పోస్ట్‌లు

ఆగస్టు 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

కియా క్యా కమాల్ కర్ దియా..!

చిత్రం
కియా క్యా కమాల్ కర్ దియా..! ఆటోమొబైల్ రంగంలో కియా మోటార్స్ దుమ్ము రేపుతోంది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా వాహనాల అమ్మకాలు కొంత మేరకు తగ్గినా ఇండియాలో మాత్రం కియా సంస్థ తయారు చేసిన కార్లకు భలే డిమాండ్ ఉంటోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లాలో ఇటీవలే ప్రారంభించింది. ప్రస్తుతం మారుతి సుజుకి, టాటా , హ్యుండాయి , హొండా, వోక్స్ వాగన్ , ఇన్నోవా , తదితర వెహికల్స్ ను కొనుగోలు చేస్తూ వచ్చారు. వీటికి తోడుగా కియా కంపెనీ ఆకట్టుకునే డిజైన్స్, అద్భుతమైన ఫీచర్స్ , అందుబాటు ధరల్లో వాహనదారులకు, వెహికిల్స్ ప్రియులకు మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కియా స్లిటోస్ కాంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారు ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనిని కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. దీని ధర 9 లక్షల 69 వేల రూపాయల నుండి 15 లక్షల రూపాయలకు పైగా ఉంది. ఈ కారును మొదటిసారిగా 2018 లో జరిగిన ఆటో షో లో ప్రదర్శించారు. ఇండియాలో కియా కంపెనీ 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతానికి అనంతపురం ప్లాంట్ లో వీటిని తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన కార్లు విదేశాలకు త్వరలో ఎగుమతి కానున్నాయి....

నిబద్ధతకు నిదర్శనం..శివన్ కు పురస్కారం..!

చిత్రం
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు ప్రపంచ స్థాయిలో ఎనలేని పేరు తీసుకు వస్తున్న ఆ సంస్థ చైర్మన్ కె. శివన్ అలియాస్  కైలాసవాడివు శివన్ కు అరుదైన పురస్కారం దక్కింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కలాం పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును శివన్ కు అందచేసింది. అంతరిక్ష పరిశోధనల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ గౌరవాన్ని అంద చేసినట్లు  ప్రభుత్వం తెలిపింది. చందమామ వద్దకు చంద్రయాన్ ను దిగ్విజయంగా పంపించడంతో  ఒక్కసారిగా శివన్ పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగింది. 1957 లో తమిళనాడు రాష్ట్రంలో శివన్ జన్మించారు. ప్రతిష్టాత్మకమైన విక్రమ్ సారాభాయి స్పెస్ సెంటర్ లో అంతకు ముందు డైరెక్టర్ గా  సేవలు అందించారు. లిక్విడ్ ప్రొపులిజియన్ సెంటర్ లో కూడా పని చేశారు. క్రైజోనిక్ ఇంజన్లను తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే శివన్ కు  రాకెట్ మ్యాన్ అని మరో పేరు కూడా ఉంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శివన్ చిన్నప్పటి నుంచే ఎంతో కస్టపడి చదువుకున్నారు. వారి కుటుంబంలో మొదటి సారిగా గ్రాడ్యుయేట్ పాసైన వ్యక్తి ఆయన ఒక్కరే.  మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజీలో డిగ్రీ పొ...

నల్లమల విలవిల ..అడవి బిడ్డలు వలవల..!

చిత్రం
పచ్చని అందాలు , మైమరిచి పోయే ప్రకృతి సౌందర్యం, వానొచ్చినా, మట్టి బిడ్డలు, జంతు జీవాలు కలిసి బతికే అరుదైన నల్లమల ఇప్పుడు విలవిల మంటోంది. ఓ వైపు ఉమా మహేశ్వరం ఇంకో వైపు శ్రీశైలం ఉన్న ఈ అటవీ ప్రాంతం అపారమైన వనరులు, నిధి నిక్షేపాలు కలిగి ఉన్నది. అందుకే దీనిపై అక్రమార్కులు, బడా బాబులు , కేంద్ర, రాష్ట్ర పాలకులు కన్నేశారు. దివంగత ఉమ్మడి రాష్ట్ర సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు డీబీర్స్ కంపెనీకి వజ్రాల వేట కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. దీని వెనుక పెద్ద మతలబే జరిగిందని వార్తలు వచ్చాయి. దేని వెనుక వున్న విధ్వంసంపై అప్పట్లోనే నల్లమలలో వజ్రాల వేట అనే పేరుతో ఓ ప్రత్యేక కథనం రాయడం జరిగింది. ఈ కార్పొరేట్ కంపెనీ చర్యల్ని నిరసిస్తూ నల్లమల అడవి బిడ్డలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. వీరికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కంపెనీ వెనక్కి తగ్గిందని అనుకున్న తరుణంలోనే మరో పిడుగు లాంటి వార్తను ప్రకటించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం . పర్యావరణ శాఖ కూడా హుటాహుటిన అనుమతులు కూడా ఇచ్చేసింది. నల్లమలలో అత్యంత ప్రమాదకరమైన, మానవాళి జీవన విధ్వంసం కలిగించే యురేనియంను వెలికి తీసుకోవచ్చంటూ గ్రీన్ సిగ...

తెలుగు లోగిళ్ళలో స్టార్ మా హవా

చిత్రం
వినోదపు రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ , ఇమేజ్ స్వంతం చేసుకున్న స్టార్ టీవీ ఆసియాలోనే కాదు ఇండియాను మెస్మరైజ్ చేస్తోంది. ఎక్కడ మార్కెట్ ఉంటుందో వ్యాపారులు, కంపెనీలు వెళ్లడం సహజం. కానీ అందరూ వెళ్లే దారిలో వెళితే మజా ఏముంటుంది. కిక్ అన్నది లేక పోతే ..మనకంటూ ఓ చరిత్ర అన్నది లేకపోతే ..ఉండీ ఏం ప్రయోజనం అని అంటారు..ఓ సందర్భంలో ఆ సంస్థ సీయివో ఉదయ్ శంకర్. ఎప్పుడైతే స్టార్ గ్రూప్ అతడిని ఏరికోరి ఎంచుకుందో అప్పుడే గెలుపు అన్నది కంపల్సరీ అని డిసైడ్ అయి పోయింది. ఇంకేం చేరిన తక్షణమే స్టార్ టీవీ రూపు రేఖలను మార్చేశాడు. మొత్తం మార్కెట్ స్ట్రాటజీని భిన్నంగా అమలు చేస్తూ ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. డబ్బులు కొల్లగొట్టాలంటే బ్యాంకులనో , లేదా జనాలనో మోసం చేయాల్సిన పని లేదు. నిజాయితీగా సంపాదించ వచ్చని నిరూపించాడు. అంతేనా ఇప్పుడు ఇండియన్ ఎంటర్టైన్ మెంట్ విభాగంలో ఉదయ్ ఓ సెన్సేషన్. ఒక్కసారి దృష్టి సారిస్తే..ఇక అది కావాల్సిందే. అందుకే మొత్తం మార్కెట్ నే పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకు వచ్చాడు. కోట్లు కొల్లగొట్టాలంటే ఏం చేయాలో ఉదయ్ శంకర్ ను దగ్గరగా చూడాలి. ప్రాంతీయ భాషల్లోకి స్టార్ ఎంటర...

చిదంబరం స్వయం కృతాపరాధం

చిత్రం
కాలం చాలా విలువైనది అంతకంటే బలీయమైనది. దీనిని తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళు , ఇంకో సమయంలో మౌనం వహించడమే లేక తమ తప్పిదాల వల్లనో లేక ఇంకే ఇతర వివాదం, సమస్య వల్లనో తల దించు కోవాల్సి రావొచ్చు. ప్రపంచంలో దేనినైనా కోల్పోయేందుకు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉంటారు. కానీ తమ పదవులు పోతే తట్టుకోలేరు. అంతకంటే ఎక్కువగా అధికారం కోల్పోతే ఉండలేరు. కుర్చీకి వున్న పవర్ అలాంటింది. ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా జరగవచ్చు. భారత దేశంలో ఈ తరహా రాజకీయాలు మరీ ఎక్కువగా ఉంటాయి. పైకి కనిపించక పోయినా, లోలోపట పగలతో రగిలి పోతుంటారు. చిరునవ్వులు అలాగే ఉంటాయి. కానీ వేధింపులు మరో రకంగా పలకరిస్తాయి.  ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందో అప్పటి నుంచి వేట మొదలైంది రెడీనా సరి అధికారంలోకి వచ్చిన మోడీ అండ్ షా దెబ్బకు ప్రతిపక్ష పార్టీలు , నాయకులు, అధినేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అన్నిటి కంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ నే పవర్ లోకి రావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఓ వైపు చంద్ర బాబు సైలెంట్ అయి పోగా ..దేవ గౌడ మిన్నకుండి ప...