పోస్ట్‌లు

మే 12, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

యుకె సంప‌న్నుల్లో మ‌నోళ్లే టాప్ - రిచెస్ట్ లిస్ట్ ప్ర‌క‌టించిన సండే టైమ్స్

చిత్రం
యుకెలో అత్యంత సంప‌న్న‌మైన వ్య‌క్తులుగా భార‌త్‌కు చెందిన హిందూజా సోద‌రులు ప్ర‌థ‌మ స్థానంలో నిలిచారు. సండే టైమ్స్ తాజాగా రిచెస్ట్ పీపుల్స్ జాబితాను లండ‌న్‌లో ప్ర‌క‌టించింది. గ‌త ఏడాదితో పోలిస్తే శ్రీ‌, గోపి హిందూజాల సంప‌ద 1.356 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగి 22 డాల‌ర్ల‌కు చేరుకుంది. గ‌త ఏడాది ప్ర‌క‌టించిన జాబితాలో మొద‌టి స్థానంలో జిమ్ రాట్ క్లిఫ్ ఈసారి మూడో స్థానానికి ప‌డిపోయారు. జాబితాలో మొద‌టి న‌ల్ల జాతి మ‌హిళ‌గా మోర‌న్ నిలిచారు. 1914లో హిందూజా సోద‌రులు ముంబైలో వ్యాపారాన్ని ప్రారంభించారు. చ‌ముము, గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ, స్థిరాస్థి త‌దిత‌ర రంగాల్లో భారీగా పెట్టుబ‌డులు పెట్టారు..వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నారు. అవి భారీగా ఆదాయాన్ని స‌మ‌కూర్చి పెడుతున్నాయి. న‌లుగురు సోద‌రుల్లో శ్రీ‌, గోపిలు మాత్ర‌మే బిజినెస్ రంగాన్ని చూసుకుంటున్నారు. మిగ‌తా ఇద్ద‌రు సోద‌రులు దీనికి దూరంగా ఉన్నారు. గ‌తంలో 2014, 2017 ల‌లో ప్ర‌క‌టించిన జాబితాల్లో హిందూజాలు స్థానం సంపాదించారు. యూర‌ప్‌లోని వివిధ ప్రాంతాల‌కు చెందిన 1000 మంది సంప‌న్నుల‌ను విశ్లేషించారు. ఫైన‌ల్‌గా ఈ జాబితాను ప్ర‌క‌టించారు.ప్ర‌స్తుతం వెల్ల‌డ...

అంతిమ పోరులో ముంబైదే విజ‌యం - చ‌తికిల‌ప‌డిన చెన్నై కింగ్స్

చిత్రం
ఎట్ట‌కేల‌కు ఐపీఎల్ -12 పోరు ముగిసింది. ఉత్కంఠ‌కు తెర ప‌డింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టు ధోని సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టును ఒక్క ప‌రుగు తేడాతో గెలుపొందింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. దేశ‌మంత‌టా హైద‌రాబాద్ వైపు చూసింది. కోట్లాది మంది భార‌తీయులు ఊపిరి బిగ‌ప‌ట్టి ఫైనల్ పోరాటాన్ని చూశారు. ప్ర‌తి ఫార్మాట్‌లోను ముంబై జ‌ట్టు చెన్నైపై ఆధిప‌త్యం సాధించింది. భావోద్వేగాలు పెరిగి..ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో తెలియ‌క క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ‌కు లోన‌య్యారు. నువ్వా నేనా అన్న రీతిలో ఫైన‌ల్ జ‌రిగింది. ఆఖ‌రు బంతి వ‌ర‌కు ఎవ‌రిని విజ‌యం వ‌రిస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. బుమ్రా, రాహుల్ చాహ‌ర్‌లు అద్భుత‌మైన రీతిలో బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. వాట్స‌న్ ఒక్క‌డే మెరుపులు మెరిపించినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు. ముంబై జ‌ట్టు 2013, 2015, 2017ల‌లో విజేత‌గా నిలువ‌గా 2019లో తిరిగి గెలుపొందింది. ఐపీఎల్‌లో అత్య‌ధిక టైటిళ్లు గెలిచిన జ‌ట్టుగా రికార్డు స్వంతం చేసుకుంది. 2017లో ఇదే ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగ...

టాప్ ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్ ఇవే

చిత్రం
ఇండియాలో ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో విమాన‌యాన సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. 2018-2019 సంవ‌త్స‌రానికి గాను టాప్ లో 11 ఎయిర్‌లైన్స్‌లు నిలిచాయి. టికెట్ల బుకింగ్, ఆఫ‌ర్స్‌, డిస్కంట్స్ , ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా వారు కోరుకున్న గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డంతో పాటు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంలో ముందంజ‌లో ఉంటున్నాయి. ఆయా సంస్థ‌లు న‌డిపే విమానాల‌కు అనువుగా ఉండేలా దేశ‌మంత‌టా ఎయిర్ పోర్ట్స్‌ను కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి అభివృద్ధి ప‌రుస్తున్నారు. ప్ర‌పంచంలోనే హైద‌రాబాద్‌లోని జిఎంఆర్ విమానాశ్ర‌యానికి మంచి పేరుంది. దేశీయ ప్ర‌యాణికుల‌తో పాటు విదేశీ టూరిస్టులు కూడా హైద‌రాబాద్‌ను సంద‌ర్శించేందుకు ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ స‌ర్కార్ కొలువు తీరిన‌ప్ప‌టి నుంచి ట్రావెల్ అండ్ టూరిజం ప్యాకేజీల‌ను ఏర్పాటు చేసింది. విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన‌ప్ప‌టి నుంచి క్యాబ్స్ ఏర్పాటు, హోట‌ళ్ల‌లో దించ‌డం, ఆహారం అందేలా చూడ‌టం, వారు కోరుకున్న సంద‌ర్శ‌న స్థ‌లాల‌ను చూయించ‌డం, వాటి చ‌రిత్ర‌ను గైడ్స్ ద్వారా వివ‌రిస్తున్నారు. దీంతో ట్రావెల‌ర్స్ ఈ సిటీ ప‌ట్ల ఎక్కువ మ‌క్...

జాక్ పాట్ కొట్టేసిన రెంటోమోజో

చిత్రం
ల‌క్ ఎవ‌రిని ఎప్పుడు ప‌ల‌క‌రిస్తుందో ఎవ‌రికెరుక‌. అలాంటి భారీ ఆఫ‌ర్‌ను స్వంతం చేసుకుంటే ఎలా వుంటుందో త‌లుచుకుంటేనే వ‌ళ్లు జ‌ల‌ద‌రించింది. అదృష్టం ప‌ల‌క‌రించాలే కానీ కోట్లు వాలిపోతాయి. మంద‌గించిన బిజినెస్ జోరందుకుంటుంది. ఆదాయం స‌మ‌కూరుతుంది. రూపాయ‌లు వాలిపోతాయి. డాల‌ర్ల పంట పండుతుంది. ఖ‌లేజా ఉండాలే కానీ ..ప్రారంభించ‌డ‌మే కావాల్సింద‌ల్లా. గీతాంశు 2014లో బెంగళూరు కేంద్రంగా రెంటో మోజో స్టార్ట‌ప్‌ను స్టార్ట్ చేశారు. ఈ అంకుర సంస్థ అద్దెకు ఫ‌ర్నీచ‌ర్ అంద‌జేస్తుంది. కొనుగోలు చేయాల్సిన ప‌నిలేదు. పాడై పోతుందున్న బెంగ లేదు. వాటిని మోసుకు వెళ్లాల్సిన బాధంటూ ఉండ‌దు. ఎంచ‌క్కా మ‌న‌కు అవ‌స‌రం అనిపిస్తే ..రెంటో మోజో యాప్ ను డౌన్లోడ్ చేసుకోవ‌డ‌మే. కావాల్సిన వ‌స్తువుల‌న్నీ అందుబాటులో ఉంటాయి. ఇల్లు, ఆఫీస్, రెస్టారెంట్స్, హోట‌ల్స్ , కంపెనీలు, చిన్న చిన్న బిజినెస్ కేంద్రాలు, స్పాట్స్..ఇలా ప్ర‌తి దానికి ఫ‌ర్నీచ‌ర్ అవ‌స‌ర‌మే. వీళ్లు కొత్త రకంగా ఆలోచించారు. కొన్ని రోజులుండే ఫ‌ర్నీచ‌ర్ కోసం ఎందుకు ఖ‌ర్చు చేయాలి డ‌బ్బుల్ని. కార్లున్నాయి. అవ‌స‌రానికి అద్దెకు దొరుకుతున్నాయి. ఆటోలు, మోటారు బైక్‌లు, వాహ...