పోస్ట్‌లు

సెప్టెంబర్ 12, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సౌత్ ఈస్ట్ ఏషియా నెట్ ఫ్లిక్స్ హెడ్ గా మైలీతా..ఇండియా జపం చేస్తున్న కంపెనీలు..!

చిత్రం
ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా జపం చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ , మైక్రో సాఫ్ట్ , అడోబ్ , షావోమి , లాంటి కంపెనీలన్నీ భారతీయులకు పెద్ద పీట వేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాప్ రేంజ్ లో ఉన్న గూగుల్ కు మనోడే హెడ్. అలాగే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కు కేరాఫ్ గా ఉన్నారు. ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో టాప్ రేంజ్ లోకి తీసుకు వచ్చిన ఘనత భారతీయుడిదే. డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగి పోవడంతో ప్రతి ఐటి కంపెనీ ఈ సెక్టార్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ మార్కెట్ ఉన్నది చైనా, ఇండియా, అమెరికానే. దీంతో కంపెనీలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. డిజిటల్ ఫార్మాట్ లో ఎక్కువగా మార్కెట్ వాటా కలిగి ఉన్నది అమెజాన్, నెట్ ఫ్లిక్స్ , గూగుల్ ప్లస్ , ప్రో తమ హవా కొనసాగిస్తున్నాయి. ఇక స్టార్ టీవీ గ్రూప్ ఏకంగా డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా హాట్ స్టార్ ను స్టార్ట్ చేసింది. తాజాగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఇదే రంగం లోకి ఎంటర్ అయ్యేందుకు పావులు కదుపుతోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ యాపిల్. వీడియో స్ట్రీమింగ్ రం...

పద్మ అవార్డులకు హిమదాస్ సరి పోదా..?

చిత్రం
ఈ దేశంలో కాకుండా చైనాలోనో లేదా అమెరికాలో పుట్టి వుంటే మట్టినే నమ్ముకున్న హిమ దాస్ ను ఆకాశానికి ఎత్తేసేవారు. సమున్నతంగా సత్కరించే వారు. ఎందుకంటే ఇక్కడ కులాలు, మతాల సమీకరణాల ప్రాతిపదికన పతకాలు పంచబడతాయి. అవార్డులు ఇవ్వబడతాయి.130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వేలాది మంది మాత్రమే క్రీడాకారులుగా వెలుగులోకి వస్తున్నారు. ఇంకా లక్షలాదిగా అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నన్ని రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇంకెక్కడా కనిపించవు. ఇక్కడ మీడియా కూడా  బడా బాబులకు , కంపెనీలకు వత్తాసు పలుకుతున్నాయి. వారిచ్చే బిస్కెట్స్ కోసం ఆహా ఓహో అంటూ ప్రచారం చేస్తున్నాయి. పీవీ సింధు కంటే ముందే హిమ దాస్ అయిదు బంగారు పథకాలు సాధించింది. కానీ ఆమె పేరు ఎక్కడా అగుపించలేదు. ఏదో ఓ చిన్న మూలన పది లైన్లు రాశారు. ఇదీ సమున్నత భారతం. ఇదీ మోడీ సర్కార్ చూపిస్తున్న ఔదార్యం. ఈ భూమి నాకు ఎంతో ఇచ్చింది. నేను ఎదుర్కున్న కస్టాలు, ఇబ్బందులు ఏవీ నా పట్టుదలకు అడ్డంకి కాలేక పోయాయి. నా ముందు ఒక్కటే మిగిలి ఉన్నది. అది నాకు, నా కన్నవారికి జన్మను ఇచ్చి, సమాజంలో గుర్తింపు కలుగజేసిన నా భారత దేశం మాత్రమే నా కళ్ళ ముందు నిలిచింది. నా క...

అవార్డుల రేసులో మేరీ, పీవీ..హిమ ఎక్కడ..?

చిత్రం
భారత దేశంలో క్రీడాకారులకు కొదువ లేదు. కాకపోతే రాజకీయాలు ఎక్కువ. ఏ దేశంలో లేని రీతిలో ఇక్కడ పవర్ పాలిటిక్స్ ట్రిక్స్ ప్లే చేస్తాయి. మొత్తం రాజకీయాలను పక్కన పెడితే ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఏదైనా ఉందంటే అది బీసీసీఐ మాత్రమే. అది ఎవ్వరి మాటా వినదు. దానిపై పెత్తనం చెలాయించాలని మోడీ అండ్ పరివారం చూసినా కుదరడం లేదు. ఇక ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారాలు ఎవరెవరికి దక్కుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. వీటి ఎంపికపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇక తెలంగాణ, ఏపీ ల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్లేయర్స్ ఉత్తమంగా భావించే పద్మ భూషణ్ , పద్మ విభూషణ్, పద్మశ్రీ , తదితర పురస్కారాలను త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఇక ప్రపంచ ఛాంపియన్ షిప్ లో బంగారు పతాకాన్ని సాధించిన పీవీ సింధుకు పద్మ భూషణ్ ఇవ్వాలని క్రేడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. రెండో అత్యున్నతమైన అవార్డుగా భావించే పద్మవిభూషణ్‌కు ఆరుసార్లు ప్రపంచ విజేత, బాక్సింగ్‌ క్వీన్‌ మేరీకోమ్‌ పేరును అవార్డుల కమిటీకి సిఫారసు చేసింది. పద్మశ్రీ అవార్డుకు అర్హులుగా మరో తొమ్మిది మంది క్రీడాకారుల పేర్లను పంపింది. వీరిలో ఏడుగురు మహిళలే ఉండ...

రాహల్ అవుట్..శుభమన్ ఇన్..ధోనీ వైరల్

చిత్రం
భారత్ లో పర్యటించే సౌత్ ఆఫ్రికా తో జరిగే టెస్ట్ మ్యాచ్ లకు భారత క్రికెట్ జట్టులో ఎవరెవరు ఉంటారనే ఉత్కంఠకు తెర పడింది. ఈ మేరకు బీసీసీఐ చర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ టీమిండియా ఆటగాళ్లను ప్రకటించారు. అందరూ అనుకున్నట్టుగానే ఎన్నో సార్లు అవకాశాలు ఇచ్చినా కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ప్రకటించిన జాబితాలో రాహుల్ పై వేటు పడింది. రోహిత్ ను ఓపెనర్ గా ఎంపిక చేశారు. భారత జట్టు మూడు టెస్ట్ లు సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. దీని కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది ఎంపిక కమిటీ . జట్టుకు శుభారంభాన్ని ఇచ్చేలా తిరిగి రోహిత్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. ఇదే విషయాన్నీ ఎమ్మెస్ కె వెల్లడించారు. ఇంకో వైపు పరుగుల వరద పారిస్తున్న పంజాబ్ ఆటగాడు శుభమన్ గిల్ కు టెస్టుల్లో ఆడే అవకాశాన్ని కల్పించారు. మరో వైపు మాజీ జట్టు సారధి ఎమ్మెస్ ధోనీ ఆట నుంచి తప్పుకుంటున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ దీనిని సెలెక్షన్ కమిటీ చైర్మన్ ప్రసాద్ కొట్టి పారేశారు. దేశ వ్యాప్తంగా ఆ వార్త ట్రోల్ అయ్యింది. గత నాలుగు ఇన్నింగ్స్ లలో కేవలం 25 సగటుతో 101 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ ను పక్కన పెట్టారు . కాగా వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఇండియా - ఏ ...

ఏపీలో గరం గరం తారాస్థాయికి చేరిన రాజకీయం

చిత్రం
ఏపీలో రాజకీయాలు తార స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పాలిటిక్స్ సాగుతున్నాయి. దేశ రాజకేయాలలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా, అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నారా చంద్ర బాబు నాయుడు. తొమ్మిది ఏళ్ళ పాటు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ఆయన సీఎం గా పని చేశారు. ఆయన హయాంలో రైతులపై కాల్పులు జరిగాయి. ఇదే సమయంలో తీవ్ర కరువు నెలకొనడం, తెలంగాణపై ఆధిపత్యం చెలాయించడం, వందలాది మందిని నక్సల్స్ పేరుతో కాల్చి చంపడం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీంతో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ కూడా ఇదే ధోరణి అవలంభించారు. నక్సల్స్ ను చర్చల పేరుతో ఆయన కూడా నెత్తురు పారించాడు. ఇదే సమయంలోతెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ప్రపంచం నివ్వెర పోయేలా పోరాటం జరిగింది. కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించింది. అయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆశించినంత స్పందన రాలేదు. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్, బీజేపీతో దోస్తీ కారణంగా అధికారంలోకి వచ్చారు చంద్ర బాబు. ఇదే సమయం లో కాంగ్రె...

రికార్డ్ స్థాయికి చేరుకున్న హెరిటేజ్ ఫుడ్స్ టర్నోవర్ - 80 లక్షల పెట్టుబడి ..2 వేల కోట్ల రాబడి..!

చిత్రం
భారత దేశ రాజకీయాలలో ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రారంభించిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ గణనీయమైన ఆదాయాన్ని గడిస్తోంది. 2018 -2019 సవత్సరానికి గాను సదరు కంపెనీ టర్నోవర్ 2 వేల 482 కోట్లకు చేరుకుంది. దేశంలోని 15 రాష్ట్రాలకు విస్తరించింది. పాల తయారీ, ఉత్పత్తిలో ఇప్పటి వరకు 3 లక్షల మంది పాడి రైతులు హెరిటేజ్ లో భాగస్వామ్యులుగా వున్నారు. చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫండ్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వున్నారు. రాబోయే 2024 సంవత్సరం లోపు మరో మూడు లక్షల మంది రైతులను భాగస్వామ్యం చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకుంది కంపెనీ. అందులో భాగంగానే పాడి గేదెలు, ఆవులను రైతులకు అందజేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం తమ సంస్థతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఎంఓయూ చేసుకుంటోంది హెరిటేజ్ . తాజాగా మూడు బ్యాంకులతో రైతులకు రుణాలు అందజేసేలా సంతకాలు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ లతో ప్రస్తుతానికి టై అప్ పెట్టుకుంది. తక్కువ వడ్డీకే రుణాలు రైతులకు ఈ బ్యాంకులు అందజేయనున్నాయి. ఈ పాడి రైతులు గేద...

రికార్డ్ ధరకు బాలాపూర్ లడ్డు.. శోభాయాత్ర పర్వం..భాగ్యనగరం..!

చిత్రం
గణపతి బొప్పా మోరియా అంటూ భాగ్యనగరం శోభాయాత్రతో శోభిల్లుతోంది. ఒకటి కాదు వేలాదిగా గణనాదులు నిమజ్జనానికి తండోప తండాలుగా తరలి వస్తున్నాయి. హైదరాబాద్ నగర పాలక సంస్థ, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వేలాది మంది పోలీసులను మోహరించారు. మొత్తం 40 చోట్ల వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ప్రతి చోటా సీసీ కెమెరాలు బిగించారు. ఏ ఒక్క చిన్న సంఘటన చోటు చేసుకున్నా వెంటనే పోలీస్ కంట్రోల్ రూము కు చేరుకుంటుంది. అక్కడి నుంచి మోనిటరింగ్ చేస్తారు. హైదరాబాద్ మరోసారి సాగర హారాన్ని తలపింప చేస్తోంది. ఎక్కడ చూసినా గణనాదులు, వాహనాలతో నిండి పోయింది ట్యాంక్ బండ్. జీహెచ్ఎంసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. ఆయా ప్రాంతాలలోని ఉత్సవ కమిటీలు నీళ్లు, భోజన ఏర్పాట్లు చేశాయి. నగరమంతటా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచి పోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో రహదారులు పూర్తిగా నిండి పోయాయి. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు గాను జర్మనీ నుంచి ప్రత్యేకించి క్రేన్ ను ప్రభుత్వం ఇ...