పోస్ట్‌లు

జూన్ 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వారంలో ఒక రోజు - పోలీసుల్లో ఆనందం ..కుటుంబాల్లో సంతోషం

చిత్రం
వాళ్లు మ‌న‌లాంటి మ‌నుషులే. మ‌న‌మంతా ఇలా ఆనందంగా ఉన్నామంటే వారందిస్తున్న సేవ‌లే. ర‌క్ష‌ణ విభాగంలో కీల‌క భూమిక పోషిస్తూ రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్య‌త‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న అటెండ‌ర్ నుంచి ఐఏఎస్ ఆఫీస‌ర్ల దాకా ప్ర‌తి ఒక్క‌రికి 8 గంట‌ల ప‌ని, వారంలో ఒక రోజు వారాంత‌పు సెల‌వు తీసుకుంటున్నారు. ద‌ర్జాగా కుటుంబాల‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్ప‌టి నుంచో ఆయా ఎన్నిక‌ల సంద‌ర్భంగా అన్ని పార్టీల నేత‌లు పోలీసుల‌కు వీక్లీ ఆఫ్ అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ నేటి దాకా అమ‌లు కాలేదు. రాజు త‌లుచుకుంటే ఏదైనా చేయ‌వ‌చ్చ‌ని ఏపీ సీఎంగా ఎన్నికైన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరూపించారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో భాగంగా ప్ర‌క‌టించిన విధంగానే త‌క్ష‌ణ‌మే పోలీసు శాఖ‌లో ప్ర‌తి ఒక్క‌రికి వీక్లీ ఆఫ్ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. పోలీసులు సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపార...

కెప్టెన్సీకి రాహుల్ రాం రాం - కొలిక్కి రాని కొత్త సార‌థి

చిత్రం
సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ ఎన్న‌డూ లేనంత‌టి సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించిన పార్టీకి పేరున్నా ప్ర‌స్తుతం జ‌వ‌స‌త్వాలు కోల్పోయి చ‌తికిల‌ప‌డింది. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా బ‌ల‌మైన క్యాడ‌ర్ క‌లిగిన పార్టీ ఇపుడు ర‌థ‌సార‌థి కోసం వెతుకుతోంది. నిన్న‌టి దాకా పార్టీ బాధ్య‌త‌లు తీసుకున్న రాహుల్ గాంధీ దేశ్ కీ నేత అంటూ క్యాడ‌ర్ ప్ర‌చారం చేసింది. రెండు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాలేక పోయారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాను కూడా అందించ‌లేక పోయారు. దీంతో పార్టీ ఓట‌మికి ..భారీ ప‌రాజ‌యానికి పూర్తి బాధ్య‌త వ‌హిస్తూ తాను కాంగ్రెస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఇప్ప‌టికే దేశ ప్ర‌జ‌ల సాక్షిగా ప్ర‌క‌టించారు. రాహుల్ నిర్ణ‌యాన్ని పార్టీకి చెందిన సీనియ‌ర్ లీడ‌ర్ల‌తో పాటు తల్లి సోనియాగాంధీ, చెల్లెలు ప్రియాంక గాంధీలు ఎంత‌గా న‌చ్చ చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని మార్చు కోలేదు. త‌మ కుటుంబం నుంచి కాకుండా వేరే ఎవ్వ‌రికైనా పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించండంటూ లేఖ...

క‌విత్వంతో ఐపీఎస్ క‌ర‌చాల‌నం

చిత్రం
ఓ వైపు ఐపీఎస్‌గా స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే మ‌రో వైపు సామాజిక బాధ్య‌త‌గా క‌విత్వంతో క‌ర‌చాల‌నం చేస్తోంది చంద‌నా దీప్తి. జీవితాన్ని ఆవిష్క‌రించే సాధ‌నాల్లో పోయెట్రి ఒక‌టి. సానుకూల దృక్ఫ‌థంతో ఆలోచిస్తే స‌మ‌స్య‌లు చిన్న‌విగా క‌నిపిస్తాయ‌ని , చూసే దృష్టిని బ‌ట్టి లైఫ్ వుంటుంద‌ని ఆమె న‌మ్ముతారు. ఆ దిశ‌గా ఆమె అడుగులు వేస్తున్నారు. క‌విత్వం రాయ‌డంతో పాటు వివిధ అంశాల‌పై ర‌చ‌న‌లు కూడా చేస్తున్నారు. పోలీసు శాఖ అంటేనే చాలా మంది ఇబ్బందిక‌రంగా భావిస్తారు. ప్ర‌స్తుతం చంద‌నా దీప్తి ఎస్పీగా మెద‌క్ జిల్లా బాధ్య‌త‌లు చూస్తున్నారు. జిల్లా వాసులకు బాస‌ట‌గా నిలుస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స్ఫూర్తి దాయ‌కంగా ఉండేలా ర‌చ‌న‌లు చేస్తూ చైత‌న్య‌వంతం చేస్తున్నారు. చంద‌నా దీప్తి ముందు నుంచి మెరిట్ స్టూడెంట్. ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఢిల్లీలో సిఎస్ఇ కోర్సు చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీస‌ర్‌గా ఎంపిక‌య్యారు. దీప్తి స్వంత ఊరు తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వ్య‌క్తి. హైద‌రాబాద్‌లో ఉంటూ క‌ష్ట‌ప‌డి చ‌దివారు. బెస్ట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. వివిధ సామా...

కేసీఆర్ భగీర‌థ ప్ర‌య‌త్నం - కాళేశ్వ‌రం క‌ళ్ల‌ముందు సాకారం

చిత్రం
అప‌ర మేధావిగా, దార్శ‌నికుడిగా, ముందు చూపు క‌లిగిన నాయ‌కుడిగా పేరుగాంచిన తెలంగాణ ష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు. అసాధ్యమ‌నుకున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టును సుసాధ్యం చేసి త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించుకున్నారు. కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో అతి త‌క్కువ టైంలో ప్ర‌పంచంలోనే అతి పెద్ద వంతెన నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. ఇది తెలంగాణ సాధించిన ఘ‌న‌త‌. కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌లు సాకారం అయ్యేలా చేసిన వైనం భావి త‌రాల‌కు పాఠంగా నిలువ బోతున్న‌ది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనిని మంత్రి ఈటెల ప‌ర్య‌వేక్షించారు. రేయింబ‌వ‌ళ్లు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు క‌ష్ట‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టుకు కొండ గుర్తుగా సీఎం విగ్ర‌హాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేశారు. ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌కమైన కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 3 ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్లు, 16 రిజ‌ర్వాయ‌ర్లు, 20 లిఫ్టులు అంటే ఎత్తిపోత‌లు, 203 కిలోమీట‌ర్ల మేర సొరంగ మార్గం, 1521 కిలోమీట‌ర్ల పొడ‌వునా కాల్వ‌లు నిర్మించారు. 37 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు అందించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. మ...

చంద్ర‌బాబుకు క‌టీఫ్..క‌మ‌లంతో దోస్తానా

చిత్రం
సుదీర్ఘ‌మైన చ‌రిత్ర క‌లిగిన ప్రాంతీయ పార్టీగా పేరు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్న‌ది.ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అటు అసెంబ్లీలోను ఇటు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ సీట్ల‌ను చేజిక్కించుకుంది. ఊహించ‌ని రీతిలో ఓట‌మిని చ‌వి చూశారు తెలుగు త‌మ్ముళ్లు. అధినాయ‌క‌త్వం దీనికి పూర్తిగా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థ‌ల స‌మ‌రానికి వైసీపీ సై అంటుంటే టీడీపీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. త‌న కుటుంబంతో క‌లిసి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరిన చంద్ర‌బాబుకు అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు టీజీ వెంక‌టేశ్, సుజ‌నా చౌద‌రి, సిఎం ర‌మేష్, గ‌రిక‌పాటిలు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. త‌మ రాజ్య‌స‌భ ప‌క్షాన్ని క‌మ‌లంలో విలీనం చేయాల‌ని కోరుతూ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు లేఖ అంద‌జేశారు. త్వ‌ర‌లో మ‌రో ముగ్గురు లోక్‌స‌భ స‌భ్యుల‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా త‌మ పార్టీలోకి వ‌స్తార‌ని , అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత చేర్చుకోవాలో లేదా అన్న‌ది అపుడు పార్టీ హైక‌మాండ్ ఓ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏపీ టీడీపీలో వీరి జంపింగ్ క‌ల‌క‌లం రేపింద...

వారెవ్వా వార్న‌ర్..పోరాడిన బంగ్లా

చిత్రం
వార్ ఒన్ సైడ్ అవుతుంద‌ని భావించిన కంగారూల ఫ్యాన్స్‌కు దిమ్మ దిరిగేలా బంగ్లా ఆట‌గాళ్లు దుమ్ము రేపారు. నిన్న‌టికి నిన్న విండీస్‌కు చుక్క‌లు చూపించిన ఈ జ‌ట్టు ..ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ పోరుకు తెర లేపింది. చివ‌రి వ‌ర‌కు ఆస‌క్తిక‌రంగా మారిన ఈ మ్యాచ్‌లో గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టుకు చెందిన డేవిడ్ వార్న‌ర్ రెచ్చి పోయాడు. విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్‌ను ప్ర‌ద‌ర్శించాడు. ఈ టోర్నీలో త‌న‌కు ఎదురే లేదంటూ హెచ్చ‌రిక‌లు పంపించాడు ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు. 147 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు 5 భారీ సిక్స‌ర్ల‌తో 166 ప‌రుగుల భారీ స్కోర్ సాధించాడు. జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు వార్న‌ర్. సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారిన బంగ్లాకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. బంగ్లా ప‌సికూన‌లు పులుల్లా రెచ్చి పోయారు. ఆఖ‌రి వ‌ర‌కు ఆస్ట్రేలియ‌న్ల‌కు ద‌డ పుట్టించారు. ముష్పిక‌ర్ 97బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 102 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్ఫూర్తి దాయ‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ట్టు స్కోర్‌ను పెంచేందుకు దోహ‌ద ప‌డ్డాడు. ఆసిస్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశార...