పోస్ట్‌లు

ఆగస్టు 28, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రిలయన్స్ ఆన్ లైన్ లో బిజినెస్..!

చిత్రం
భారతీయ పారిశ్రామిక రంగంలో రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్న రిలయన్స్  గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరోసారి షాక్ ఇచ్చేనందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దిగ్గజ ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆర్ .ఐ. ఎల్ టెలికాం, లాజిస్టిక్స్, ఈకామర్స్, డిజిటల్ , ఆయిల్, జ్యుయెలరీ రంగాలలోకి అడుగు పెట్టింది. టెలికాం రంగాన్ని సరికొత్త నిర్ణయాలతో మార్కెట్ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియా, బీ ఎస్ ఎన్ ఎల్ , తదితర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. 34 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ తో రికార్డ్ లను తిరగ రాసింది. ఇప్పుడు ఇదే సంస్థ వినోద  రంగంతో పాటు భారతీయ మార్కెట్ లో బిగ్ నెట్ వర్క్ కలిగిన కిరాణా దుకాణాలపై కన్నేసింది. ఇంకేం ఆల్ రెడీ ఆఫ్ లైన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా తాజాగా ఆన్ లైన్ లో కి ఎంటర్ అయ్యేందుకు పావులు కదుపుతోంది. వచ్చే దీపావళి పండుగ నాటికి రిలయన్స్ ఆన్ లైన్ బిజినెస్ పేరుతో రంగంలోకి దిగనుంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ తన న్యూ కామర్స్ వెంచర్ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇప్పటికే దేశంలో భారీ ఎత్తున రిటైల్, డిజిటల్ స్టోర్స్ ను ఏ...

మీ విజయం అపురూపం ..ఎందరికో ఆదర్శం

చిత్రం
ప్రపంచ స్థాయి విజేతలకు భాగ్యనగరం వేదికగా ..కేరాఫ్ గా మారిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన పీవీ సింధుతో పాటు పారా బ్యాడ్మింటన్ జగజ్జేతగా నిలిచిన మానసి జోషిని ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో జరగ బోయే ఒలంపిక్స్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించాలని, ఆయా రాష్ట్రాలకు పేరు తీసుకు రావాలని సీఎం కోరారు. ఈ విజయం సాధించడం ద్వారా భారత దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు. భవిష్యత్తులో జరిగే పోటీలలో సింధు పాల్గొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్ లేవల్లో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. పీవీ సింధు , ఆమె పేరెంట్స్ , కోచ్ గోపీచంద్ , తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరి నాథ్ ప్రగతి భవన్ లో కలిశారు. వీరితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి , డిజిపి మహేందర్ రెడ్డి , పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్ , సజ్జనార్ , మహేష్ భగవత్ , ఇంటెలిజెన్స్ ఐజి న...

కొలువులు సరే..వయసు మాటేమిటి..?

చిత్రం
బంగారు తెలంగాణ పేరుతో దుమ్ము రేపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ళు కావస్తున్నా నేటికీ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈరోజు వరకు స్పష్టం చేయలేదు. పోరాటాలు, బలిదానాలు, ఆత్మహత్యలు, కేసులు, అరెస్టులతో కోరి తెచ్చుకున్న తెలంగాణాలో ఇప్పుడు ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. నిరుద్యోగులకు ఉరే మిగిలేలా చేస్తోంది. ఇప్పటి దాకా 10 లక్షల మందికి పైగా కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎంతటి దుర్భర పరిస్థితి ఉన్నదో. ఇక చిలుక పలుకులు పలుకుతున్న కేంద్రంలో రెండో సారి కొలువు తీరిన మోడీ సర్కార్ ఇందుకేమీ భిన్నంగా లేదు. ఎంత సేపు స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప అసలైన శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఎన్నికల సమయంలో తెలంగాణలో  ఇక కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. వేలాది మంది కాట్రాక్ట్ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. విద్య శాఖా నిద్ర పోతుండగా , ఖాళీలు మాత్రం భర్తీ కావడం లేదు. కేజీ టూ పీజీ అంటున్నారే త...

కార్తీక దీపం..బుల్లితెరపై సంచలనం..!

చిత్రం
తెలుగు  వినోదపు రంగంలో స్టార్ టీవీ రికార్డులను షేక్ చేస్తోంది. ఎప్పుడైతే స్టార్ గ్రూప్ కు ఉదయ శంకర్ సి.ఈ.ఓ గా  ఎంటర్ అయ్యాడో ఇక అప్పటి నుంచి ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ రంగమే కాదు డిజిటల్ మీడియా రంగంలో పెను సంచనాలు సృష్టించేలా చేశాడు. ఆసియా ఖండంలో దుమ్ము రేపుతున్న స్టార్  టీవీ ఇప్పుడు ఇండియాను తిప్పేస్తోంది. బుల్లి తెరను స్టార్ టీవీ వాడుకున్నంతగా ఏ టీవీ వాడు కోవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సగటు బుల్లితెర ప్రేక్షకులు అంతా స్టార్ చేజిక్కించుకున్న మాటీవీని విడిచి ఉండలేక  పోతున్నారు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రూపొందిస్తూ తెలుగు వినోద రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది స్టార్ మా. ఓ వైపు  మా టివి ఇంకో వైపు హాట్ స్టార్ ..ఓహ్ ..ఉదయ్ శంకర్ సత్తా ఏమిటో ఈ పాటికే తెలిసింది.  మిగతా టీవీ యాజమాన్యాలకు. తెలుగు మీడియా న్యూస్ ఛానల్స్ సైతం మా టీవీ దెబ్బకు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ లో ఏం జరుగుతోంది అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అంటే దాని స్టామినా ఏపాటిదో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇక ఇప్పుడు తెలుగు సీరియల్స్ లలో మిగతా ఛానల్స్ ను వెనక్కి నెట్ట...

!..వైకల్యాన్ని అధిగమించి..విజేతగా నిలిచి..! జయహో మానసి..!

చిత్రం
ఓ వైపు పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడా విభాగంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టిస్తే, అదే ఇండియాకు చెందిన క్రీడాకారిణి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రపంచం నివ్వెర పోయేలా విజేతగా నిలిచింది. మువ్వొన్నెల భారతీయ పతాకాన్ని ఎగుర వేసింది. అన్ని అవయవాలు సరిగా ఉన్నా అమెరికా, డాలర్ల జపం చేసే ప్రబుద్దులకు పూర్తిగా వికలత్వం కలిగినా,  మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్ షిప్ సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఈ ప్లేయర్. ఒకుహరాను ఓడించి సింధు టైటిల్ నెగ్గక ముందే , ఇండియా నుంచి మానసి చరిత్ర సృష్టించారు. ఈ టోర్నమెంట్ తో పాటే జరుగుతున్న వరల్డ్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పారా షట్లర్ మానసి జోషి మహిళల సింగిల్స్ ఎల్ ఎల్ -3 కేటగిరిలో స్వర్ణభేరి మ్రోగించింది. ఈ అమ్మాయి వర్ధమాన ఆటగాడు పుల్లెల గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందింది. పరుల పర్మాన్ ను ఓడించి గెలుపొందింది. మహారాష్ట్ర కు చెందిన మానసి జోషి సాఫ్ట్ వెర్ ఇంజనీర్. ముంబైలోని ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. 2011 లో రోడ్డుపై వెళుతుండగా అనుకోకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలును తొడ భాగం వరకు తొలగించారు. చేతి వేళ్ళు కూడా చిట్లి ...

లోకపు వాకిట నెత్తుటి సంతకం ..పాట..!

చిత్రం
మనసు మూగదై పోయినప్పుడు దానికి స్వాంతన చేకూర్చే సాధనాల్లో టానిక్ లాగా పని చేసేది, తక్షణమే రిలీఫ్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే పాట. ఈ లోకంలో  సకల జీవరాశులతో పాటు మానవ జాతి కూడా ఎప్పుడో ఒకప్పుడు పాడడం రాక పోయినా కనీసం కూని రాగమైనా తీసి ఉంటారు. అడవుల్లో , పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు, జంతువులు కూడా ఆనందానికి లోనైనప్పుడు ఆడుతాయి..ఒక్కోసారి అరుస్తాయి కూడా. భూమి పొరల్లో ఇంకి పోయిన ప్రతిది కూడా ఈ ప్రపంచానికి పనికి వస్తుంది. ఒక్క మానవ దేహం తప్ప. అందుకే ఏనాడో సామాజిక సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం చెప్పారు. చిల్లర రాళ్లకు మొక్కడం కంటే చిత్తం మీద మనసు పెట్టు అని బతుకు మర్మం..తత్వాన్ని అర్థమయ్యేలా..జనం భాషలో చెప్పారు. తోలు బొమ్మలాటలైనా , చివరకు నాటకమైనా ..ఏదైనా పాట పరిధిలోకి రావాల్సిందే. తాజాగా బెంగాల్ కు చెందిన యాచకురాలు పాడిన పాట వైరల్ అయ్యింది. ఆమెను తక్కువ చేయడం లేదు..కానీ ప్రపంచానికే పోరాటాలతో కొత్త పాఠాలు నేర్పిన తెలంగాణాలో ఎక్కడికి వెళ్లినా గాయకులు , పాటగాళ్లు వందల కొద్దీ కనిపిస్తారు. వారు నిజమైన మట్టి బిడ్డలు. వాళ్ళ గొంతుల్లో మాధుర్యం ఉండక పోవొచ్చు. కానీ గుండెల్లో గూడు కట్ట...