పోస్ట్‌లు

మే 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏపీలో కొలువు తీరేదెవ్వ‌రో..?

చిత్రం
ఇలాంటి దారుణ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌ల‌లో కూడా అనుకుని ఉండ‌రు. జీవితంలో మ‌రిచి పోలేని అప‌జ‌యాన్ని అందించారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఈనెల 30న వేద పండితుల సాక్షిగా, జ‌న సమ‌క్షంలో జ‌నామోదం పొందిన జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. అతిర‌థ మ‌హార‌థులు, ఇత‌ర ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి రానున్నారు. ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు వ‌న్ సైడ్‌గా తీర్పు ఇవ్వ‌డం, 150 సీట్ల‌కు చేర్చ‌డంతో జ‌గ‌న్ ఉబ్బి త‌బ్బ‌బ‌వుతున్నారు. ఏదో 120 లేదా 130 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోతామ‌ని న‌మ్మ‌కంతో ఉన్న జ‌గ‌న్‌కు ఊహించ‌ని రీతిలో ఆంధ్రా ప్ర‌జ‌లు గిఫ్ట్ ఇచ్చారు. ఏపీ చ‌రిత్ర‌లో ఇది చారిత్రాత్మ‌క విజ‌యం. ఊహించిన దానికంటే ఎక్కువ‌గా ఎమ్మెల్యేలు గెలిచారు. వీరితో పాటు 23 ఎంపీ సీట్ల‌లో వైసీపీ పాగా వేసింది. బీజేపీతో స‌ఖ్య‌త పాటిస్తున్న జ‌గ‌న్..మోదీ కేబినెట్‌లో చేర‌మ‌ని జ‌గ‌న్‌ను ఆహ్వానిస్తే ..చేరేందుకు సుముఖ‌త చూపించ‌వ‌చ్చు. ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌...

నిజామాబాద్‌లో నైతిక విజ‌యం రైత‌న్న‌ల‌దే

చిత్రం
మెతుకుల‌ను పండించి ..మ‌ట్టినే న‌మ్ముకుని ..బ‌తుకు బ‌రువై అరిగోస ప‌డుతున్న రైతులు భార‌త‌దేశలో ఒక చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు. నూత‌న అధ్యాయానికి తెర తీశారు. అంత‌కు ముందు పాల‌మూరు జిల్లాలోని పోలేప‌ల్లి గ్రామ‌స్తులు త‌మ భూములు త‌మ‌కు కావాల‌ని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మోసం చేశాడంటూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించారు. అప్ప‌ట్లో అది ఓ సంచ‌ల‌నం. మొన్న‌టి దాకా తిరుగులేద‌ని భావించిన అధికార పార్టీకి చుక్క‌లు చూపించారు. నిజామాబాద్ అంటేనే పసుపు, చెరుకు పంట‌ల‌కు ప్ర‌సిద్ధి. ఆసియా ఖండంలోనే అధిక సాగు చేసే ప్రాంతం ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ మాత్ర‌మే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే త‌మ బ‌తుకులు బాగు ప‌డ‌తాయ‌ని, త‌మ పిల్ల‌ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, త‌మ పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర దొరుకుతుంద‌ని ఇక్క‌డి మ‌ట్టి బిడ్డ‌లు భావించారు. అదంతా రివ‌ర్స్ అయ్యింది. సీఎం కూతురు క‌విత ఇక్క‌డ ఎంపీగా పోటీ చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచింది. రైతుల‌కు ప‌సుపు బోర్డు ఏర్పాటు చేస్తామ‌ని, ఆదుకుంటామ‌ని చెప్పి ఆచ‌ర‌ణ‌లో చూపించక పోవ‌డంతో రైతులు పోరు బాట ప‌ట్టారు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యేలా ఆందోళ‌న‌ల...

డైన‌మిక్ స్ట్రాట‌జిస్ట్ ..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోరా మ‌జాకా..!

చిత్రం
అత‌డు రంగంలోకి దిగాడంటే ..ఇక అంతే ప్ర‌త్య‌ర్థులు చిత్త‌యి పోవాల్సిందే. అత‌డు పులి కంటే వేగంగా ఆలోచిస్తాడు. రాకెట్ కంటే స్పీడ్‌గా త‌న ప్లాన్‌ను అమ‌లు చేస్తాడు. అంత‌కంటే భిన్నంగా త‌న‌దైన మార్క్ తో ..స్ట్రాట‌జీని అమ‌లు చేస్తాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌టం అంటూ ఉండ‌దు. ప‌ని అంతా పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉంటుంది. ప‌క్కా లోకల్ గా అనిపిస్తుంది ఆయ‌న ఆలోచ‌నా తీరు. అప‌ర మేధావిగా..ఇండియాలో ఎవ‌రికీ రానంత పాపులారిటీ ఆయ‌నకు రానే వ‌చ్చింది.  గెలుపు కావాలంటే..విజ‌యం సాధించాలంటే..ఏం చేయాలో అత‌డికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ను కోవాలి. అంత‌లా పాపుల‌ర్ అయి పోయాడు అత‌డు. ఇంత‌గా ఇంట్ర‌డ్యూస్ చేయాల్సిన వ్య‌క్తి ఎవ‌ర‌త‌డంటే..ఒకే ఒక్క‌డు..డైన‌మిక్ లీడ‌ర్..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోర్. యుద్ధంలో గెల‌వాలంటే ఏం చేయాలి. ఎవ‌రిని ఎప్పుడు సంప్ర‌దించాలి. ఏయే శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్టు కోవాలి. ఎవ‌రి బ‌లాలు ఏమిటి..బ‌ల‌హీన‌త‌లు ఏమిటి..ఏం చేస్తే స‌క్సెస్ చెంత వాలుతుంది. ఇవ‌న్నీ త‌నొక్క‌డే అమ‌లు చేస్తాడు.  ఎవ‌రూ త‌న ప‌క్క‌న ఉండ‌రు. ఉప్పెన‌లా దూసుకెళ‌తాడు. సునామీలా అల్లుకు పోతాడు. జ‌నాన్ని మాట‌ల‌తో మంత్రం ...