పోస్ట్‌లు

అక్టోబర్ 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆర్టీసీ సమ్మె పై కేంద్రం ఆరా..ఢిల్లీకి తమిళిసై

చిత్రం
తెలంగాణాలో ఒక్కసారిగా రాజకీయాలు వెదికాయి. పరిణామాలు ఊహించని రీతిలో మారిపోతున్నాయి. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఇదే సమయంలో కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఇద్దరు కార్మికులు తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. పరిస్థితి చేయి దాటిపోతున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రావడం లేదు. మరో వైపు టీఅర్ఎస్ సీనియర్ నాయకుడు కేశవరావు కార్మికుల డిమాండ్లను కేసీఆర్ సానుభూతితో పరిశీలించాలని కోరారు. కోర్టు ఏం చెప్పబోతుందో నని ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం ఆత్రుతతో ఎదురు చూస్తోంది. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కంటికి గాయం కావడం, బీజేపీ కేంద్ర ప్రెసిడెంట్ నడ్డా ఫోన్ చేయడం జరిగింది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆందోళన, పోలీసుల అరెస్టులు, కేసుల నమోదు, విపక్షాల మద్దతు, ప్రైవేట్ బస్సుల కొనుగోలు వ్యవహారంపై పూర్తి నివేదికను ఎప్పటికప్పుడు కేంద్రం తెప్పించుకుంటోంది. ఇదిలా ఉండగా అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోనూ చేపడుతున్న ప్రాజెక్టులలో మేఘా కృష్ణారెడ్డి చేతి వాటం ఉందని, ఇందులో కేసీఆర్ కుటుంబం లబ్ది ప...

అమ్మాయిలు అదుర్స్..ఇండియాదే వన్డే సిరీస్

చిత్రం
ఇండియాలో సౌత్ ఆఫ్రికా పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు కోలుకోలేని షాక్ తగిలింది. టెస్టుల్లో పురుషుల జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపిస్తుంటే... వన్డేల్లో భారత మహిళల జట్టు కూడా సఫారీని చిత్తు చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ రాజ్ సారధ్యంలోని మహిళా క్రికెట్జ జట్టు చేజిక్కించుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో గెలుపొందింది. ఇదిలా ఉండగా టీమిండియా జట్టు చేతిలో దక్షిణాఫ్రికా వైట్‌వాష్‌ కావడం ఇదే మొదటిసారి. ఆఖరి వన్డేలో భారత్‌ తక్కువ స్కోరునే కాపాడుకొని 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ నుంచి టెయిలెండర్ల వరకు ఇద్దరు మినహా మిగతా ప్లేయర్స్ చేతులెత్తేశారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 76 బంతుల్లో 5 ఫోర్ల తో 36  పరుగులు చేయగా, శిఖా పాండే  40 బంతుల్లో 35  పరుగులు చేసి స్కోర్ పెంచారు. సఫారీ బౌలర్లలో మరిజన్నె కప్‌ 3, షబ్నమ్, అయబొంగ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 48 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలవుట్ అయ్యింది. భారత స్పిన్నర్లు ఏక్తా బి...

సయోధ్య కుదిరేనా..సమ్మె నిలిచేనా

చిత్రం
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఇప్పటికే ఓ డ్రైవర్ తో పాటు మరో కండక్టర్ బలిదానం చేసుకున్నారు. దీంతో తెలంగాణాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. డిపోల వద్ద కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. వంటా వార్పూ, బైక్ ర్యాలీ చేపట్టారు. ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు దాడులకు దిగారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల చావులు ముమ్మాటికీ సర్కార్ హత్యలేనని నాయకులు ఆరోపించారు. సీఎం తో పాటు మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఉన్నట్టుండి అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కేశవరావు ఓ ప్రకటన చేశారు. వెంటనే సమ్మె విరమించాలని, కార్మికుల డిమాండ్లను సానుభూతితో సీఎం కేసీఆర్ పరిశీలించాలని కోరారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం పేర్కొనడంపై తెలంగాణ అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉద్యమంలో పాల్గొనని వారు తమపై ఆరోపణలు చేసే హక్కు లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి. రాజి రెడ్డి. థామస్ రెడ్డి లు స్పష్టం చేశారు. అంతటా ప్రభుత్వానికి వ్యతిరేకత రావడంతో కొంత మెట్...

కళా సౌరభం..చిత్ర రాజసం

కళ అజరామరం. అదో అంతుపట్టని సన్నివేశం. కదిలే ప్రపంచాన్ని, లోలోపటి అంతరంగాన్ని ఆవిష్కరించే ఉపకారణాలల్లో ఏదైనా అగ్రభాగాన ఉంది అంటే అది ఒక్కటే ఆర్ట్. ప్రతి నిత్యం ప్రవాహమై, సంచారమై అల్లకల్లోలాను రేపే ప్రతి సన్నివేశాన్ని భద్ర పరుచు కునే లాకర్ లాంటిది ఈ కళ. ఈ అందమైన లోకాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరించలేం. జీవితం చిన్నది. అది ఆశ పెడుతుంది. పరుగులు పెట్టిస్తుంది. ఒక చోట ఉండనీయదు..ఇంకో చోటుకు వెళ్లనీయదు. అందుకే ప్రతి ఒక్కరు ప్రయాణాన్ని ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలు..కొత్త దారులు..కొత్త అడుగులు..ఇంతలా మానవ సమూహాన్ని కొన్ని దశాబ్దాలుగా..కొన్ని తరాల నుంచి ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఉంటాయి కూడా..దీనికి ప్రారంభమే తప్పా అంతం అంటూ లేనే లేదు. ఏ చరిత్రను కదిలించినా లెక్కలేనన్ని గాయాలు..మరిచి పోలేని జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ శరవేగంగా టెక్నాలజీ మారినా సాహిత్యం, కళా సౌరభాలు మారలేదు. ఉప్పెనలా మరింత ముందుకు వెళుతూనే ఉన్నాయి. జీవిన గీతికను గేయంగా కళాకారులు ఆలాపిస్తూ వుంటే ఇంకొందరు చిత్రకారులు నిద్రలేని రాత్రుల్లో తమను తాము ఆవిష్కారించుకునే యజ్ఞంలో నిమగ్నమై పోయారు. ఇది నిరంతరం సాగే ప్రక్...

ఆ రోజులు మరిచి పోలేం..ఈ రోజుల్లో బతకలేం

చిత్రం
ఇప్ప‌టికీ పుస్త‌కం చ‌ద‌వ‌కుండా ..రాయ‌కుండా వుండ‌లేను. వంద‌ల పుస్త‌కాలు. లెక్క‌లేన‌న్ని. వాటిలో కొన్ని ఆలోచింప చేస్తే..మ‌రికొన్ని గుండెల్లో దాచుకునేలా చేశాయి. నేను లేకుండా వుండ‌గ‌ల‌వా ..అని అప్పుడెప్పుడో అడిగింది..భార్య‌..ఉండ‌గ‌ల‌ను..కానీ పుస్త‌కాలు లేకుండా నేనుండ‌లేన‌న్నా..కొన్ని రోజులు మాట‌లు బంద్..పెళ్లి క‌దా. అదో బంధం..అంతులేని సంబంధం. ఆ కాస్తా ఇద్ద‌రి మ‌ధ్య ఆక‌ర్ష‌ణ అన్న‌ది లేక‌పోతే ఇంత‌లా ..అల్లుకు పోవ‌డాలు..ఆవేశ‌కావేశాలు..ఆలోచ‌న‌ల..క‌ల‌బోత‌లు..అల‌క‌లు..ప‌ల‌క‌రింత‌లు..చూపులు..మ‌ళ్లీ మాట్లాడుకోవ‌టాలు..ఇదేగా కుటుంబాలు బ‌లంగా వుండేందుకు దోహ‌ద ప‌డుతున్నాయి. ప‌దిలోనే దాస్ కేపిట‌ల్ చ‌దివాక‌..అదేదో ప్ర‌పంచాన్ని జ‌యించినంత ఆనందం. ఊళ్లో ప‌కీర్లు..నాట‌కాలు వేసే వాళ్లను చూస్తే ప్రేమ‌. సంత‌లు, జాత‌ర్లలో డ్రామాలు. క‌ర్నూలు నుండి ర‌జ‌నీబాయి వ‌స్తుందంటే జ‌నం విర‌గ‌డి వాలేవారు. ఇపుడు లెక్క‌లేనంత మంది జ‌నం. అంద‌రూ న‌టులే..న‌టీమ‌ణులే. ప్ర‌తిభ‌తో ఏం ప‌ని. టెక్నాల‌జి పెరిగింది క‌దా.. మ‌న శ‌రీరం ఒక్క‌టి అప్ప‌గిస్తే చాలు..అన్నీ అందుబాటులో దొరుకుతాయి. మ‌నం కాకుండా పోతామంతే.. కాలం మారంద‌ని అనుకున్నా...

ఎందరికో స్ఫూర్తి..మరెందరికో దిక్సూచి

చిత్రం
ఒక‌ప్పుడు పేద‌రికంతో మ‌గ్గిన ఈ కుర్రాడు వేలాది మందిని ఇంగ్లీష్ భాష‌లో ఎక్స్‌ప‌ర్ట్స్‌గా తీర్చిదిద్దే స్థాయికి చేరుకున్నాడు. తెలుగు భాష‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే కేంబ్రిడ్జి యూనివ‌ర్శిటీ నుండి బంగారు ప‌త‌కాన్ని స్వంతం చేసుకున్నాడు. ఇది నిజ‌మైన క‌థ‌. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన అత‌డే చిరంజీవి. శ్రీ మేధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సంస్థ‌కు అధిప‌తి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్‌ప‌ర్ట్ గా, మెంటార్‌గా, ట్రైన‌ర్‌గా ఎన‌లేని ఎక్స్‌పీరియ‌న్స్ స్వంతం చేసుకున్న ఘ‌న‌త ఆయ‌న‌దే. చిరంజీవి అంటే సినిమా న‌టుడు గుర్తుకు వ‌స్తాడు. కానీ ఈ చిరంజీవి మాత్రం వెరీ వెరీ డిఫ‌రెంట్‌. విశాఖ న‌గ‌రంలో చిన్న‌గా ఓ గ‌దిలో ప్రారంభ‌మైన స్పోకెన్ ఇంగ్లీష్ శిక్ష‌ణ సంస్థ ఇపుడు కార్పొరేట్ కంపెనీ స్థాయికి చేరుకుంది. చిరంజీవి ఇంటి పేరు అంబ‌రగొండ‌. ఫౌండ‌ర్‌గా ..చీఫ్ కోచ్‌గా మేధ లాంగ్వేజ్ థియేట‌ర్‌ను స్థాపించాడు. ప్ర‌పంచాన్ని ఇంగ్లీష్ భాష శాసిస్తోంది. దీనిపై ప‌ట్టు సాధించ‌క పోతే ఎక్క‌డా బ‌త‌క‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. తెలుగు వారి ప‌రిస్థితి మ‌రీ దారుణం. అంతా తెలుగు మీడియంలో చ‌దివిన వారే. ఇంగ్లీష్ అ...

రంగులకు వన్నెలద్దుతున్న శ్రీకాంత్

చిత్రం
జీవితం కొందరికి బోర్. ఇంకొందరికి ఎంజాయ్. మరికొందరికి మాత్రం అదో సరదా కానే కాదు. ఓ యుద్ధం. అందులో ఎన్నో కళలు. బతుకును అర్థం చేసుకోవాలన్నా, దానిని కుంచెలో బంధించాలంటే చాలా ఓర్పు కావాలి. అంతకంటే ఎక్కువగా సహనం ఉండాలి. ప్రతి ప్రయాణం ఒక్కో అనుభవాన్ని..అనుభూతిని మిగిల్చేలా చేస్తుంది. అందులో ఆర్టిస్టులు వెరీ వెరీ డిఫ్ఫరెంట్. ఎవరి లోకంలో వాళ్ళు మునిగి పోతే కళాకారులు మాత్రం తమ లోకంలో తాము జీవిస్తారు. తమ మెదళ్ళకు పనిచెబుతారు. అది..కవితైనా..పాటైనా..చిత్రమైనా..దృశ్యమైనా..ఏదైనా ప్రాణం పోసు కోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి పురిటి నొప్పులలాంటి కష్టం కూడా. అందుకే చాలా మంది కళాకారులు ఎవ్వరికీ త్వరగా అర్థం కారు. ఎవ్వరూ వారి ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇది కొన్ని తరాలుగా, కొన్నేళ్లుగా అనాది నుంచి వస్తూనే ఉన్నది. కుంచె చేతిలోకి ఒదిగి పోతే కొత్త గా ఓ అద్భుత దృశ్యం కాగితంపై రూపు దిద్దు కుంటుంది. అందులో ఎన్నో కలర్స్. ప్రతి రంగు ఒక్కో అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే రంగుల హరివిల్లును ఆవిష్కరించాలని ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ సంచారపు ప్రవాహంలో వేలాది మంది కొట్టుకు పోతే కొందరు మాత్రమ...

టీఆర్ఎస్ కు షాకిచ్చిన సీపీఐ

చిత్రం
తెలంగాణలో అధికార పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం లేదంటూ సీపీఐ వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులు గత పది రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగారు. ఇదే సమయంలో ఆర్టీసీ సంస్థలో వందలాది కార్మికులు సీపీఐ పార్టీకి అనుబంధంగా కార్మిక సంస్థగా ఉన్నది. దీనికి కార్మిక శాఖ గుర్తింపు కూడా ఉంది. దీంతో కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వత్తిళ్లు వచ్చాయి. కార్మికులు చేస్తున్న పోరాటం, ఆందోళన న్యాయబద్ధమైనది కావడంతో అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు పూర్తి మద్దతు ప్రకటించారు. అంతకు ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, థామస్ రెడ్డి, రాజి రెడ్డిలు అన్ని పార్టీల అధినేతల వద్దకు వెళ్లారు. తాము చేస్తున్న శాంతియుత ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలతో కలిసి అఖిల పక్షం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కోదండ రామ్, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, లక్ష్మణ్...

కార్మికుల కోసం సకల జనం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉధృతంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో గతంలో ఆర్టీసీ కార్మికులు అగ్ర భాగాన నిలిచారు. ఇప్పటికే డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ గౌడ్ లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు నిరసన తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాక పోగా, పైపెచ్చు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం చెప్పడంపై తెలంగాణ అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కార్మికుల కోసం అన్ని వర్గాల నుంచి సంఘీభావం ప్రకటించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు న్యాయవాదులు. అయితే తెలంగాణ అంతటా పోలీసులు మోహరించారు. చాలా చోట్ల ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడ్డారు. దీనిపై విపక్షాలు, ఆయా సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు ఖండించారు. ఇదిలా ఉండగా కార్మికులు చని పోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వెంటనే సీఎం, మంత్రులపై కేసులు నమోదు చేయాలనీ బీజేపీ ప్...

అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి

చిత్రం
ఆర్థిక శాస్త్రంలో విశిష్టమైన సేవలందించిన ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి వరించింది. 2019 సంవత్సరానికి గానూ అభిజిత్‌ బెనర్జీ, ఎస్తేర్‌ డుఫ్లో, మైఖేల్‌ క్రెమేర్‌లను నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ప్రకటించింది. అంతకు ముందు ఇండియాకు చెందిన అమర్థ్యాసేన్‌ కు ఆర్థిక శాస్త్రం లో నోబెల్ దక్కింది. ఆయన తర్వాత నోబెల్ బహుమతి పొందిన వాడిగా ప్రవాస భారతీయుడు, మేధావి, ఆర్ధిక వేత్త అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం లభించింది. ఆర్ధిక రంగంలో ఎదురవవుతున్న సవాళ్లు, ప్రపంచ పేదరికాన్ని తొలగించేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు ఎంతగానో కృషి చేశారు. ఈ మేరకు అభిజిత్ చరిత్ర సృష్టించారు. అభిజిత్‌ బెనెర్జీ బెంగాల్ లో జన్మించారు. మేధావిగా, స్కాలర్ గా బెనర్జీ పేరు పొందారు. 2011 లో ఎఫ్టీ గోల్డ్ మాన్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారు. 1961 ఫిబ్రవరి 21 న పుట్టారు. ఆయనకు ఇప్పుడు 58 ఏళ్ళు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ, కోల్ కత్తా లోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, ఫీల్డ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ విభాగంలో పని చేశారు. జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో పని చేశా...

జగన్ ను కలిసిన మెగాస్టార్

చిత్రం
ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ నటుడు చిరంజీవి సీఎం నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా చిరంజీవి దంపతులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం చిరజీవి వెంట ఆయన సతీమణి సురేఖ తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కూడా ఉన్నారు. కాగా జగన్ నివాసానికి వెళ్లిన మెగాస్టార్ దంపతులకు జగన్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం చిరంజీవి జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. చిరు భార్య సురేఖ జగన్ భార్యకు చీరను అందజేశారు. చిరంజీవి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లు భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఐదు నెలలు గడిచినా ఈరోజు వరకు టాలీవుడ్ నుండి నటీనటులు కలవ లేదు. దీనిపై శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, నటుడు పృథ్వీ రాజ్ మండిపడ్డారు. ఇదే సమయంలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా లతో కలిసి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమా తీశారు. దీనిని చిరంజీవి కొడుకు, నటుడు రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో తన 151...

ఆగని సమ్మె..దిగని సర్కార్

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఎట్టి పరిస్థితుల్లో తమ ఆందోళనను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు. ప్రభుత్వం తరపున ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా ఖమ్మం ఆర్టీసీ డిపోలో  డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. అయన కుటుంబం పై పోలీసులు వత్తిడి తీసుకు వచ్చి అంత్యక్రియలు జరిపించారు. 48 వేల మంది కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. మరో వైపు హైదరాబాద్ లో మరో ఆర్టీసీ కార్మికుడు కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో సమస్య మరింత తీవ్రతరమైంది. తక్షణమే పరిష్కరించాలని, కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్ధి నాయకులు డిమాండ్ చేశారు. అంతకు ముందు ఓయూలో ధర్నా చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించారు. వీరికి మద్దతును ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాలు పూర్...