పోస్ట్‌లు

జులై 10, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

క‌ర్నాట‌కం ర‌స‌వ‌త్త‌రం ..రాజ‌కీయ క‌ల్లోలం..!

చిత్రం
క‌థ మార‌లేదు. సీన్స్ మాత్రం పండుతూనే ఉన్నాయి. క‌న్న‌డ నాట రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రాన్ని త‌ల‌పింప చేస్తోంది. దూరద‌ర్శ‌న్‌లో రామాయ‌ణం సీరియ‌ల్‌ను త‌ల‌పింప చేస్తోంది క‌ర్నాట‌క పాలిటిక్స్. జాతీయ మీడియా ఓ వైపు క్రికెట్ జ‌పం చేస్తున్నా..మ‌రో వైపు క‌న్న‌డ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. ఓవైపు కేపిటిల్ సిటీ ఢీల్లీతో పాటు బెంగ‌ళూరు, ముంబై కేంద్రాలుగా ఈ ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీ రోజుకో ట్విస్ట్‌ల‌ను రేపుతూ రంజుగా మార్చేస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్, జేడీఎస్‌లు సంకీర్ణ స‌ర్కార్‌ను ఏర్పాటు చేశాయో..అప్ప‌టి నుంచి క‌ర్నాట‌క వాసుల‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అస‌లు ప్ర‌భుత్వం ఉందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. రాజ‌కీయ కురువృద్ధుల‌కు కేరాఫ్‌గా మారిన ఈ నాట‌కంలో ఓ వైపు మాజీ ప్ర‌ధాని దేవెగౌడ స్వ‌యాన కుమారుడు కుమార‌స్వామి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇంకో వైపు మ‌ల్లికార్జున ఖ‌ర్గే తో పాటు మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధిరామ‌య్య‌లు ఈ ప‌ద‌విపై క‌న్నేసారు. పైకి అంతా ఒక్క‌టిగానే ఉన్నామ‌ని చెబుతున్నా ఎవ‌రికి వారు త‌మ ఆధిప‌త్యాన్ని చెలాయించాల‌నే ఉద్ధేశంతో డ్రామాల‌కు తెర తీశారు. త...

నాయ‌క‌త్వ వైఫ‌ల్యం..చేజార్చుకున్న విజ‌యం - ఇండియా డీలా..కీవీస్ భ‌ళా..!

చిత్రం
నాయ‌కుడంటే ఎలా వుండాలి. ముందుండి న‌డిపించాలి. భావోద్వేగాల‌ను అదుపులో వుంచు కోవాలి. త‌న వాళ్ల‌ను దూరంగా ఉంచాలి. తాను సైతం జాతికి అంకితం కావాలి. అదీ ఆటంటే..అదీ స్ఫూర్తి అంటే. అందుకే మ‌న ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు మిగ‌తా దేశాల జ‌ట్ల ఆట‌గాళ్ల‌కు ఉన్నంత తేడా. చెప్పాల్సి వ‌స్తే..ఎంతో. టోర్నీలో బాగా ఆడామ‌ని మ‌నం అనుకుంటున్నాం. ప‌సి కూనలుగా భావించిన అంద‌రికీ బంగ్లాదేశ్ తో  టీమిండియా ఆడిన ఆట‌ను మ‌రొక్క‌సారి చూస్తే తెలుస్తుంది. మ‌నం ఎంత చావు త‌ప్పి గెలిచామోన‌ని. కోట్లాది ప్ర‌జ‌లు వీళ్ల‌ను దేవుళ్లుగా చూసి..ఆరాధిస్తున్నారు కాబ‌ట్టే వీరికి ఆట మీద కంటే ఆదాయంపైనే దృష్టి ఎక్కువై పోయింది. లెక్క‌లేనంత ప్రాఫిట్ రాబ‌ట్టే వీళ్ల ఆట‌లు సాగుతున్నాయి. అదే ఆస్ట్రేలియా జ‌ట్టును చూడండి. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్స్  వాళ్లు. వాళ్ల‌కు తెలిసింది ఒక్క‌టే. ఆట. అంతే. మిగ‌తాదే ఏదైనా. వాళ్ల‌కు కుటంబాలు మ‌న‌లాగే ఉంటాయి. కానీ వారంతా మైదానం వెలుపుల వుంటారు. వీరికి చేదోడుగా ఉంటారు కానీ మ‌న‌లా వెంట పెట్టుకుని, రెస్టారెంట్లు, ప‌బ్‌ల వెంట ప‌రుగులు తీయ‌రు. సెల్ఫీలు దిగ‌రు. ప్ర‌చారం చేసుకోరు.  ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ ఆట‌గాళ్లు...

ఆట కంటే ఆదాయంపైనే మ‌క్కువ‌..ఫ్యాన్స్ కు శ‌ఠ‌గోపం..ఆనందంలో ఆట‌గాళ్లు..!

చిత్రం
ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో టీమిండియా క‌థ ముగిసింది. క‌మాన్ ఇండియా అంటూ ఇచ్చిన పిలుపున‌కు మ‌న క్రికెట‌ర్లు ఇంకెందుకు క‌ష్ట‌ప‌డాలంటూ దుకాణం స‌ర్దేశారు. నిన్న‌టి దాకా హీరోలుగా ..దేవుళ్లుగా నీరాజ‌నాలు అందుకున్న ఆట‌గాళ్లు ఇపుడు బేల చూపులు చూస్తున్నారు. దేశం ఏమై పోయినా ప‌ర్వాలేదు..100 కోట్ల‌కు పైగా ఉన్న భార‌త‌దేశంలో ..దేనినైనా భ‌రిస్తారు కానీ భార‌త క్రికెట్ జ‌ట్టు ఓడిపోతే స‌హించ‌లేరు. ఎందుకంటే ..క్రికెట్టే ఇక్క‌డ ఊపిరి క‌నుక‌. జాతి అంతా దానితో మ‌మేక‌మై పోయింది క‌నుక‌. ఎంతగా చెప్పుకున్నా ఈ ఒకే ఒక్క ఆట ఇండియాను ఒక్క‌టిలా చేస్తుంది. ఏ ఆయుధాలు ప్ర‌యోగించాల్సిన ప‌నిలేదు..ఏ అధికారిక ఆజమాయిషీ అక్క‌ర్లేదు. క్రికెట్‌తో ఆటలాడుకుంటే చాలు..అంద‌రినీ కంట్రోల్‌లో ఉంచ‌వ‌చ్చు. అందుకే కేంద్రంలో, దేశంలోని ఆయా రాష్ట్రాల‌లో ఏ పార్టీ ప‌వ‌ర్‌లో ఉన్నా స‌రే..అంద‌రి జ‌ప‌మంతా ఒక్కటే ..క్రికెట్ . దానిపై ఉన్నంత మోజు..సామాన్య ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఉండ‌దు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించి కూర్చోబెట్టాం క‌నుక‌. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆట‌గాళ్ల‌ల్లో స‌గ‌టున ఆదాయం లెక్కిస్తే మ‌న క్రికెట‌ర్లు స‌చిన్, కోహ్లి, ధోనీ,...

స్వ‌యంకృతాప‌రాధం ..కోలుకోలేని అప‌జ‌యం - క‌న్నీటి ప‌ర్యంత‌మైన భార‌తీయం..!

చిత్రం
స‌మ‌స్త క్రికెట్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా నివ్వెర పోయేలా చేసిన క్ష‌ణాలు. హాట్ ఫెవ‌రేట్‌గా ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో బ‌రిలోకి దిగిన టీమిండియా జ‌ట్టు ఏకంగా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అటు బ్యాటింగ్‌లోను..ఇటు బౌలింగ్‌లోను ..క‌లిసిక‌ట్టుగా పోరాడింది. లీగ్ ద‌శ‌లో జ‌రిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ ఓడిపోగా..మ‌రో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యింది. దీంతో టోర్నీమెంట్‌లో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. బ్యాటింగ్ దిగ్గ‌జాలు ప‌ది మందిని ఎంపిక చేస్తే అందులో ఇండియ‌న్ క్రికెట‌ర్స్ క‌నీసం అయిదుగురైనా ఉండి తీరాల్సిందే. కోట్లాది భార‌తీయుల ఆశ‌లు త‌గ్గ‌కుండా ..జాతి గ‌ర్వించే రీతిలో ఇండియ‌న్స్ ఆడారు. దీంతో జాతి యావ‌త్తు ఉత్తుంగ త‌రంగ‌మై మేరా భార‌త్ మ‌హాన్ అంటూ నిన‌దించింది. ఎక్క‌డ చూసినా కోట్లాది ప్ర‌జ‌లు జాతీయ పండుగ‌ను చేసుకున్నారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ రాజ‌ధాని దాకా ఎక్క‌డ చూసినా ..ఏ సందులోకి వెళ్లినా..ఏ రెస్టారెంట్‌లో కూర్చున్నా..బ‌స్సుల్లో, రైళ్ల‌ల్లో, విమానాల్లో సైతం క్రికెట్ వినిపించింది..క‌నిపించింది. హ‌ర్యానా క‌రేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో ఎప్పుడైతే భార‌త క్రికెట్ జ‌ట్టు ...

ఇంటి దారి ప‌ట్టిన టీమిండియా - కోట్లాది భార‌తీయుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన కోహ్లీ సేన..!

చిత్రం
కోట్లాది భార‌తీయుల ఆశ‌ల‌పై టీమిండియా నీళ్లు చ‌ల్లింది. ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్‌లో ఇండియా జ‌ట్టు 19 ప‌రుగుల తేడాతో ఓడి పోయింది. టోర్న‌మెంట్‌లో ఓవ‌ర్ ఆల్‌గా అద్భుత‌మైన ఫామ్‌ను క‌న‌బ‌ర్చి సెమీస్‌కు చేరిన భార‌త జ‌ట్టు అనూహ్యంగా , చేజేతులారా అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. టైటిల్ ఫేవ‌రేట్‌గా ఉన్న కోహ్లీ సేన ..త‌క్కువ టార్గెట్‌ను ఛేదించ‌లేక చ‌తికిలి ప‌డిపోయింది. ఏ స‌మ‌యంలోనైనా జ‌ట్టును ముందుండి న‌డిపించే నాయ‌కుడు, ఓట‌మి అంటేనే ఒప్పుకోని ఇండియ‌న్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప‌రుగులేమీ చేయ‌కుండానే పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. ఆప‌ద స‌మ‌యంలో ఆదుకునే ఆప‌ద్భాంద‌వుడిగా పేరొందిన మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆఖ‌రు వ‌ర‌కు వున్నా , ఆఫ్ సెంచ‌రీ కొట్టినా భార‌త్‌ను గ‌ట్టెక్కించ లేక పోయాడు. ప‌రీక్షా స‌మ‌యంలో ఎదురొడ్డి నిలిచి ఆడాల్సిన, ఎంతో అనుభ‌వం క‌లిగిన ధోనీ లేని ప‌రుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. ఇండియా జ‌ట్టులో చెప్పు కోవాల్సింది ఒక్క‌డినే ర‌వీంద‌ర్ జ‌డేజా. త‌న అద్భుత‌మైన బ్యాటింగ్‌తో దుమ్ము రేపిన ఈ క్రికెట‌ర్ ఏకంగా 77 ప‌రుగులు చేసి న్యూజిలాండ్ జట్టుపై ఒత్తిడి...