మేఘా సక్సెస్..ఫోర్బ్స్ లో పబ్లిష్
ఇండియాలో బిగ్గెస్ట్ నిర్మాణ కంపెనీగా ఇప్పటికే పేరొందిన ఎంఈఐఎల్ మరో చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మ్యాగజిన్ కలెక్టర్స్ ఎడిషన్ 2019లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ జాబితా విడుదల చేసింది. 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేఘా బిల్డర్ పేరుతో ఫోర్బ్స్ స్టోరీ ప్రచురించింది.
పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది.14 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి పలు దేశాల్లోని లెక్కలేనన్ని ప్రాజెక్టుల్లో సంస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఉటంకించింది.
భారత్ అత్యుత్తమ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా ఎంఈఐఎల్ నిలుస్తోందని పేర్కొంది. రుణ రహిత కంపెనీగా ఎంఈఐఎల్ కొనసాగుతున్న విషయాన్ని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇదిలా ఉండగా ఇటీవల మేఘా కంపెనీపై ఆదాయ శాఖ ఉన్నతాధికారులు దాడులు చేపట్టారు. పలు కీలకమైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని కంపెనీ తేలిగ్గా తీసుకుంది. ప్రతి ఏటా సోదాలు చేపట్టడం మామూలేనని పేర్కొంది. ఇప్పటికే అటు ఏపీ, ఇటు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కీలక ప్రాజెక్టులు చేపట్టింది.
పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది.14 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి పలు దేశాల్లోని లెక్కలేనన్ని ప్రాజెక్టుల్లో సంస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఉటంకించింది.
భారత్ అత్యుత్తమ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా ఎంఈఐఎల్ నిలుస్తోందని పేర్కొంది. రుణ రహిత కంపెనీగా ఎంఈఐఎల్ కొనసాగుతున్న విషయాన్ని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇదిలా ఉండగా ఇటీవల మేఘా కంపెనీపై ఆదాయ శాఖ ఉన్నతాధికారులు దాడులు చేపట్టారు. పలు కీలకమైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని కంపెనీ తేలిగ్గా తీసుకుంది. ప్రతి ఏటా సోదాలు చేపట్టడం మామూలేనని పేర్కొంది. ఇప్పటికే అటు ఏపీ, ఇటు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కీలక ప్రాజెక్టులు చేపట్టింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి