు గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఇంతగా భయపడేందుకు కారణమవుతున్న ఒకే ఒక్క పేరు ..అతడే జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ కుమార్ దోవల్. ప్రతి భారతీయుడు ఆయనను చూసి గర్వపడుతున్నారు. ప్రేమగా ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుచుకుంటున్నారు. ఎక్కడా ఎక్కువగా మాట్లాడక పోవడం , పక్కాగా స్కెచ్ వేయడం, ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం అజిత్ కు వెన్నతో పెట్టిన విద్య. మోదీ దేశ ప్రధానమంత్రి గా రెండో సారి బాధ్యతలు చేపట్టాక సైనిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మోదీ  దోవల్ కు కీలక పదవి కట్టబెట్టారు. అంతకు ముందు,  జాతీయ గూఢ చర్య విభాగానికి అజిత్ కుమార్ అధిపతిగా పని చేశారు. ప్రస్తుతం ఆయనకు 74 ఏళ్ళు. ఎన్నో అవార్డులు , పురస్కారాలు అందుకున్నారు. అన్నిటికంటే ఆయన దేశభక్తుడు. ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు,   దశాబ్ద కాలం పాటు ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు  నిర్వర్తించారు. స్వంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌. 23 ఏళ్లకే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పని చేయడంతో అజ్మీర్‌లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుక...