పోస్ట్‌లు

నవంబర్ 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అందరి చూపు ఈడెన్ వైపు

చిత్రం
ప్రపంచంలోనే అత్యున్నతమైన క్రికెట్ ఆటకు వేదికైన ఈడెన్ గార్డెన్స్ మరో చరిత్రకు నాంది పలకబోతోంది. గులాబీ గుబాళింపులన్నీ సిటీ ఆఫ్‌ జాయ్‌ లోనే కనిపిస్తున్నాయి. కోల్‌కతాలో ఎక్కడ చూసినా ఇప్పుడు పింక్‌ టెస్టు పలుకులే. క్రికెట్‌ను ప్రేమించే చారిత్రక నగరానికి ఇప్పుడు కొత్త శోభ చేకూరింది. తొలిసారి జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టును విజయవంతం చేసేందుకు కోల్‌కతా వాసులంతా ప్రయత్నం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పింక్‌ టెస్టును సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు, చిరస్మరణీయంగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లూ చేశాడు. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌కు పలు ఆకర్షణలు తోడవుతున్నాయి. గతంలో భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం ఈ సారి కూడా ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉండటం కూడా వారికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆతిథ్యం అద్భుతంగా ఉండేందుకు ‘క్యాబ్‌’ అన్ని ఏర్పాట్లు చేసింది. స్వయంగా గంగూలీనే అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. టెస్టు మ్యాచ్‌ సందర్భంగా చేయబోయే ప్రత్యేక కార్యక్రమాల గురించి వెల్లడించారు. బంగ్లాదేశ్‌...

మేఘా సక్సెస్..ఫోర్బ్స్ లో పబ్లిష్

చిత్రం
ఇండియాలో బిగ్గెస్ట్ నిర్మాణ కంపెనీగా ఇప్పటికే పేరొందిన ఎంఈఐఎల్‌ మరో చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజిన్ కలెక్టర్స్‌ ఎడిషన్‌ 2019లో మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్‌ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్‌ జాబితా విడుదల చేసింది. 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేఘా బిల్డర్‌ పేరుతో ఫోర్బ్స్‌ స్టోరీ ప్రచురించింది. పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది.14 బిలియన్‌ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే జోర్డాన్...

ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ క్లోజ్

చిత్రం
భారతీయ ఆర్ధిక రంగం ఎన్నడూ లేని రీతిలో కుదుపునకు లోనవుతోంది. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన పేమెంట్స్ బ్యాంకులన్నీ ఇప్పుడు మోడీ తీసుకున్న నోట్ల రద్దు దెబ్బకు దివాళా అంచున నిలబడ్డాయి. ఇప్పటికే కొన్ని పేమెంట్స్ బ్యాంకులు తీవ్ర నష్టాలతో ఒడిడుకులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా మరో పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేతకు సిద్ధమైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌కు తాజాగా ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్‌ ఈ ఏడాది సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్‌ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్‌ నియమించిందని వివరించింది. అయ్యర్‌ డెలాయిట్‌ టచ్‌ తొమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలో సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించ లేమని, స్వచ్ఛంద మూసివేతను జూలై లోనే ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 2015 ఆగస్టులో ఆర్‌బీఐ మొత్త...

దిగ్గజ కంపెనీలకు రియల్ మి షాక్

చిత్రం
స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో చైనాకు చెందిన కంపెనీలే తమ హవాను కొనసాగిస్తున్నాయి. వరల్డ్ మార్కెట్ లో ఇప్పటికే షావో మి ఏకంగా ఐదో ప్లేస్ కు చేరుకుంది. దిగ్గజ యాపిల్, శాంసంగ్ కంపెనీలను దాటుకుని ఇండియన్ మార్కెట్ ను రెడ్ మి శాసిస్తోంది. ఇప్పటికే 10 లక్షల మొబైల్స్ అమ్మి రికార్డు బ్రేక్ చేసింది. లెనోవా, మోటరోలా, వివో , షావోమి , రియల్ మి మొబైల్స్ కంపెనీలన్నీ ఇప్పుడు చైనాకు చెందినవే. తాజాగా శాంసంగ్ మడత ఫోన్ ను లంచ్ చేసింది చైనాలో. దీని ధర లక్షా 75 వీలుగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోటరోలా కంపెనీ సైతం 5 జీ స్మార్ట్ ఫోన్ ను ప్రదర్శనలో ఉంచింది. మరో వైపు మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు రియల్ మి అద్భుతమైన ఫీచర్స్ తో కొత్తగా పలు మోడల్స్ తో రిలీజ్ చేసింది. తాజాగా రియల్‌ మి..ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్లస్‌ చిప్‌ అమర్చిన ఈ మోడల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుండగా 8జీబీ,128జీబీ ధర 29,999 వద్ద నిర్ణయించింది.12జీబీ, 256జీబీ వేరియంట్‌ ధర 33,999. వీటిలో 64 మెగా పిక్సెల్‌ క్వాడ్‌ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ స్మా...

బస్సులు నడిచేనా..కష్టాలు తీరేనా

చిత్రం
షరతులు విధించ కుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయో లేదోనన్న ఆందోళన ప్రయాణీకుల్లో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 46 రోజుల పాటు సమ్మె కొనసాగింది. ఈ సమ్మెను ప్రభుత్వం మొదటి నుంచి చట్ట విరుద్ధంగానే భావిస్తోంది. కార్మికులపై అనేక ఆంక్షలు విధించింది. విధుల్లో చేరేందుకు రెండు సార్లు గడువు విధించింది. కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మెను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభించ కుండానే తమంతట తాముగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని అన్ని డిపోల్లో డ్రైవర్లు,కండక్టర్లతో సహా సిబ్బంది విధుల్లో చేరే అవకాశాలు వున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకుంటుందా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రెండు సార్లు విధించిన గడువుల్లో కొందరు విధుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గడువు తరువాత వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు నిర...

సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్

చిత్రం
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్ లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌  లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్‌ ముందుకే దూసుకు పోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను తాకిన సెన్సెక్స్‌ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు 2 పాయింట్లు తక్కువ. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌కు ఒక పాయింట్‌ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరి పెట్టుకుంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 346 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్‌ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్...

సర్కారుదే ఆలశ్యం..సమ్మె విరమణకు సిద్ధం

చిత్రం
అలుపెరుగకుండా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ముగింపు దశకు చేరుకుంది. ఎలాంటి షరతులు విధించ కుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. సమ్మె వ్యవహారాన్ని కార్మిక న్యాయ స్థానమే తేల్చాలని, దీనికి రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. ఈ వ్యవహారం ఇప్పుడు కార్మిక శాఖకు చేరింది. దీంతో కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జేఏసీ వెల్లడించింది. ప్రజలు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. సమ్మెలో ఉన్న కార్మికుల ఆత్మ గౌరవం కాపాడాలని, సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితి కల్పించి వారిని విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత వ్యక్తమైతేనే సమ్మె విరమిస్తామని పేర్కొంది. లేని పక్షంలో యథాతథంగా సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. సమ్మె విషయంలో హైకోర్టులో ఊరట లభిస్తుందని ముందు నుంచి ఊహించిన కార్మికులకు షాక్ ఇచ్చింది. అనుకూల నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇ...

శివసేనకు లైన్ క్లియర్

చిత్రం
మహా ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించారు. సైద్ధాంతికంగా తీవ్ర విబేధాలున్న శివసేనకు కాంగ్రెస్‌ మద్దతివ్వడంపై నెలకొన్న అనుమానాలు తొలిగాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్‌ నేతలు ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసంలో నాలుగు గంటలకు పైగా చర్చలు జరిపారు. త్వరలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌  ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. బీజేపీతో సేన తెగ తెంపులయ్యాక ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తలు రావడం మొదలయ్యాక, ఈ విషయమై స్పష్టమైన ప్రకటన రావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగుతాయని, కూటమికి సంబంధించి మరి కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని పృథ్వీరాజ్‌ చ...

ఇక రాజపక్సదే రాజ్యం

చిత్రం
శ్రీలంకలో సమీకరణాలు మారి పోయాయి. లంకలో నెత్తురుటేరులు పారించిన రాజపక్సే మరోసారి అధికార పీఠంపై కూర్చోనున్నారు. గతంలో ఎల్టీటీఇని నామ రూపాలు లేకుండా చేయడంలో సక్సెస్ అయిన ఈ నాయకుడు మరోసారి లంక పగ్గాలు చేపట్టబోతున్నారు. దీంతో శ్రీలంకలో తమిళులు మరింత ఇబ్బందులు ఎదుర్కునే ప్రమాదం పొంచి ఉంది. ఆయన ఎన్నిక కావడానికి లోపాయికారిగా భారత ఆంతరంగిక, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారనే ప్రచారం అంతర్జాతీయంగా జరిగింది. తాజాగా శ్రీలంక కొత్త ప్రధాన మంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా ఎంపిక చేశారు. ప్రస్తుత ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే బాధ్యతల నుంచి తప్పు కోగానే, మహిందా రాజపక్స ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోతబయ రాజపక్స చేతిలో విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ తరఫున పోటీ చేసిన సాజిత్‌ ప్రేమదాస ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే ప్రకటించారు. పార్లమెంట్లో తన ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, అధ్య...

త్వరలో హై స్పీడ్ ట్రైన్

చిత్రం
త్వరగా గమ్య స్థానానికి చేరు కోవాలని కలలు కంటున్న ప్రయాణీకుల కోరిక త్వరలోనే తీరబోతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి, నాగ్ పూర్ కు వెళ్లే ప్రయాణీకులు ఎక్కువగా ఉంటారు. దాదాపు ఏడు లేదా ఎనిమిది గంటల సమయం పడుతోంది. దీంతో రైల్వే శాఖ హై స్పీడ్ ట్రైన్ ను తీసుకు రావాలని యోచిస్తోంది. సామీ హై స్పీడ్ ట్రైన్ గా దీనికి పేరు పెట్టింది. ఇది గనుక పట్టాలు ఎక్కితే సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ కు కేవలం మూడే మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ రెండు ముఖ్య నగరాల మధ్య గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. రష్యన్‌ రైల్వేస్‌ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం, సాధ్యా సాధ్యాలపై ఆ దేశ రైల్వే అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం కొద్ది రోజుల క్రితమే భారతీయ రైల్వే బోర్డుకు తుది నివేదికను అంద జేసింది. దీనిపై రష్యన్‌ అధికారుల బృందం మూడు దఫాలుగా అధ్యయనం చేసింది. రెండేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును రష్యన్‌ రైల్వేస్, భారతీయ రైల్వే 50:50 చొప్పున భరించేలా ఒప్పందం కుదిరింది. ట్రాక్‌ సామర్థ్యం...

డిపాజిటర్లకు కేంద్రం భరోసా

చిత్రం
బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వినియోగదారులకు మరింత భరోసా కల్పించేలా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి శుభవార్త అందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ బీమా పరిమితిని ఊహించిన దాని కంటే ఎక్కువ పెంచనుందని తెలుస్తోంది. ముఖ్యంగా 1 లక్ష నుండి 5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోల్‌సేల్ డిపాజిటర్లకు డిపాజిట్ బీమాను 25 లక్షలకు పెంచే కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టే అవకాశం ఉందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఈ పెంపు అమల్లోకి వస్తే, డిపాజిట్ బీమాకు సంబంధించి ఇదే మొదటి పెంపు అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొదటిది, చాలా కాలంగా పెండింగ్‌లో అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వ్యక్తులు, లేదా సంస్థలకు ప్రతిపాదిత మెరుగైన పరిమితులకు మించి అదనపు డిపాజిట్ బీమాను పొందడానికి బ్యాంకులను అనుమతించడం. రెండవది, ఆర్‌బీఐ నియంత్రణలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్, పంజాబ్ అండ్‌ మహారాష్ట్రల మాదిరిగానే మోసాల కారణంగా నష్ట పోతున్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక రిజర్వ్‌ను ఏర్పాటు చేయడం. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌...

ప్రపంచం మెచ్చిన మనోడు

చిత్రం
మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ గా ఉన్న తెలుగు వాడైన సత్య నాదెళ్ల అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ గా ఎంపికయ్యారు. సత్య నాదెళ్లతో పాటు మరికొందరు భారతీయులకు ఈ లిస్టులో చోటు సంపాదించారు. కాగా ఈ ఏడాది ‘ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు నాదెళ్ల. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇందులో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం. వ్యూహాత్మక నాయకుడి పాత్రలో ఒదిగి పోయిన ఆయన, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా దూసుకు పోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకోగలిగారని ఫార్చూన్‌ మ్యాగజైన్‌ ఈ సందర్భంగా కొనియాడింది. తాజాగా 10 బిలియన్‌ డాలర్ల పెంటగాన్‌ క్లౌడ్‌ కాంట్రాక్టును అందు కోవడంలో నాదెళ్ల చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చ...

పేదల కోసం ఆరోగ్య పథకం

చిత్రం
ఆయుష్మాన్‌‌ భారత్‌‌, నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ వంటి ఎన్ని పథకాలు ఉన్నా, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా అందని ద్రాక్ష గానే మారిందని నీతి ఆయోగ్‌‌ పేర్కొంది. వీరి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం తీసుకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పుడున్న వైద్య సంరక్షణ పథకాలను కలిపి, హెల్త్‌‌ కేర్‌‌ సిస్టమ్‌‌ను తయారు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయ పడింది. ఇప్పటికీ 50 శాతం మందికి బీమా సదుపాయం లేదని వెల్లడించింది. పేద, ధనిక తేడాలు లేకుండా, అందరికీ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని వర్తింప జేయాలని, ఇందు కోసం ప్రతి ఒక్కరినీ తప్పని సరిగా హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ స్కీమ్‌‌లోకి తీసుకు రావాలని నీతి ఆయోగ్‌‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు  చేసింది. మధ్య తరగతి వారి కోసం ఒక బీమా పథకం తప్పక తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఇప్పుడున్న అన్ని ఆరోగ్య సంరక్షణ, బీమా పథకాలను కలిపేయాలని సూచించింది. దీనివల్ల ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు తగ్గుతుందని, మారుమూల ప్రాంతాలకూ వైద్య సేవలు అందుతాయని అభిప్రాయ పడింది. హెల్త్‌‌ సిస్టమ్‌‌ ఫర్‌‌ న్యూ ఇండియా పేరుతో నీతి ఆయోగ్‌‌ పూర్తి నివేదికను వెల్లడించింది. అన్ని ఇన్సూరెన్స్‌‌ స్కీమ...

అందుబాటులో అమృత్ షాప్స్

చిత్రం
ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక నుంచి తక్కువ ధరల్లో మందులు అందుబాటులోకి రానున్నాయి. సర్కారు దవాఖాన్లలో ‘అమృత్‌‌‌‌’ పేరుతో మెడికల్ షాపులు ప్రారంభం కానున్నాయి. జనరిక్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌తో పాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్‌‌‌‌, ఇంప్లాంట్స్ సహా అన్ని ఐటమ్స్‌‌‌‌ ఈ షాపుల్లో లభించనున్నాయి. ఇందు కోసం హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్‌‌‌‌ తో తెలంగాణ ప్రభుత్వం ఇది వరకే ఒప్పందం చేసుకుంది. దీన్‌‌‌‌ దయాల్‌‌‌‌ అమృత్‌‌‌‌ పేరిట కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల్లో మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తోంది. దవాఖాన్లలో రాష్ర్ట ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, ఈ సంస్థ షాపులు పెట్టి డిస్కౌంట్‌‌‌‌పై మెడిసిన్ అమ్ముతుంది. హెచ్ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ సంస్థ సొంతంగా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తుండగా, మిగతా వాటిని కంపెనీల నుంచి బల్క్‌‌‌‌లో కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో తక్కువ లాభం చూసుకుని, ప్రజలకు అందుబాటులో ధరలో మందులు అందిస్తామని సంస్థ చెబుతోంది. బయటి షాపుల్లో కంటే 30 నుంచి 40 శాతం తక్కువకు అమృత్ షాపుల్లో మందులు దొరుకుతాయి. దీంతో మందుల నిలువు దోపిడీ నుంచి పేదలకు కొంత ఉపశమనం లభిస్తుంది. జనరి...

మెస్మరైజ్ చేస్తున్న 5జీ ఫోన్‌

చిత్రం
స్మార్ట్ ఫోన్స్ లవర్స్ కు తీపి కబురు. ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న 5 జీ ఫోన్ ను వరల్డ్ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది శాంసంగ్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సరికొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. శాంసంగ్ డబ్ల్యు 20..5జీ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. గెలాక్సీ ఫోల్డ్ రీబ్రాండెడ్ వెర్షన్‌ 5జీ అప్‌ గ్రేడ్ చేసి ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 855+ సాక్‌  మినహా మిగిలిన ఫీచర్లను గెలాక్సీ ఫోల్డ్‌ మాదిరిగా ఉంచింది. ఎకెజి-ట్యూన్డ్ స్పీకర్లు, డాల్బీ అట్‌మాస్‌ సపోర్ట్, యాక్సిలెరో మీటర్, యాంబియంట్ లైట్, బేరో మీటర్, జియో మాగ్నెటిక్, గైరోస్కోప్,ఇన్-డిస్ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. అలాగే వైర్‌ లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌ లెస్ పవర్ షేర్‌కు మద్దతు ఇస్తుంది. డిసెంబరు నుంచి ఇది చైనాలో అందు బాటులోకి రానుంది. ధర వివరాలు, ఇతర మార్కెట్లలో దీని లభ్యత తదితర వివరాలను శాంసంగ్‌ ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధర సుమారు1,73,000 గా వుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే మోటోరోలా కూడా కొత...

మామ్స్ కు కిమ్స్ బంపర్ ఛాన్స్

చిత్రం
గర్భిణులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం. మిసెస్‌ మామ్‌ పేరుతో  రెండో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు డాక్టర్‌ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో ఈ ప్రోగ్రాం వివరాలు వెల్లడించారు. మిసెస్‌ మామ్‌లో పాల్గొనే గర్భిణులకు మాదాపూర్‌లోని స్నాట్‌ స్పోర్ట్స్‌లో గ్రాండ్‌  ఫినాలే పోటీలు నిర్వహిస్తామన్నారు. మిసెస్‌ స్మైల్, మిసెస్‌ ఫ్యాషనిస్టా, మిసెస్‌ బ్రెయిన్స్, మిసెస్‌ బ్యూటీఫుల్‌ హెయిర్, మిసెస్‌ ఫిట్‌నెస్‌ తదితర కేటగిరీల్లో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌లను ఎంపిక చేస్తామన్నారు. విజేతలకు ఉచిత ప్రసవంతో పాటు ఆసక్తికర బహుమతులు అంద జేయనున్నట్లు వెల్లడించారు. గర్భిణులు 8897993265 నంబర్‌కు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాసంతో పాటు యోగా చేయిస్తామన్నారు. న్యూట్రిషన్‌లో చిట్కాలు, డెంటల్, హెల్త్‌ చెకప్స్, గర్భిణులు అందంగా ఎలా తయారు కావచ్చో తెలియ జేయడమే గాక సాధారణ ప్రసవం కోసం వారిని సిద్ధం చేస్తామని తెలిపారు. గత ఏడాది 60 మంది మిస్...

పింక్ బాల్ ఎవరిని గెలిపించెనో

చిత్రం
ఇండియా అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది ఈ ఆటపై. చిన్నారులు, వృద్దులు, అభిమానులు, సినీ స్టార్స్,, పొలిటికల్ లీడర్స్, ఇలా ప్రతి ఒక్కరు క్రికెట్ ప్రేమికులే. ఇదిలా ఉండగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రెసిడెంట్ గా సౌరభ్ గంగూలీ ఎన్నికయ్యాక క్రికెట్ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. మొదటి సారిగా పట్టుబట్టి పింక్ బాల్ ను ఇంట్రడ్యూజ్ చేశాడు గంగూలీ. దీంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అభిమానులతో పాటు ఇరు దేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ టెస్టు ప్రారంభానికి  కొన్ని గంటలే సమయం ఉంది. తొలి డేనైట్‌ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్జెన్స్‌ ఆతిథ్య మిస్తోంది. డే నైట్‌ టెస్టు కోసం రెగ్యులర్‌గా వాడే రెడ్‌ బాల్స్‌కు బదులు పింక్‌ బాల్స్‌ను వాడతారు. దీంతో ఈ పింక్‌ బాల్‌తో మనోళ్లు నెగ్గుకు రాగలరా అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంత మందికి పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. సారథి విరాట్‌ కోహ్లి, వైఎస్‌ కెప్టెన్‌ అ...