పోస్ట్‌లు

జులై 27, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దివికేగిన దిగ్గ‌జ నేత - పెద్ద‌దిక్కును కోల్పోయిన తెలంగాణ - పాల‌మూరు బిడ్డ మ‌రువ‌దు ఈ గ‌డ్డ..!

చిత్రం
సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు ఇక‌లేడు..ఇక రాడు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పోతే నిబిడాశ్చ‌ర్యంతో మీరే అంటూ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం మాడ్గుల‌కు చెందిన సూదిని జైపాల్ రెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌తో హైద‌రాబాద్ లో క‌ను మూశారు. అద్భుత‌మైన మేధావిగా, రాజ‌కీయ దురంధరుడిగా, అప‌ర చాణుక్యుడిగా, ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా, న‌డిచే ఎన్‌సైక్లోపేడియాగా, ప‌దాల‌కు అర్థాలు వెతుక్కునే డిక్ష‌న‌రీ ఆయ‌న‌. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఆయ‌న ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించారు. లోతైన ప‌రిశీల‌న‌, తార్కిక ప‌రిజ్ఞానం, దేశ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయ ప‌ర‌మైన అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారు. అన్నిటికంటే ఆయ‌న గొప్ప భావుకుడు, మాన‌వ‌తావాది, ర‌చ‌యిత‌, చివ‌రి వ‌ర‌కు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న వ్య‌క్తి. జైపాల్ రెడ్డి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న‌తో సంభాషించాల‌న్నా లేక ఇంట‌ర్వ్యూ చేయాలంటే చాలా మంది జ‌ర్న‌లిస్టులు జ‌డుసుకున్న సంద‌ర్భాలు ఎన్నో. 24 ఏళ్ల సుదీర్ఘ‌మైన పాత్రికేయ అనుభ‌వంలో క‌ర‌వుకు కొండ‌గుర్తుగా ఉన్న ఈ జిల్లాకు చెందిన నాకు ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసే అవ‌కాశం ఓ దిన‌ప‌త్రిక ద్వారా ద‌క...

న్యూ బిజినెస్‌లోకి ప్రిన్స్ ఎంట‌ర్..!

చిత్రం
అంద‌గాడు..ఆడ‌పిల్ల‌ల క‌ల‌ల రాకుమారుడిగా పేరున్న ఒకే ఒక్క న‌టుడు ఎవ‌ర‌న్నా ఉన్నారంటే..ఎవ‌రైనా ఠ‌క్కున సమాధానం చెప్పేది మ‌హేష్ బాబు అని. టాలీవుడ్‌, కోలివుడ్, బాలీవుడ్..ఇండియా వ్యాప్తంగా ఈ న‌టుడికి లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. సింప్లిసిటీని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే మహేష్ బాబు డైలాగ్ డెలివ‌రీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఆయ‌న త‌ప‌న ప‌డ‌తారు. జ‌యాప‌జ‌యాల‌ను మ‌హేష్ ప‌ట్టించుకోరు. అదీ ఆయ‌న స్పెషాలిటీ. న‌టుడిగా ఆయ‌న ప్రూవ్ చేసుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా త‌ను, త‌న కుటుంబం ఇంతే. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. ఎవ‌రి ప‌ట్ల జోక్యం చేసుకోరు. ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ తో చేసిన సినిమా ఆడ‌క పోయినా..స‌ద‌రు డైరెక్ట‌ర్ ఒకే ఒక్క మాట చెప్పారు ప్రిన్స్ గురించి. మ‌హేష్ బాబు ..డైరెక్ట‌ర్స్ ఛాయిస్ అంతే కాదు ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన న‌టుడు. షూటింగ్ కు వ‌చ్చిన‌ప్పుడు ఎలా వుంటారో..పూర్త‌య్యాక ఇంటికి వెళ్లేట‌ప్పుడు అలాగే ఉంటారు. ఇలాంటి న‌టులు అరుదుగా ఉంటార‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రం ఓ సంద‌ర్భంలో తెలిపారు. ఇప్ప‌టికే...

ఇక చెల్లింపుల రంగంలోకి వాట్సాప్ ఎంట‌ర్

చిత్రం
డిజిట‌లైజేష‌న్ పుణ్య‌మా అంటూ ఇండియాలో ఆన్ లైన్‌లో పేమెంట్స్ కు సంబంధించిన లావాదేవీలకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. ప్ర‌భుత్వ , ప్రైవేట్ బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు సేవ‌లు అందించ‌డంలో పోటీ ప‌డినా చివ‌ర‌కు అవి కూడా  అస‌లైన టైంలో చేతులెత్తేశాయి. ఎప్పుడైతో కేంద్రంలో బీజేపీ స‌ర్కార్ కొలువు తీరిందో అప్ప‌టి నుంచి జ‌నానికి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. అన్నింటికి మించి ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్ష‌న్స్ పెరుగ‌గా , ఇంకా స‌గానికి పైగా సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నారు. ఏ ఒక్క లావాదేవీ జ‌రిపినా లేదా నిర్వ‌హించినా ..చెల్లింపులు జ‌రిపినందుకు అడ్డ‌గోలుగా క‌మీష‌న్ వ‌సూలు చేస్తున్నారు. ఈ దందా మ‌రింత ఎక్కువ‌గా జ‌రుగుతోంది ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌లో. ఆయా బ్యాంకుల‌కు సంబంధించిన ఎనీ టైం మిష‌న్ అంటే ఏటీఎంలు నో క్యాష్ అన్న బోర్డులు త‌గిలించి ..ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఏదైనా అవ‌స‌రం ఉందంటే క‌మీష‌న్ దారుల వ‌ద్ద‌కు ప‌రుగులు తీయాల్సి వ‌స్తోంది. ఇంత జ‌రుగుతున్నా ఆర్బీఐ కానీ లీడ్ బ్యాంకు కానీ, జిల్లా స్థాయిలలో ఉన్న ఉన్న‌తాధికారులు కానీ ఎవ‌రూ స్పందించ‌డం లేదు. చెల్లింపులు అనేవి ఆన్‌లైన్ ...

మ‌హిళ‌లు అసాధార‌ణ విజ‌యాలు స్ఫూర్తికి సంకేతాలు

చిత్రం
ఆకాశంలో స‌గమే కాదు అభివృద్ధిలో ..అన్ని రంగాల్లో మ‌హిళ‌లు లేకుండా విజ‌యాలు సాధించ‌డం క‌ష్టం. ఇటీవ‌ల మ‌హిళ‌లు రాజ‌కీయ‌, క్రీడా, ఆర్థిక‌, వ్యాపార‌, శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌లో పాలుపంచుకంటూ త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. శారీర‌కంగా, మాన‌సికంగా తీవ్ర వివ‌క్ష‌కు లోనైన మ‌హిళలు ఇపుడు మారుతున్న ప్ర‌పంచంలో త‌మ వాయిస్ ను బ‌లంగా వినిపిస్తున్నారు. తాజాగా 19 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన హిమ‌దాస్ అద్భుత‌మైన గెలుపును సాధించింది. అసాధార‌ణ‌మైన విజ‌యాల‌ను న‌మోదు చేసింది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేసే దాకా ఆమె సాధించిన స‌క్సెస్ గురించి ఈ దేశ వాసులకు తెలియ‌లేదు. అయిన దానికి కాని దానికి చిన్న విష‌యాన్ని పెద్ద‌దిగా చేసి 24 గంట‌లు ప్ర‌సారం చేసే జాతీయ మీడియా హిమ‌దాస్ గురించి అస్స‌లు ప‌ట్టించు కోలేదు.  ఇక నేష‌న‌ల్, స్టేట్ ప్రింట్ మీడియా కూడా కావాల్సినంత స్పేస్ ఇవ్వ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం హిమ‌దాస్ గురించి భారీ ఎత్తున నెటిజ‌న్లు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆమె సాధించిన విజ‌యానికి జేజేలు ప‌లికారు. త‌ర్వాత ప్రింట్, మీడియాలు ఆమె గురించి రాశాయి. గోల్డెన్ గ‌ర్ల్‌గా ఇపుడు కీర్తిస్తున్నారు. మేరీ కోమ్ కు పె...

తెల్లొళ్ల కోట‌లో పాగా వేసిన న‌ల్ల సూరీలు

చిత్రం
రాజ్యాలు కూలి పోయినా ..టెక్నాల‌జీ మారినా..మ‌నుషులు అంత‌రిక్షంలోకి వెళ్లినా ఇంకా కుల వ్య‌వ‌స్థతో పాటు జాతుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికాలో ఆఫ్రిక‌న్స్ అన్నా..న‌ల్ల జాతీయులంటే చుల‌క‌న భావ‌న‌. ఇప్ప‌టికింకా తెల్ల‌వాళ్ల డామినేష‌న్ కంటిన్యూ అవుతోంది. న‌లుగురు బ్లాక్ మెన్స్ స్టార్ట‌ప్ తో ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యారు. జాన్ హెన్రీ, హెన్రీ పియ‌రీ జాక్వెస్, బ్రాండ‌న్ బ్రియాంట్ , జారిడ్ టింగ‌ల్ కో ఫౌండ‌ర్స్ గా హ‌ర్లెమ్ కేపిటల్ ను స్థాపించారు. ఫైనాన్సియ‌ల్ ప‌రంగా ఈ స్టార్ట‌ప్ ప్రాఫిట్‌ను సాధించింది స్వ‌ల్ప కాలంలోనే. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగంలో వీరు న‌లుగురు సూప‌ర్ స్టార్స్‌గా పేరు గ‌డించారు. అమెరికాలో అక్క‌డి వారిదే హ‌వా. వారిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం చాలా క‌ష్టం.  ఐటీ, ఫార్మా, టెలికాం, త‌దిత‌ర రంగాలైతే ఓకే. కానీ బిజినెస్ రంగంలో వీరే ఎక్కువ‌గా ఉంటారు. వీరి ఆధిప‌త్యాన్ని త‌ట్టుకుని ఫైనాన్షియ‌ల్ సెక్టార్‌లో టాప్ రేంజ్‌లోకి రావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. న‌లుగురు బ్లాక్ మెన్స్‌తో పాటు ఓ వైట్ మెన్ అంటే ఓ అమెరిక‌న్ కూ...

సామాజిక మాధ్య‌మాలు..ప్ర‌జా చైత‌న్యానికి ప్ర‌తీక‌లు..!

చిత్రం
ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాలు అనేవి లేక‌పోతే ప్ర‌పంచం ఎప్పుడో జ‌నాన్ని న‌ట్టేట ముంచి వుండేది. ప్ర‌శ్నించే హ‌క్కుల్ని కోల్పోతే ఎన్ని వున్నా ఏం లాభం. జీవితం వ్య‌ర్థ‌మే. ప్ర‌తి చోటా ఎక్క‌డో ఒక చోట ఈ లోకంలో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, పోరాటాలు, నిల‌దీయ‌డాలు, శాంతియుతంగా ధ‌ర్నాలు, రాస్తారోకోలు, స‌మ్మెలు..కొన‌సాగుతూనే ఉన్న‌వి. నిత్యం వాటికి ఎక్క‌డో ఒక చోట స్పేస్ దొరుకుతోంది. యుద్ధం అనివార్య‌మైన చోట‌..శాంతికి తావుండ‌దు..ఇక పోరాటం మాత్ర‌మే మిగిలి ఉంటుంది. మౌనంగా చూస్తూ భ‌రించ‌డం కూడా నేర‌మే అంటాడు దాస్తోవ‌స్కీ ఓ సంద‌ర్భంలో. ప్రపంచాన్ని అత్యంత ప్ర‌భావితం చేసిన మార్పుల్లో..మొద‌ట మాగ్నాకార్టనే. ఆ త‌ర్వాత ఎన్నో పోరాటాలు చోటు చేసుకున్నాయి. లక్ష‌లాది మంది జ‌నం ఆధిప‌త్య పోరులో అంత‌మై పోయారు. నామ రూపాలు లేకుండా ..చ‌రిత్ర ద‌రిదాపుల్లోకి రాకుండా పోయారు. ఇది విషాద‌క‌ర‌మైన స‌న్నివేశం. ఎంత చెప్పినా త‌క్కువే. బ‌లిదానాలు చేసిన వాళ్లు, త్యాగాలు చేసిన వాళ్లు మ‌రెంద‌రో. వీరికి చ‌రిత్ర పుటల్లో చోటు ద‌క్క‌లేదు. మ‌హాక‌వి శ్రీ‌శ్రీ అన‌లేదా..న‌ర‌జాతి చ‌రిత్ర స‌మ‌స్తం ప‌రపీడ‌న ప‌రాయ‌ణ‌త్వం అని. అందుకేగా కార...