పోస్ట్‌లు

అక్టోబర్ 31, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

 అంతటా ఆధారమే..లేదంటే భారమే

చిత్రం
కేంద్రంలో బిజెపి కొలువు తీరాకా ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి పనికి ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. అది లేకుంటే బతకలేమనే స్థితికి తీసుకు వచ్చారు మోడీ అండ్ అమిత్ చంద్ర షా. దీంతో బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఆధార్ నమోదును తమ భుజానికి ఎత్తుకున్నాయి. ఇదో ప్రహసనంగా మారింది. తాజాగా 30 మంది లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా సరే ఆధార్ కోసం వెయిట్ చేస్తే, ఈ విషయాన్ని పోస్టల్ అధికారులకు తెలియ పరిస్తే నేరుగా సిబ్బందిని మన ఇళ్ల వద్దకే పంపిస్తారు. ఇదో వినూత్న ప్రయత్నం. పోస్టల్ శాఖ ఇతర శాఖలతో పోటీ పడుతోంది. సరికొత్త సేవలతో ముందుకు వస్తోంది. ఉత్తరాలు, పోస్టు కార్డులు చేర వేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖ ఆధార్‌ సేవలూ అందిస్తోంది. ఆధార్‌ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు..డోర్‌ వద్దకు వచ్చి సేవలందించనుంది. రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్‌ శాఖ ఆధార్‌ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్‌తో అ...

ఉద్యోగుల్లో ఆనందం..జగన్ కు నీరాజనం

చిత్రం
తెలంగాణలో కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. భారీ మెజార్టీని కట్ట బెట్టిన ఆరాష్ట్ర జనానికి అడిగినవన్నీ చేసి పెడుతున్నారు ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే పనిలో పడ్డారు. అంతే కాకుండా పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం పెంచేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు ప్రజలు తమకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు తలెత్తినా లేదా పరిష్కారం కాకా పోయినా వెంటనే తనకు నేరుగా ఫోన్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. మరో వైపు తన తండ్రి ప్రవేశ పెట్టిన ప్రజా దర్బార్ ను ఏర్పాటు చేశారు జగన్. దీంతో అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే వెంటనే కేసు నమోదు చేయమని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో అటు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో దడ మొదలైంది. ఆయా శాఖలపై పట్టు బిగించిన సీఎం ..ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు స...

కార్మికుల వేదన..చిన జీయర్ దీవెన

చిత్రం
ఆయన జగమెరిగిన జగత్ గురువు. లక్షలాది మంది భక్తులను కలిగిన ఆధ్యాత్మిక వేత్త. ఆధునిక యుగంలో భక్తిని, శాంతిని ప్రవచిస్తూ సాగి పోతున్న యోగి. ఆయనను పామరులు, పండితులు కొలుస్తారు. కలియుగంలో చినజీయర్ స్వామీజీని ఇష్ట దైవంగా భావిస్తారు. ఆయన భక్తుల జాబితాలోకి తాజగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, యెడ్యూరప్ప, సందింటి జగన్ మోహన్ రెడ్డిలు కూడా చేరి పోయారు. ఇది కూడా ఓ సంచలనమే. కాగా గత 28 రోజులుగా తమ డిమాండ్లు పరిష్కారించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు చీవాట్లు పెట్టినా సీఎం పట్టించు కోవడం లేదు. ఇప్పటికే ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించక పోవడంతో 16 మంది తట్టు కోలేక అసువులు బాసారు. అయినా సీఎం డోంట్ కేర్ అంటున్నారు. 49 వేల మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ స్పష్టం చేశారు. కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చూస్తా, చర్చలు మాత్రం జరిపే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే బస్సులు రాక లక్షలాది మంది ప్రజలు లబోదిబోమంటున్నారు. పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే సమస్యను పరిష్కారించేలా ఆ...

బిగ్ ఛాన్స్ కొట్టేసిన భవానిశ్రీ

చిత్రం
ఎవరీ భవానిశ్రీ అనుకుంటున్నారా. ఇప్పుడు తమిళ్ సినీ రంగంలో సెన్సేషన్ సృష్టిస్తున్న నటి. పిన్న వయస్సులోనే టాప్ రేంజ్ లోకి వెళ్లేందుకు ఈ అమ్మడు రెడీ అవుతోంది. 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డు కెక్కిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు స్వయానా సోదరి. మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉంటూనే హీరోగా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు జీవి. ప్రస్తుతం అర డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ మేనల్లుడు కూడా. అంతే కాదు జీవీ భార్య సైతం సైంధవి యువ గాయకురాలు. సో..వీరి ఇంట అందరూ ప్రతిభావంతులే. తాజాగా చెల్లెలు భవాని శ్రీ కూడా రంగ ప్రవేశం చేస్తోంది. ఈమె ఇప్పటికే రణసింగం అనే చిత్రంలో నటించడానికి ఎంపికయ్యారు. విజయ్‌ సేతుపతి, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భవానీశ్రీ రెండవ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవ దర్శకుడు విరుమాండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా తొలి చిత్రం తెరపైకి రాక ముందే భవానీశ్రీ మరో రెండు సూపర్‌ అవకాశాలు తలుపు తట్టాయన్నది తాజా న్యూస్‌. ఈ చిన్న దానికి ధనుష్‌కు జంటగా నటించే అవకాశంతో పాటు, మరో డైరెక్టర్ సుధ కొంగర చిత్రంల...

ధిక్కార స్వరం..వెంటాడుతున్న వివాదం

చిత్రం
 ఈ దేశంలో ప్రశ్నించడం అన్నది నేరంగా మారింది. మతం పేరుతో..కులం పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు. స్వేచ్ఛగా నాలోని ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు భారత రాజ్యాంగం నాకు సర్వ హక్కులు కల్పించింది. నిలదీస్తే చంపేస్తారా. నిన్న గౌరీ లంకేశ్ ను చంపారు. రేపు నన్నూ చంపొచ్చు. అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఆ ఒకే ఒక్క గొంతు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ది. మిగతా నటీనటులు డబ్బులు ఎలా వెనకేసు కోవాలో అని ప్రయత్నాలు చేస్తుంటే ప్రకాష్ మాత్రం స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. సమాజం కోసం సమస్యలపై నిలదీస్తున్నారు. ఇవ్వాళ ప్రశ్నించక పోతే రేపు బతకడం మరింత కష్టమవుతుందని ఈ నటుడు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయనను వివాదాలు వెంటాడుతున్నాయి. ఏకంగా ప్రకాష్ రాజ్ ను సినిమా రంగం నుండి బహిష్కరించాలనే దాకా వెళ్ళింది. ఈ మేరకు కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనో భావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యానించారని, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది. రామాయణాన్ని అవమానిస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బ తినేల...

ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద రియాల్టీ షో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొన్ని గంటల్లో దీనికి శుభం కార్డు పడబోతోంది. టైటిల్‌ గెలవడానికి ఇంటి సభ్యులు చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడు అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. అయితే వారి తీర్పును తమకు అనుకూలంగా మలుచు కునేందుకు హౌస్‌ మేట్స్‌తో పాటు ఇంటి సభ్యుల అభిమానులు తీవ్రంగా కష్ట పడుతున్నారు. వీరికి సపోర్ట్‌ చేస్తూ కొంత మంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి బుల్లితెర యాంకర్‌ రష్మీ మద్దతు తెలుపగా, రాహుల్‌కు పాప్‌ సింగర్‌ నోయెల్‌ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు పటాస్‌ పంచ్‌ల యాంకర్‌ రవి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో గాయని గీతా మాధురి, నటి హరితేజ బిగ్‌బాస్‌ 3పై స్పందించారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో టాప్‌ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్‌ ద బెస్ట్‌ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోను మాత్రమే పోస్టు చేసింది. కాగా ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనే దానిపై ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. దీంతో గీతా మాధురి ఫ్యాన్స్‌ రెండు టీంలుగా విడిపోయి రాహుల్‌, శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓట్లు చీల్చుతున్నారు....

అమ్మ ఆరాటం..కొడుకు పోరాటం

చిత్రం
ఆడియన్స్ ను గత కొన్ని రోజులుగా అలరిస్తూ వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ కొద్దీ గంటల్లో ముగియనుంది. ఫైనల్లో ఎవరు గెలుస్తారో ననే ఉత్కంఠ నెలకొంది. హౌజ్ లో అయిదుగురు పార్టిసిపెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో రాహుల్ సిప్లిగంజ్ డైరెక్టు గా ఫైనల్ కు వెళ్లగా మిగతా వారు ఆఖరు పోరులో నిలిచేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. వీరి కోసం వారి వారి ఫ్యాన్స్ ఓ గ్రూప్ గా ఏర్పడి సోషల్ మీడియా వేదికగా తమ వారికి ఓటు వేయమని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సింగర్ రాహుల్ మదర్ కూడా రంగం లోకి దిగింది. ప్రధాన ఫైట్‌ మాత్రం రాహుల్‌, శ్రీముఖి మధ్యలోనే ఉంది. అభిమానులు తమ తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు వేయండి అంటూ ప్రచారంతో  ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్‌ ఫినాలే నాడు తేలనుంది. మరోపైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ కోసం ప్రముఖ సింగర్‌ నోయెల్‌ గట్టి ప్రచారం చేస్తున్నారు. నోయల్ కు మద్దతుగా రాహుల్ తల్లి రంగంలోకి దిగింది. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన రాహుల్‌ తల్లి ఇంటి సభ్యులతో పాటు ప...

నోట్ల రద్దు..ఇప్పుడు పసిడి వంతు

చిత్రం
నిన్నటి దాకా నోట్ల రద్దుతో జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి బతుకు దెరువు లేకుండా చేసిన మోడీ ఇప్పుడు దేశంలో దాచుకున్న బంగారంపై కన్ను పడింది. బంగారాన్ని భారీగా దాచుకున్న వారి కోసం ప్రభుత్వం త్వరలో ఓ స్కీమును తేనుంది. నల్ల బంగారాన్ని తెల్లగా మార్చు కునేందుకు ఒక అవకాశం కల్పించాలని ఆలోచిస్తోంది. ఈ ప్రత్యేక స్కీము ద్వారా బంగారపు నిల్వలకు చట్ట బద్దత కల్పించాలనేది ప్రభుత్వ టార్గెట్‌‌. ఈ స్కీము రూపకల్పనలో ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. దాచు కున్న బంగారాన్ని బయట పెట్టి, దాని విలువ మీద పన్ను చెల్లిస్తే చాలు, ఆ బంగారం తెల్లదిగా మారి పోతుంది. వ్యక్తుల దగ్గర ఎంత పరిమితిలో బంగారం ఉండొచ్చనే అంశం మీద త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పరిమితికి మించిన బంగారపు నిల్వలను వెల్లడించి, ఆ విలువకు పన్ను చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. స్కీము కాల పరిమితి ముగిశాక, ఎవరి దగ్గరైనా ఎక్కువ బంగారం ఉన్నట్లు బయట పడితే భారీగా ఫైన్స్‌‌ వేస్తారు. తాజా స్కీము కింద ఎంత పన్ను రేటు ఉంటుందనేది ఇంకా తెలియలేదు. కానీ, స్వచ్ఛందంగా ప్రకటించే స్కీ...

గూగుల్ గుడ్ ఐడియా

చిత్రం
ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ గుడ్ ఐడియాస్ ఎక్కడ ఉన్నా ఎంకరేజ్ చేస్తుంది. న్యూ ఐడియాస్ ను ప్రోత్సహిస్తుంది. ఇందు కోసం ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో తమ ఆలోచనలు పంచు కోవచ్చు. అవి సమాజానికి, మానవ సమూహానికి ఉపయోగ పడేలా ఉండాలి. అంతే కాకుండా గూగుల్ సామాజిక బాధ్యత కింద పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణం కాపాడు కునేలా జనాన్ని జాగృతం చేసే పనిలో నిమగ్నమైంది. తాజగా గూగుల్ సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ప్రపంచాన్ని ఆయుధాలు, అణుబాంబులు కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ తీవ్ర ప్రభావం చూఫుతున్నాయి. దీంతో లైఫ్ లో ప్రశాంతత కరువవుతోంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా దీని వల్ల మేలు కంటే ఎక్కువగా కీడే జరుగుతోంది. ఇందు కోసం ఓ ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. అదేమిటంటే ఆ ఫోన్​ నుంచి ఫోన్లు చేసుకోలేం. మెసేజ్​లు పంపించుకోలేం. వాట్సాప్​లో చాటింగ్​ చెయ్యలేం. ముచ్చట పడి ఓ సెల్ఫీ తీసుకోలేం. అదే గూగుల్​ తీసుకొస్తున్న కొత్త  పేపర్​ ఫోన్​ .ఆ మధ్య గూగుల్​ పిక్సెల్​ 4 ఫోన్​ను రిలీజ్​ చేసింది. దానిని విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ పేపర్​ ...

రియల్ బిగ్ బాస్ ఎవ్వరో

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద ఇప్పుడు సీరియల్స్ హవా నడుస్తోంది. అంతకంటే ఎక్కువగా రియాల్టీ షో లు కూడా టీఆర్ఫీ రేటింగ్ లో చోటు దక్కించుకుంటున్నాయి. తాజాగా స్టార్ మా టీవీ బిగ్ బాస్ ప్రారంభించిన కొద్దీ రోజుల్లోనే పాపులర్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తయ్యాయి. శివ జ్యోతి ఎలిమినేట్ కావడంతో బాబా భాస్కర్, రాహుల్, శ్రీ ముఖి, వరుణ్, అలీ రెజా మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ ఫైనల్ లో అంతిమ విజేత ఎవరో కొన్ని గంటల్లో తేలి పోనుంది. వీరిలో చివరకు టాప్‌‌‌‌‌‌‌‌–3లో నిలిచిన వారి లోంచి ఒకరిని విన్నర్ గా ఎంపిక చేస్తారు. ఫైనల్‌‌‌‌‌‌‌‌ విజేత కోసం ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు ఓటింగ్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంది. అయిదుగురి లోంచి ఎవరు టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలుస్తారని ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోస్ట్‌‌‌‌‌‌‌‌గా నాగార్జున ఈ షోను సక్సెస్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌గా నడిపిస్తున్నాడు. కంటెస్టెంట్లు కూడా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను బాగానే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. మధ్యలో కొన్ని ఎపిసోడ్లు అంతగా ఆకట్టుకోక పోయినా, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ చేసింది ఈ షో. క...

ఆదిత్య అదుర్స్..పాలిటిక్స్ చీర్స్

చిత్రం
మరాఠా రాజకీయాల్లో నవ శకం ఆరంభమైంది. మహారాష్ట్ర లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ యువ కెరటం రాకెట్ లా దూసుకు వచ్చింది. అతడు ఎవరో కాదు కొన్ని దశాబ్డల పాటు భారత దేశ పాలిటిక్స్ ను శాసించిన మహా నేత బాల థాక్రే మనుమడు ఆదిత్య థాక్రే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. శివ సేన చీఫ్ గా తన తండ్రి ఉద్దవ్ థాక్రే ఉండనే ఉన్నాడు. ఏకంగా మనోడు సీఎం పదవి రేసులో నిలిచాడు. ఏ మాత్రం బీజీపీ గనుక ఒప్పుకుని వుంటే అత్యంత పిన్న వయసులో మరాఠాకు దిశా నిర్దేశం చేసే వాడు. శివ సేన యువ సేన చీఫ్ గా ఉన్నాడు. వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ముంబయిలో హిస్టరీ తో డిగ్రీ చేశాడు. న్యాయ విద్య పూర్తి చేశాడు. 13 జూన్ 1990 లో పుట్టారు. ఆదిత్యకు అన్నీ తాత పోలికలే అబ్బాయి. పుస్తకాలు బాగా చదువుతాడు. అంతే కాకుండా పోయెమ్స్ రాస్తాడు. గేయ రచయిత కూడా. మంచి వక్త. ప్రజలకు ఏది కావాలో ఆదిత్యకు బాగా తెలుసు. తాను రాసిన కవితలతో మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో ఓ పుస్తకాన్ని రాశాడు. ఇది 2007 మార్కెట్ లోకి వచ్చింది. ఇదే సంవత్సరంలో గీత రచయితగా మారాడు ఆదిత్య థాక్రే. ప్రైవేట్ ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాడు. ...

కంపెనీల మధ్య పోటీ..కస్టమర్స్ కు భలే గిరాకీ

చిత్రం
టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కస్టమర్స్ కు డేటా పరంగా బాగా వర్కవుట్ అయ్యేలా ఉంది. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో రోజు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఎటూ తేల్చుకోకుండా చేసేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ నుండి పోటీ తట్టుకునేందుకు భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ అంటే బిఎస్ఎన్ఎల్ సైతం తన వినియోగదారులకు అపరిమిత కాల్స్, డేటా అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంతో తాజాగా మరో దెబ్బ కొట్టే పనిలో పడ్డది జియో రిలయన్స్ కంపెనీ. దీంతో ప్రధాన పోటీదారుగా ఉన్న తన ప్రత్యర్థి కంపెనీ నుండి, తన కస్టమర్స్ తరలి పోకుండా ఉండేందుకు ఎయిర్‌టెల్ బంపర్ అఫర్ ప్రకటించింది. ఏకంగా కొత్త ప్లాన్స్ విడుదల చేసింది. 100 ఎంబీపీఎస్ వేగంతో ఎయిర్‌టెల్ నుంచి కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. దీనిని వాడుకుంటే బోలెడు ప్రయోజనాలు కలగనున్నాయి. కేవలం 799  రూపాయలతో సరికొత్త బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌ను వెల్లడించింది. ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్’ పేరుతో ఇప్పుడు ఫైబర్ సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్ ఇక నుంచి అన్ని హోం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఈ గొడుకు కిందికే రానున్నట్టు తెలిపింది. తాజా ప్ల...

దేశమంతటా ఇక విమానాలు

చిత్రం
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త నిర్ణయం తీసుకుంటోంది. ఓ వైపు భారత ఆర్థిక రంగంపై పూర్తి పట్టు కలిగిన మోదీ కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా డిసిషన్స్ తీసుకుంటూ ఝలక్ ఇస్తున్నారు. ఓ వైపు మోదీ పట్ల నమ్మకం తో వున్న జనం మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. తాజాగా ఆభరణాలు, ఆయిల్ పై పడిన సర్కార్ ఇక దేశమంతటా ఎయిర్ పోర్ట్స్ ఏర్పాటు చేయాలని  నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదు ఏళ్ళల్లో మరో 100 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అంతే కాకుండా 1,000 కొత్త మార్గాలకు విమాన సేవలను ప్రారంభించాలని భావిస్తోంది. 2025కల్లా దేశంలో అవసరమయ్యే మౌలిక వసతులపై చర్చించేందుకు గత వారంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో ఈ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. విమానాల లీజుకు ఫైనాన్స్‌ సమకూర్చే వ్యాపార ప్రారంభానికి సంబంధించీ చర్చ జరిగినట్లు తెలిసింది. ఆరేళ్ల కనిష్ఠానికి జారుకున్న జీడీపీ వృద్ధికి ఊతమివ్వడంతో పాటు 2025  నాటికి ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చేందుకు మౌలిక ప్రాజెక్టులను రెట్టింపు చేయాలని మోదీ సర్కార...