పోస్ట్‌లు

సెప్టెంబర్ 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇక..ఎస్..తో.. పేటీఎం..?

చిత్రం
బ్యాంకింగ్ రంగంలో సేవల్లో ముందు వరుసలో ఉన్న ఎస్ బ్యాంక్ లో కొంత మొత్తంలో వాటాను కొనుగోలు చేసే దిశగా డిజిటల్ చెల్లింపుల సంస్థ పే టీఎం ప్రయత్నాలు చేస్తోంది. యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు చెందిన సంస్థలకు యస్‌ బ్యాంక్‌లో 9.6 శాతం మేర వాటా ఉన్నది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి పేటీఎమ్‌ యాజమాన్య సంస్థ, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆర్‌బీఐ ఆమోదాన్ని బట్టి ఒప్పందం స్వరూపం ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేటీఎమ్‌ వ్యవస్థాపకులు విజయ్‌ శేఖర శర్మకు ఇప్పటికే పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో వాటా వున్నది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, డీల్ ఈజీగా అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే, సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక బ్యాంక్‌లో 5 శాతం మేర ఇన్వెస్ట్‌ చేయవచ్చు. యస్‌ బ్యాంక్‌ ఇటీవల క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా 1,930 కోట్ల నిధులు సమీకరించింది. మరిన్ని పెట్టుబడులు సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో యస్‌ బ్యాంక్‌కు 1,50...

పదవుల పందేరం..అస్మదీయులకు అందలం..?

చిత్రం
ఏపీలో కొలువు దీరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అతి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. తనకు చేదోడుగా ఉన్న వారికి పదవులను కట్టబెడుతున్నారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంకు ధర్మకర్తల మండలి ఎట్టకేలకు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ప్రకటించారు. తిరుమల అంటేనే కోట్లాది ప్రజల, భక్తుల మనోభావాలకు సంబంధించినది. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పాలక మండలిని ఏర్పాటు చేయాల్సి ఉండగా, గత కొన్నేళ్ల నుంచి దీనికి విరుద్దంగా పాలకులు సభ్యులను నియమిస్తూ వస్తున్నారు. వీరి వల్ల దేవాలయానికి ఒరిగిందేమీ ఉండదు. పైపెచ్చు వీరికి ప్రత్యేక ప్రోటోకాల్. అదనపు ఖర్చు కూడా.తాజాగా జగన్ మోహన్ రెడ్డి టీటీడీ పాలక మండలిని ఖరారు చేశారు. ఇందులో అందరూ జగమెరిగిన, పలు ఆరోపణలు ఉన్న వ్యాపారవేత్తలు. ఈసారి పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచారు. జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో జగన్ మోహన్ రెడ్డికి సన్నహితులు కాగా, తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీరిలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జూపల్లి రామ...

సానియా హల్ చల్..సోషల్ మీడియాలో వైరల్ ..!

చిత్రం
ఇండియాలో ఎవరు ఎప్పుడు స్టార్స్ గా వెలుగొందుతారో ఎవ్వరూ చెప్పలేరు. మోస్ట్ ఫెవరబుల్ గా ఉంటూ అటు అభిమానులను ఇటు నెటిజన్లను ఆకట్టుకుంటున్న ప్లేయర్స్ లలో ఒకరు ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ అయితే మరొకరు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఆమె మోడల్ గా, క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఇటీవల ఓ బాబుకు తల్లి కూడా అయ్యారు. అయినా ఆమె అందంలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా రోజు రోజుకు ఇంకా బ్యూటిఫుల్ గా తయారవుతూ ఫ్యాన్స్ ను మరింత విస్తు పోయేలా చేస్తోంది. అంతే కాదు సానియా మీర్జా మిగతా ఆటగాళ్ల కంటే సోషల్ మీడియాలో ముందంజలో ఉంటున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా, ఏ ప్లేస్ ను సందర్శించినా వెంటనే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో క్షణాల్లోనే అవి వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో ప్రతి రోజు సానియా మీర్జా పోస్ట్ చేస్తున్నారు. లెక్కలేనంత మంది లైకులు, హాట్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలు పెట్టారు. వీటిని చూసిన నెటిజన్స్ ఔరా అంటూ విస్తు పోయారు. కొడుక్కి తల్లివైనా ఏమాత్రం అందం తగ్గలేదంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా తన చెల్లెలు ఆనం మీర్జాతో కలిసి పారిస్ వె...

హద్దులు దాటిన ప్రేమ..ముద్దులతో సరిగమ..!

చిత్రం
తెలుగు బుల్లితెర మీద స్టార్ మా టీవీ ఆధ్వర్యంలో టెలికాస్ట్ చేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ దుమ్ము రేపుతోంది. ఇతర టీవీ ఛానల్స్ కు ధీటుగా ఈ ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా స్టార్ టీవీ బిగ్ బాస్ ను ప్రసారం చేస్తోంది. తమిళ్, కన్నడ, హిందీ లో ఈ షో కు పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ టేకోవర్ చేసుకున్న మా టీవీని స్టార్ టీవీ భారీ ఎత్తున ఆఫర్ ఇచ్చి స్వంతం చేసుకుంది. వినూత్న కార్యక్రమాలు, ఆకట్టుకునే భారీ తారాగణంతో రూపొందించిన సీరియల్స్ ను టెలికాస్ట్ చేస్తూ ప్రత్యర్థి టీవీలకు సవాల్ విసురుతోంది. నాగార్జునకున్న ఫాలోయింగ్ ను గుర్తించిన స్టార్ యాజమాన్యం మీలో కోటీశ్వరుడు ఎవరూ అంటూ రియాల్టీ షో ప్రసారం చేసింది. ఇది ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవితో దీనిని నడిపించారు. తాజాగా బిగ్ బాస్ ను స్టార్ట్ చేసారు. మాటీవీలో మొదటి సారిగా ఈ రియాల్టీ షో ను జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేయగా, రెండో సారి బిగ్ బాస్ ను హీరో నాని హోస్ట్ చేశారు. ముచ్చటగా మూడో సారి నాగార్జున ప్రారంభించారు. స్టార్ట్ చేసే కంటే ముందు బిగ్ బాస్ పై పలు ఆరోపణలు, ...

రేగిన దుమారం..తగ్గిన డైరెక్టర్..వాల్మీకి ఇక గద్దలకొండ గణేష్

చిత్రం
సినిమా టైటిళ్ల విషయంలో వివాదాలు కొత్త కాదు. తెలుగు సినిమా రంగాన్ని ప్రతి సారి ఏదో ఒక సినిమాపై తమ మనో భావాలు దెబ్బ తింటున్నాయని ఆందోళనలు చేయడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం మామూలై పోయింది. తాజాగా డైనమిక్ డైరెక్టర్, రచయిత, భావుకుడు, ధైర్యం కలిగిన వ్యక్తి హరీష్ శంకర్ తీసిన వాల్మీకి పై పెద్ద దుమారం చెలరేగింది. అంతకు ముందు షాక్ తీశాడు. మిరపకాయ్ మూవీతో దుమ్ము రేపాడు. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా తీశాడు. పవన్ రేంజ్ ను మరింత పెంచాడు. ఒకే ఒక్క డైలాగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేసింది అదే నాకో తిక్కుంది దానికో లెక్కుంది అని. తర్వాత బన్నీతో డీజే తీశాడు . అదే దువ్వాడ జగన్నాథం. గుడిలో బడిలో ఒడిలో అన్న పాటపై దుమారం చెలరేగింది. పొద్దస్తమానం పుస్తకాలతో కుస్తీ పడుతూ, నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ మాంచి కసితో ఉండే హరీష్ శంకర్ ఏది మాట్లాడినా ఓ కిక్ ఉంటుంది.  అది చూసే వాడికి అర్థమవుతుంది. తానేమిటో తన పదాలకున్న పవర్ ఏమిటో. సినీ జనాలకు తానేమిటో రుచి చూపించాడు. అతడి సినిమాలలో ఏదో ఒకటి వివాదం చోటు చేసుకుంటూనే ఉన్నది. తాజాగా వరుణ్ తేజ్ తో వాల్మీకి పేరుతో సినిమా తీశాడు. టీజర్ కు హెవీ రెస్పాన్స్ వచ్చింద...

షబానా ఆజ్మి..సహజ నటీమణి..!

చిత్రం
భారతీయ సినిమా రంగంలో సహజ నటనకు ప్రతిరూపం షబానా కైఫీ ఆజ్మి. ఆమెకు ఇప్పుడు 70 ఏళ్ళు. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ ఆమె భర్త. నటిగా, సామాజిక యాక్టివిస్ట్ గా పేరు పొందారు. సినిమాలలో కాకుండా టీవీ, థియేటర్ లలో కూడా నటించారు. ఆమె తండ్రి షౌకత్ ఆజ్మీ గొప్ప కవి. పూణే లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో షబానా చేరారు. అక్కడ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. ఆమె తన అసమాన ప్రతిభతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏకంగా అయిదు సార్లు నేషనల్ ఫిలిం అవార్డును అందుకున్నారు షబానా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పురస్కారాలు అందుకున్నారు. 30 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో విమేన్ ఇన్ సినిమా అనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ప్రకటించింది. దేశంలో నాలుగో అత్యున్నతమైన పురస్కారం ఇది. ఇప్పటి దాకా షబానా ఆజ్మి 120 సినిమాలలో నటించారు. 1988 నుంచి నేటి దాకా నటిస్తూనే ఉన్నారు.  సామాజిక భాద్యతగా ఆమె స్వీకరించారు. స్త్రీ పక్ష పాతిగా పేరు తెచ్చుకున్నారు. మహిళల తరపున పోరాడుతున్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్స్ ఫండ్ కు గుడ్ విల్ అంబాజిడర్ గా పని చేస్తున్నారు...