పోస్ట్‌లు

అక్టోబర్ 12, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

గీడ మీ గూండాగిరీ చెల్లదు..కేసీఆర్ సీరియస్

చిత్రం
మీరు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చెయ్యండి. కానీ మీ గూండాగిరీ, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెల్లవ్. ఉద్యమం చేసినా ప్రభుత్వం చలించదు. డిపోల వద్ద అరాచకం చేస్తే సహించం. ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించం. వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. చర్చలు ఉత్తి మాట. మూడు రోజుల్లో బస్సులన్నీ తిరుగుతాయి. తాము లేకుంటే ఆర్టీసీ నడవదని అనుకుంటున్నారు. ఎలా నడవదో నేను చూస్తా. ఉద్యమిస్తామని యూనియన్ నేతలు చెబుతున్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్‌ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించం. గీడ మీ గూండాగిరీ నడవదు. ఇంత దాకా ఓపిక వహించాం. ఇక నుంచి ఉపేక్షించం. మరింత కఠినంగా ఉండబోతున్నాం. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా అరెస్టులు చేస్తాం. జైళ్లకు తరలిస్తాం. ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాం. మరిన్ని కొత్త బస్సులు నడుపుతాం. కొత్త వారిని తీసుకుంటాం. కాదని అడ్డంకులు సృష్టిస్తే తగిన గుణపాఠం నేర్పుతామని తీవ్ర హెచ్చరికలు చేశారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ సమ్...

ప్రేమ పావురమా..స్నేహ గీతమా

చిత్రం
ఏ ముహూర్తాన ఉదయ్ శంకర్ స్టార్ టీవీకి సీఇఓగా వచ్చాడో ఇక దాని స్వరూపమే పూర్తిగా మారి పోయింది. భారతీయ వినోద రంగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చేలా చేశాడు. అంతేనా ఏకంగా సౌత్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. తెలుగులో మాటీవీని భారీ డబ్బులు పెట్టి తీసుకున్నాడు. ఇంకేం ఎక్కడో ఉన్న దానిని ఇప్పుడు తెలుగు బుల్లి తెరపై దుమ్ము రేపేలా చేశాడు. అంతే కాదు డిఫ్ఫరెంట్ ప్రోగ్రామ్స్ కు ఊపిరి పోస్తోంది మా టీవీ యాజమాన్యం. జనరంజకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మా టీవీ. మొత్తం దాని రూపు రేఖలు హై రేంజ్ ను తలపింప చేస్తున్నాయి. అంతే కాదు పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంతో టాప్ పొజిషన్ కు చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ దుమ్ము రేపుతోంది. కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా ఆదరణ లో మాత్రం దూసుకెళుతోంది. ఇదే సమయంలో బిగ్ బాస్ లోని పార్టిసిపెంట్స్ లలో కేవలం ఇద్దరిపైనే ఎక్కువగా ఫోకస్ అయ్యింది. వారెవ్వరు అంటే ప్రముఖ సింగర్ , తెలంగాణ పోరడు, యూత్ ఐకాన్ రాహుల్ సిప్లిగంజ్ ఉండగా మరొకరు వర్ధమాన నటి పునర్నవి భూపాళం. వీరిద్దరూ మొదట అంతగా మాట్లాడు కోలేదు. కానీ ఉన్నట్టుండి మెలమెల్లగా ప్ర...

మరాఠాలో పోరు రసవత్తరం

చిత్రం
మరాఠాలో ఎన్నికల పోరు మరో యుద్ధాన్ని తలపింప చేస్తోంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, శివ సేన ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుండగా కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి బరిలో నిలిచాయి. ఎవరికి వారే గెలుపు తమదే అంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత దేశంలో బలమైన ఆర్ధిక వ్యవస్థకు పునాదిగా మరాఠాకు పేరున్నది. ఆర్థికంగా, వ్యాపారంగా, వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో ముంబై ప్రథమ స్థానంలో కొనసాగుతూ వస్తోంది. బీజేపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కొలువై ఉన్నది. ఇందులో భాగంగా ఈ నాలుగు పార్టీలే అక్కడ కీలకం. ముంబయిలో ప్రధానంగా సినిమా పరిశ్రమ టాప్ లో ఉన్నది. దీనిపై ఆధారపడి బతుకుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు దివంగత నాయకుడు బాల్ థాకరే మనుమడు ఆదిత్య థాకరే. ఆయన మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా శివసేన పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కేవలం 10 రూపాయలకే భోజనం అందజేస్తామని, ఒక్క రూపాయికే అన్ని వైద్య సేవలు ఇస్తామని శివసేన అధిన...

గుండెల్ని మీటిన పునర్నవి

చిత్రం
తెలుగు బుల్లితెరపై వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న బిగ్ బాస్ పార్టిసిపెంట్ పునర్నవి భూపాళం ఉన్నట్టుండి ఎలిమినేట్ కావడం విస్తు పోయేలా చేసింది. నటిగా తనకంటూ ఓ ప్లేస్ ను ఏర్పాటు చేసుకున్న పునర్నవి రియాల్టీ షో పూర్తి అయ్యేంత వరకూ ఉంటుందని అంతా భావించారు. తన మీద తనకు ఉన్న నమ్మకం, జీవితం పట్ల తనకున్న పట్టు ఆమెను ఆకట్టుకునేలా చేసింది. 100 రోజుల ఎపిసోడ్ లో దాదాపు 11 వారల పాటు కాంపిటేషన్ లో నిలుస్తూనే వచ్చింది. అందరి కంటే పునర్నవి .. రాహుల్ మధ్య కొంత కెమిస్ట్రీ జనాన్ని ఎక్కువగా మెస్మరైజ్ చేసింది. ఈ ప్రోగ్రాం లో పునర్నవి రాహుల్ ను ముద్దు పెట్టు కోవడం సంచలనం కలిగించింది. యూట్యూబ్ లో అంతటా వైరల్ గా మారింది. అదే ట్రోల్ అయ్యింది కూడా. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడం తనకు ఏమీ బాధ కలిగించ లేదన్నారు. తన లైఫ్ లో మరిచిపోలేని సన్నివేశం ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడమేనని అన్నారు. తనకు లోపట ఒకటి బయట ఒకటి మాట్లాడటం రాదని, ఎంతైనా లౌక్యం కూడా ఉండాలన్నారు పునర్నవి. చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉండడంతో ఇబ్బందిగా అనిపించిందన్నారు. డిగ్రీలో సైకాలజీ చదవడం కూడా బిగ్ బాస్ లో డిఫెరెంట్ గ...

ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ - సమ్మె అప్రజాస్వామికం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉగ్ర రూపం దాల్చుతోంది. బీజేపీ ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి కార్యక్రమం మూడు గంటలకు పైగా సాగింది. పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తో పాటు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, పిఓడబ్ల్యూ లీడర్ పద్మ, తదితరులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లక్ష్మణ్ సొమ్మసిల్లి పడి పోయారు. తర్వాత కొలు కోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీ కేంద్ర ప్రెసిడెంట్ నడ్డా ఫోన్ లో లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అధికార పార్టీ తప్పా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, మహిళా, విదార్థి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు తమ మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా రవాణా శాఖా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడారు. కార్మికులు చేస్తున్న సమ్మె అప్రజాస్వామికమని చెప్పారు. ఏనాడు ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తానని చెప్పలేదన్నారు. చర్చలకు పిలిచినా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రాలేదని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ప్రస్తుతం నెలకొన్న ఆర్టీసీ సమ్మెపై సమీక్షించారు. ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఉ...

బాలీవుడ్ ను షేక్ చేస్తున్న వార్

చిత్రం
బాలీవుడ్ వర్గాలు విస్తుపోయేలా చేసింది వార్ సినిమా. ఇప్పటికే విడుదలైన అన్ని చోట్లా కోట్లు కొల్లగొడుతోంది. బాక్సాఫీస్‌ వద్ద వార్‌ తన హవాను కొనసాగిస్తోంది. ఈనెల గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన వార్‌ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది. విడుదలైన తొలి వారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 300 కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకు వెళుతోంది. ఈ మూవీ ప్రతిరోజు 9 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తూ పోతోంది. ఇప్పటికే 250 కోట్లు దాటేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో మంచి సినిమాలు లేక పోవడం కూడా వార్ సినిమాకు కలిసొచ్చింది. ఈ మూవీని తెలుగు, తమిళ్‌ భాషల్లో  విడుదల చేశారు. మొదటి రోజు నుంచే వసూళ్లు అదర గొట్టింది. పెట్టిన పెట్టుబడి పూర్తి గా తిరిగి రావడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్‌ రోషన్‌, యువ సంచలనం టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో ఈ సినిమా తీశారు. ఈ యాక్షన్‌ మూవీ ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ పేరు మీదున్న రికార్డ్ ను బ్రేక్ చేసి రెండో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలబడింది. ఇక 2019లో బాలీవుడ్‌ లో కబీర్ సింగ్ సినిమా అత్యధికంగా 379 కోట్లు వసూలు చేసింది. అయిత...

బస్ భవన్ ఉద్రిక్తం..సమ్మె తీవ్రతరం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రతరమైంది. ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆందోనళకు విపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మెట్టు దిగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకోబోమంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్తగా బస్సులతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులను, సంబంధిత శాఖా మంత్రిని ఆదేశించారు. దీనిపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సమ్మెపై ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రోడ్లపై బస్సులు కనిపించడం లేదని, బస్సుపాసులు అనుమతించడం లేదని, చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం పూర్తి వివరాలు సమర్పించక పోవడంపై సీరియస్ అయ్యింది. అయినా సర్కార్ లో చలనం లేకుండా పోయింది. ఇంకో వైపు వేలాది కుటుంబాలు రోడ్డెక్కితే సీఎం ఉన్నట్టుండి టీజేఏసీ నేతలతో సమావేశం కావడం విస్తు పోయేలా చేసింది. వీరు కనుక ఒకవేళ ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికితే కష్టమవుతుందని పిలిచారని విపక్షాలు మండిపడ్డాయి. ఇదిలా ఉండగా అన్ని పార్ట...