పోస్ట్‌లు

జూన్ 15, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బ్యాంకుల‌కు షాకిచ్చిన ఆర్బీఐ - ఏటీఎంల‌లో డ‌బ్బులుండ‌క పోతే ఫైన్ - ఖాతాదారుల‌కు ఊర‌ట .!

చిత్రం
కేంద్ర ప్ర‌భుత్వంలో కొలువు తీరిన క‌మ‌ల ద‌ళ‌ప‌తి న‌రేంద్ర దామోద‌ర‌దాస్ మోదీజీ అనూహ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని త‌ప్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్‌కు అప్ప‌గించారు. ఆర్బీఐకి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది స‌ర్కార్. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఖాతాదారుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని హెచ్చ‌రించంది. దీంతో భార‌త ప్ర‌భుత్వానికి, దేశానికి, జాతి మొత్తానికి క‌స్టోడియ‌న్‌గా ఉన్న ఆర్బీఐ అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వేత‌ర బ్యాంకుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో బ్యాంకుల ఎడా పెడా చార్జీల మోత నుంచి కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్ల‌యింది. ఉన్నట్టుండి అర్ధ‌రాత్రి నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఖాతాదారులు, ప్ర‌జ‌లు, రైతులు, వ్యాపారులు, దిన‌స‌రి కూలీలు, ఉద్యోగ‌స్తులు, చిరు వ్యాపారులు, కిరాణాకొ్ట్టుదారులు, స్టూడెంట్స్, ఇలా ప్ర‌తి ఒక్క‌రు డ‌బ్బులు దొర‌క‌క నానా ఇబ్బందులు ప‌డ్డారు. రోజుల త‌ర‌బ‌డి ఏటీఎంల ద‌గ్గ‌ర‌, బ్యాంకుల వ‌ద్ద నిరీక్షించారు. వారిపై పోలీసుల ...

చైనా హోట‌ల్స్ మార్కెట్‌ను శాసిస్తున్న ఓయో - ఇండియ‌న్ యువ‌కుడి ఘ‌న‌త

చిత్రం
ఓయో కంపెనీని ఏ ముహూర్తంలో ప్రారంభించాడో రితీష్ అగ‌ర్వాల్ కానీ అత‌డి పంట పండుతోంది. ఏకంగా ప్ర‌పంచంలోనే అతి పెద్ద హోట‌ల్స్ యాజ‌మాన్యాలు దిమ్మ తిరిగేలా త‌న వ్యాపారాన్ని విస్త‌రించుకుంటూ పోయాడు. ఒక్క ఐడియా ఇవాళ కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డించేలా చేస్తోంది. ఇది అరుదైన రికార్డుగా న‌మోదైంది. చైనా అంటేనే డ్రాగ‌న్ గా పేర్కొంటారు. చాలా కంపెనీలు అక్క‌డ త‌మ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాలంటే నానా తిప్ప‌లు ప‌డుతుంటాయి. ముఖ్యంగా అమెరిక‌న్ కంపెనీల‌కు చైనా చుక్క‌లు చూపిస్తోంది. ముప్పు తిప్ప‌లు పెడుతోంది. అలాంటి దుర్భేద్య‌మైన చైనా హోట‌ల్స్ చైన్ మార్కెట్‌ను భార‌త్ కు చెందిన యువ‌కుడు రితీష్ ఏలుతున్నాడు. ఇది ఓ ర‌కంగా షాకింగ్ న్యూసే. ఇప్ప‌టి దాకా త‌న‌కంటూ ఎదురే లేద‌ని భావించిన దిగ్గ‌జ ఐటీ కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, పోలారిస్ లాంటివ‌న్నీ త‌మ కార్య‌క‌లాపాల‌ను చైనాలోనే నిర్వ‌హిస్తున్నాయి. లేక‌పోతే డోంట్ కేర్ అంటోంది చైనా స‌ర్కార్. ప్రపంచంలో ఎక్క‌డైనా మీ ఆధిప‌త్యం చెల్లుబాటు అవుతుందేమో కానీ..ఇక్క‌డ బ‌త‌కాలంటే మాత్రం మా నియ‌మ నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. ...

ఆక‌లి తీరుస్తున్న అక్ష‌య‌పాత్ర‌కు పుర‌స్కారం

చిత్రం
లక్ష‌లాది మంది పిల్ల‌ల ఆక‌లి తీరుస్తూ వారు చ‌దువుకునేలా అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ సంస్థ‌కు అంత‌ర్జాతీయ ప‌రంగా అరుదైన గౌర‌వం ల‌భించింది. ప్ర‌తి ఏటా బిబిసి వ‌ర‌ల్డ్ స‌ర్వీస్ గ్లోబ‌ల్ ఫుడ్ ఛాంపియ‌న్ అవార్డును 2019 సంవ‌త్స‌రానికి గాను అక్ష‌య‌పాత్ర‌ను ఎంపిక చేసింది. సంస్థ కార్యాల‌యంలో అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ వైస్ ఛైర్మ‌న్ చంచ‌ల‌ప‌తి దాస యునైటెడ్ కింగ్‌డంలోని బ్రిస్ట‌ల్ సిటీ కౌన్సిల్‌లో జ‌రిగిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో పుర‌స్కారాన్ని అందుకున్నారు. యుకె అక్ష‌య‌పాత్ర సిఇఓ భ‌వానీ షెఖావ‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. 2018లో జోష్ ఆండ్రెస్ ఈ అవార్డును పొందారు. చెఫ్‌గా ప‌నిచేస్తూ వ‌చ్చిన ఆదాయంతో 3.4 మిలియ‌న్ల మందికి ఉచితంగా ఆహారాన్ని అంద‌జేశారు. ఇది ఓ రికార్డు. హ‌రికేన్ మ‌న పేరుతో స్వీక‌రించారు. బెంగ‌ళూరు కేంద్రంగా మొద‌టిసారిగా 2000 సంవ‌త్స‌రంలో అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ త‌న కార్య‌క‌లాపాల‌కు శ్రీ‌కారం చుట్టింది. స్వ‌చ్ఛంధంగా బ‌డి బ‌య‌ట‌నే వుంటూ..బాల్యాన్ని కోల్పోతున్న బాల‌బాలిక‌ల‌కు చేయూత ఇవ్వాల‌ని సంక‌ల్పించింది. ఇందు కోసం ఏకంగా ఆయా దాత‌లు ఇచ్చిన విరాళాల‌తో వ‌చ్చిన డ‌బ్బుల‌తో మెరుగైన‌, నాణ్య‌వంత‌మైన‌, ...

పెన్ష‌న్ డ‌బ్బుల‌తో వంతెన నిర్మించిన యోధుడు

చిత్రం
ఎవ‌రైనా మ‌లి వ‌య‌సులో జీవితం హాయిగా వుండాల‌ని అనుకుంటారు. వ‌చ్చిన డ‌బ్బుల‌ను భ‌ద్రంగా దాచుకుంటారు. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల‌లో మ‌దుపు చేస్తారు. ఇంకొంద‌రు ఎక్కువ వ‌డ్డీ వ‌స్తుంద‌నే ఆశ‌తో బంధువుల‌కో లేదా తెలిసిన వారికి ఇస్తారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు డ‌బ్బులు ప‌నికొస్తాయ‌ని ఆలోచ‌న అంతే. ఇంకొంద‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాక ఇళ్ల‌లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఒడిస్సా రాష్ట్రం కియోంజిహార్ జిల్లా కాన్పూర్ గ్రామానికి చెందిన గంగాధ‌ర్ రౌత్ మాత్రం అంద‌రిలా ఆలోచించ‌లేదు. ప‌శు సంవ‌ర్ద‌క శాఖ‌లో లైవ్ స్టాక్ ఇన్స్ పెక్ట‌ర్‌గా ప‌నిచేసి రిటైర్డ్ అయ్యారు. వ‌చ్చిన పెన్ష‌న్ డ‌బ్బుల‌తో త‌న క‌ర్త‌వ్యం ఏమిటో ఆలోచించాడు.  ఏకంగా ఊరికి ఇబ్బందిగా మారిన వంతెన నిర్మాణం గురించి ప‌దుగురితో చ‌ర్చించాడు. వారి నుంచి స్పంద‌న రాలేదు. తానే అడుగులు వేశాడు. ఇందు కోసం స్వంతంగా త‌న డ‌బ్బుల‌ను వినియోగించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. రౌత్..ఈ ప‌నిని సామాజిక బాధ్య‌త‌గా గుర్తించాడు. ఇందు కోసం తానే ముందుకు క‌దిలాడు. ఊరు దాటాలన్నా..రావాల‌న్నా ..సాలంది న‌దిని దాటాల్సిందే. వ‌ర‌ద‌లు వ‌చ్చినా, వాన‌లు భారీగా కురిసినా ఊరుకు క‌...