పోస్ట్‌లు

సెప్టెంబర్ 10, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బాబు గృహ నిర్బంధం..ఛలో ఆత్మకూరు ఉద్రిక్తం

చిత్రం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. తనను ఏ శక్తి అడ్డుకోలేదని, తాను ఆత్మకూరు కు వెళ్లడం ఖాయమన్నారు. ఇది చీకటి రోజుగా బాబు అభివర్ణించారు. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై మండి పడ్డారు. పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేక పోయింది. దాదాపు గంటకు పైగా బాబు కారులోనే వుండి పోయారు. మాజీ సీఎం ఇంటి తలుపులకు తాళ్లతో బిగించారు. శాంతియుతంగా తాము వెళుతుంటే అధికార పార్టీ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భాదితులకు అండగా ఉండేందుకు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి బాబు పిలుపునిచ్చారు. పెద్దఎత్తున పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు బాబు వెంట ఉన్నారు. ఆత్మకూరు కు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఇవ్వాళ కాక పోయినా, రేపైనా సరే తాను వెళ్లడం ఖాయమన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంపై బాబు ఫైర్ అయ్యారు. టీడీపీ ఛలో ఆత్మకూర్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు సైతం...

ఆర్ధిక సంక్షోభం..ఆటో సెక్టార్ పై ప్రభావం..!

చిత్రం
మోదీ దెబ్బకు దేశ ఆర్థిక రంగం కోలుకోలేని స్థితికి చేరుకుంది. దీని దెబ్బకు దేశంలో అన్ని రంగాలపై పడింది. ఇందులో భాగంగానే వాహనం రంగంపై కూడా ప్రభావం చూపింది. తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కుంటోంది ఆటో రంగం. ఆటోమొబైల్ సెక్టార్ నానాటికీ దిగజారుతోంది. గత నెలలో వాహనాల అమ్మకాలు తగ్గి పోయాయి. ప్యాసింజర్ వెహికిల్స్ , టూ వీలర్స్ కు గిరాకీ కొంచం కూడా పెరగ లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 23 శాతం అమ్మకాలు పడిపోయాయి. ఇదే రంగంలో పనిచేస్తున్న వారిలో మూడు లక్షల మందికి పైగా ఆయా వాహనాల తయారీదారులు తొలగించారు. దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో 41 శాతం తగ్గాయి. ఇదే కాలంలో టూ వీలర్ల అమ్మకాలు 22 శాతం , సీవీల అమ్మకాలు 39 శాతం తగ్గి పోయాయి. టూ వీలర్ సెగ్మెంట్ మార్కెట్ లీడర్ హీరో మోటోకార్స్ సేల్స్ 21 శాతం మేర తగ్గాయి. టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు కూడా తగ్గాయి. వాహనాలు అమ్ముడు పోక పోవడంతో యజమానులు భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తున్నారు. పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తున్నా వాహనదారుల నుండి స్పందన రావడం లేదు. దీంతో తయారీ ధరకే అంటూ తెలిపినా ఇటు వైపు చూడడం లేదు. కొత్త డిజైన్స్ , భారీ సౌక...

రా రమ్మంటున్న పాకిస్థాన్..సై అంటున్న ఇండియా

చిత్రం
దాయాది దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ కారాలు మిరియాలు నూరుతోంది. ప్రపంచ వేదిక మీద భారత్ పై దాడికి దిగుతోంది. పాక్ కుట్రలను సమర్ధవంతంగా భారత్ తిప్పి కొడుతోంది. అయినా పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. యుద్దానికి రెడీగా ఉన్నామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడో ప్రకటించారు. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ , కాశ్మీర్ అన్నది భారత్ కు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఐక్య రాజ్య సమితి లో శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ ఘాటుగా సమాధానం చెప్పారు. ఇండియా పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరో వైపు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా పేరొందిన మసూద్ అజర్ ను ఇటీవలే పాకిస్తాన్ విడుదల చేసింది. మరో వైపు అమెరికా పర్యటన సమయంలో ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో మితిమీరిన తీవ్రవాదులు ఉన్నారని స్వయంగా ఆరోపించారు. మరోసారి తన అక్కసును ఇండియాపై కక్కుతూనే ఉన్నారు. కాశ్మీర్ పై పదే పదే ఆరోపణలు చేస్తున్న  పాక్ అంతర్జాతీయ స్థాయిలో ఒంటరిగా మిగిలింది. ఒక్క చైనా దేశం మిన...

జోరుమీదున్న బీజేపీ..డిఫెన్స్ లో కాంగ్రెస్

చిత్రం
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడి కొట్టు మిట్టాడుతోంది. ఎన్నడూ లేనంతగా నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు వద్దంటూ వుండి పోతే ప్రియాంక గాంధీ మాత్రం మోడీని టార్గెట్ చేస్తోంది. చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేసే పనిని భుజాలకు ఎత్తుకుంది తల్లి సోనియా గాంధీ. ఎన్నడూ లేనంతగా ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. రాహుల్ నేతృత్వంలో ఇది జరగడంతో ఆయన పూర్తిగా పార్టీకి కొంత కాలం దూరంగా ఉన్నారు. దేశ పరిస్థితులను, రాజకీయ నేపథ్యాన్ని, ఆయా ప్రాంతాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఆ పార్టీ అధిష్టానం అంచనా వేయలేక పోయింది. ఎంత సేపు బీజేపీ దాని పరివారాన్ని , మోడీ , అమిత్ షా లను టార్గెట్ చేస్తూ పోయారు తప్పా , గ్రాస్ రూట్ లెవల్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేక పోయారు. అంతే కాకుండా బీజేపీ పక్కా ప్లాన్ తో చాప కిందా నీరులా తన కేడర్ ను బలోపేతం చేసుకుంటూ వెళితే కాంగ్రెస్ తుమ్మితే ఊడిపోయే పదవులను కట్టబెడుతూ విలువైన కాలాన్ని నిర్వీర్యం చేసింది. ఊహించని రీతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. కనీసం లోక సభలో అధికారాన్ని చేజిక్కించుక...

వెన్నెల్లో వేకువలు ఈ చిత్రాలు

చిత్రం
ప్రపంచాన్ని కాన్వాస్ లో బంధించే వాటిల్లో కెమెరా, పెన్నుతో పాటు పెన్సిల్ , బ్రష్ ..లాంటివి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలలు అంతా కంటారు కానీ కొందరే వాటిని నిజం చేస్తారు. అలాంటి వారిలో ఆర్టిస్టులు మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. వారి ప్రపంచం వేరుగా ఉంటుంది. వారి లోకం అందరికంటే భిన్నంగా కనిపిస్తుంది. కానీ ప్రతి నిమిషం ఏదో కొత్తదనం చూపించాలన్న తపన మాత్రం నిత్యం అగ్నిగుండం లాగా మండుతూనే ఉంటుంది. ఒక్కో కళాకారుడు ఒక్కో సైనికుడు. ప్రపంచాన్ని ఆవిష్కరించాలంటే బోలెడు ప్రయత్నాలు చేయాలి. పొద్దుటి నుంచి రాత్రి దాకా ఆలోచిస్తూనే ఉండాలి. గుండె మండి పోతే, మెదడు చిట్లి పోతున్నంతగా అనిపిస్తే అప్పుడు చిన్నగా చేతులు కదులుతాయి. మానవ జీవితం , ఈ అనంతమైన ప్రకృతి, నిత్యం మనల్ని చైతన్యవంతం చేసి గుండెల్లో ప్రేమను నింపే ఆ సూర్యచంద్రులు, భూమిని ముద్దాడుకుంటూ పారే సెలయేర్లు, ప్రశాంతంగా ఉంటూనే ఒక్కోసారి ఉగ్ర రూపం దాల్చే నదులు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసే ఆ మంచు కొండలు, పర్వతాలు , అలలు , ఎగసి పడే జలపాతాలు, గెంతులు వేసే లేగదూడలు, మేఘాలు , కళ్ళు జిగేల్ మనిపించే నక్షత్రాలు ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఇంకెన్న...

వ్యాపార దిగ్గజం..స్ఫూర్తి శిఖరం..జాక్ మా..!

చిత్రం
అన్నిట్లో వేలు పెడుతూ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని నిరంతరం పరితపించే అమెరికా ముగ్గురి విషయం వచ్చే సరికల్లా తొట్రుపాటుకు గురవుతూ ఉంటుంది. ఇద్దరు ఈ లోకాన్ని వీడితే ఇంకొకరు ఇప్పుడు ఈ నేల మీద వున్నారు. పెద్దన్నకు నిద్ర లేకుండా చేస్తున్న వారెవ్వరో కాదు పోరాట యోధుడు చేగువేరా అయితే , ఉద్యమ వీరుడు ఫెడరల్ కాస్ట్రో ..మరొకరు చైనాకు చెందిన వ్యాపార దిగ్గజ శిఖరం ..జాక్ మా. ఇప్పటికీ యుఎస్ కు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా వినుతి కెక్కిన జాక్ మాకు 55 ఏళ్ళు. ఒక సామాన్యుడు అసాధారణమైన రీతిలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా విస్తరించేలా చేసిన ఘనత ఆయనది. అతడు స్థాపించిన ఆలీబాబా ఇప్పుడు కోట్లు కోళ్ల గొడుతోంది. బిజినెస్ లో తనకు ఎదురే లేకుండా సాగుతోంది. జాక్ చైనాలోని హాంగ్జౌలో ఉంటున్నారు. ఆయన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి కలిగిస్తోంది. వేలాది మందికి దారి చూపుతోంది. జంగ్ యింగ్ ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఆలీబాబా వ్యాపార సంస్థలకు అధిపతిగా ఉన్నారు. అత్యున్నత కట్టుదిట్టమైన దేశంలో అంచెలంచెలుగా విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా పేరు పొందారు జ...

టాలీవుడ్ కు మోదీ బంపర్ ఆఫర్

చిత్రం
నిన్నటి దాకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఓ దుర్భేద్యమైన ప్రాంతం. అక్కడ తుపాకుల మోత, దాడులు, బాంబులు, ఉగ్రమూకల చప్పుళ్ళు తప్పా ఇంకేమీ లేదనుకునే వాళ్ళం. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర స్వంతం చేసుకున్న ఆ ప్రాంతం భారత దేశంలో అంతర్భాగమేనని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆ ప్రాంతానికి రక్షణ కవచంగా ఉన్న 370 వ ఆర్టికల్  ను రద్దు చేస్తూ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు భారత ప్రధానమంత్రి మోదీజీ. ఈ మేరకు ఇది తమకు చెందిన ప్రాంతం. ఇందులో ఏ ఒక్కరికి కానీ లేదా దాయాది దేశానికి ఇసుమంత అధికారం లేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఒక్క చైనా తప్పా ఏ ఒక్క దేశమూ పాకిస్థాన్ కు మద్దతు తెలపలేదు. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా భయపడలేదు.  ఇలాగే పిచ్చి చేష్టలు చేస్తే గనుక యుద్ధం చేసేందుకైనా తాము సిద్డంగా ఉన్నామని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఇది ముమ్మాటికీ ఈ దేశ ప్రజలది. ఇక్కడి ప్రతి నీటి బొట్టు , పిడికెడు మట్టి కూడా ఇండియాలోనిదే. కాదని ముందుకు వస్తే కాలు దువ్వడానికి సై అంటూ సవాల్ విసిరారు మోదీ. ఇన్నేళ్ళుగా జమ్మూ క...

అమెరికాలో జెండా ఎగరేసిన ఓయో

చిత్రం
హాస్పిటాలిటీ సెక్టార్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ఓయో ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాలోకి ఎంటరైంది. ప్రపంచమంతా అమెరికా జపం చేస్తుంటే ఇండియాకు చెందిన రితీష్ అగర్వాల్ హోటల్ రంగం విస్తు పోయేలా చేశాడు. ఒక భారతీయుడు సాధించిన అపూర్వ విజయం ఇది. ఇండియన్ మార్కెట్ ను చైనా కంపెనీలు డామినేట్ చేస్తుంటే మనోడి ఓయో చైనా హోటల్స్ ను ఓన్ చేసుకుంది. ఇది కూడా ఓ రికార్డ్. అమెరికాతో పాటు లాటిన్ అమెరికా కంట్రీస్ కు కూడా ఓయో వ్యాపారాన్ని విస్తరించాలని డెసిషన్ తీసుకున్నారు. ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ ప్రతి చోటా ఓయో తప్పక వుండి తీరుతుంది. హోటల్స్ మరింత ఆకర్షణీయంగా, అన్ని సౌకర్యాలు ఉండేలా తీర్చి సిద్ధేందుకు ఓయో డబ్బులు కూడా సమకూర్చుతోంది యజమానులకు. 500 సిటీస్ లలో 4 50 000 ఉన్నాయి. ఇండియాతో పాటు శ్రీలంక, చైనా, మలేషియా , యుకె , అమెరికా, యూఏఈ , సౌదీ అరేబియా, ఫిలిపైన్స్ , ఇండోనేషియా, వియత్నాం, జపాన్ దేశాలకు విస్తరించేలా చేశాడు రితీష్ అగర్వాల్ . ఓయో వ్యాపారం ద్వారా రోజుకు కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. హర్యానాలోని గూర్గావ్ కేంద్రంగా అంకుర సంస్థగా ఓయోను స్టార్ట్ చేశాడు రితీష్ . ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్...

అబ్బా ట్రాఫిక్ రూల్స్ దెబ్బ..జంకుతున్న జనం..సర్కారుకు ఆదాయం..!

చిత్రం
అభివృద్ధిలో దూసుకు వెళుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ లో మాత్రం గీత డాటా లేక పోతోంది. మెట్రో రైలు ప్రారంభామైనా ట్రాఫిక్ కస్టాలు తప్పడం లేదు. వేలాది మంది తమ అవసరాలు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం నగరంలో ప్రయాణం చేస్తున్నారు. కాస్తంత చినుకు పడితే చాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనిని ఏమాత్రం నియంత్రించలేని స్థితిలో హైదరాబాద్ నగర పాలక సంస్థ ఉంటోంది. ఉన్నది ఒకే ఒక్క దారి కావడంతో పలు చోట్ల రహదారుల విస్తరణ, నగర జనాభాకు అనుగుణంగా వసతులు లేక పోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మెట్రో వల్ల కొంత మేరకు తగ్గినా, ఐటి కంపెనీలు ఉండడంతో ఎంప్లొయీస్ ఎక్కువగా స్వంత వాహనాలను వినియోగిస్తున్నారు. తక్కువ ధరకే వాహనాలు లభిస్తుండడంతో ప్రతి ఒక్కరు వీటి ద్వారానే ప్రయాణం చేస్తున్నారు. దీంతో వాహన కాలుష్యం కూడా ఎక్కువవుతోంది. ఇదే సమయంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రస్తుత ప్రభుత్వం రవాణా శాఖా కు కొత్త మార్గదర్శకాలు నిర్దేశింది. మోటార్ రవాణా చట్టంలో మార్పులు చేసింది. రోడ్డు ప్రమాదాలు పెరిగి పోవడం, చాలా మంది వాహనదారులు చని పోవడం, మరి కొందరు తీవ్రంగా గాయ పడటం జరుగుతుండడంత...