పోస్ట్‌లు

అక్టోబర్ 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

స్విగ్గీ లో కొలువుల పండుగ

చిత్రం
ఫుడ్ డెలివరీ సర్వీసెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి స్విగ్గీ కంపెనీ తాజాగా నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తమ సర్వీసెస్ ను మరింత మెరుగు పర్చడం తో పాటు కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించడం, ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే కొద్దీ నిమిషాల్లోపే చేర్చేలా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఏకంగా 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది స్విగ్గీ . ఈ మొత్తం ఉద్యోగాలను వచ్చే 18 నెలల కాలంలో వీరిని భర్తీ చేసుకోనుంది. అంతే కాకుండా తమ కంపెనీలో మొత్తం ఐదు లక్షల మంది ఉండాలన్నది కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇండియాలో మూడో అతి పెద్ద సంస్థగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం స్విగ్గీ కి జొమాటో నుంచి అధికంగా పోటీ ఉంటోంది. అంతే కాకుండా తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలందించడంతో పాటు, ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావిస్తోంది.ఇది వాస్తవ రూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద  ప్రయివేటు రంగ సంస్థగా అవతరిస్తుంది. గిగాబైట్స్ టెక్ కాన్ఫరెన్స్‌లో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ ఈ విషయాన్...

ఏపీ ప్రభుత్వం..అత్యవసర బాధితుల కోసం

చిత్రం
ఏపీలో వైసీపీ సర్కార్ కొలువు తీరాక ప్రజలకు ఉపయోగపడేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో 108 సర్వీసెస్ ను పునరుద్దిరించిన ఘనత తన తండ్రి రాజశేఖర్ రెడ్డిదే. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా వేలాది మంది అత్యవసర బాధితుల కోసం అండగా నిలిచేలా ..జాతీయ రహదారులపై ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు వైఎస్సార్‌ అత్యవసర చికిత్స పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రమాద బాధితులకు వెంటనే అత్యవసర చికిత్సలు అందించాలని జగన్ ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు సీఎం జగన్. ఇదిలా ఉండగా ప్రతి ప్రతి 50 కి.మీ.లకు ఒకటి చొప్పున త్వరలో మొత్తం 90 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఇందు కోసం దాదాపు 72 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంభవించే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ రహదారులపై త్వరలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు’ పేరుతో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రం మీ...

ఇక మండలాలకు 108 సర్వీసెస్

చిత్రం
రాష్ట్రంలో108 సేవలను మరింతగా విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఈ సర్వీసెస్ పూర్తిగా సక్సెస్ అయ్యాయి. ఎక్కడ చూసినా 108 అంబులెన్స్ కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టింది మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు. ఆయన పరిపాలన కాలంలోనే ఐటీ దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న సత్యం కంప్యూటర్స్ సహాయంతో 108 అంబులెన్స్ సర్వీసెస్ ను ప్రభుత్వంతో కలిసి స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం. కాంగ్రెస్ అధికారం లోకి రావడం, సత్యం కంపెనీ అధినేత రామలింగ రాజు జైలుకు వెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇదే సమయంలో కొన్ని నెలల పాటు 108 సేవలు ఆగి పోయాయి. దీంతో రాష్ట్ర మంతటా వత్తిళ్లు పెరగడం, రోడ్డు ప్రమాదాలు చోటు చేసు కోవడంతో అప్పటి దివంగత సీఎం రాజా శేఖర్ రెడ్డి రంగం లోకి దిగారు. దీనిని నిలబెట్టేందుకు కృషి చేశారు. సత్యం కంపెనీని మహీంద్రా కంపెనీ టేకోవర్ చేసుకుంది. ఇక 108 సేవలు అందించేందుకు మహీంద్రా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో జివికె కంపెనీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇదే కంపెనీ 108 అంబులెన్స్ సేవలు అందిస్తోంది. అయితే సదరు కంపెనీపై కూడా ఆరోపణులున్నాయి. స...

దాయాదుల మధ్య పోరు షురూ

చిత్రం
నిన్నటి దాకా మిన్నకుండి పోయిన పాకిస్థాన్ అదును చూసి ఇండియాను టార్గెట్ చేసింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరిగా మారింది. నిన్నటి దాకా సపోర్ట్ గా ఉన్న చైనా సైతం పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పేసింది. దీంతో పాకిస్తాన్ పగతో రగిలి పోతున్నది. భారత స్థావరాలపై దాడులకు పాల్పడింది. దీంతో కేంద్ర హోమ్ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అనంతరం భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఇండియన్ బలగాలు భారీగా కాల్పులతో విరుచుకు పడటంతో పాక్‌ ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయి. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ ప్రతీకార కాల్పులకు దిగింది. బాలాకోట్‌ ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడుల అనంతరం.. ఆ స్థాయిలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకు పడింది. భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పీఓకేలోని నీలం లోయలో ఉన్న నాలుగు ఉగ్ర స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. పక్కా ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత జవాన్లు కాల్పులు జరిపారు. మూడు స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి, మరో ...

సమస్తం కార్మికుల కోసం

చిత్రం
సకల తెలంగాణ సమాజం ఒక్కటి కాబోతున్నది. మీ అందరి తోడ్పాటు, సహకారం వల్లనే మేమిచ్చిన బంద్ పిలుపు సక్సెస్ అయ్యింది. ఇదే స్పూర్తితో ప్రభుత్వం దిగి వచ్చే దాకా తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సకల జనులు మా వెంట ముందుండి నడిచారు. మీకందరికీ కృతజ్ఞతలు. మీ ఋణం మేం తీర్చుకోలేం. మేం న్యాయబద్ధమైన డిమాండ్లను మాత్రమే అడుగుతున్నాం. కానీ ముఖ్యమంత్రి మాత్రం తన అహాన్ని వీడడం లేదు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చింది. ఇందుకు మా కార్మికులందరి తరపున క్షమాపణలు చెబుతున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వతమ రెడ్డి చెప్పారు. అన్ని పార్టీలు, సంఘాలు, మేధావులు, మహిళా సంఘాలతో జేఏసీ సమావేశమైంది. జేఏసీ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అన్ని పార్టీలు, సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు కార్యాచరణను ప్రకటించింది జేఏసీ. అంతే కాకుండా కార్మికులంతా దీపావళి పండుగను జరపరాదని నిర్ణయం తీసుకున్నామని అశ్వత్తమ్మ రెడ్డి చెప్పారు. కాగా బంద్ సక్సెస్ కావడంతో సమ్మె మలి దశ కార్యాచరణ పటిష్టంగా ఉండేలా చూడాలని జేఏసీ తీర్మానించింది. 4 లక్షల మందితో సకల ...

అభినవ ఇందిర ప్రియాంక

చిత్రం
ఇండియాలో వర్ధమాన రాజకీయ నాయకురాలల్లో జనాదరణ కలిగిన లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రియాంక గాంధీ. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ముద్దుల కూతురుగా, అన్న రాహుల్ గాంధీకి ప్రియమైన చెల్లెలుగా ఉన్నారు. కోట్లాది మంది ప్రియాంక గాంధీకి అభిమానులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నకు, తల్లికి చేదోడుగా ఉంటున్నారు. అన్న కంటే ఎక్కువగా ఆమె ప్రచారంలో ముందు వరుసలో ఉంటున్నారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ పై, ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. సమస్యలపై నిలదీస్తున్నారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, తదితర రంగాలపై ప్రియాంక గాంధీకి మంచి పట్టుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో నిమగ్నమై పోయారు. అయితే ఇటీవల జరిగిన అధికారిక అత్యున్నత పార్టీ కొర్ కమిటీ మీటింగ్ లో ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే దానిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ప్రియాంక గాంధీపై ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రియాంక గాంధీని మరో అభినవ ఇందిరా...

కార్మికుల కోసం జనసేనాని

చిత్రం
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ..జనమే జెండా సమస్యలే ఎజెండా దిశగా కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నెలకొన్న ఇస్యూస్ పై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ బాధ్యులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులను పవన్ ఆదేశించారు. పార్టీ శ్రేణులలో స్థైర్యాన్ని పెంపొందించి, యువ నాయకత్వం బలోపేతానికి పార్టీ కార్యాచరణ చేయాలని కమిటీ సభ్యులకు పవన్ సూచించారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పని తీరు, హామీలు, పథకాల అమలులో వైఫల్యాలు, విద్యుత్ సంక్షోభం, సాగుదారుల సమస్యలు, జనసేన నేతలు, శ్రేణులపై అధికార పక్షం చేస్తున్న దాడులపై చర్చించారు. ఇదిలా ఉంటే.. ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో నవంబర్ 3 న భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటానని జనసేనాని చెప్పారు. పార్టీ శ్రేణులంతా భవన నిర్మాణ కార్మికులకు...

పట్టు బిగిస్తున్న టీమిండియా

చిత్రం
టీమిండియా రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో పట్టు బిగిస్తోంది. అటు బౌలింగ్ లోను..ఇటు బ్యాటింగ్ లోను రాణించింది. మరో వైపు టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండగా, ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. వచ్చీ రావడంతోనే జార్జ్‌ లిండే వేసిన ఓవర్‌లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టాడు. ఆపై మరొకసారి లిండే వేసిన ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు. సిక్సర్ల రూపంలోనే 30 పరుగులు సాధించాడు. వేగంగా పరుగులు సాధించిన జాబితాలో మనోడు చోటు దక్కించుకున్నాడు. తొమ్మిది బంతుల్లోనే ఉమేశ్‌ యాదవ్ ఈ పరుగులు చేశాడు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధిస్తే దాన్ని ఉమేశ్‌ బ్రేక్‌ చేశాడు. ఉమేశ్‌, ఫ్లెమింగ్‌ల తర్వాత వెస్టిండీస్‌ ఆటగాడు నామ్‌ మెక్లీన్స్‌, అబ్దుల్‌ రజాక్‌లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు ఫార్మాట్‌ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడిన అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కల్గిన ఆటగాళ్లలో ఉమేశ్‌ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇ...

వైరల్ గా మారిన ఉపాసన ట్వీట్

చిత్రం
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ పై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మహాత్మా గాంధీ 150 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛేంజ్ వితిన్ పేరుతో సెలబ్రెటీలు, నిర్మాతలు, బిగ్ పర్సనాలిటీస్ తో ప్రధాన మంత్రి మోదీ సమావేశమవుతున్నారు. వారి సపోర్ట్ కావాలని అడుగుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీ లోని కళ్యాణ్ మార్గ్ లో బాలీవుడ్ స్టార్స్ పీఎం తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా పలువురు సినీ, టెలివిజన్‌ ప్రముఖలు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌లో సైతం పంచుకున్నారు. అయితే మోదీ హిందీ ప్రముఖలను మాత్రమే కలవడంపై ఉపాసన అసహనం వ్యక్తం చేశారు. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడికి కూడా ఆహ్వానం అందక పోవటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను పట్టించుకోవడం లేదని అభిప్రాయ పడ్డారు. ఈ విషయంపై ఆమె ప్రధానిని సూటిగా ప్రశ్నించడం..అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ.. మీరు ప్రధాని అయినందుకు దక్షిణాది ప్రజ...

పదవే వద్దన్న పృథ్వీ

చిత్రం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - మా హైదరాబాద్ లో  ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ మధ్యలోనే సభ్యులు  అర్థాంతరంగా వెళ్లిపోయారు.  మా అధ్యక్షుడు నరేష్‌కు తెలియ కుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్..ఫిలిం ఛాంబర్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేష్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని, కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్‌ తెలిపారు. కాగా మా లో ఎక్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ చైర్మన్‌ పృథ్వీ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌పై నిప్పులు చెరిగారు. తనకు ఈసీ మెంబర్‌ పదవి అక్కర్లేదని, సభ్యుల తీరు మారకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. గెలిచినందుకు ఆనంద పడాలో.. బాధ పడాలో తెలియడం లేదన్నారు. మా లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని, మెంబర్స్‌ కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం ...

సర్కార్ దిగొచ్చే దాకా సమరమే

చిత్రం
ఆర్టీసీ కార్మికులతో బేషరతుగా చర్చలు జరపాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ విపక్షాలు, ప్రజా, విద్యార్ధి సంఘాలతో భేటీ అయ్యింది. సర్కారు దిగి వచ్చే దాకా సమరానికి సిద్ధం కావాల్సిందేనని కీలక నిర్ణయం తీసుకున్నది. బంద్ సక్సెస్ అయ్యిందని, ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చు కోవాలంటే అందరి సహకారం కోరడంతో పాటు మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని తీర్మానం చేశారు.ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేకంగా ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మెపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ మరోసారి గవర్నర్ ను కలవనున్నట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. 16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై ఈరోజు వరకు సర్కార్ సానుకూలంగా స్పందించిన పాపాన పోలేదన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడు కోవాలన్నదే తమ లక్ష్యమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించే వరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబ...