పోస్ట్‌లు

ఏప్రిల్ 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉగ్ర‌మూక‌ల పంజా..ర‌క్త‌మోడిన కొలంబో

చిత్రం
ఉగ్ర మూక‌లు మ‌రింత రెచ్చి పోయాయి. శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోలో ఒక్క‌సారిగా భారీ శ‌బ్దాల‌తో న‌గ‌రం ద‌ద్ద‌రిల్లి పోయింది. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో చ‌ర్చీలలో ప్రార్థ‌న‌లు చేసుకుంటున్న వారే ల‌క్ష్యంగా ఈ దాడులు వెంట‌వెంట‌నే కొన‌సాగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 130 మందికి పైగా చ‌నిపోగా ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో కొలిక్కి రాలేదు. మూడు చ‌ర్చీలు, మూడు హోట‌ళ్ల‌లో ఈ పేలుళ్లు జ‌రిగాయి. భారీ పేలుళ్లు చ‌ర్చీల‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఆక‌స్మిక దాడుల దెబ్బ‌కు శ్రీ‌లంక ఒక్క‌సారిగా కుదుపున‌కు లోనైంది. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి కూత‌వేటు దూరంలో ఉన్న హోట‌ల్‌లో బాంబులు పేలాయి. ఈస్ట‌ర్ పండుగ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చాలా మంది చ‌ర్చీల‌లో ప్రార్థ‌నలు చేశారు. ప్రశాంత వాతార‌ణం నెల‌కొన్న స‌మ‌యంలో బాంబులు పేల‌డంతో జ‌నం భ‌యంతో ప‌రుగులు తీశారు. బాంబు పేలుళ్ల దుర్ఘ‌ట‌న దుర్వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో ..ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాలు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించాయి. ఇండియా, పాకిస్తాన్, చైనా, అమెరికా, ఇంగ్లండ్ , ర‌ష్యా దేశాల అధిప‌తులు తీవ్ర దిగ్భ్రాంతిని ప్ర‌క‌టించారు. ఈ...

మురిసిన ఢిల్లీ ..మెరిసిన శ్రేయ‌స్

చిత్రం
ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు త‌న ఆట‌తీరును మార్చుకుంది. మెల మెల్ల‌గా గెలుస్తూ ..మ‌రో మ్యాచ్ ఆడి గెలిస్తే ప్లే ఆఫ్ పై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చు. పంజాబ్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌నతో విజ‌యం వ‌రించింది. బౌలింగ్ ప‌రంగా సందీప్ 40 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీస్తే..కాగిసో ర‌బాడా 23 ప‌రుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్ష‌ర్ ప‌టేల్ 22 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక బ్యాటింగ్ విష‌యానికొస్తే శిఖ‌ర్ ధావ‌న్ దుమ్ము రేపాడు. కేవ‌లం 41 బంతులు మాత్ర‌మే ఆడిన ఈ క్రికెట‌ర్ 7 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 56 ప‌రుగులు చేశాడు. మ‌రో వైపు శ్రేయ‌స్ అయ్య‌ర్ 49 బంతులు ఆడి అయిదు ఫోర్లు ..భారీ సిక్స‌ర్‌తో 58 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 5 వికెట్లు తేడాతో పంజాబ్ పై గెలిచింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌ను కోల్పోయి 163 ప‌రుగ‌లు మాత్ర‌మే చేసింది. మైదానంలోకి దిగిన పంజాబ్ ఆట‌గాళ్లు మొద‌టి నుండి ఆఖ‌రు వ‌ర‌కు బ్యాట్స్‌మెన్స్ ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. వెస్టీండీస్ ఆట‌గాడు..పంచ్ హిట్ట‌ర్‌గా పేరొందిన క్రిస్ గేల్ ఒక్క‌డే ...

చెల‌రేగిన స్మిత్ ..రాజ‌స్థాన్ ఈజీ విన్

చిత్రం
క్రికెట్ ఆట‌కు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక‌ప్పుడు స‌ర‌దా కోసం ఆడిన గిల్లీ దండా ..ఇపుడు క్రికెట్ రూపంలో ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తోంది. కోట్లాది ఫ్యాన్స్‌ను నిద్ర లేని రాత్రులు గ‌డిపేలా చేసేస్తోంది. క్ష‌ణ క్ష‌ణానికి ఉత్కంఠ‌ను రేపుతూ..ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ..న‌రాలు తెగిపోతాయో అన్నంత ఉద్వేగాన్ని క‌లిగించే ఈ క్రికెట్ ఇపుడు జ‌నాన్ని పీడిస్తోంది. పిల్ల‌లు..మ‌హిళ‌లు..యూత్..పెద్ద‌లు..వృద్ధులు ఇలా ఒక‌రేటిమి..అంద‌రూ..అంత‌టా టీవీలకు అతుక్కు పోయారు..ల‌క్ష‌లాది మంది మొబైల్స్‌లో వీక్షిస్తున్నారు. ఇవేవీ ప‌ట్టించుకోని వేలాది అభిమానులు టికెట్ల వేట‌లో విజేత‌లుగా నిలుస్తున్నారు. త‌మకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ప్ర‌త్యక్షంగా మైదానంలో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డే పోరాటాన్ని చూస్తూ..తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నీలో జైపూర్‌లో జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుపై సునాయ‌సంగా గెలుపొందింది. అయిదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆర్ఆర్ జ‌ట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ విధ్వంస‌క‌ర‌మైన రీతిలో ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తే..స‌హ‌చ‌ర ఆట...

ఆశీర్వ‌దించండి..అన్న‌ను గెలిపించండి

చిత్రం
మిమ్మ‌ల్ని చూస్తుంటే మా కుటుంబంతో గ‌డిపిన క్షణాలు గుర్తుకు వ‌స్తున్నాయి. నేను మీ సోద‌రిని..మీలో ఒక‌రిని..మీలో మేమంతా ఒక్క‌రం. మీ ఆద‌రాభిమానాలు మాకుండాలి. మీ దీవెన‌లు మా అన్న‌య్య‌కు కావాల‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ బ‌రిలో ఉన్నారు. త‌న అన్నకు మ‌ద్ధ‌తుగా ప్రియాంక రంగంలోకి దిగారు. తాను కూడా బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డే ఎక్కువ‌గా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. మొద‌టిసారిగా రాహుల్ ఇక్క‌డ పోటీలో ఉండ‌డంతో దేశం ఈ నియోజ‌క‌వ‌ర్గం వైపు దృష్టి సారించింది. ఎన్నిక‌ల స‌భ‌లో ప్రియాంక గాంధీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆమె ఎక్క‌డ పాల్గొంటే అక్క‌డ జ‌నం తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె బీజేపీని టార్గెట్ చేశారు. గ‌త ఐదేళ్ల‌లో క‌మ‌ల‌నాథులు దేశాన్ని ముక్క‌లు చేశార‌ని. ప్ర‌జ‌ల‌ను పేద‌లుగా మార్చార‌ని ఆరోపించారు. ప్ర‌తి రాష్ట్రం దేశంలో భాగ‌మేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు ఇందులో భాగ‌స్థులే. ఎవ‌రూ ఎక్కువ కాద...

క‌లిసిన క‌త్తులు..కురిసేనా ఓట్లు

చిత్రం
రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు..శాశ్వ‌త మిత్రులు అంటూ ఉండ‌ర‌న్న మాట‌ల్ని నిజం చేశారు ..ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఎస్పీ, బీఎస్పీల బాధ్యులు. అత్య‌ధిక పార్ల‌మెంట్ సీట్లు క‌లిగిన రాష్టం ఇదే. మాన్య‌శ్రీ కాన్షీరాం బ‌హుజ‌న స‌మాజ్ వాది పార్టీని స్థాపించారు. స‌మాజ్‌వాది పార్టీని కాద‌ని బీఎస్పీని అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కాన్షీజీదే. ఆయ‌న తిర‌గ‌ని ప్రాంత‌మంటూ లేదు. అంత‌లా బ‌హుజ‌నుల బాగు కోసం ఎంత‌గానో శ్ర‌మించారు. ఈ దేశంలో ఎంద‌రో రాజ‌కీయ గురువులు, నాయ‌కులు ఉన్నారు. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా జ‌నాన్ని చైత‌న్య‌వంతం చేసి ..కేంద్రంలో అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణదే. తెలంగాణ గాంధీగా పేరొందిన ఆచార్య జ‌య‌శంక‌ర్ కృషి ..కేసీఆర్ పోరాట ఫ‌లిత‌మే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డింది. కాన్షీరాం దృష్టిలో కుమారి మాయావ‌తిని జాతి గ‌ర్వించే నాయ‌కురాలిగా తీర్చిదిద్దారు. యుపీలో అన్ని పార్టీల‌ను కాద‌ని మొద‌టిసారిగా బీఎస్పీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు అక్క‌డి ప్ర‌జ‌లు. బీఎస్పీ ప‌వ‌ర్ లోకి రావ‌డం అన్న‌ది దేశ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయంగా పేర్కొనాల్సిందే. చిన్న బిందువుగా ప్రారంభ‌...