పోస్ట్‌లు

నవంబర్ 15, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వసూళ్ళలో జోకర్ బేఫికర్

చిత్రం
హాలీవుడ్ లో ఇప్పుడు జోకర్ సినిమా హవా నడుస్తోంది. జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించిన అమెరికన్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'జోకర్‌' మూవీ బాక్సాఫీస్‌ వద్ద తన కలెక‌్షన్లను స్థిరంగా కొనసాగిస్తోంది. గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా జోకర్‌ విడుదలైంది. సినిమాలో హింస ఎక్కువగా ఉందంటూ విమర్శకులు పెదవి విరిచినా మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది జోకర్. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు దాటిన తొలి ఆర్‌-రేటెడ్ సినిమా గా నిలిచింది. ఇంతకు ముందు 2018లో వచ్చిన ర్యాన్ రేనాల్డ్స్ నటించిన కామెడి థ్రిల్లర్‌ 'డెడ్‌పూల్ ‌2' సినిమా .78.5 , డెడ్‌పూల్‌  75  కోట్లు వసూలు చేయగా, తాజాగా జోకర్‌ ఆ సినిమాల రికార్డును అధిగమించింది. అంతే గాక చైనాలో ఆర్‌-రేటడ్‌ సినిమాలను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ జోకర్‌ సినిమాను మాత్రం  ప్రేక్షకులు హిట్‌ సినిమాగా నిలిపారు. జోకర్‌గా నటించిన జోక్విన్‌ ఫీనిక్స్‌ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 62.3 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో వార్నర్‌ బ్రదర్స్‌, డీసీ ఫిలిమ్స్‌ సంస్థ జోకర్‌ సినిమాను తెరకెక్కించగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వ...

బాలీవుడ్ లో దేవరకొండ హల్ చల్

చిత్రం
ఒకే ఒక్క సినిమాతో స్టార్ డం తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మోస్ట్ సెలబ్రెటీగా మారి పోయాడు. ఇక అర్జున్‌రెడ్డి సక్సెస్‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరో అయ్యాడు. సినిమాలలో, అడియో రిలీజ్‌ ఫంక‌్షన్‌లతో పాటు పలు సినిమా కార్యక్రమాలలో తనదైన రీతి మాట్లాడుతూ తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. వరస విజయాలతో దూసుకుపోతూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అయ్యాడు ఈ హీరో. ఇక బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహర్‌ అర్జున్‌రెడ్డిని హీందీలో రీమేక్‌లో నటించమని అడగడంతో విజయ్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. అలాగే ఇటీవల విజయ్‌ నటించిన డియర్‌ కామ్రేడ్‌ను కూడా కరణ్‌ హీం​దీలో రీమేక్‌ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్‌కి టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌కు కూడా సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలో ఈ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ హీరోకి బాలీవుడ్‌లో ఆఫర్‌లు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో బీజీగా ఉండటంతో బీటౌన్‌కి వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని చెపుకొస్తున్నాడు రౌడీ. తాజాగా ఇంటర్‌నేషనల్‌ సింగర్‌ ‘క్యాటీ పెర్రి’ మ్యుజిక్‌ షో కోసం ముంబాయిలోని వన్‌ ప్లేస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిని పార్టీకి నిర్మాత కరణ్‌ జోహర్‌ హోస్ట్‌గా వ్యవహరి...

ఫ్యాన్స్ ఖుష్..దాదా జోష్

చిత్రం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్, మాజీ టీమిండియా సారధి సౌరభ్ గంగూలీ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఆయన పగ్గాలు చేపట్టాక బిసిసిఐ రూపు రేఖలు మార్చే పనిలో దృష్టి పెట్టాడు. భారీ ఆదాయం కలిగినక్రీడా సంస్థగా ప్రపంచంలోనే పేరుంది. దీనిలో పదవి దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇండియాకు ప్రైమ్ మినిష్టర్ కావడం చాలా తేలిక, కానీ ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రెసిడెంట్ కావడం చాలా కష్టమని క్రికెట్ పండితులు ఎప్పుడో సెలవిచ్చారు. నీతి, నిజాయితీ, దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా గంగూలీకి పేరుంది. అంతే కాదు ఈ బెంగాలీ బాబుకు అటు బెంగాల్ లో ఇటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది. మాజీ టీమిండియా లెజెండ్ మహమ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోనే గంగూలీ తన క్రికెట్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అందుకే ఈ దాదాకు అజ్జూ భాయ్ అంటే అభిమానం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఉత్సవాలకు ప్రత్యేకంగా తనను ఆహ్వానించాడు. అంతే కాదు బిసిసిఐ పదవి చేపట్టాకా అజ్జుతో కలిసి ఏం చేయాలన్న దానిపై సూచనలు తీసుకున్నాడు. అజహరుద్దీన్ సారధిగా ఉన్న సమయంలోనే ద్రావిడ్, గంగూలీ, కుంబ్లే, సిద్దు, ఇలా ఎందరో వెలుగులోకి వచ్చారు. ప్రతి ఒక్కరికే ఆడే ఛాన్స్ ఇచ్చ...

జాయ్ కి హైదరాబాద్ ముస్తాబు

చిత్రం
ఐటీ హబ్ గా దేశంలో ఇప్పటికే పేరొందిన హైదరాబాద్ మరో అంతర్జాతీయ వేదికకు ముస్తాబు కాబోతోంది. వరల్డ్   లోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ అండ్‌ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే ఇండియా జాయ్ కార్యక్రమానికి మరోసారి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. నాలుగు రోజుల పాటు ఇండియా జాయ్-2019 కార్యక్రమం పేరుతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఇండియా జాయ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా జాయ్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాలకు చెందిన  వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గేమింగ్ యానిమేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్య స్థానంగా మార్చేందుకు ‘ఇమేజ్ టవర్’ ను నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రకటిం...

సీట్లు తక్కువ..డిమాండు ఎక్కువ

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు జనాన్ని ఆకట్టు కుంటున్నాయి. ఇదే క్రమంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యా నిధి పథకానికి విద్యార్థులు పోటెత్తారు. ఈ పథకం కింద పరిమిత తక్కువ సంఖ్యలో మాత్రమే సర్కారు అనుమతి ఇస్తోంది. దీని కోసం దరఖాస్తుల సంఖ్య మాత్రం భారీగా ఉంటోంది. 2016 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.  తొలి రెండేళ్లలో 300 దరఖాస్తులు కూడా రాలేదు. ప్రస్తుతం కోటాకు మించి పదింతలు దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దరఖాస్తుల పరిశీలన, వడ పోత కత్తిమీద సాములా మారుతోంది. ఎంజేపీ ఓవర్సీస్‌ విద్యా నిధి కింద ప్రతి ఏడాది 300 మందికి అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఈబీసీలకు 5 శాతం కేటాయిస్తుండగా, మిగతా 95 శాతాన్ని ప్రాధాన్యత క్రమంలో బీసీ లోని కేటగిరీల వారీగా అవకాశం ఇస్తున్నారు. ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఇటీవల దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగా 3,116 మంది దరఖాస్తులు వచ్చాయి. దీంతో పోటీ పెరిగింది. ఒక దానికి పది మంది పోటీ పడుతున్నారు. అనూహ్యంగా దరఖాస్తులు పెరగడంతో వీటి పర...

ట్విట్టర్ సంచలన నిర్ణయం

చిత్రం
సోషల్ మీడియాలో ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న ట్విట్టర్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. చిట్టి సందేశాలతో గణనీయమైన ఆదాయాన్ని గడిస్తోంది ఈ దిగ్గజ కంపెనీ. కాగా ఇటీవల ట్విట్టర్ రాజకీయ, వాణిజ్య ప్రకటనలను నిషేధిస్తున్నామని, దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తామని ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే ప్రకటించారు.   కాగా మార్క్‌ జుకర్‌బర్గ్‌ సీఈవోగా ఉన్న ఫేస్‌బుక్‌లో పొలిటికల్, కమర్షియల్ ప్రకటనల రూపంలో రాజకీయాలపై దుష్ప్రచారం, నకిలీ వార్తలు పెద్ద ఎత్తున చెలామణి అవుతున్నాయి. దీంతో ట్విట్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, పూర్తి పారదర్శకత అలవడుతుందని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాజకీయ దుష్ప్రచారాన్ని లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న రాజకీయ, వాణిజ్య ప్రకటనల నిలిపి వేతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అమెరికా పార్లమెంట్‌ ప్రశ్నకు జుకర్‌బర్గ్‌ సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో పలు పార్టీలు, అధినేతలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం అమెరికాతో పాటు పలు దేశాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇదే సమయంలో తప్పుడు రాజకీయ ప్రకటన...

దివాళా అంచున ఆర్ కామ్

చిత్రం
రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లలో టెలికాం సెక్టార్ లో జియో దూసుకు పోతుండగా, అనిల్ అంబానీ చైర్మన్ గా ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ మాత్రం రోజు రోజుకు కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. ముకేశ్ అంబానీ భారతీయ ఆర్ధిక, మార్కెట్ రంగాన్ని శాసిస్తుండగా అనిల్ మాత్రం బేల చూపులు చూస్తున్నారు. ఇప్పటికే టెలికాం, ఆయిల్, ఫ్యాషన్, ఫాబ్రిక్స్, జ్యుయెలరీ, ఫుడ్, షూస్, తదితర రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళుతున్నారు. ముకేశ్ అంబానీ పకడ్బందీ ప్రణాళికతో ఒక్కో అడుగు వేసుకుంటూ తన కంపెనీలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆదాయ బాట పట్టిస్తున్నారు. దీంతో తాజాగా ఆయా కంపెనీల షేర్ అమాంతం పెరిగాయి. మదుపరులకు భారీగా ఆదాయం సమకూరింది. ఇదే సమయంలో ఆర్ కామ్ మాత్రం కోలుకోలేని రీతిలో నష్టాలను కొనితెచ్చుకుంటోంది. దీనిని గాడిలో పెట్టేందుకు ముకేశ్ అంబానీ రంగంలోకి దిగారు. అనిల్ అంబానీకి వెన్ను దన్నుగా నిలిచారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆర్ కామ్ కు ఏకంగా 30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో  1,141 క...

పరుగుల వరద..మనదే ఆట

చిత్రం
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. ఆరు వికెట్లు కోల్పోయి 493 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి 343 పరుగుల ఆదిక్యం సాధించింది. రవీంద్ర జడేజా 76 బంతుల్లో 60 పరుగులు చేయగా, ఉమేష్‌ యాదవ్‌ 10 బంతుల్లో 25 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. అబు జాయేద్‌ 4, ఎబాదత్‌ హొసేన్‌, మెహిదీ హసన్‌ తలో వికెట్‌ తీశారు. ఇక ఒక వికెట్ కోల్పోయి 86 పరుగుల ఓవ ర్‌నైట్‌ స్కోరుతో ఆటను మయాంక్‌ అగర్వాల్‌, చతేశ్వర్‌ పుజారా ఆరంభించి 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చతేశ్వర పుజారా మెలమెల్లగా పరుగులు సాధిస్తూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. 54 పరుగులు చేశాక రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఫుల్ స్వింగ్ లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సున్నాకే వెనుదిరిగాడు. తాను ఆడిన రెండో బంతికి కోహ్లి డకౌట్‌గా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకొచ్చిన రహానే, మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి మంచి భాగస్వామాన్ని నమోదు చేశాడు. ఈక్రమంలో మయాంక్‌ సెంచరీ సాధించాడు. రహానే 172 బంతుల్లో 86 రన్స్ చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం ఆదే ఊపుతో చెలరేగి ఆడిన మయాంక్‌ డబ...

మనదే టీ-20 సిరీస్

చిత్రం
భారత క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఓ వైపు నిబద్దత, నిజాయితీ కలిగిన, మాజీ సారధి, బెంగాలీ దాదా సౌరభ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక దీని రూపు రేఖలు పూర్తిగా మార్చేసే పనిలో పడ్డాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన, ఆదాయం కలిగిన బిసిసిఐకి ఇప్పుడు అతడే బాస్. పూర్తిగా ఆటపైనే దృష్టి సారించాడు. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు సముచిత స్థానం ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నాడు. దీంతో నిన్నటి దాకా అంతగా సపోర్ట్ లేక ఇబ్బందులు పడిన మహిళా ప్లేయర్స్ ఇప్పుడు ఆటలో దుమ్ము రేపుతున్నారు. తాజాగా వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న మన మహిళా జట్టు ఇప్పటికే పలు మ్యాచుల్లో విజయం సాధించింది. మిథాలీ రాజ్, స్మృతి మందన్న, తదితర ఆటగాళ్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. టి20 క్రికెట్‌ జట్టు ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌పై ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది టీమిండియా. గయానాలో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవ...

వైభవంగా అర్చన వివాహం

చిత్రం
బిగ్‌బాస్‌ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపా రవేత్త జగదీశ్‌ భక్త వత్సలంల వివాహం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం గత నెలలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నగరంలో సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సిటీలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి రిసెప్షన్‌ నిర్వహించారు. అర్చన, జగదీశ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అర్చన క్లాసికల్‌ డ్యాన్సర్‌. అంతే కాకుండా పలు సినిమాల్లోనూ నటించి వెండి తెరపై మెరిసింది. అయితే సరైన హిట్‌ లేక పోవటంతో అడపా దడపా చిత్రాలకు మాత్రమే పరిమితమై పోయింది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరికీ సుపరిచితు రాలయ్యింది. ఈ షోతో తగిన గుర్తింపు తెచ్చుకున్న అర్చన పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. తాజాగా వజ్ర కవచధర గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ ఫుల్ పాత్రను పోషించింది. కొంత కాలంగా సినిమాలు రాక పోవడంతో ఉన్నట్టుండి అర్చన మనసు పెళ్లి వైపు మళ్లింది...

గంభీర్ రివర్స్ కౌంటర్

చిత్రం
మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. ఎంపీగా నియోజకవర్గం పట్ల తనకున్న చిత్తశుద్ధి గురించి, అక్కడ తాను చేసిన అభివృద్ధే మాట్లాడుతుందని గంభీర్‌ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలకు అదే సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర తరమైన నేపథ్యంలో, ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్యానెల్‌ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే టీమిండియా, బంగ్లాదేశ్  మ్యాచ్‌ కామెంట్రీ నిమిత్తం గంభీర్‌ ఇండోర్‌లో ఉండటంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు. కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే పాల్గొనడంతో ప్యానెల్‌.. భేటీని రద్దు చేసింది. ఇండోర్‌లో జిలేబీలు తింటున్న గంభీర్ ఫొటోలను సోషల్‌ మీడియాలో ఆప్‌ నేతలు పోస్ట్ చేశారు. గంభీర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన గౌతం గంభీర్‌ ట్విటర్‌ వేదికగా వారికి కౌంటర్‌ ఇచ్చారు. నా నియోజకవర్గం, పట్టణంలో జరిగే అభివృద్ధిని చూసి నా గురించి మాట్లాడాలి. ఘాజీపూర్‌లో స్వచ్ఛత కోసం అత్యాధునిక కంపోస్టు యంత్రాలు పెట్టించాం. ఈడీఎంసీ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాసులు, మౌలిక స...