పోస్ట్‌లు

జులై 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మోస్ట్ ఫేవ‌ర‌బుల్ బ్రాండ్‌..టాటా..!

చిత్రం
కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో ప్రారంభించే కంపెనీల‌కు రేటింగ్ అత్యంత ముఖ్య‌మైన‌ది. వాటి ప‌నితీరు, మార్కెట్‌లో దాని స్థితిగ‌తులు, వార్షిక సంవ‌త్స‌రంలో దాని ప‌నితీరు మెరుగు ప‌డిందా లేదా..ఆదాయంలో ఏ పొజిష‌న్‌లో ఉన్న‌ది..భ‌విష్య‌త్‌లో ఎలా వుండ‌బోతోంద‌న్న దానిపై ప్ర‌తి ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా న‌మ్మ‌క‌మైన సంస్థ‌లు టాప్‌లో ఉన్న కంపెనీల‌ను ఎంపిక చేస్తాయి. మ‌న ఇండియా వ‌ర‌కు వ‌స్తే ర‌త‌న్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టాటా కంపెనీ అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా నిలిచింది. త‌న స్థానాన్ని మ‌రోసారి నిలబెట్టుకుంది. అటు స‌ర్వీసులోను..ఇటు వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని చూర‌గొంటూ త‌న వ్యాపారాన్ని అంత‌కంత‌కూ విస్త‌రించుకుంటూ పోతోంది టాటా. ప్ర‌ధాన రంగాల‌లో త‌న‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తోంది. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మందికి జీవ‌నోపాధి క‌ల్పిస్తోంది టాటా గ్రూపు. ఆటోమొబైల్ రంగంతో పాటు ఐటీ సెక్టార్‌లో టాటా కంపెనీలు దుమ్ము రేపుతున్నాయి. ఐటీ ప‌రంగా టాప్ రేంజ్‌లో వుంది. టీసీఎస్ భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకుంటోంది.2019లో భార‌త్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ బ్రాండ్‌గా టాటా కంపెనీ నిలిచింది. యునైటెడ...

ఒప్పో వైస్ ప్రెసిడెంట్‌గా సుమీత్ వాలియా..!

చిత్రం
భార‌తీయులు దుమ్ము రేపుతున్నారు. త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌తో దిగ్గ‌జ కంపెనీల‌ను మెస్మ‌రైజ్ చేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, షియోమీ, అడోబ్, అమెజాన్ ఇలా ప్ర‌తి మేజ‌ర్ కంపెనీల‌న్నీ ఇండియా జ‌పం చేస్తున్నాయి. ఏకంగా టాప్ రేంజ్‌లో ఉన్న వారికి అద్భుత‌మైన అవ‌కాశాలు అంద‌జేస్తున్నాయి. తాజాగా ఇండియ‌న్ మార్కెట్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేశాయి రెండు దిగ్గ‌జ కంపెనీలు. ఈ రెండింటిలో ఒక‌టి చైనాకు చెందిన ఒప్పో మొబైల్ త‌యారీ కంపెనీ అయితే..మ‌రొక‌టి జ‌ర్మ‌నీకి చెందిన బిగ్గెస్ట్ మోటార్స్ కంపెనీ బిఎండ‌బ్ల్యుకు చెందింది. ఒక‌రేమో ప‌ల్ల‌వీ సింగ్ అయితే ..ఇంకొక‌రు సుమీత్ వాలియా. ఇప్ప‌టికే రెండూ కంపెనీల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాండ్ క‌లిగి ఉన్నాయి. ఇండియ‌న్ మార్కెట్‌లో వీటికున్నంత డిమాండ్ ఇంకేదానికి లేదంటే ఆశ‌ర్య ప‌డాల్సిన పనిలేదు. ఒప్పో కంపెనీ కార్య‌క‌లాపాలు చూసుకునేందుకు, వ్యాపార ప‌రంగా మిగ‌తా కంపెనీల‌కు షాక్ ఇస్తూ..త‌న మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఇండియాకు చెందిన సుమీత్ వాలియాకు అరుదైన అవ‌కాశం క‌ల్పించింది. ప్రొడ‌క్ట్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా సుమీత్‌ను నియ‌మిస్తున్న‌ట్లు ఒప్పో మొబైల్స్ కంప...

బిఎండబ్ల్యు మోటార్స్ కంపెనీ డైరెక్ట‌ర్‌గా ప‌ల్ల‌వి సింగ్

చిత్రం
ప్ర‌తి ఒక్క‌రి క‌ల ఒక్క‌టే..వాహ‌నాలను ప్రేమించే వారికి ..అదేమిటంటే బిఎండ‌బ్ల్యు మోటార్స్ కంపెనీనే ప్రిఫ‌ర్ చేస్తారు. ఎక్కువ‌గా రిచ్ పీపుల్స్, బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్, సెల‌బ్రెటీస్, కంపెనీల సీఇఓలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, ప్లేయ‌ర్స్, సినీ న‌టులు, ఇలా ప్ర‌తి రంగానికి చెందిన వారంతా మొద‌ట‌గా ప్ర‌యారిటీ ఇచ్చేది ఈ కంపెనీ ద్వారా త‌యార‌య్యే వెహికిల్స్‌ను కోరుకుంటారు. అందులో ప్ర‌యాణించ‌డం అన్న‌ది ఓ క‌ల కానే కాదు..అదో స్టేట‌స్ స ింబ‌ల్. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసేందుకు..కొనుగోలు చేసేందుకు..ట్రావెల్ చేసేందుకు ఉత్సాహ ప‌డ‌తారు. ప్ర‌పంచంలోనే మోటార్స్ రంగంలో బిఎండ‌బ్ల్యు కంపెనీ కార్లు, ఇత‌ర వెహికిల్స్‌కు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. ఈ కంపెనీకి చెందిన వెహికిల్స్ ను కేవ‌లం సినిమాల్లో చూడ‌ట‌మే త‌ప్పా ఎక్క‌డా చూడ‌లేం. ఇపుడు యూట్యూబ్ అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌తి వాహ‌నం గురించి తెలుసుకునే వీలు క‌లుగుతోంది. వాహ‌నాల మార్కెట్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్న బిఎండ‌బ్ల్యు కంపెనీకి ఏకంగా ఇండియాకు చెందిన మ‌హిళ‌..ప‌ల్ల‌వి సింగ్‌ను ఇండియాలోని బిఎండ‌బ్ల్యు మార్కెటింగ్ విభాగానికి డైరెక్ట‌ర్‌గా నియ‌మించింది స‌ద‌రు ...

బాద్‌షాకు అరుదైన పుర‌స్కారం

చిత్రం
బాలీవుడ్‌లో బాద్‌షాగా పేరు సంపాదించుకున్న , విల‌క్ష‌ణ న‌టుడిగా వినుతికెక్కిన ప్ర‌ముఖ న‌టుడు షారూఖ్ ఖాన్‌కు అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు మ‌హిళ‌ల సంక్షేమం, వారి హ‌క్కుల కోసం ఎప్ప‌టి నుంచో కృషి చేస్తున్నారు ఈ హీరో. సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ బ్రాండ్ తో పాటు విశిష్ట‌మైన ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న ఘ‌న‌త ఆయ‌న‌కే చెల్లింది. మాట‌ల్లో మేన‌రిజం..న‌డ‌క‌లో ..న‌డ‌త‌లో డిఫ‌రెంట్‌గా ఉండే ఆయ‌నంటే జ‌నానికి అమిత‌మైన ఆస‌క్తి..అంత‌కంటే అభిమానం కూడా. హీరోగా ఆయ‌న నిల‌దొక్కుకునేందుకు ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించారు. బాలీవుడ్‌లో ఖాన్‌ల త్ర‌యందే హ‌వా. ఎంతో మంది కొత్త‌గా హీరోలు తెరంగ్రేటం చేసినా..ఈ ముగ్గురిని ఢీకొనేందుకు..వారి స్పీడ్‌ను త‌గ్గించేందుకు ఏ ఒక్క‌రు చేరుకోలేక పోయారు. చాలా మంది హీరోలు ప్ర‌య‌త్నం చేసినా..ఫ‌లితం ద‌క్క‌లేదు. ఎందుకంటే ఈ ముగ్గురిలో ఎవ‌రికి వారే హీరోలు. ఏ ఒక్క‌రిని గొప్ప వారుగా నిర్ణ‌యించ‌లేం. ఎందుకంటే ..ఎవ‌రూ చెప్ప‌లేరు. వీరంతా ఎవ‌రి అండ లేకుండానే..ఇంకెవ్వ‌రి తోడ్పాటు..సిఫార‌సులు తీసుకోకుండానే స్వంతంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్‌లో స్టార్స్‌గా ...

బిగ్ బాస్ పై అభ్యంత‌రం..కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

చిత్రం
తెలుగు ఎంట‌ర్‌టైన్మెంట్ రంగంలో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న మా టీవీని ఏషియాలోనే టాప్ రేంజ్‌లో కొన‌సాగుతున్న స్టార్ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో మేనేజ్‌మెంట్‌తో పాటు వివిధ విభాగాల‌లో, రంగాల‌లో కొత్త వారు చేరారు. ఓ వైపు సీరియ‌ల్స్, ఇత‌ర ప్రోగ్రామ్స్‌ను చేప‌డుతూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో దూసుకెళుతోంది ఈ టీవీ. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంతో పాటు సీరియ‌ల్స్ తో త‌న రేటింగ్‌ను అలాగే కాపాడుకుంటూ వ‌స్తోంది రామోజీరావు నేతృత్వంలోని ఈటీవీ ఛాన‌ల్స్. ఇంకో వైపు స్వ‌రాభిషేకం నిరాటంకంగా కొన‌సాగుతోంది. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష‌లాది మంది వీక్ష‌కుల మ‌న‌సు చూర‌గొంటోంది. దీంతో ఈ కార్య‌క్ర‌మానికి అద‌న‌పు హంగులు జోడించి ఆయా ప్రాంతాల‌లో ప్ర‌త్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ జ‌నానికి జోష్ క‌లుగ చేస్తోంది.  మ‌రో వైపు ముద్ద మందారం, అత్త నా కోడ‌లా లాంటి డిఫ‌రెంట్ ప్రోగ్రామ్స్‌తో జీ తెలుగు టాప్ పొజిష‌న్‌లో చాలా కాలం పాటు కొన‌సాగింది. మా, ఈటీవీల నుండి పోటీ ఎదుర్కొంటోంది. కాగా స్టార్ గ్రూప్ ఎప్పుడైతే మా టీవీని చేజిక్కించుకుందో ..దాని రేంజ్ మ‌రింత పెరిగింది. న...

అమెజాన్‌లో ఆగ‌ని స‌మ్మె - అంత‌టా ఆందోళ‌న బాట

చిత్రం
ప్ర‌పంచంలోనే ఈ కామ‌ర్స్ రంగంలో టాప్ రేంజ్‌లో కొన‌సాగుతున్న అమెరికాకు చెందిన దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ లో ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఆయా దేశాల‌లో ఏర్పాటైన కంపెనీల ఎదుట వారు స‌మ్మెకు దిగారు. ఓ వైపు బంప‌ర్ ఆఫ‌ర్స్, భారీ డిస్కౌంట్ల‌తో డాల‌ర్ల‌ను కొల్లగొడుతూ లెక్క‌లేనంత ఆదాయాన్ని పొందుతున్నా త‌మ‌కు మాత్రం వేత‌నాలు పెంచ‌డంలో శ్ర‌ద్ద చూపించ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే త‌మ‌కు జీతాలు పెంచాల‌ని లేక‌పోతే జీవ‌నం కష్ట‌మ‌వుతుంద‌ని వాపోయారు. కంపెనీ మాత్రం ఇదంతా అవాస్త‌వ‌మంటూ కొట్టి పారేసింది. ఉద్యోగులు మాత్రం ఆయా దేశాల‌లో రోడ్ల‌పైకి వ‌చ్చారు. ప్ర‌పంచ మంత‌టా అన్ని దేశాల్లో స‌మాచారంతో పాటు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అయినా అమెజాన్ డోంట్ కేర్ అంటోంది. త‌మ‌కు వ‌చ్చిన ముప్పేమి లేదంటూ కొట్టి పారేసింది. స‌మ్మెలు చేసినా, ఆందోళ‌న‌లు చేప‌ట్టినా..పోరాటానికి దిగినా జీతాలు మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో పెంచ‌మంటూ స్ప‌ష్టం చేసింది. స‌మ‌స్య మాత్రం ముదిరి పాకాన ప‌డింది. త‌మ ప‌ని టైమింగ్స్ ను మెరుగు ప‌ర్చాల‌ని, జీతాలు స‌రిపోయినంతగా పెంచాల‌ని కోరారు. అమెరికాలోని ప్ర‌ధాన కార్యాల‌యంతో పాటు ఇంగ్లండ్, జ‌...