పోస్ట్‌లు

సెప్టెంబర్ 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇండియాను షేక్ చేస్తున్న జియో - ఎయిర్ టెల్, వోడా డీలా..!

చిత్రం
ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ స్టార్ట్ చేసిన జియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయిల్, జ్యుయెలరీ, ఈ కామర్స్ , ఫ్యాషన్, లాజిస్టిక్ రంగాలలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ఈ కంపనీ ఇటీవలే టెలికం రంగాన్ని ఒంటి చేత్తో శాసించే స్థాయికి చేరుకుంది. ప్రత్యర్హి కంపెనీలు భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ , ఎయిర్ టెల్ , వోడా ఫోన్ , ఐడియా, టాటా టెలికాం ఇలా ప్రతి టెలికాం ఆపరేట్స్ కు చుక్కలు చూపిస్తోంది. మొదటి సారిగా జియో ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లైట్ గా తీసుకున్నాయి మిగతా కంపెనీలు. కానీ ఆర్ ఐ ఎల్ మాత్రం దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఎంతలా అంటే ప్రపంచాన్ని గూగుల్ ఎలా తన కంట్రోల్ లో పెట్టుకున్నదో, అలాగే రిలయన్స్ కంపెనీ మారుమూల గ్రామాలకు సైతం తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. ఇందు కోసం వేలాది కోట్లను ఖర్చు చేసింది. దీంతో డేటా కన్వర్జేషన్ అన్నది మరింత సులభతరంగా తయారైంది. ఇండియాలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఇటీవల ముంబైలో జరిగిన మీటింగ్ లో చెప్పారు ముకేశ్ అంబానీ. ఇది తమ ఆలోచన కాదని. తమకు ప్రాణం పోసి, ప్రపంచం...

పెల్లుబికిన భాషాభిమానం..అమిత్ పై ఆగ్రహం..!

చిత్రం
భారత దేశంలో ఎక్కువగా హిందీ భాషను మాట్లాడుతున్నారు కాబట్టి దేశమంతటా హిందీని తప్పని సరిగా వాడాలంటూ బీజేపీ హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా వ్యాఖ్యానించడంపై దేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలు రాష్ట్రాలలో ఆయా పార్టీలకు చెందిన అధినేతలు, నటులు, ముఖ్యమంత్రులు, విపక్షాలు, మేధావులు, భాషాభిమానులు పెద్ద ఎత్తున మండి పడ్డారు, తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమిళ నాడు, పక్షిమ బెంగాల్ లో ఆందోళనలు చేపట్టారు. అంతే కాకుండా తమిళనాడులో ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చారు. మద్రాస్ లో రోడ్లపై ఏర్పాటు చేసిన బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలను చెరిపి వేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పు కునేది లేదంటూ స్పష్టం చేశారు. తమపై బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తే దేశం అగ్ని గుండమే అవుతుందని అమిత్ షా ను హెచ్చరించారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రముఖ నటులు కమల హాసన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. జల్లికట్టు లాగా ఉద్యమించాల్సి వస్తుందన్నారు. ఎవరి భాష వారిదే. ఇంకొకరి పెత్తనాన్ని సహించం, ఇంకో భాషను స్వీకరించే ప్రసక్తి లేద...

కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు - ఉత్తమ్ వర్సెస్ రేవంత్

చిత్రం
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిపక్ష పాత్రను పోషించలేక పోతోంది. ఓ వైపు అధికార పక్షాలు రాకెట్ కంటే స్పీడ్ గా దూసుకు వెళుతుంటే కాంగ్రెస్ మాత్రం ఇంటి పోరుతో సతమతమవుతోంది. తాజాగా పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ పై అభ్యర్థిని ముందుగానే ప్రకటించడంపై అదే పార్టీకి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. పార్టీలో చర్చించ కుండానే, ఏకాభిప్రాయం తీసుకోకుండానే, ఎలాంటి సమావేశం నిర్వహించకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా డెసిషన్ తీసుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. ఉత్తమ్ తన భార్యకు టికెట్ కేటాయిస్తూ ముందస్తుగానే ప్రకటన చేయడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. అంతకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీని సోనియా గాంధీ తన చేతుల్లోకి తీసుకున్నాక, ఢిల్లీలో రేవంత్ రెడ్డి తన కుటుంబంతో సహా ఆమె నివాసం కు వెళ్లి కలిశారు. ఇదే సందర్భంలో పార్టీకి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేస్తారని, తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవిని మార్పు చేస్తారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. ఆ మేరకు రే...