పోస్ట్‌లు

జులై 11, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జ‌గ‌న్‌..బాబుల మ‌ధ్య మాట‌ల యుద్ధం ..!

చిత్రం
ఆంధ్రా అసెంబ్లీ ర‌ణరంగాన్ని త‌ల‌పింప చేసింది. మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు..తాజా ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ నీళ్ల అంశం కుదిపేసింది. చ‌ర్చంతా దీనిపైనే జ‌రిగింది. బాబు, జ‌గ‌న్‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డిచింది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. శాస‌న‌స‌భ నియ‌మ నిబంధ‌న‌ల‌కు కాళేశ్వ‌రం , గోదావ‌రి -కృష్ణా లింక్‌పై అధికార‌, ప్ర‌తిప‌క్ష సభ్యుల మ‌ధ్య స‌భ‌లో వాడి వేడిగా చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి నీళ్లు తెస్తామ‌ని ఇందు కోసం ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఓకే చేశార‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ స‌భ‌లో ప్ర‌క‌టించారు. త‌న‌కున్న సత్సంబంధాల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని తెలిపారు. తెలంగాణ భూమి మీదుగా గోదావ‌రి జ‌లాల‌ను త‌ర‌లించి..ఏపీలోని కృష్ణా ఆయ‌క‌ట్టును స్థిరీక‌రిస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యంపై సీఎం అభ్యంత‌రం తెలుపుతూ తెలంగాణ నుంచి ఒక‌వేళ నీళ్లు రాక‌పోతే ఏం చేస్తారంటూ చంద్ర‌బాబు అభ్యంత‌రం తెలిపారు.  దీనిపై తీవ్రంగా స్పందించారు జ‌గ‌న్. ఏపీలో అభివృద్ధి కోసం కేసీఆర్ స‌హ‌క‌రిస్తున్నారు. ఏపీకి తెలంగాణ నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ హ‌ద్దులో ఉ...

డిజిట‌ల్ పేమెంట్స్‌ల‌లో ఫోన్ పే ముందంజ‌..లావాదేవీల‌లో నెంబ‌ర్ వ‌న్ ..!

చిత్రం
డిజిట‌ల్ పేమెంట్స్ విభాగంలో ఫోన్ పే లావాదేవీల ప‌రంగా కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని పొందుతోంది. అమెరికాలోని రిటైల్ దిగ్గ‌జ కంపెనీ వాల్ మార్ట్‌కు డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసె సంస్థ కాసుల‌ను కురిపించేలా చేస్తోంది. వాల్యూయేష‌న్‌లో ఈ కంపెనీ అనూహ్యంగా దూసుకెళుతోంది. ఇండియాలో అతి పెద్ద ఈ కామ‌ర్స్ కంపెనీగా ఉన్న ఫ్లిప్ కార్ట్‌ను వాల్‌మార్ట్ చేజిక్కించుకుంది. ఆ స‌మ‌యంలో స‌ద‌రు కంపెనీ ఫోన్ పే సంస్థ‌ను ప‌ట్టించు కోలేదు. ఫ్లిప్ కార్ట్‌లో ఆల్ రెడీ భాగంగా ఉన్న ఫోన్ పే ప్ర‌స్తుతం దేశంలోనే టాప్ స్టార్ట‌ప్‌ల‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. దీని వ్యాపారాలు కూడా ఊహించ‌ని రీతిలో పెరుగుతూ వ‌స్తున్నాయి. దీంతో అద‌నంగా వాల్ మార్ట్‌కు అనుకోని రీతిలో ప్ర‌యోజ‌నాలు చేకురుతున్నాయి. ఆదాయం అంత‌కంత‌కు పెరుగుతుండ‌డంతో ఫ్లిప్ కార్డ్ బోర్డు ..ప్ర‌త్యేకంగా స‌మావేశాన్ని నిర్వ‌హించింది. త‌మ కంపెనీలో భాగ‌స్వామిగా ఉన్న ఫోన్ పే కోసం ప్ర‌త్యేకంగా ఫోన్ పే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మ‌రో కొత్త సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాక బ‌య‌టి నుంచి పెట్టుబ‌డిదారుల నుంచి 100 కోట్ల డాల‌ర్ల వ‌ర‌కు అంటే దాదాపు 6 వే...

కోర్టుకు చేరిన క‌ర్నాట‌కం..సందిగ్ధంలోనే ప్ర‌భుత్వం

చిత్రం
రోజుకో ట్విస్ట్ తో  క‌న్న‌డ నాట రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కిస్తున్నాయి. రాజీనామా స‌మ‌ర్పించిన ఎమ్మెల్యేలు త‌మ లెట‌ర్ల‌కు ఆమోదం తెల‌పాల‌ని స్పీక‌ర్ ర‌మేష్ కుమార్‌కు విన్న‌వించారు. ఆయ‌న స‌సేమిరా అన‌డంతో చివ‌ర‌కు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో స్పందించిన స‌ర్వోన్న‌త న్యాయ స్థానం వెంట‌నే నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని సీజేఐ బెంచ్ స్పీక‌ర్‌ను ఆదేశించింది. దీనికి స్పీక‌ర్ మాత్రం త‌క్ష‌ణ‌మే వారి రాజీనామాల‌ను ఆమోదించేందుకు కుద‌ర‌ని, కొంత స‌మ‌యం కావాల‌ని కోరారు. స‌రైన ఫార్మాట్‌లో ఇవ్వ‌కుండా ఎక్క‌డో ఉండి రాజకీయాలు చేస్తే ఎలా అని స్పీక‌ర్ ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్నాన‌ని, త‌న వ‌య‌సు అయిపోయింద‌ని, ఆ మాత్రం త‌న ప‌ద‌వికి క‌ట్టుబ‌డి ప‌నిచేయ‌క పోతే తాను ఎందుకు ఇక్క‌డ ఉన్న‌ట్టు అంటూ ప్ర‌శ్నించారు. రోజు రోజుకు రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు చోటు లేకుండా పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భార‌త రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించ‌డంలో భాగంగానే తాను ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని, ప్ర‌తి అంశాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నాన‌ని స్పీక‌ర్ వెల్ల‌డించారు. ముంబై హోట‌ల్‌లో ఇంత‌కాలం సేద దీర...

డాల‌ర్స్ డ్రీమ‌ర్స్ కు యుఎస్ బంప‌ర్ బొనాంజా - గ్రీన్ కార్డుల ప‌రిమితి ఎత్తివేత బిల్లుకు ఆమోదం

చిత్రం
నిన్న‌టి దాకా ఇండియాపై కారాలు మిరియాలు నూరుతూ క‌న్నెర్ర చేస్తూ వ‌చ్చిన ప్ర‌పంచ పెద్ద‌న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తాజాగా కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ఎన్నికైన‌ప్ప‌టి నుంచి భార‌తీయుల‌కు న‌ష్టం క‌లిగించే రీతిలోనే వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. త‌మ దేశంలో ఇండియ‌న్స్ వుంటూ..త‌మ వారి అవ‌కాశాల‌ను దెబ్బ తీస్తున్నారంటూ చేసిన కామెంట్స్ ఇండియ‌న్స్‌ను కంటి మీద కునుకే లేకుండా చేశాయి. వీసా ల జారీ విష‌యంలో కూడా క‌ఠిన‌త‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో అమెరికా అంటేనే జ‌డుసుకునే ప‌రిస్థితికి తీసుకు వ‌చ్చారు  యుఎస్ ప్రెసిడెంట్. తొలిసారిగా భార‌తీయుల‌కు మేలు చేసే దిశ‌గా పెద్ద‌సారు ఓ అడుగు ముందుకు వేశారు. అమెరికాలో శాశ్వ‌త నివాసానికి ప‌ర్మిష‌న్ ఇచ్చే వ‌ల‌స‌దారుల వీసాల‌పై దేశాల వారీగా ఉన్న ప‌రిమితిని ఎత్తివేసే బిల్లును అమెరికా ప్ర‌తినిధుల స‌భ ఆమోదించింది.  దీంతో కోట్లాది మంది భార‌తీయులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా డాల‌ర్లు సంపాదించాల‌నే డ్రీమ‌ర్స్ కు ఇది ఓ శుభ‌వార్త‌. ఇండియన్స్ కు ఇక‌పై గ్రీన్ కార్డులు ఎక్కువ‌గా జారీ అయ్యే అవ‌కాశాలున్నాయి. విదేశీయులు గ్రీన్‌కార్డులు పొందాలంటే ద‌శాబ్దాల త‌...

ఫ్లిప్ కార్ట్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్

చిత్రం
ఇండియాలో టాప్ వ‌న్ ఈ కామ‌ర్స్ కంపెనీగా పేరొందిన ఫ్లిప్ కార్ట్..ప్ర‌పంచ ఈకామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ , స్నాప్ డీల్ కంపెనీల‌కు షాక్ ఇచ్చింది. ఏకంగా కొత్త‌గా కో - బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుద‌ల చేసింది. ఈ కార్డును పొంద‌డం వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి క‌స్ట‌మ‌ర్స్ కు. యాక్సిస్ బ్యాంకు, మాస్ట‌ర్ కార్డ్‌తో క‌లిసి ఫ్లిప్ కార్డ్ కంపెనీ కో - బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకు వ‌చ్చింది. అయితే , ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం ఎంప‌కి చేసిన వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే తొలుత అందిస్తుంది. భ‌విష్య‌త్‌లో అంద‌రికీ విస్త‌రింప చేయాల‌నే ఆలోచ‌న‌తో దీనికి శ్రీ‌కారం చుట్టింది ఫ్లిప్ కార్ట్. ఈ కో - బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్ కార్ట్ , మింత్ర‌, 2గుడ్ ల‌లో కొనుగోలు చేసే ప్ర‌తిదానిపై 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వ‌చ్చేలా చేస్తుంది.  ఈ స‌దుపాయం వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు వ‌స్తువులు తీసుకున్న ఆనందంతో పాటు పెట్టిన ఖ‌ర్చులో కొంత తిరిగి వ‌స్తుంది. ఈ ఛాన్స్ వ‌ల్ల ఇప్పుడున్న వినియోగ‌దారుల‌తో పాటు మ‌రికొంత మంది క‌స్ట‌మ‌ర్లు ఫ్లిప్ కార్డ్ ఇచ్చే వెస‌లుబాటును పొందేందుకు వీలు క‌లుగుతుంది. అంతేకాకుండా ఇత‌ర రి...

వారెవ్వా..అమెజాన్..అయ్యో యాపిల్ ..!

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత న‌మ్మ‌క‌మైన కంపెనీ ఏదంటే ట‌క్కున మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది యాపిల్, గూగుల్ కంపెనీలే. కానీ ఇపుడు ఆ సీన్ మారిపోయింది. ప్ర‌తి రోజు కోట్లాది మంది ప్ర‌పంచ వ్యాప్తంగా గూగుల్ ను వాడందే ఉండ‌లేరు. ఇక మ‌రో అమెరిక‌న్ కంపెనీ యాపిల్ పేరు చెబితే చాలు ..జ‌నం గుండెలు ల‌య త‌ప్పి పోతాయి. అంత‌లా దానికి క్రేజ్ ఉంది. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా నిర్వ‌హించిన న‌మ్మ‌క‌మైన బ్రాండ్స్..కంపెనీలు ఏవి అని ఓ సంస్థ స‌ర్వే చేప‌ట్ట‌గా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి. గూగుల్ లేకుండా ఉండ‌లేం..కానీ ఎంత భ‌ద్రం అనే విష‌యంలో మాత్రం దానికి ఓటు వేయ‌లేమంటూ చెప్పేశార‌ట‌. మ‌రో కంపెనీ యాపిల్ కూడా ఒపినియ‌న్స్ వ్య‌క్తం చేశారు. చూస్తే అందంగా ఉండొచ్చు..క్వాంటిటీ క‌న్న ..క్వాలిటి విష‌యంలో అన్ని బ్రాండ్స్ కంటే గొప్ప‌గా ఉండ‌వ‌చ్చు..కానీ రోజూ అందించే ఆఫ‌ర్స్ విష‌యంలో అదే దేశానికి చెందిన అమెజాన్ కంపెనీకే జ‌నం ఓటేశారు. ఈ కామ‌ర్స్ రంగంలో స‌ద‌రు కంపెనీ త‌న హ‌వాను కొన‌సాగిస్తూ వ‌స్తోంది. వినియోగ‌దారుల అభిరుచులు, అభిప్రాయాలు, సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటూ త‌న‌కంటూ ఓ బ్రాండ్‌తో పాటు ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటూ ముంద...

గెలుపొందిన ఇంగ్లండ్ ..త‌ల‌వంచిన ఆస్ట్రేలియా - ఫైన‌ల్ పోరుకు రెడీ ..!

చిత్రం
ఊహించ‌నిదే జ‌రిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఆశించిన రీతిలో ఫ‌లితాలు ప్ర‌తికూలంగా వ‌చ్చాయి. నిన్న‌టికి నిన్న అండ‌ర్ డాగ్స్ గా ప‌రిగ‌నించిన ఇండియా జట్టు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు పోయి..చేజేతులారా ఓట‌మిని కొని తెచ్చుకుంది. నాకౌట్ ద‌శ‌లో సెమీ ఫైన‌ల్లో న్యూజిలాండ్ ..భార‌త్‌ను ఇంటికి పంపించింది. రెండో సెమీ ఫైన‌ల్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతుంద‌నుకుంటే ..ఏకంగా ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్ కంగూరుల‌కు ద‌డ పుట్టించింది. అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని స్వంతం చేసుకుని, ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌లోకి దూసుకెళ్లింది. ఈసారి క‌ప్పు కొత్త గూటికే చేర‌నుంది. ఇదీ ఇవాల్టీ విశేషం. జేస‌న్ రాయ్ చెల‌రేగి పోగా ..వోక్స్ దుమ్ము రేపాడు. దీంతో గెలుపు సునాయ‌సంగా ల‌భించింది ఇంగ్లండ్ జ‌ట్టుకు. అయిదు సార్లు గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి ఎగ‌రేసుకు పోదామ‌ని క‌ల‌లు క‌న్న‌ది. ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై ఇంగ్లండ్ ఆట‌గాళ్లు నీళ్లు చ‌ల్లారు. ఈసారి ఎలాగైనా స‌రే క‌ప్పును ముద్దాడాల‌ని ప‌రిత‌పించిన విండీస్, శ్రీ‌లంక‌, పాకిస్తాన్, ఇండియా జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంటి దారి ప‌ట్టాయి. ఇక మిగిలింది అస‌లైన పోరు న్యూ...

అమ్మో లావ‌ణ్య‌..నోట్ల క‌ట్ట‌లు..ఆభ‌ర‌ణాలు..రెవిన్యూ శాఖ‌లో మ‌రో జ‌ల‌గ ..ఎమ్మార్వో అరెస్ట్ ..ఏసీబీ కోర్టుకు త‌ర‌లింపు..!

చిత్రం
ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన అధికారులు త‌మ‌కు అడ్డే లేదంటూ అడ్డ‌గోలుగా సంపాదించేస్తున్నారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక అవినీతి అంటూ ఉండ‌ద‌ని చెప్పిన స‌ర్కార్ కు దిమ్మ తిరిగేలా అందినంత మేర దోచేస్తున్నారు. ప్ర‌తి ప‌నికి ఓ రేటు నిర్ణ‌యించేసి ..ప్ర‌జ‌లకు సేవ‌లందించాల్సిన ఆఫీసుల‌నే అడ్డాలుగా మార్చేసుకున్నారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా గ‌త కొన్నేళ్లుగా దోపిడీకి లోనైంది. దీనిని నాలుగు జిల్లాలుగా విభ‌జించారు. అయినా పేద‌ల బ‌తుకులు మార‌లేదు. రైతుల వెత‌లు తీర‌లేదు. ఒక‌టే జ‌పం..బంగారు తెలంగాణ‌. అక్ర‌మార్కుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ దారుల‌కు, మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాల‌కు , ర‌హ‌దారి ప్ర‌మాదాల‌కు నెల‌వై పోయింది ఈ తెలంగాణ‌. అన్ని శాఖ‌ల‌కంటే రెవిన్యూ శాఖ‌లో అవినీతి రాజ్య‌మేలుతోంది. పైస‌లు త‌డ‌పందే ఫైళ్లు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి దాపురించింది. టిఆర్ ఎస్ స‌ర్కార్ ఏర్పాటు అయ్యాక ఎవ‌రైనా లంచం అడిగితే నేరుగా త‌మ‌కు ఫిర్యాదు చేయండంటూ ..సీఎం అప్ప‌ట్లో టోల్ ఫ్రీ నెంబ‌ర్ ప్ర‌క‌టించారు. దానికి వేలాది మంది బాధితులు విన‌తులు స‌మ‌ర్పించుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు.  వీరి నిర్వాకానికి ఇటీవ‌లే ఓ క‌లెక్ట‌ర్ మ...