పోస్ట్‌లు

సెప్టెంబర్ 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

లోకల్‌ మార్కెట్లోకి స్విగ్గీ

చిత్రం
ఈ కామర్స్ వ్యాపారం ఇండియాలో జోరందుకుంది. ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్  లైన్ లో బిజినెస్ ఊపందుకుంది. ఇప్పటికే వినియోగదారులు ఎక్కువగా ఫుడ్, ఎంటర్టైన్ మెంట్, ఫ్యాషన్, దుస్తులు, షూస్ , ఎలక్ట్రానిక్స్ , స్పోర్ట్స్, గోల్డ్, డైమండ్స్, వెండి తదితర వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మహిళలు, చిన్నారులు, వ్యాపారులు, యూత్ అంతా వీటి మీదే మోజు పెంచుకున్నారు. దీంతో దేశ, విదేశీ కంపెనీలన్నీ ఈ కామర్స్ రంగంలోకి ఎంటరవుతున్నాయి. ఇండియన్ మార్కెట్ ను చైనా కు చెందిన కంపెనీలు డామినేట్ చేస్తుండగా, ఇండియన్, అమెరికాకు చెందిన కంపెనీలు సైతం అమ్మకాల్లో దుమ్ము రేపుతున్నాయి. గత ఐదేళ్లుగా భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుండి నోట్ల రద్దు ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. జీఎస్టీ దెబ్బకు జనం, బిజినెస్ పర్సన్స్ విలవిలలాడి పోయారు. ఆయా ప్రభుత్వ బ్యాంకులు ఎన్నడూ లేనంతగా నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు తమకు అందుబాటు ధరల్లో ఉన్న వాటికే ప్రయారిటీ ఇస్తుండడంతో ఈ కామర్స్ కంపెనీలు ఇంటి వద్దకే సేవలు అందజేస్తున్నాయి. ఇదే క్రమంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జొమాటో, స...

దివ్యంగుల పాలిట దేవత..పుష్ప..!

చిత్రం
ఉదయం నుంచి రాత్రి దాకా స్మార్ట్ ఫోన్స్  లేదా షాపింగ్స్  , సీరియల్స్ లలో మునిగి తేలిపోతూ కాలాన్ని గుర్తించని మహిళలు ఆమెను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. జీవితం అంటే మనం బతకడం కాదని, ఆపదలో ఉన్నవారిని ఆదు కోవడం, చేతనైనంత సాయం చేయడం అని నమ్మింది బెంగళూర్ కు చెందిన పుష్ప. గత ఏడాది ఆమె అందించిన సేవలకు గాను నారి శక్తి  పురస్కారం పొందింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. అందరిలా ఆమె ఇంట్లో కూర్చో లేదు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే మరో వైపు తనకు వీలున్నప్పుడల్లా వికలాంగులకు తోడుగా నిలిచింది. అంతే కాకుండా 700 మందికి పరీక్షలు రాయడంలో సహాయం చేసింది. తన స్నేహితురాలు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ కోరడంతో ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంది పుష్ప. చాలా మంది విద్యార్థులు మానసిక, శారీరక , బుద్ది మాంద్యం లోపం కలిగి ఉండడంతో చదువు కోవడం, పరీక్షలు రాయడం కష్టతరంగా మారింది. దీనిని పుష్ప మిత్రురాలు గుర్తించింది. వారికి తమ సంస్థ తరపున వేరే వారితో రాసే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే ఇట్టి సెక్టార్ లో పని చేస్తున్న పుషను కూడా సంప్రదించింది. ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ...

రికార్డుల మోత మోగిస్తున్న రాఫెల్ నాదల్

చిత్రం
ఉత్కంఠ భరితంగా సాగిన యుఎస్ ఫైనల్లో స్పెయిన్ కు చెందిన రాఫెల్ నాదల్ విజయం సాధించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ గెలుపుతో 19 వ టైటిల్. ఇది కూడా ఓ చరిత్రే. రాఫెల్ మొత్తం ఆదాయం 37,684 , 949  మిలియన్ డాలర్లు. ఆదాయం గడించే ఆటగాళ్లలో మొదటి ప్లేస్ లో నిలిచారు. ఆయన సాధించిన రికార్డులను మరే  ఆటగాడు బ్రేక్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటి దాకా 43 టైటిల్స్ పొందారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ , ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్ , యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లాం లను సాధించారు. ఒలంపిక్స్ పోటీల్లో బంగారు పతకాలను పొందారు. డబుల్స్ విభాగంలో ఏడు టైటిల్స్ గెలిచారు. ఆయన అసలు పేరు రాఫెల్ "రాఫా " నాదల్ పరేరా. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ప్రకటించిన జాబితాలో నాదల్ ను  నెంబర్ వన్ ఆటగాడిగా ప్రకటించింది. అన్నికాలాలలో ఉన్న ఉత్తమమైన క్రీడాకారులలో ఒకడిగా అతనిని పేర్కొంది. "ది కింగ్ ఆఫ్ క్లే" అంటూ ముద్దుగా అభిమానులు పిలుస్తారు. గొప్ప క్లే కోర్ట్ ఆటగాడిగా నిపుణులు భావించేటట్టు చేసాయి. తొమ్మిది గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్, 18 ఏటీపీ వరల్డ్ టూర్ మాస్టర్స్ 1000 పోటీలతో పాటు  2004, 2008 , 2009లో ఫైనల్స్‌లో విజయం ...

విదేశీ కంపెనీలపై కన్నేసిన రిలయన్స్

చిత్రం
భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో సంచలనానికి తెర తీసింది. ఇప్పటికే రిటైల్, ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ , ఫ్యాషన్ , డిజిటల్ టెక్నాలజీ, తదితర రంగాలపై దృష్టి పెట్టిన సదరు కంపెనీ విదేశాల్లో తన హవాను కొనసాగించాలని పావులు కదుపుతోంది. ప్రత్యర్థి కంపెనీలకు దిక్కుతోచని రీతిలో దెబ్బ కొడుతూ, తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళుతోంది ఆర్ ఐ ఎల్. లక్ష కోట్లకు పైగా ఉన్న అప్పులను త్వరలో తీరుస్తామని ఇటీవలే ముంబైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. దీంతో ఉన్నఫలంగా షేర్ మార్కెట్ లో షేర్లు పెరిగి పోయాయి. ఇన్వెస్టర్స్ కు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆపరేటర్స్ కు చుక్కలు చూపిస్తోంది. ఫ్యాషన్ , జ్యుయెలరీ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తోంది. అబ్రాడ్ లో టాప్  రేంజ్ లో ఉన్న విదేశీ కంపెనీలను చేజిక్కించు కోవాలని పావులు కదుపుతోంది. ఇందు కోసం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఫ్యాషన్ , పిల్లలకు సంబంధించిన  దుస్తులు, వస్తువులను టార్గెట్ చేస్తోంది. ప్రతి రంగంలోకి ఎంటర్ కావాలని అనుకుం...

బాధితుల కోసం చంద్రబాబు పోరాటం

చిత్రం
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు ప్రస్తుతం తీవ్ర వత్తిళ్ళను ఎదుర్కుంటున్నారు. ఓ వైపు పార్టీకి చెందిన సీనియర్లు ఒక్కరొక్కరుగా వెళ్లి పోతుండగా, మరో వైపు అధికారంలో వున్న వైసీపీ ఇదే అదనుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేస్తోంది. అంతే కాకుండా ఎవరైతే టీడీపీ అధినేతకు కుడి భుజంగా వున్నారో  వారి ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతోంది. ఏపీలో ఎక్కడ తెలుగుదేశం బలంగా వున్నదో,  అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తమ జెండా ఎగరాలని పావులు కదుపుతోంది. ప్రతి చోటా దాడులు అధికమయ్యాయి. కొన్ని చోట్ల హత్యలు చోటు చేసుకున్నాయి. ఇక ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద ఉధృతి పెరిగింది. గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. వరద తాకిడికి పలు గ్రామాలు నీట మునిగాయి. కానీ ప్రభుత్వం సహాయక చర్యల్లో కొంచం ఆలశ్యం చేసింది. దీనిని కూడా రాజకీయం చేయాలని చూసింది. బాబును టార్గెట్ గా చేశారే తప్పా సమస్య తీవ్రం కాకుండా చూడలేక పోయారు. ఏపీ అంతటా తెలుగుదేశం శ్రేణులపై దాడులు పెరిగి పోయాయి. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కేసులు, దాడులు ఉండవని చెప్పిన జగన్ మరుసటి రోజు నుంచే ప్రతి దాడులు పెరిగి పో...

డాటర్ ఆఫ్ ది నేషన్ - గాత్ర సామ్రాజ్ఞికి అరుదైన గౌరవం..!

చిత్రం
కేంద్రంలో కొలువుదీరిన మోదీ ప్రభుత్వం గాన కోకిల లతా మంగేష్కర్ కు అరుదైన గౌరవం ప్రకటించింది. ఆమెను డాటర్ ఆఫ్ ది నేషన్ గా వెల్లడించింది. ప్రధానమంత్రికి లతా మంగేష్కర్ అంటే ఎనలేని గౌరవం. దీంతో ఆమెను  సిసలైన భారత జాతి ముద్దు బిడ్డగా పరిగణించాల్సి ఉంటుంది. వచ్చే 28 తో ఆమెకు 90 ఏళ్ళు నిండుతాయి. ఇంత వయసు వచ్చినా ఆమె గొంతులో మాధుర్యం అలాగే ఉన్నది. గాయకురాలు, నటి కూడా. 1942 లో కళా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 980 సినిమాలు. 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. హిందీ పాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. ఆమె తండ్రి సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ , చెల్లెలు ఆశా భోస్లే ఆమె కూడా ఇండియాలో పేరొందిన గాయని. లతాజి బాల్యం కష్టాలు, కన్నీళ్ళతో గడిచి పోయింది. ఐదో  ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు  వినడం, పాడడం తప్ప మరో లోకం లేదు. తాను చదువు కోలేక పోయినా తన తర్వాతి వారైనా పెద్ద చదువులు చదవాలనుకొంది, చదువుకన్నా సంగీతం పైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబ మంతా సంగీతంలోనే స్థిరపడి పోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా సైగల్ ను తెలిపింది. తండ్రి 1942ల...

కొలువుదీరారు..కొలువుల మాటేమిటి..?

చిత్రం
తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ఆరు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కేబినెట్ సంఖ్య 18 కి చేరింది. మంత్రులుగా కొలువుతీరిన వారిలో కేటీఆర్ , హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి లు ఇది వరకే ఒకసారి  మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్నది. కల్వకుంట్ల తారక రామా రావు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఐటీ, మున్సిపల్ , మైనింగ్ శాఖా మంత్రిగా పని చేశారు. ఇక తన్నీరు హరీష్ రావు నీటి పారుదల శాఖా మంత్రిగా ఉండగా, సబితా ఇంద్రా రెడ్డి గత ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో హోమ్ శాఖా మంత్రిగా పని చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కారెక్కారు. దీంతో అప్పుడే సీఎం కేసీఆర్ సముచిత స్థానం ఇస్తానని చెప్పారు. అదే విధంగా తన మాట నిలబెట్టుకున్నారు. ఇక కొత్తగా ఈ ఆరుగురిలో మరో ముగ్గురు గంగుల కమలాకర్ , పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ లకు మంత్రులుగా పని చేసే ఛాన్స్ దక్కింది. మరో వైపు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఇద్దరికీ ఉద్వాసన తప్పదనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా కేసీఆర్ తనదైన ముద్ర వేశారు. కుల, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ప...