పోస్ట్‌లు

ఆగస్టు 19, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అలౌకిక ఆనందం..కృష్ణ తత్వం..!

చిత్రం
  ప్రపంచంలో హరే రామ హరే కృష్ణ ..కృష్ణ కృష్ణ హరే..అంటూ మెలమెల్లగా వినిపిస్తోంది. ఇలా లోకమంతటా వ్యాపించేలా చేసిన ఘనత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఎక్కడ చూసినా వీరే దర్శనం ఇస్తారు. ఇతోధికంగా తమకు తోచిన రీతిలో సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు శ్రీకృష్ణుడు బోధనలను ప్రచారం చేస్తున్నారు. ఇస్కాన్ పేరుతో దేవాలయాలు, ఆశ్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దైవారాధన, సేవారాధన, భక్తిని ప్రసరింప చేయడం వీరి ఉద్దేశం. హైదరాబాద్ లోని అబిడ్స్ తో పాటు సికింద్రాబాద్ లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి రోజు పూజలు జరుపుతారు. ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఆదివారం కడుపు నిండా భోజనం, పాయసం పెడతారు. వీరి ఆధ్వర్యంలో దేశంలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పేద పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన వారి ఆకలిని తీర్చే పనిని ప్రారంభించారు. అదే అక్షయపాత్ర. మొదట్లో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ బృహత్తర పథకం దేశమంతటా విస్తరించింది. లక్షలాది మందికి ఉచితంగా, ఆకలితో అలమటించే పిల్లల ఆకలిని తీరుస్తోంది. ఇస్కాన్ ఈ రూపకంగా భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీనికి ఆయా రాష...

సింధు సరే…వీళ్లకేం తక్కువ ..?

చిత్రం
  ఈ దేశాన్ని కాషాయ మయం చేయాలని అనుకుంటున్న మోడీ, అమిత్  షా , ఆర్. ఎస్ . ఎస్.  పరివారం సక్సెస్ అయినప్పటికీ, ఇంకా కార్పొరేట్ , బిజినెస్ టైకూన్లు , రిలయన్స్ అంబానీ, ఆదానీలదే  హవా నడుస్తోంది. మన్ కీ బాత్ , స్వచ్ఛ భారత్ అని ప్రచారం చేస్తున్నంతగా దేశం ఎదగడం లేదు. వీరి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. ఏకంగా వ్యాపారం పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్లాది  రూపాయలు  కొల్లగొడుతూ ఆస్తులు సంపాదిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బడా బాబులకు వంత పాడుతోంది. ఈ బిలియనీర్లు ఇప్పుడు ఆటగాళ్లను స్పాన్సర్ చేస్తున్నారు. వీరిని బ్రాండ్ అంబాసిడర్లు గా వాడుకుంటున్నారు. ఇండియాలో మహిళల విభాగంలో పీవీ సింధు ఏడాదికి 20 కోట్లకు పైగానే సంపాదిస్తోందని అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ఒకే ఒక్క ఛాంపియన్ షిప్ సాధించిన సింధును ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ అయిదు బంగారు పతకాలు సాధించి పెట్టి , దేశాన్ని , జాతిని  తలెత్తుకునేలా చేసిన చిరుత పులి హిమ దాస్,  బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన మేరీ కోమ్ , ఒకే కాలుతో ప్రతిభ చూపిన జోషి ...

లోకపు వాకిట నెత్తుటి సంతకం ..పాట..!

చిత్రం
  మనసు మూగదై పోయినప్పుడు దానికి స్వాంతన చేకూర్చే సాధనాల్లో టానిక్ లాగా పని చేసేది, తక్షణమే రిలీఫ్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే పాట. ఈ లోకంలో  సకల జీవరాశులతో పాటు మానవ జాతి కూడా ఎప్పుడో ఒకప్పుడు పాడడం రాక పోయినా కనీసం కూని రాగమైనా తీసి ఉంటారు. అడవుల్లో , పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు, జంతువులు కూడా ఆనందానికి లోనైనప్పుడు ఆడుతాయి..ఒక్కోసారి అరుస్తాయి కూడా. భూమి పొరల్లో ఇంకి పోయిన ప్రతిది కూడా ఈ ప్రపంచానికి పనికి వస్తుంది. ఒక్క మానవ దేహం తప్ప. అందుకే ఏనాడో సామాజిక సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం చెప్పారు. చిల్లర రాళ్లకు మొక్కడం కంటే చిత్తం మీద మనసు పెట్టు అని బతుకు మర్మం..తత్వాన్ని అర్థమయ్యేలా..జనం భాషలో చెప్పారు. తోలు బొమ్మలాటలైనా , చివరకు నాటకమైనా ..ఏదైనా పాట పరిధిలోకి రావాల్సిందే. తాజాగా బెంగాల్ కు చెందిన యాచకురాలు పాడిన పాట వైరల్ అయ్యింది. ఆమెను తక్కువ చేయడం లేదు..కానీ ప్రపంచానికే పోరాటాలతో కొత్త పాఠాలు నేర్పిన తెలంగాణాలో ఎక్కడికి వెళ్లినా గాయకులు , పాటగాళ్లు వందల కొద్దీ కనిపిస్తారు. వారు నిజమైన మట్టి బిడ్డలు. వాళ్ళ గొంతుల్లో మాధుర్యం ఉండక పోవొచ్చు. కానీ గుండెల్లో గూడు కట...

ఇక చాలదా నీ జీవితానికి..!

చిత్రం
  మనకో వేదిక కావాలి ఆలోచనలు కట్టిపెట్టి అనుకున్న ప్రచారం కావాలంటే మనకో గ్రూప్ ఉండాలి అందుకు సరిపడినంత లౌక్యం కావాలి  అప్పుడేగా కర్చు లేకుండా అభిమానులు దొరికేది అబ్బో యెంత ఫాలోయింగో అనుకుంటూ మనం ఆక్షర్యానికి గురవుతాం..అంతలోనే మనకెందుకు అనుకుంటూ సాగిపోతాం ..! ఎవరి దారులు వాళ్ళవి ఎవరి లోకంలో వాళ్ళు లోపట ఒకటి ..బయట మరొకటి మెత్తగా పలకరించే ప్లాస్టిక్ నవ్వులు అప్పుడప్పుడు కాసింత సేద దీర్చే మనుషులు మరి మనను గుర్తించాలంటే వాళ్ళను మెస్మరైస్ చేయాలంటే మనకూ ఓ సమూహం కావాలి అది మనతో పాటే సాగేలా మన కనుసన్నలలో ఉండేలా చూసుకోవాలి …అప్పుడేగా లైక్ లు ..అబ్బో అంటూ కామెంట్లు ఇంకాస్తా ముందుకు వెళితే అహో అంటూ కితాబులు ..! నువ్వు కవి కాదల్చుకున్నవా తక్కువ కాలంలో గొప్పనైన వ్యక్తిగా అంతర్జాలంలో నీ పేరు మారు మోగాలా అయితే నీకు ఎలాంటి ప్రశ్నలు అక్కర్లేదు నీ గురించి పతాక స్తాయిలో గొప్పగా అభివ్యక్తీకరిస్తే చాలు కాస్తంత లౌక్యం ఉంటె సరి ఇంకెందుకు ఆలశ్యం రండి ..పైసా ఖర్చు లేకుండా మహా కవి కాదల్చుకున్నవా ..! అయితే వెంటనే ఓ వేదిక చూసుకో నీకంటూ ఓ గ్రూప్ వెంటేసుకో నిన్ను ప్రశించే వాళ్ళు లేకుండా చూసుకో ఇక..నీవొక బ్రా...

అభివృద్ధికి ఆమడ దూరం..ఉస్మానియాపై ఎందుకంత కోపం..?

చిత్రం
  ఈ దేశంలో సామాజిక చైతన్యం కలిగిన యూనివర్సిటీస్ లలో మొదటి పేరు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు దిక్కులేనిదైంది. తాజాగా వందేళ్ల ఉత్సవం జరుపుకున్నా కనీస వసతులకు నోచుకోని దుస్థితికి దిగజారి పోయింది. నిత్య చైతన్యానికి, జీవన పోరాటానికి ప్రతీకగా ఉన్న ఈ చదువుల తల్లి ఇప్పుడు ఆసరా కోసం వేచి చూస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసింది. వేలాది మంది చైతన్యం కలిగిన విద్యార్థులు, తెలంగాణ ప్రాంతపు బిడ్డలు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేపట్టారు. ఖాకీల దాస్టికానికి బలై పోయారు. ఇంకొందరు నామ రూపాలు లేకుండా పోయారు. ఈ దేశపు అభివృద్ధిలో, పునర్ నిర్మాణంలో ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారంతా ఈ ఉన్నత విద్యాలయం నుంచి వచ్చిన వారే. ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసిన ఘనత ఇక్కడ,.ఈ నాలుగు గోడల మధ్యన చదువుకున్న వారిదే. జాతికి జీవగర్రలాగా మారిన చరిత్రను స్వంతం చేసుకున్నది ఇక్కడే. పోరాటాలకు, ఆరాటాలకు నెలవై పాటలకు, కవితలకు ప్రాణం పోసుకున్నది ఈ జాగాలోనే. ఎంత చెప్పినా తక్కువే . ఒక ఏడాది కాదు ఒక దశాబ్డం పడుతు...

సాన్యా సంచలనం..పుస్తక ప్రభంజనం..!

చిత్రం
  లోగ్ క్యా కహేంగే..అంటూ సాన్యా ఖురానా రాసిన పుస్తకం దేశ వ్యాప్తంగా అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. వృత్తి రీత్యా సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయిన ఈ అమ్మాయి రాయడంలో అందెవేసిన చెయ్యి. తన మీద తనకు అపారమైన నమ్మకం , ఆత్మ విశ్వాసం కలిగిన ఈమె అనుకోకుండా రచయిత్రిగా మారారు. అంతకు ముందు ఆమె అడోబ్ ఐటి కంపెనీలో పని చేశారు. మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచేలా ప్రత్యేక కథనాలు రాశారు. సాన్యా రాసిన పుస్తకం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి. అమెజాన్ కంపెనీలో ఇప్పుడు ఈ బుక్ సంచలనం రేపుతోంది. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సాన్యా పర్యటించారు. ఈ జర్నీలో ఎందరినో కలిశారు. వారితో మాట్లాడారు. ఆ అనుభవాలనే అక్షరబద్దం చేశారు. ఈ పుస్తకం ఇప్పుడు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఖురానాకు కాసులు కురిపిస్తోంది. ఒక్క రోజులోనే ఆమె మోస్ట్ పాపులర్ రైటర్ గా పేరు సంపాదించారు. వుమెన్ డ్రీమ్స్ అండ్ యాంబిషన్స్ నే ఆమె టార్గెట్ గా పెట్టుకున్నారు. లీన్ ఇన్ ఇండియా పేరుతో ఓ సంస్థను ఖురానా స్థాపించారు. ఒక రోజు ఆమె తండ్రి తనకు చదువుకునేందుకు ఓ పుస్తకం చేతిలో పెట్టారు. అందులో మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న...

రికార్డుల మోత మోగిస్తున్న రాఫెల్ నాదల్

చిత్రం
  ఉత్కంఠ భరితంగా సాగిన యుఎస్ ఫైనల్లో స్పెయిన్ కు చెందిన రాఫెల్ నాదల్ విజయం సాధించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ గెలుపుతో 19 వ టైటిల్. ఇది కూడా ఓ చరిత్రే. రాఫెల్ మొత్తం ఆదాయం 37,684 , 949  మిలియన్ డాలర్లు. ఆదాయం గడించే ఆటగాళ్లలో మొదటి ప్లేస్ లో నిలిచారు. ఆయన సాధించిన రికార్డులను మరే  ఆటగాడు బ్రేక్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటి దాకా 43 టైటిల్స్ పొందారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ , ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్ , యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లాం లను సాధించారు. ఒలంపిక్స్ పోటీల్లో బంగారు పతకాలను పొందారు. డబుల్స్ విభాగంలో ఏడు టైటిల్స్ గెలిచారు. ఆయన అసలు పేరు రాఫెల్ “రాఫా ” నాదల్ పరేరా.అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ప్రకటించిన జాబితాలో నాదల్ ను  నెంబర్ వన్ ఆటగాడిగా ప్రకటించింది. అన్నికాలాలలో ఉన్న ఉత్తమమైన క్రీడాకారులలో ఒకడిగా అతనిని పేర్కొంది. “ది కింగ్ ఆఫ్ క్లే” అంటూ ముద్దుగా అభిమానులు పిలుస్తారు. గొప్ప క్లే కోర్ట్ ఆటగాడిగా నిపుణులు భావించేటట్టు చేసాయి. తొమ్మిది గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్, 18 ఏటీపీ వరల్డ్ టూర్ మాస్టర్స్ 1000 పోటీలతో పాటు  2004, 2008 , 2009లో ఫైనల్స్‌లో విజయ...

అస్తమించని కళారవి కాళన్న

చిత్రం
  అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు చికిత్స..పుట్టుక నీది ..చావు నీది..బతుకంతా దేశానిది..అంటూ జీవితాంతం విలువలకు కట్టుబడిన మహోన్నత మానవుడు కాళోజి నారాయణరావు. కవిగా, రచయితగా, పోరాట యోధుడిగా చివరి వరకు నిలబడ్డారు. తాను కొంత కాలం పాటు ఇక్కడికి అతిథిగా ఉండేందుకే వచ్చానని అన్నారు. స్వల్పమైన అక్షరాలతో అద్భుతమైన కవిత్వాన్ని రాశాడు. ఆశువుగా చెబుతూ వుంటే అనుచరులు రాసుకుంటూ భద్రం చేశారు.. నిజమైన ప్రజా కవి కాళోజి. అవార్డు ఇస్తామని అంటే నాకెందుకు అంటూ తిరస్కరించారు. రాజ్యంతో ఎన్నడూ రాజీ పడలేదు. ఆయన కవిత్వం విశ్వజనీనమైనది. నిత్యం పోరాటమే ఊపిరిగా చేసుకుని రచనలు చేశారు. నైజాంకు వ్యతిరేకంగా,  పౌర హక్కుల కోసం నిలబడిన నిజమైన కవి. కాళోజి జీవితమే కవిత్వం. ప్రతి సంఘటన ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఆయన నిజమైన తెలంగాణ గాంధీ. సింప్లిసిటీకి ప్రతీకగా నిలిచారు. తెలంగాణ బతుకు ప్రయాణంలో మరిచి పోలేని మహోన్నతమైన కవి కాళోజి. అనువాదాలతో ఆకట్టుకున్నారు. 78 ఏళ్ళు బతికినా రాసుకుంటూనే పోయారు. సామాన్యుల నుంచి పండితుల దాకా అర్థమయ్యేలా కాళోజి రాసినట్లుగా ఇంకే కవి , రచయిత రాలేదు. అందుకే కాళోజి ప్రజా కవి. ఆయన జీ...

వ్యాపార దిగ్గజం..స్ఫూర్తి శిఖరం..జాక్ మా..!

చిత్రం
  అన్నిట్లో వేలు పెడుతూ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని నిరంతరం పరితపించే అమెరికా ముగ్గురి విషయం వచ్చే సరికల్లా తొట్రుపాటుకు గురవుతూ ఉంటుంది. ఇద్దరు ఈ లోకాన్ని వీడితే ఇంకొకరు ఇప్పుడు ఈ నేల మీద వున్నారు. పెద్దన్నకు నిద్ర లేకుండా చేస్తున్న వారెవ్వరో కాదు పోరాట యోధుడు చేగువేరా అయితే , ఉద్యమ వీరుడు ఫెడరల్ కాస్ట్రో ..మరొకరు చైనాకు చెందిన వ్యాపార దిగ్గజ శిఖరం ..జాక్ మా. ఇప్పటికీ యుఎస్ కు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా వినుతి కెక్కిన జాక్ మాకు 55 ఏళ్ళు. ఒక సామాన్యుడు అసాధారణమైన రీతిలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా విస్తరించేలా చేసిన ఘనత ఆయనది. అతడు స్థాపించిన ఆలీబాబా ఇప్పుడు కోట్లు కోళ్ల గొడుతోంది. బిజినెస్ లో తనకు ఎదురే లేకుండా సాగుతోంది. జాక్ చైనాలోని హాంగ్జౌలో ఉంటున్నారు. ఆయన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి కలిగిస్తోంది. వేలాది మందికి దారి చూపుతోంది. జంగ్ యింగ్ ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఆలీబాబా వ్యాపార సంస్థలకు అధిపతిగా ఉన్నారు. అత్యున్నత కట్టుదిట్టమైన దేశంలో అంచెలంచెలుగా విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా పేరు పొందారు జాక్ మా....

పద్మ అవార్డులకు హిమదాస్ సరి పోదా..?

చిత్రం
  ఈ దేశంలో కాకుండా చైనాలోనో లేదా అమెరికాలో పుట్టి వుంటే మట్టినే నమ్ముకున్న హిమ దాస్ ను ఆకాశానికి ఎత్తేసేవారు. సమున్నతంగా సత్కరించే వారు. ఎందుకంటే ఇక్కడ కులాలు, మతాల సమీకరణాల ప్రాతిపదికన పతకాలు పంచబడతాయి. అవార్డులు ఇవ్వబడతాయి.130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వేలాది మంది మాత్రమే క్రీడాకారులుగా వెలుగులోకి వస్తున్నారు. ఇంకా లక్షలాదిగా అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నన్ని రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇంకెక్కడా కనిపించవు. ఇక్కడ మీడియా కూడా  బడా బాబులకు , కంపెనీలకు వత్తాసు పలుకుతున్నాయి. వారిచ్చే బిస్కెట్స్ కోసం ఆహా ఓహో అంటూ ప్రచారం చేస్తున్నాయి. పీవీ సింధు కంటే ముందే హిమ దాస్ అయిదు బంగారు పథకాలు సాధించింది. కానీ ఆమె పేరు ఎక్కడా అగుపించలేదు. ఏదో ఓ చిన్న మూలన పది లైన్లు రాశారు. ఇదీ సమున్నత భారతం. ఇదీ మోడీ సర్కార్ చూపిస్తున్న ఔదార్యం. ఈ భూమి నాకు ఎంతో ఇచ్చింది. నేను ఎదుర్కున్న కస్టాలు, ఇబ్బందులు ఏవీ నా పట్టుదలకు అడ్డంకి కాలేక పోయాయి. నా ముందు ఒక్కటే మిగిలి ఉన్నది. అది నాకు, నా కన్నవారికి జన్మను ఇచ్చి, సమాజంలో గుర్తింపు కలుగజేసిన నా భారత దేశం మాత్రమే నా కళ్ళ ముందు నిలిచింది. నా...

సామాన్య జీవితం..అసాధారణ విజయం.!

చిత్రం
  అమెరికా వెళ్లడం, డాలర్లు సంపాదించడం, ఐటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిర పడడం ప్రతి ఒక్కరి కల. అందరి లాగా రవి కిరణ్ కోగంటి కూడా కల కన్నారు..దానిని నిజం చేశారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు ఏడేళ్ల పాటు పని చేసిన ఆయన తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు. ఇంకొకరు అయితే ఉన్న జాబ్ వదిలి వేసుకోడానికి ఇష్ట పడరు. ప్రతి ఒక్కరు భద్రమైన జీవితం కోరుకుంటారు. జేబు నిండా, బ్యాంక్ అక్కౌంట్ నిండా డబ్బులు ఉండేలా చూసు కుంటారు. కానీ కోగంటి డోంట్ కేర్ అన్నారు. అంతేనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలుగు వెలుగులు ప్రసరింప చేస్తున్నారు. అదే స్మార్ట్ తెలుగు. ఎలాంటి లాభా పేక్ష లేకుండా, ఒక్క పైసా తీసుకోకుండా ఏకంగా ట్రైనర్ గా, మెంటార్ గా సేవలు అందజేస్తున్నారు. తెలుగులో బ్లాగర్స్ ను రాసేలా ప్రోత్సహిస్తున్నారు. అంతే కాకుండా సాహిత్యం పట్ల మక్కువ కలిగిన కోగంటి ఇప్పుడు హైటెక్ సిటీలో తన లాంటి వారి కోసం ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఐటి,  ఎంసీఏ వరకు చదివారు. స్మార్ట్ లి వెబ్ టెక్నాలజీ కంపెనీకి రవి కిరణ్ సీఇఓ గా వున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, ఐటీ ఎక్స్ పర్ట్ గా ఉన్న కోగంటి హెచ్ సి ఎల్, టీ సి ఎస్, ప్రై ఎస్ ఇన్ఫో టెక్...

ఆ రూపం అపురూపం..ఆమె జ్ఞాపకం మధురం..!

చిత్రం
  భారతీయ సినీ జగత్తులో మరిచి పోలేని జ్ఞాపకం మధుబాల. ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో సావిత్రి..బాలీవుడ్ లో మధుబాల గొప్ప నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. 1933 లో పుట్టిన ఆమె 1969 లో మృతి చెందారు. 1950 ల నుండి 1960 కాలంలో ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. వీటిలో ఎక్కువ భాగం కావ్య స్థాయిని పొందాయి. తన సమకాలికులైన నర్గీస్, మీనా కుమారిలతో పాటు అత్యంత ప్రతిభావంతులైన హిందీ చిత్ర నటీమణులలో ఒకరిగా మధుబాల విస్తృత గౌరవాన్ని పొందారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల పదకొండు మంది సంతానంలో ఈమె ఐదవ వ్యక్తి. ఇదే సమయంలో మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత తన కుటుంబాన్ని ముంబైకి మార్చారు. ముంతాజ్ తొమ్మిది సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. మొదటి సారి నటించిన చిత్రం బసంత్ బాక్స్-ఆఫీస్ వద్ద విజయవంతమైంది. బాలనటిగా ఆమె అనేక చిత్రాలలో నటించడాన్ని కొనసాగించారు. నటీమణి దేవికా రాణి ఆమె నటనకు, సామర్ధ్యానికి ముగ్దులై ఆమెకు మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు. మధుబాల త్వరగానే ఒక విశ్వసనీయమైన వృత్తి పరమైన నటిగా కీర్తిని సంపాదించుకున్నారు...

మనసు పొరల్లో..మెడ వంపుల్లో..!

చిత్రం
  ప్రేమ అన్నది లేక పోతే జీవితాన్ని కొనసాగించడం కష్టం. ప్రపంచంలో మనకంటూ తోడు అన్నది లేకపోతే అంతా శూన్యం అనిపిస్తుంది. ఒకరిపై మరొకరికి ఉన్నది ప్రేమ ఒక్కటే. కష్టాల్లో తోడుంటుంది. సంతోషంలో భాగమవుతుంది. ఒకరికొకరు ప్రేమించు కోవడం అన్నది సహజం. ఇది ఒక్కటి లేకపోతే పరమ బోర్. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ .ఒక్కో పంథా. ఎవరి దారుల్లో వాళ్ళు ఉన్నా. ఎవరి లోకంలో వాళ్ళు లీనమై పోయినా. ఒకళ్ళ కోసం ఇంకొకరు వేచి చూడటం. నిరీక్షించి ఉండటం మామూలే. ఇలాంటి క్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. పైకి లేదని చెప్పినా లేదా బుకాయించినా ప్రేమ అన్నది అంతర్లీనమై ఉంటుంది. దానిని ఎవరూ చెరపలేరు. మరిచి పోకుండా ఉండలేరు. తలుచుకోకుండా, గుర్తుకు తెచ్చుకోకుండా బతకలేరు. స్త్రీ పురుషుల మధ్య ఈ ఆకర్షణ అన్నది లేక పోతే కాలం సాగదు. కొందరు అనుకోకుండా తారస పడతారు. ఇంకొందరు మనతో పాటే వుండి పోతారు. ఇదంతా ప్రేమ మహత్యం. కాదనలేం. మనసుల్లో ఏదో మూలాల అభిమానం దాగి ఉంటూ ప్రేమగా మారి పోతుంది. ఎప్పుడూ స్తబ్దుగా ఉండే మనం, కావాల్సిన వాళ్ళు తారస పడినప్పుడో లేదా అనుకోకుండా కలుసుకున్నప్పుడో.. ఆ క్షణాన గుండె గోదారై ఉప్పొంగుతుంది. ప్రేమ అన్నది అంతులేని ప్రయాణం. ఇ...

మాతృత్వమా వర్ధిల్లు..దాతృత్వమా పరిఢవిల్లు..!

చిత్రం
  ప్రతి మహిళకు దేవుడిచ్చిన వరం మాతృత్వం. ఈ అరుదైన ప్రపంచానికి కొత్త ప్రాణాన్ని, జీవిని పరిచయం చేసే ఒకే ఒక్క వ్యక్తి. రక్తమాంసాలు కలిగిన స్త్రీ. ఆమెకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉన్నది. కొందరు పిల్లల్ని కొన్ని కారణాల రీత్యా కనక పోవచ్చు. అందుకే చాలా మంది మహిళలు, పురుషులు, భార్యాభర్తలు తమకు ఇష్టమైన పిల్లలను దత్తత తీసుకుంటారు. వారితో తమ కలలను నిజం చేసుకుంటారు. పిల్లలకు జన్మ ఇవ్వడం ఒక ఎత్తైతే వారిని పెంచడం మరో సమస్య. పెరిగి పెద్దగా అయ్యేంత దాకా ఎన్నో కష్టాలు. మరెన్నో ఇబ్బందులు. అయినా తాము ఉపవాసం ఉంటూ పిల్లలకు ప్రాణం పోస్తారు. తమకంటే ఎక్కువగా చూసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పేరు పొందిన సన్నీ లీయోన్ తాను కూడా ఒకరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. తన భర్త డేనియల్ వెబర్ ను కూడా ఒప్పించింది. గత ఏడాది నిషా అనే చిన్నారిని దత్తత తీసుకుంది. పాపతో పాటు ఇద్దరు కుమారులు నావోహ్ , ఏషర్ లు ఉన్నారు వీరికి. సన్నీ లియోన్ అనే సరికల్లా బూతు సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆమెను అందరూ అదే ధోరణితో చూస్తారు. కానీ సన్నీ మాత్రం వృత్తి రీత్యా , బతుకు దెరువు కోసం నటిస్తున్నా, కానీ తాను కూడా ఓ తల...

సక్సెస్ దేముంది బాస్ .. ఓటమి ఇచ్చే కిక్కేవేరు

చిత్రం
  అపజయం, ఓటమి, అవమానం ఇవ్వన్నీ బతుకులో మామూలే. ఫెయిల్యూర్ అన్నది ఓ ప్రయాణం మాత్రమే. అది నేర్పే పాఠం ఇంకెవ్వరూ నేర్పించలేరు. విజయంలో అందరూ దగ్గరవుతారు. కానీ అపజయం మనల్ని వరించినప్పుడు ఏ ఒక్కరూ మనతో ఉండరు. ఆ దరిదాపుల్లో చూద్దామన్నా కనిపించరు. లోకం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావని చూడదు. ఎంత మందిని దాటుకుని గెలుపు వాకిళ్ళల్లో తోరణాలు కట్టావన్నదే చూస్తుంది. అప్పుడే నీకు లోకం సలాము చేస్తుంది. చరిత్ర అంటే విజేతల చరిత్ర కాదు. అది కోట్లాది జనం బలిదానాల, ఆత్మ త్యాగాల సమ్మేళనమే చరిత్ర. ప్రతి పేజీలో రక్తపు మరకలు లేకుండా హిస్టరీ ఉన్నదా. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని అనలేదా..గొంతు చించుకు అరవలేదా మహాకవి శ్రీ శ్రీ. సక్సెస్ సమాజంలో ఓ గుర్తింపును, ఇమేజ్ ను ఇస్తుంది. కానీ సముద్రమంత జీవితాన్ని ఈదాలంటే మాత్రం ఓటమి మనల్ని పలకరించాల్సిందే. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చోట అంటాడు..ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని. చూస్తే చిన్న పదాలు. కానీ కొన్ని తరాలకు సరిపడా కిక్కు వుంది ఇందులో. అది కొందరికే సాధ్యం. ఈ జర్నీ ఎప్పుడూ ఉండేదే..కానీ కలుస్తాం..విడిపోతాం. ...

న్వవ్వుల రేడు ఇక రాడు..!

చిత్రం
  తెలుగు సినిమా రంగం గొప్ప నటుడిని కోల్పోయింది. హాస్య నటుడిగా పేరున్న తెలంగాణకు చెందిన వేణు మాధవ్ ఇక సెలవంటూ వెళ్లి పోయాడు. మొన్నటికి మొన్న ఎమ్మెస్ ను కోల్పోయింది. జనానికి వినోదం పంచుతున్న వాళ్లంతా ఒక్కరొక్కరుగా ఉండలేమంటూ వెళ్లి పోతున్నారు. మొదట మిమిక్రి ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన జీవితం ఉన్నట్టుండి నటుడిగా సక్సెస్ అయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో 1969 సెప్టెంబరు 28 లో పుట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 400లకు పైగా సినిమాల్లో నటించాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకునే వారు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించే వాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సు లేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు. వేణు మాధవ్ కు వెంట్రిలాక్...

వారెవ్వా..అజ్జూ భాయ్..ఆగాయా..!

చిత్రం
  ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కళ్ళ ముందు ఓ సంపూర్ణ విజయం సాక్షాత్కారమైంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అన్న సినీ కవి రాసిన పాట మదిలో మెదిలింది. కభీ కభీ మేరే దిల్ మే అంటూ ముఖేష్, లతా ఆలాపిస్తూ ఉంటే అమితాబ్ భావోద్వేగంతో అలవోకగా చెబుతూ వుంటే ఆ ఆనందమే వేరు. ఏంటీ ఓ ప్రపంచాన్ని మరో సారి చుట్టి వచ్చినంత ఆనందం కలిగింది. ఎందుకంటే ఎవరెస్టు శిఖరం ఎక్కిన వాడు. ఎత్తు పల్లాలను చవి చూసిన వాడు. భారత జట్టులో బాంబే ఆధిపత్యాన్ని అడ్డుకున్నవాడు. టీమిండియాలో దేశంలోని నలుమూల నుండి ప్రాతినిధ్యం వహించేలా చేసిన వాడు. క్రికెట్లో అసాధ్యమనుకున్న మూడు సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన వాడు. ఏకంగా ప్రపంచంలోనే భారత దేశపు జాతీయ పతాకాన్ని ప్రతి స్టేడియంలో ఎగిరేసేలా చేసిన అరుదైన ఆటగాడు..ఒకే ఒక్కడు..మణికట్టు మాయాజాలంతో ఇప్పటికే ఎప్పటికీ తన లాగా ఆడే ఆటగాల్లో కోసం వేచి చూస్తూ ఉన్న మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్. మ్యాచ్ ఫిక్సింగ్ భూతం అతడిని కమ్ముకోక పోయి వుంటే ఇవ్వాళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు చైర్మన్ అయ్యేవాడు. ఎన్ని వైఫల్యాలు ..ఎన్ని కుట్రలు..ఎన్ని అవమానాలు ..లోకం అతడిని వేలి వేసింది. తనవారు అతడిని ద...

తెలంగాణకే తలమానికం..బతుకమ్మ సంబురం..!

చిత్రం
  ఎనలేని దోపిడీకి, తరతరాల వివక్ష నుండి విముక్తం పొందిన తెలంగాణ మాగాణం ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని నిటారుగా నిలబడ్డది. ఒకే గొంతుకై ఆడుతున్నది, పాడుతున్నది. కోట్లాది గొంతుకలు ఇప్పుడు బతుకంతా సంబురాలను జరుపుకునే అరుదైన సన్నివేశం బతుకమ్మ పండుగ కు ముస్తాబవుతోంది. పూల జాతరను తలపించేలా లక్షలాది ఆడబిడ్డలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ అన్నది కొందరికి మాత్రం అదో పండుగగా భావిస్తారు. కానీ అదో మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇక బతుకమ్మ విషయానికి వస్తే, ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మను తెలంగాణాలో సద్దుల పండుగ  అని కూడా పిలుస్తారు. ఈ బతుకమ్మ దసరా పండుగకు రెండు రోజుల ముందు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించింది. సెప్టెంబరు, అక్టోబరు  నెలలలో రెండు పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటు వైపు, ఇటు వైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండి పోతుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి విజయ దశమి పండుగ. అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మ...