పోస్ట్‌లు

సెప్టెంబర్ 2, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇక తెలంగాణకు తమిళిసై చికిత్స ..!

చిత్రం
భారత దేశంలో ఇప్పుడు రెండే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువగా కనిపిస్తున్నాయి కూడా . వారెవ్వరో కాదు ..ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే మరొకరు అమిత్ షా. ఆర్ ఎస్సెస్ , వీహెచ్ పి, భజరంగ్ దళ్ పరివారాలల్లో వీరి మాటకు తిరుగు లేకుండా పోయింది. ఎందుకంటే రెండవ సారి కేంద్రంలో వీరిద్దరి నేతృత్వం లోనే భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన రీతిలో అధికారంలోకి వచ్చింది. దేశమంతటా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం లోకి రావాలనే టార్గెట్ తో ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. నార్త్ లో హవా కొనసాగిస్తున్న బీజీపీకి సౌత్ లో కూడా జెండా ఎగుర వేయాలన్నది లక్ష్యం. అందు కోసమే కాంగ్రెస్ , జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ను కాదని కర్ణాటకలో కాషాయం కొలువు తీరేలా చేశారు షా అండ్ మోదీ.  ఇదే సమయంలో తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది. ఎలాగైనా సరే అధికారం లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాలు పన్నుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నది. దీనిని దెబ్బ కొట్టాలంటే బిజిపికి ఇప్పుడున్న బలం చాలదు. చాప కింద నీరులా అల్లుకు పోయే కేడర్...

యూట్యూబ్ బంపర్ ఆఫర్

చిత్రం
టెక్ దిగ్గజం గూగుల్ తర్వాతే ఏదైనా. ఇప్పటికే ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఈ కంపెనీ ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అదో అతి పెద్ద సంచలనం. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా తన కంటూ బ్రాండ్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న సదరు కంపెనీ, ప్రతి ఫార్మాట్ లో టాప్ రేంజ్ లో కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓ వైపు మైక్రో సాఫ్ట్ , తదితర కంపెనీలు రంగంలో ఉన్నా సెర్చింగ్ కేటగిరీలో మాత్రం గూగుల్ కంపెనీదే హవా. దాని దరి దాపుల్లోకి ఇప్పట్లో వచ్చేందుకు ఏ ఐటీ కంపెనీ సాహసం చేయలేక పోతోంది. ఆండ్రాయిడ్ వెర్షన్ ను డెవలప్ చేయాలన్నా, క్లౌడ్ సేవలు వినియోగించు కోవాలన్నా , డిజిటల్ టెక్నాలజీ వాడు కోవాలన్నా గూగుల్ మీదే ఆధార పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. గూగుల్ కంపెనీకి చెందిన యూట్యూబ్ ఇప్పుడు  ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ప్రతి రోజు కోట్లాది వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. లెక్కలేనన్ని వీడియోలను జనం చూస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ మరింత విస్తరించడంతో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ను వేదికగా చేసుకుంటున్నారు. తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతూ , క్రియేటివిటీని జోడిస్తూ లక్షలు పోగేసుకుంటున్నారు. ఎలా...

టెస్ట్ సిరీస్ కైవసం..అభిమానుల్లో ఆనందం

చిత్రం
ప్రపంచ కప్ లో హాట్ ఫెవరెట్ గా ఉన్న టీమిండియా సెమీ ఫైనల్ లో చతికిల పడడంతో క్రికెట్ అభిమానులు సారధి కోహ్లీ, కోచ్ శాస్త్రి ల మీద తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఒక దశలో కోచ్ పదవి కోసం బీసీసీఐ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎంపిక చేసే బాధ్యతను హరికేన్ కపిల్ దేవ్ ను నియమించింది. కానీ కోహ్లీ కే పూర్తి బాధ్యతలు అప్పగించడంతో, తిరిగి అనుమానాలకు తెర దించుతూ రవిశాస్త్రి కే కోచ్ పదవిని కట్టబెట్టింది. అంతే కాకుండా టీమ్ ఎంపికలో కూడా ఏ ఒక్కరి ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా వ్యహరించింది.  ఇందు కోసం బలమైన జట్టును వెస్ట్ ఇండీస్ పర్యటనకు ఎంపిక చేసింది. కోహ్లీ వరల్డ్ కప్ ఓటమి ని మైమరపించేలా తాను ఆడుతూ జట్టు సభ్యులలో కాన్ఫిడెన్స్ నింపాడు. వన్ డే సిరీస్ తో పాటు తాజాగా టెస్ట్ సిరీస్ కూడా భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. తమకు ఎదురు లేదని చాటింది. తెలుగు వాడైన హనుమ విహారి అద్భుతంగా రాణించాడు. తన సత్తా ఏమిటో రుచి చూపించాడు. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను మన ఆటగాళ్లు దుమ్ము రేపారు . మొత్తం మీద రెండో టెస్ట్ లోను విజయం సాధించారు. అభిమానులకు ఆనందం కలిగించారు. మొదటి టెస్ట్ లో భారీ తేడాతో గెలుపొందిన ఇండియ...