పోస్ట్‌లు

జూన్ 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

విద్యార్థులకు గైడ్ లైన్ - విద్యా హెల్ప్ లైన్ - తెలంగాణ పోర‌ని గెలుపు క‌థ

చిత్రం
విద్యా హెల్ప్ లైన్ గురించి ఎవ‌రిని అడిగినా ఠ‌కీమ‌ని చెప్పేస్తారు హైద‌రాబాద్ సిటీలో. ఇదో పేరుకు స్వ‌చ్చంధ సంస్థ‌నే. కానీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా బిట్స్ పిలానీలో చ‌దువుకుని, ఉన్న‌తమైన జాబ్స్‌ను వ‌దిలేసుకుని ..కేవ‌లం స్టూడెంట్స్ బాగు కోసం త‌న జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ కుర్రాడి క‌థ ఇది. వికారాబాద్‌కు చెందిన పుచ్చ‌కాయ‌ల చంద్ర‌శేఖ‌ర్ సాంకేతిక ప‌రంగా మంచి విజ‌న్ ఉన్న యువ‌కుడు. తాను నేర్చుకున్న‌, తాను అనుభ‌వించిన ఇబ్బందుల‌ను భావిత‌రాల‌కు చెందిన పిల్ల‌లకు క‌ల‌గ‌కూడ‌ద‌నే ఉద్ధేశంతో నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ పేరుతో ఎన్‌జిఓను స్థాపించాడు. అది అంచెలంచెలుగా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రించుకుంటూ పోయింది. దాత‌లు, సంస్థ‌లు చంద్ర‌శేఖ‌ర్ అండ్ టీం క‌లిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ ను చూసి ఇంప్రెస్ అయ్యారు.  వారు కూడా తోచిన రీతిలో సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. వారందిస్తున్న చేయూత‌తోనే ఇంకా ముందుకు వెళ్ల‌గ‌లుగుతున్నామ‌ని అంటున్నారు చంద్ర‌శేఖ‌ర్ విన‌మ్రంగా. ఇక్క‌డ కుల‌, మ‌తాల‌కు, వ‌ర్గాల‌కు తావు లేదు. కేవ‌లం ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుని అంద‌రికంటే టాప్‌లో నిలిచిన వారికి ఆయా కంపెన...

ఆథెర్ ఎన‌ర్జీకి బొంప‌ర్ బొనాంజా - స‌చిన్ బ‌న్సాల్ బిగ్ ఇన్వెస్ట్‌మెంట్

చిత్రం
పేష‌న్, ప‌ర్ప‌స్ ట్యాగ్ లైన్‌తో చిన్న పెట్టుబ‌డితో  ప్రారంభ‌మైన ఆథెర్ ఎన‌ర్జీ అంకుర సంస్థ జాక్ పాట్ కొట్టేసింది. రాను రాను ఆయిల్‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెర‌గ‌డం, వాహ‌నాల‌కు స‌రి పోక పోవ‌డం, ధ‌రాభారం మోయ‌లేక పోవ‌డంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించారు ఔత్సాహికులు. దీంతో గ‌త ప‌దేళ్లుగా సోలార్ ప‌వ‌ర్‌తో పాటు విద్యుత్ ఛార్జింగ్‌తో న‌డిచేలా బైక్‌లు, స్కూట‌ర్లు, కార్లతో పాటు ఇత‌ర వాహ‌నాలు విద్యుత్‌తో న‌డిచేలా త‌యారు చేస్తున్నారు. ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ లో ఎక్కువ‌గా కార్లకు అధిక డిమాండ్ ఉంటోంది. ఇండియా ప‌రంగా చూస్తే ప్ర‌తి మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వారు స్టేట‌స్ సింబ‌ల్‌గా భావిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్క‌రు కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఉత్సుక‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీనిని ముందుగానే గుర్తించిన నిర్వాహ‌కులు ఆథెర్ ఎనర్జీ పేరుతో స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. ఒక్క‌సారి విద్యుత్ ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం చేసేందుకు వీల‌వుతుంది. స్టాప్, స్టార్ట్..వీ..అనే పేరుతో దీనిని రూపొందించారు. హై కెపాసిటీ లైన్ బ్యాట‌రీని ఇందులో రూపొందించారు. ఈ వెహికిల్ 50 వేల కిలోమీట‌ర్లు ...

కొత్త కేబినెట్‌లో రోజాకు నో ఛాన్స్

చిత్రం
ఐరెన్ లెగ్ గా అప‌వాదులు ఎదుర్కొని, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు త‌ట్టుకుని వైఎస్ఆర్‌సీపీకి అన్ని వేళ‌లా అండ‌గా నిలిచి..ప్ర‌త్య‌ర్థులకు త‌న మాట‌ల తూటాల‌తో ముచ్చెమ‌టలు పోయించి..ఎమ్మెల్యేగా మ‌రోసారి గెలిచి త‌న స‌త్తా ఏమిటో చూపించిన రోజా సెల్వ‌మ‌ణికి జ‌గ‌న్ కేబినెట్‌లో చోటు ద‌క్క‌లేదు. ఎవ‌రున్నా లేక పోయినా త‌న స్వంత చెల్లెలి కంటే ఎక్కువ‌గా..మిన్న‌గా రోజాను చూసుకున్నారు జ‌గ‌న్. స‌మ‌యం చూసుకుని ఆమెకు స‌ముచిత స్థానాన్ని క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా స్ప‌ష్టం చేశారు. థంబింగ్ మెజారిటీ రావ‌డం, జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగి పోయాయి. పార్టీ కోసం ప‌నిచేశారు. తాను ఎక్క‌డా త‌గ్గ‌లేదు. చంద్ర‌బాబును ఆయ‌న ప‌రివారాన్ని, చివ‌ర‌కు ఆయ‌న కొడుకు లోకేష్ ను అడుగ‌డుగునా నిల‌దీశారు.  ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే వుంటూ నిజ‌మైన ప్ర‌జా నాయ‌కురాలిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా నుంచి ఆమె శాస‌న‌స‌భ్యురాలిగా ఎన్నిక‌య్యారు. బై బై బాబు అంటూ నిప్పులు చెరిగారు. ఏపీని ...

బెంగాల్‌కు కాయ‌క‌ల్ప చికిత్స - ప్ర‌శాంత్ కిషోర్‌తో దీదీ దోస్తీ

చిత్రం
సుదీర్ఘ రాజ‌కీయ అనుభవానికి చెక్ పెట్టి..వ్య‌క్తిగా ప్ర‌వేశించి..బెబ్బులిలా గాండ్రించి..త‌న‌కంటూ ఓ స్టైల్‌ను ..ఇమేజ్ ను..బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుని..రాజ‌కీయ ర‌ణ‌రంగంలో కాక‌లు తీరిన యోధుల‌ను మ‌ట్టిక‌రిపించి ..వామ‌ప‌క్ష‌పు సామ్రాజ్యపు గోడ‌ల‌ను కూల్చి వేసిన ఘ‌న‌త మ‌మ‌తా బెన‌ర్జీది. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌డ‌మే కాకుండా తానే ఓ రికార్డు న‌మోదు చేసింది. ఆమె ఎవ్వ‌రికీ లొంగ‌దు..ఇంకెవ్వ‌రినీ త‌న దరిదాపుల్లోకి రానివ్వ‌దు. ఏ ఒక్క‌రితో పూర్తి చెలిమి అంటూ చేయ‌దు. ఆమె నైజ‌మే అంత‌. దీనిపై ప్ర‌శ్నిస్తే..ఆమె న‌వ్వేస్తారు. మౌనంగా వుండి పోతారు. న‌న్ను ఓ కోల్‌క‌తా అప‌ర‌కాళినంటూ అంటూ వుంటారు. నేను మ‌నిషిని. కాక‌పోతే మిగ‌తా వారికంటే ప‌ట్టుద‌ల ఎక్కువ‌. అంతే ..అంత‌కు త‌ప్పించి నా వ‌ద్ద ఏ ఆయుధ‌మూ లేదు..మ‌రే శ‌క్తి లేదంటారు ఆమె. మొద‌టి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉన్నా. వారి కోస‌మే ప‌ని చేస్తున్నా. పార‌ద‌ర్శ‌క‌త పాల‌న అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టా. కొంద‌రికి రుచించ‌క పోవ‌చ్చు. కేంద్రం రాష్ట్రాల మీద ఆధార‌ప‌డి ఉంది. కానీ రాష్ట్రాలు కేంద్రం మీద ఆధార‌ప‌డ‌డం లేద‌న్న విష‌యం తెలుసు కోవాలి. అందుకే నేను మోదీ...

ఓగోకు అల్టేరియా బిగ్ ఆఫ‌ర్

చిత్రం
భార‌త‌దేశంలోని అంకురాల‌కు ఊహించ‌ని ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్నాయి. బెంగ‌ళూరు స్టార్ట‌ప్ గా ప్రారంభ‌మైన ఓగోకు అల్టేరియా కేపిట‌ల్ బిగ్ ఆఫ‌ర్ ల‌భించింది. ఈ స్టార్ట‌ప్ విశేషం ఏమిటంటే ..టూ వీల‌ర్స్ ను రెంట్‌కు ఇస్తుంది. దాని ద్వారా వ‌చ్చే ఆదాయంతో వంద‌లాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. ఊహించ‌ని రీతిలో ఈ ఐడియాకు స్పంద‌న రావ‌డంతో దేశ వ్యాప్తంగా విస్త‌రించే ఆలోచ‌న‌లో ఉన్నారు ఓగో నిర్వాహ‌కులు. అల్టేరియా కేపిట‌ల్ కంపెనీ 800 కోట్లు పెట్టుబ‌డి పెట్టాల‌ని ఒప్పందం చేసుకుంది. ఇది ఒక‌ర‌కంగా బంప‌ర్ ఆఫ‌ర్‌. ఒప్పందంలో భాగంగా మొద‌టి విడ‌త‌గా 25 కోట్లు రిలీజ్ చేసింది ఆల్టేరియా. ఓగో మొద‌టిగా బెంగ‌ళూరులో బైక్‌ల‌ను అద్దెకు ఇవ్వ‌డం ప్రారంభించింది. ఓలా, ఊబెర్ కంపెనీలు రెంట్‌కు కార్లు ఇచ్చే ఐడియాకు భారీ స్పంద‌నతో పాటు లెక్క‌లేనంత ఆదాయం ల‌భిస్తోంది. ఇందులో భాగంగా వ‌చ్చిన ఐడియాతో బైక్‌ల‌ను రెంట్‌కు ఇచ్చేలా ప్లాన్ చేసింది. ఇది బాగా వ‌ర్క‌వుట్ అయింది. అంచ‌నాకు మించి ఆదాయం స‌మ‌కూర‌డంతో ..ఓగో ఇండియాలో పాపుల‌ర్ స్టార్ట‌ప్‌గా నిలిచింది. 12,000 వేల వెహికిల్స్‌తో దేశంలోని 5 న‌గ‌రాల‌లో ఓగో  కార్య‌క‌లాపాలు నిర...

తీరుమార‌ని ఐసీసీ - బ‌లిదాన్‌పై రాద్ధాంతం - వ్య‌క్తి కంటే దేశ‌మే మిన్న‌

చిత్రం
ప్ర‌పంచాన్ని శాసించాల‌ని క‌ల‌లు కంటున్న అమెరికా లాగానే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ త‌న పెత్త‌నం ఉండాల‌ని, తన అదుపులోనే అన్ని దేశాల జ‌ట్లు న‌డ‌వాల‌ని కోరుకొంటోంది. ఎక్క‌డ‌లేని నియ‌మ నిబంధ‌న‌లు జ‌త చేస్తూ ఆట‌గాళ్ల‌తో ఆటాడుకుంటోంది. ఇప్ప‌టికే అత్య‌ధికంగా ఆదాయం క‌లిగిన క్రికెట్ బోర్డుల‌లో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు మొద‌టి స్థానంలో ఉంది. ఇండియా అంటేనే క్రికెట్ ..క్రికెట్ అంటేనే భార‌త్ ..ఇపుడిది నినాదం కాదు..సామాజిక వాస్త‌వం. ఎన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు వున్న‌ప్ప‌టికీ క్రికెట్ మ్యాచ్ అంటేనే ఒక్క‌ట‌వుతారు. త‌మ జాతి అభిమానాన్ని చాటుకుంటారు. అంత‌లా జ‌నంలో మ‌మేక‌మై పోయింది ఈ ఆట‌. ఇక్క‌డ ఆట‌గాళ్ల‌ను దేవుళ్ల‌కంటే ఎక్కువ‌గా కొలుస్తారు. ఎక్క‌డ‌లేనంత‌టి డిమాండ్ వీరికి ఉంది.  ఇదే ఇపుడు హాట్ టాపిక్. ప్ర‌తి సారి ఐసీసీ బీసీసీఐ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని చూడ‌టం, ఇండియా ఆడే మ్యాచ్‌ల‌ప్పుడు ఏవో కొర్రీలు వేయ‌డం ప‌రిపాటిగా మారింది. ఈ విష‌యంపై బీసీసీఐ , పాల‌క‌వ‌ర్గం గ‌ట్టిగానే స‌మాధానం చెప్పింది. ఐసీసీ ఆదాయంలో అధిక శాతం ఇండియాదే. తాజాగా ఐసీసీ వార్త‌ల్లోకి ఎక్కింది. ప్ర‌స్తుతం ప్ర‌...

కులాల వారీగా కూర్పు..ఎట్ట‌కేల‌కు ఏపీ కేబినెట్ ఫైన‌ల్

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో థంబింగ్ మెజారిటీతో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం ..దాని అధినేత‌, తాజా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న జ‌ట్టుకు తుది రూపం ఇచ్చారు. కులాల వారీగా ప్రాధాన్య‌త క‌ల్పిస్తూ ..స‌మ‌ప్రాధాన్య‌త ఇచ్చారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. అంతేకాకుండా స‌మ న్యాయం, స‌మ తూకం వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. మొద‌టి నుంచి త‌న వెంట వుండి, పార్టీని న‌మ్ముకుని , పార్టీ కోసం ప‌నిచేసిన వారికి ప్ర‌యారిటీ ఇచ్చారు. ఏడుగురు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కేబినెట్‌లో చోటు వుండేలా చేశారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఐదుగురికి ఛాన్స్ ఇవ్వ‌గా వీరిలో మాదిగ కులానికి 2, మాల కులానికి 3 బెర్త్‌లు క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.  ఇక మిగ‌తా కులాల‌కు సంబంధించి చూస్తే కాపు, రెడ్డి వ‌ర్గాల‌కు నాలుగు చొప్పున ఇచ్చారు. వైశ్య‌, క్ష‌త్రియ‌, క‌మ్మ‌, మైనార్టీ వ‌ర్గాల‌కు ఒక్కో మంత్రి ప‌ద‌వి కేటాయించారు. జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడే , త్వ‌ర‌లో మంత్రివ‌ర్గం ప్ర‌క‌టిస్తాన‌ని, త‌న‌ను న‌మ్ముకున్న ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక ర‌కంగా అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ ...