పోస్ట్‌లు

డిసెంబర్ 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మహీంద్రాకు ఆనంద్ గుడ్ బై

చిత్రం
ఇండియాలో అత్యంత సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మిగతా కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్లు అంతా తమ వ్యాపారాలను ఎలా పెంచు కోవాలో చూస్తూ ఉంటే మహీంద్రా ఎండీ అండ్ చైర్మన్ ఆనంద్ మాత్రం సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. అంతే కాకుండా స్ఫూర్తి దాయకంగా ఉండే వాళ్లకు మహీంద్రా ఆర్ధిక తోడ్పాటు అందజేస్తున్నారు. ఇదే సమయంలో ఉన్నత వ్యాపార విలువలను పెంపొందిస్తూ కంపెనీని లాభదాయక బాటలో ఉండేలా తీర్చి దిద్దారు. దీంతో భారత దేశంలో ఆనంద్ టాప్ పొజిషన్ లో నిలిచారు. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ మేనేజ్‌‌మెంట్‌‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌గా ఉన్న ఆనంద్ర మహీంద్రా వైదొలుగుతున్నారు. ఆయనను కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌గా నియమించింది. ఈయన బాధ్యతలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతున్నాయి. పవన్ కుమార్ గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌గా మళ్లీ అపాయింట్ చేస్తూ.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్ప జెప్పింది. సీఈవో బాధ్యతలను త్వరలో చేపడతారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్స్‌‌ను అమలు చేయడమే లక్ష్యంగా సీఈవో పొజిషన్‌‌ను కంపెనీ క్రియేట్ చేసిం...

కొత్త దారులతోనే బలపడగలం

చిత్రం
పడిపోయిన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, గ్రోత్‌‌కు సపోర్ట్ ఇచ్చేలా షార్ట్ టర్మ్‌‌లో పబ్లిక్ స్పెండింగ్‌‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత పెంచవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. ఎక్కువ మొత్తంలో వెచ్చింపు కోసం ప్రభుత్వం కొత్త రెవెన్యూ మార్గాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 92వ యాన్యువల్ కన్వెన్షన్‌‌లో గీతా గోపినాథ్ మాట్లాడారు. ప్రైవేట్‌‌ రంగం డిమాండ్‌‌లో తీవ్ర స్లోడౌన్‌‌ ఉందని, ఇన్వెస్ట్‌‌మెంట్లు కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పారు. ఇండియా తన వాణిజ్య లోటును టార్గెట్‌‌ పరిధిలో ఉంచు కోవాలని సూచించారు. దీని కోసం ఖర్చులను రేషనలైజేషన్ చేయడం, రెవెన్యూలను పెంచు కోవడం చేయాలని గీత స్పష్టం చేశారు. ఒకవేళ పెట్టుబడులు అలానే బలహీనంగా ఉంటే, గ్రోత్‌‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత దేశానికి వాణిజ్య టార్గెట్ విషయంలో స్థిరత్వం ఎంతో అవసరమని ఆమె చెప్పారు. 2019 పూర్తి బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి, 2019–20వ ఆర్థిక సంవత్సర వాణిజ్య లోటు టార్గెట్‌‌ను 3.4 నుంచి 3.3 శాతానికి కుదించా...

అంకురాలకు ఆలంబన

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరంగా సపోర్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీ - హబ్ ను ఏర్పాటు చేసింది. మహిళలు ఆంట్రప్రెన్యూర్ గా ఎదిగేందుకు కావాల్సిన సహకారం అందిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా వీ హబ్‌‌ స్టార్టప్​ ఇండియా, డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్ ప్రమోషన్‌‌ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ లతో కలిసి విమెన్‌‌ రైజింగ్ టుగెదర్ ప్రోగ్రామ్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దేశంలో ఏడాదికి 7,500 మంది విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో వింగ్ ప్రోగ్రామ్‌‌ వీ హబ్, కేరళ స్టార్టప్ మిషన్ సహకారంతో నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్‌‌ ద్వారా ఇంక్యుబేషన్‌‌ను, ఇన్వెస్టర్లను పొందడంలో విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సహాయం అందిస్తారు. వీటితోపాటు వారి బిజినెస్‌‌కు మద్దతిస్తారు. 2017 లో హైదరాబాద్‌‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తర్వాత వీ హబ్‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్న ఏడాదిన్నర లోనే వీ హబ్‌‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సహాయం అందజేస్తోంది. విమెన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు...

భాగ్యనగరమే బెటర్

చిత్రం
ఇండియాలో అన్ని ప్రాంతాల కంటే మన భాగ్యనగరమే బెటర్ అంటున్నారు పలువురు వ్యాపారవేత్తలు. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, తదిర రంగాల కంపెనీలన్నీ ఈ సిటీనే ఎంచుకుంటున్నాయి. ఓ వైపు దేశం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటోంది. ఇంకో వైపు వ్యాపార, వాణిజ్య, ఆటోమొబైల్ రంగాలన్నీ తీవ్ర ఒడిడుకులు లోనవుతున్నాయి. ఆర్ధిక మంద గమనం దెబ్బకు వ్యాపారవేత్తలు లబోదిబోమంటున్నారు. ఎకనామిక్ స్లో డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంటే హైదరాబాద్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏటా ప్రాపర్టీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2019– 2020 ఆర్థిక సంవత్సరంలో మన సిటీలో ప్రాపర్టీ రేట్లు 17 శాతం మేర పెరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి  నుంచి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తూనే ఉంది. రెసిడెన్షియల్ తోపాటు కమర్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. హైదరాబాద్ లో కమర్షియల్ లీజింగ్ 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల నుంచి 90 లక్షల చదరపు అడుగుల వరకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మెరుగు పడటం, వర్కింగ్ ప్రొఫెషనల్...

దివాలాకు లైన్ క్లియర్

చిత్రం
భారతీయ విమానయాన రంగం తీవ్ర ఒడిడుకులు లోనవుతోంది. జెట్‌ ఎయిర్‌ వేస్‌ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌ వేస్‌ రుణ దాతల కమిటీ దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు కార్పొరేట్‌ దివాలా పరిష్కార గడువు ముగిసింది. అయితే ఈ గడువును పొడిగిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్‌ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం. ముంబై కేంద్రంగా జెట్ ఎయిర్ వేస్ పనిచేస్తోంది. ఇండియాలో ఇండిగో ఎయిర్ లైన్స్ తర్వాత రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా జెట్ గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపిస్తోంది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరులో ఉన్నాయి. జెట్ ఎయిర్ వేస్ 1992 ఏప్ర...

పౌర సమాజం ధర్మాగ్రహం

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. దేశమంతటా వివిధ వర్గాలకు చెందిన పౌరులు, ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు నటీ నటులు సైతం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేశం ప్రస్తుతం అగ్ని గుండంగా మారింది. వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఆందోళనలతో అట్టుడికింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. బిజ్నోర్‌లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్‌, కాన్పూరు లో ఒక్కరు చొప్పున చనిపోయారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి. ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్‌పూర్‌ నుంచి బులంద్‌షహర్‌ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఢిల్లీలో జాతీయ పతాకం చేత పట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్...

వికేంద్రీకరణతోనే పురోభివృద్ధి

చిత్రం
పాలనా పరంగా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని జీఎన్‌ రావు కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ మెంట్ జరిగేలా చూడాలని కోరింది. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌  ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్‌ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది....

అంతిమ తీర్పు కోసం ఎదురు చూపు

చిత్రం
దిశ దారుణ హత్య కేసు దేశాన్ని, ప్రపంచాన్ని ఇండియా వైపు చూసేలా చేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పు ఏం చెప్పా బోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా తమకూ ప్రతిష్టాత్మక మైనదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై ఏమౌతుందోనని యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోందని పేర్కొంది. ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలు ఉన్నందునే రీ పోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని, దీనిపై ప్రభుత్వం కూడా ముందుకొచ్చి పారదర్శకతను చాటు కోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాల వ్యవహారంపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పై కోర్టు ఆదేశాలను  అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పింది. మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చు కోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనే పిల్‌ పై ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. వ...

సరి లేరుకు సైరా

చిత్రం
తెలుగు సినిమాలో అరుదైన సన్నివేశం చోటు చేసుకోబోతోంది. అదేమిటంటే సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి చిరంజీవి రాబోతున్నారు. అనిల్ రావి పూడి డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రావాలని కోరుతూ చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించింది. ఇందు కోసం చిరు కూడా అంగీకరించినట్లు స్వయంగా ప్రిన్స్ ట్వీట్ కూడా చేశాడు. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా కొనసాగిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, సాంగ్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కొత్త ఏడాదిలో పండుగ వేళ విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని భావిస్తోంది. దీని కోసం భారీ ఏర్పాట్లు చేయాలని, టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర హీరోను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా ఈ ఈవెంట్‌ అప్‌డేట్‌ కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌క...

చట్టాల అమలులో రాష్ట్రాలే కీలకం

చిత్రం
ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏది మాట్లాడినా అదో సంచలనం. క్షణాల్లోపే ఆ విషయం వైరల్ అవుతోంది. తాజాగా సిటిజన్ షిప్ అంశంపై దేశమంతటా నిరసనలు, ఆందోళననలు చెలరేగుతున్నాయి. సెలబ్రెటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నటుడు సిద్దార్థ్ పై కేసు కూడా నమోదైంది. కేంద్రం ఏ చట్టం చేసినా రాష్ట్రాల సహకారం లేనిదే అమలు సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ మరోసారి తేల్చి చెప్పారు. ఆయన సీఏఏ, ఎన్నార్సీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్‌ జరగక ముందే నా అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించా. సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించేవాళ్లంతా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుతున్నా. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. ఈ రాష్ట్రాల్లో దేశ జనాభా 65 శాతం ఉంది. గత లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినా ఓట్ల శాతం చూసుకుంటే వారికి వచ్చిన ఓట్లు 39 శాతమే. అంటే బీజేపీని దేశంలో 61  శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా రనేగా అర్థం. మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామ...

ధర పలికిన ఆటగాళ్లు వీళ్ళే

చిత్రం
ఐపీఎల్ వేలం ఈసారి స్పెషల్ గా కొనసాగింది. అందరూ విస్తు పోయేలా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమ్మిన్స్ అత్యధికంగా వేలంపాటలో అమ్ముడు పోయాడు. పలువురు బరిలో ఉన్నా ఈసారి మాత్రం ఫ్రాంచైజీలు పెర్ఫార్మెన్స్ ఆధారంగానే తీసుకున్నారు. అయితే కొన్ని చిత్రాలు చోటు చేసుకున్నాయి. అనుకున్న ఆటగాళ్లు ఎంపిక కాలేదు. ఇక ఫ్రాంచైజీల వారీగా చూస్తే ..చెన్నై సూపర్ కింగ్స్ పీయూష్ చావ్లా ను 6.75 కోట్లకు దక్కించుకుంది. 5.5 కోట్లకు శ్యాం కరన్, 2 కోట్లకు హాజల్ వుడ్ , 20 లక్షలకు సాయి కిషోర్ ను తీసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ హెట్ మైర్ ను 7 కోట్ల 75 లక్షలకు వేలం పాటలో దక్కించుకుంది. స్టొయినిస్‌ 4.8 కోట్లు పలకగా, అలెక్స్ క్యారీ 2.4 కోట్లు, జేసన్‌ రాయ్‌ 1.5 , క్రిస్‌ వోక్స్‌ 1.5 కోట్లు పలికారు. ఇక మోహిత్‌ శర్మ ను 50 లక్షలకు, తుషార్‌ దేశ్‌పాండేను 20 లక్షలు, లలిత్‌ యాదవ్‌ 20 లక్షలు వేలంలో దక్కించుకుంది. మరో వైపు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అత్యధికంగా మ్యాక్స్‌వెల్‌  ను ఏకంగా 10.75 కోట్లకు చేజిక్కించుకుంది. కాట్రెల్‌ 8.5 కోట్లు, క్రిస్‌ జోర్డాన్‌ 3.0 కోట్లు, రవి బిష్ణోయ్‌ 2.0 కోట్లు, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ 55 లక్షలు, దీపక్‌...

ముగిసిన వేలం..ఆటగాళ్ల ఆనందం

చిత్రం
అదృష్టం అంటే ఇదేనేమో. ఇండియాలో క్రికెట్ ఆటకున్నంత క్రేజ్ ఇంకే ఆటకు, ఆటగాళ్లకు లేదు. వీళ్ళ కోసం కోట్లల్లో ఫ్యాన్స్ కొట్టుకుంటారు..ప్రేమిస్తారు. ఇంతటి పిచ్చి ఇంకే ఆటకు లేదు. వరల్డ్ వైడ్ గా ఫుట్ బాల, బ్యాడ్మింటన్ , టెన్నిస్ క్రీడలు దుమ్ము రేపుతుంటే క్రికెట్ మాత్రం ప్రత్యేకంగా తన హవాను కొనసాగిస్తోంది. ఎంతలా అంటే విడిచి ఉండలేనంత. ఇక క్రికెటర్లు కరోడ్ పతులవుతున్నారు. ఒక్క రోజులోనే మోస్ట్ పాపులర్ అయిపోతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్రికెటర్ల లక్ వరించింది. ఐపీఎల్‌ - 2020 సీజన్‌కు సంబంధించి వేలం ముగిసింది. ఈసారి కోల్‌కతా వేదికగా జరిగిన వేలంలో పలువురు క్రికెటర్లకు ఊహించని ధరలు దక్కగా, చాలా మంది స్టార్‌ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ఊహించినట్లు గానే ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడు పోయారు. కమ్మిన్స్‌15 కోట్లకు పైగా అమ్ముడు పోగా, మ్యాక్స్‌ వెల్‌ 10.5 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. భారత యువ క్రికెటర్లలో ముందుగా ఊహించినట్లు గానే యశస్వి జైస్వాల్‌, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్‌ వేలంలో పంట పండింది. భారత ఆండర్‌ -19 క్రికెటర్లైన జైస్వా...

ఫోర్బ్స్‌ లిస్టులో మనోడే టాప్

చిత్రం
ఇప్పటికే ప్రపంచ క్రికెట్ రంగంలో తనకంటూ ఓ రేంజ్ ఏర్పాటు చేసుకున్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. పరుగుల వరద పారిస్తూనే వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ ఆటగాడిగా పేరొందాడు. విరాట్‌ కోహ్లి కేవలం క్రికెట్లోనే కాదు ఇదివరకే సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోవర్ల పరంగా దూసుకెళ్లాడు. ఇప్పుడు ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రిటీల జాబితా లోనూ టాప్‌ లేపాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న ఈ రన్‌ మెషిన్‌ తాజాగా భారత టాప్‌ –100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌ వన్‌గా నిలిచాడు. మొత్తం 252.72 కోట్ల ఆర్జనతో అతనికి మొదటి స్థానం దక్కింది. అయితే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఫోర్బ్స్‌ జాబితా ర్యాంకుల్ని కేవలం ఆదాయం తోనే గణించరు. ఆ లెక్కన చూస్తే అక్షయ్‌ టాప్‌ లేపే వాడు. కానీ ఫోర్బ్స్‌ లెక్కకు ఇతర కోణాలు ప్రాతిపదిక అవుతాయి. ఆదాయంతో పాటు, పేరు ప్రఖ్యాతులు, ప్రసార మాధ్యమాల్లోని క్రేజ్, సామాజిక సైట్లలో అనుసరిస్తున్న వారి సంఖ్య  లాంటి అంశాలను బట్టి ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. గతేడాది అక్టోబర్‌ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఈ అంశాలను ల...