పోస్ట్‌లు

ఏప్రిల్ 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బ్యాంకుల‌కు ధీటుగా పోస్టాఫీసులు

చిత్రం
దేశంలోని ప్ర‌జ‌ల‌కు విశిష్ట సేవ‌లందిస్తున్న రంగాల‌లో పోస్ట‌ల్ శాఖ కూడా ఒక‌టి. ప్ర‌తి గ్రామానికి పోస్టాఫీసు విస్త‌రించింది. అత్య‌ధిక వ‌డ్డీని అందిస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది పోస్టాఫీసే. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డుస్తున్న ఈ శాఖ పూర్తిగా నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ప‌నిచేస్తోంది. వేలాది మంది దీనిని న‌మ్ముకుని బతుకున్నారు. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆధార‌ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు ఇందులో పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, పెద్ద‌లు అంతా దీనిలోనే దాచుకున్నారు. డ‌బ్బులు జ‌మ చేస్తే ఇందులో పూర్తి భ‌ద్ర‌త ఉంటుంద‌ని న‌మ్మారు. ప్ర‌యోగాత్మ‌కంగా దేశ వ్యాప్తంగా పోస్ట‌ల్ శాఖ‌ల‌ను బ్యాంకులుగా మార్చారు. ఎలాంటి సేవా రుసుములు ఉండ‌వు. ఎడా పెడా స‌ర్వీసు ఛార్జీలు విధించ‌రు. ఎన్నిసార్ల‌యినా డ‌బ్బుల‌ను ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవ‌చ్చు. రోజూ వారీగా బ్యాంకులు ఎలా ఖాతాదారుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పిస్తాయో ..ఇక్క‌డి పోస్ట‌ల్ బ్యాంకుల్లో ల‌భిస్తాయి. 100 రూపాయ‌ల నుండి కోటి రూపాయ‌ల దాకా జ‌మ చేసుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగాను, ఉమ్మ‌డిగాను పోస్ట‌ల్ ఖాతా ప్రారంభించ‌వచ్చు. భారీగా విస్త‌రించిన పోస్ట‌ల్ శాఖ‌ను ఆధునిక‌ర...

చ‌దువులో లాస్ట్ - క్రికెట్‌లో బెస్ట్ - స‌చిన్ బ‌ర్త్ డే

చిత్రం
ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన పేజీని లిఖించుకున్న అరుదైన ఆట‌గాడు స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్. ముంబ‌యికి చెందిన ఈ ఆట‌గాడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రికార్డుల‌ను తిర‌గ రాశాడు. కొత్త రికార్డులు న‌మోదు చేశాడు. క్రికెట్ ఆట‌లో ఉన్న అన్ని ఫార్మాట్‌ల‌లో ఆడిన ఘ‌న‌త ఆయ‌న‌దే. స‌చిన్ వ్య‌క్తి కాదు..ఓ వ్య‌వ‌స్థ‌. ఓ బ్రాండ్. ఓ న‌మ్మ‌కం. ఓ స్ఫూర్తి. ఆద‌ర్శం కూడా. గురువు నేర్పిన పాఠాల‌ను వంట ప‌ట్టించుకుని భారతీయుడిగా ఎన‌లేని ప‌రుగులు సాధించాడు. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. కేవలం ప‌ది వ‌ర‌కే పాసైనా..ఇంట‌ర్ పూర్తి చేయ‌లేక పోయినా క్రికెట్‌లో లెజెండ్‌గా పిలిచేలా చేసుకున్నాడు. మోస్ట్ ఫెవ‌ర‌బుల్ క్రికెట‌ర్‌గా స‌చిన్‌కు పేరుంది. 10 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. అటు వ‌న్డేల్లోను..ఇటు టెస్ట్ క్రికెట్‌లోను స‌చిన్ ట‌న్నుల కొద్దీ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. క్రీజులో ఉన్నాడంటే సెంచ‌రీ చేయాల్సిందే . అంత‌గా పాతుకు పోయాడు. మైదానం న‌లుమూల‌లా ఆడడం ఆయ‌న‌కే చెల్లింది. మ‌రో క్రికెట్ దిగ్గ‌జం ..మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలోనే స‌చిన్ మెరిశాడు. ఎక్కువ‌గా...

నీరు గారిన విద్యా హ‌క్కు చ‌ట్టం.. స‌ర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్ర‌హం

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో విద్యా హ‌క్కు చ‌ట్టం అమ‌ల‌వుతోందా..ఈ విష‌యం గురించి ప్ర‌భుత్వానికి ఏమైనా తెలుసా..అంటూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల్లో విద్యను అంద‌జేయ‌డం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌. దానిని నుంచి త‌ప్పించు కోవాల‌ని చూస్తే ఎలా. కేంద్రం నిధులు ఇవ్వ‌క పోతే ప‌ట్టించుకోరా. అదే మీ పిల్ల‌ల‌ను అయితే ఇలాగే వ‌దిలి వేస్తారా అంటూ ప్ర‌శ్నించింది. సుప్రీంకోర్టును ఎ ందుకు ఆశ్ర‌యించ‌లేదు. అస‌లు రాష్ట్ర వాటానైనా ఖ‌ర్చు చేశారా అంటూ నిల‌దీసింది. విద్యా హ‌క్కు చ‌ట్టం ఆర్టీఇ అమ‌లుపై త‌మ వైఖ‌రి ఏమిటో చెప్పాల‌ని టీఎస్ స‌ర్కార్‌ను డివిజ‌న్ బెంచ్ ఆదేశించింది. ముందు ప్ర‌భుత్వం త‌న వాటాను ఖ‌ర్చు చేసి..మిగ‌తా వాటా కోసం కేంద్రాన్ని ఎందుకు కోర‌డం లేదంది. మ‌న పిల్ల‌ల‌కు స‌రైన బోధ‌న అంద‌క‌పోతే మ‌ట్టిలో మాణిక్యాలు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తారు .వారిని కెన్యా, ఉగాండా దేశాల్లోని పిల్ల‌ల్లాగా మార్చాల‌ని అనుకుంటున్నారా అని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ చౌహాన్, జ‌స్టిస్ ఎ. రాజ‌శేఖ‌ర్ రెడ్డిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. ఆర్టీ...

ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డ‌కండి..భ‌విష్య‌త్ ఎంతో ఉంది - హీరో రామ్

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఇంట‌ర్ బోర్డు నిర్వాకంపై ప‌లువురు హీరోలు స్పందిస్తున్నారు. వారిలో ఆత్మ స్థ‌యిర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జీవితం ఒక్క‌సారే వ‌స్తుంద‌ని, అన్ని స‌మ‌స్య‌ల‌కు చావు ఒక్క‌టే ప‌రిష్కారం కాద‌ని వారు సూచించారు. నిన్న జ‌న‌సేన అధ్య‌క్షుడు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఏది ఏమైనా ..పిల్ల‌లు ప్రాణాలు కోల్పోవ‌డం బాధాకరం. దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాలి. బాధిత కుటుంబాలకు బాస‌ట‌గా నిల‌వాలి. ద‌య‌చేసి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌కండి. ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు. వారి కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేశారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుండి మ‌రికొంత మంది ముందుకు వ‌చ్చారు. జూనియ‌ర్ ఆర్టిస్టులు సైతం త‌మ మ‌ద్ధ‌తు తెలిపారు. మాన‌సికంగా కుంగి పోవ‌ద్ద‌ని, అవ‌కాశాలు అనేకం ఉన్నాయ‌ని వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. వీలైతే తామంతా మీ వెన‌కే ఉంటామ‌ని అన్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుగా స్పందించే అల‌వాటు వున్న హీరో రామ్ . యంగ్ అండ్ ఎన‌ర్జ‌టిక్ గా ఎప్పుడూ న‌వ్వుతూ..న‌వ్విస్తూ వుండే న‌టుడిగా ...

పొర‌పాట్లు జ‌రిగాయి - చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు

చిత్రం
ఓ వైపు రెవిన్యూ శాఖలో అవినీతి, అక్ర‌మాలు పెచ్చ‌రిల్లిపోతుంటే..మ‌రో వైపు విద్యా శాఖ పూర్తిగా గాడిన త‌ప్పింది. దాని ప‌రుగు బ‌జారున ప‌డింది. ఆ శాఖ‌లో ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. కేజీ టు పీజీ, గురుకులాలు, రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు, ఏకోపాధ్యాయ పాఠ‌శాల‌లు, ఇలా పేర్లు మాత్రం ఘ‌నంగా ఉన్నాయి. సౌక‌ర్యాలు లేక‌, సిబ్బందిని నియ‌మించ‌లేక నానా తంటాలు ప‌డుతున్నాయి. టిఆర్‌టీ నిర్వ‌హించి ఫ‌లితాలు ప్ర‌క‌టించినా ఈ రోజు వ‌ర‌కు ఎంపికైన వారికి నియామ‌క ప‌త్రాలు ఇవ్వ‌లేదు. అధికారుల అవినీతి, పాల‌కుల పాపం వ‌ల్ల‌నే ఇవాళ ఇంట‌ర్ బోర్డు ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బ‌డ్డ‌ది. దీనికంతంటికి కార‌ణం విద్యా శాఖ మంత్రితో పాటు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి, ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శుల‌దే. సంఘ‌ట‌న జ‌రిగి, పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ త‌ర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష జ‌రిపారు. ఫెయిల్ అయిన వారికి మాత్రం ఫీజు ఉండ‌ద‌న్నారు. మిగ‌తా పిల్ల‌ల గురించి చెప్ప‌లేదు. ఇప్ప‌టికే ఫ‌లితాల వెల్ల‌డిలో విఫ‌ల‌మైన అధికారికే తిరిగి బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు. స‌మావేశం ముగిశాక‌..అవును..త‌ప్పులు దొర్లాయి..జ‌రిగింద...

దుమ్ము రేపిన బెంగ‌ళూరు - త‌ల‌వంచిన పంజాబ్

చిత్రం
ఒకానొక ద‌శ‌లో ఐపీఎల్ టోర్న‌మెంట్ నుండి వైదొల‌గి పోతుందుని అనుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టు హ్యాట్రిక్ విజ‌యాల‌ను స్వంతం చేసుకుంది. ప్లే ఆఫ్ ఆశ‌ల‌పై న‌మ్మ‌కం పెట్టుకుంది. వ‌రుస పెట్టి ఆరు అప‌జ‌యాల‌ను మూట‌గ‌ట్టుకున్న కోహ్లి సేన అనూహ్యంగా పుంజుకుంది. ఇంకా పోరాటం కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. టోర్నీ ప్రారంభం నుండి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న కోహ్లి మెల మెల్ల‌గా జ‌ట్టును స‌క్సెస్ బాట‌లోకి తీసుకు వ‌చ్చాడు. రోజు రోజుకు ఆట‌తీరును మెరుగు ప‌ర్చుకుంటూనే మిణుకు మిణుకుమంటున్న ప్లేఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంటూ సాగుతోంది. ఆ జ‌ట్టు ఆట‌గాడు డివిలియ‌ర్స్ రెచ్చి పోవ‌డంతో పంజాబ్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించింది. డివిల‌య‌ర్స్ 44 బంతులు ఆడి మూడు ఫోర్లు ఏడు భారీ సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోర్ లో కీల‌క భూమిక పోషించాడు. మ‌రో కీల‌క ఆట‌గాడు పార్థివ్ ప‌టేల్ 24 బంతులు మాత్ర‌మే ఆడి ఏడు ఫోర్లు, రెండు క‌ళ్లు చెదిరే సిక్స‌ర్ల‌తో 44 ప‌రుగులు చేసి పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 17 ప‌రుగుల తేడాతో బెంగళూరు జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. వీరిద్ద‌రితో పాటు స్టాయి...

స్పందించిన సీఎం - ఉచితంగా రీ వెరిఫికేష‌న్

చిత్రం
ఎట్ట‌కేల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. గ‌త కొన్ని రోజులుగా ఇంట‌ర్ బోర్డు తీరుపై స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌డంతో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. అస‌లు ఏం జ‌రుగుతుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ద‌గ్గ‌రి నుండి ఫ‌లితాల వెల్ల‌డి వ‌ర‌కు స‌మీక్ష చేప‌ట్టారు. ఈ ప్ర‌త్యేక స‌మావేశానికి విద్యా శాఖ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, విద్యాశాఖ ఉన్న‌తాధికారులు జ‌నార్ద‌న్ రెడ్డి, డాక్ట‌ర్ అశోక్ పాల్గొన్నారు. ఏ ప‌ద్ధ‌తిన ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌భుత్వం విద్యార్థులకు అండ‌గా వుంటుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. స్టూడెంట్స్ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌గా సీఎం అభివ‌ర్ణించారు. ప‌రీక్ష త‌ప్పితే ఎన్నిసార్ల‌యినా రాసు కోవ‌చ్చ‌ని, కానీ జీవితం పోతే ఇక రాద‌న్న విష‌యం గుర్తు పెట్టు కోవాల‌ని సూచించారు. పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ స్పందించ‌డంపై ప‌లు విద్యార్థి సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌...

ఆగ‌ని అరెస్టులు ..ఆందోళ‌న‌లు - ప‌రిస్థితి ఉద్రిక్తం

చిత్రం
ఇంట‌ర్ బోర్డు నిర్వాకానికి ..ప్ర‌భుత్వ బాధ్య‌తా రాహిత్యానికి మ‌రో విద్యా కుసుమం రాలి పోయింది. ఎంతో క‌ష్ట‌ప‌డి చదివిన విద్యార్థులు వారి త‌ల్లిదండ్రులు నాలుగో రోజు ఆందోళ‌న బాట ప‌ట్టారు. మ‌రికొంద‌రు రోడ్డుపై ఆందోళ‌ణ చేప‌ట్టారు. వారికి మ‌ద్ధ‌తుగా ప‌లు విద్యార్థి సంఘాల‌తో పాటు వివిధ పార్టీలన నేత‌లు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. అస‌లు దోషులెవ‌రో ఇంత‌వ‌ర‌కు తేల్చ‌లేద‌ని, ఇంత మంది చ‌నిపోయినా క‌నీసం సీఎం కేసీఆర్ స్పందించ‌లేద‌ని బాధితులు వాపోయారు. అధికారులు క‌నీసం స్పందించ‌డం లేద‌ని , స‌రైన స‌మాధానం చెప్ప‌డం లేద‌ని ఆరోపించారు. తాము మార్కులు కోల్పోయి ఇబ్బందులు ప‌డుతుంటే..రీ కౌంటింగ్ కు, రీవాల్యూయేష‌న్ కు డ‌బ్బులు ఎందుకు క‌ట్టాల‌ని ప్ర‌శ్నించారు. బిడ్డ‌ల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వం తిరిగి తీసుకు వ‌స్తుందా అని నిల‌దీశారు. పోలీసులు త‌మ‌ను ఈడ్చుకు వెళుతున్నార‌ని, అరెస్టులు చేస్తున్నా ఏ ఒక్క‌రు ఇటు వైపు క‌న్నెత్తి చూడ‌డం లేద‌న్నారు. విద్యా శాఖ మంత్రి త‌క్ష‌ణ‌మే దీనికి బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాల‌ని, అవ‌క‌త‌వ‌క‌ల‌కు, పొర‌పాట్ల‌కు కార‌ణ‌మైన ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్ ను వెంట‌నే స...