పోస్ట్‌లు

జనవరి 10, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అయ్యప్ప భారీ విగ్రహం..త్వరలో నిర్మాణం

చిత్రం
                        ప్రపంచంలోని అయ్యప్ప భక్తులకు శుభ సూచకం. వేలాది మంది అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్త జన బాంధవులు నిత్యం పూజా కైంకర్యాలతో పాటు శాశ్వతంగా, వసతి సౌకర్యాలు ఉండే విధంగా ఆ భూతనాథ అయ్యప్ప అన్నదాన క్షేత్రం నిర్మించాలని అయ్యప్ప ఆలయ సమితి నిర్ణయించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు అహోరాత్రులు శ్రమిస్తోంది. అయ్యప్ప స్వామిని నిత్యం కొలిచే వారే ఈ సమితిని ఎర్పాటు చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో మహబూబ్ నగర్  రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 184 పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి పేరుతో ఆలయాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడం..ఆ దిశగా స్వామి వారి ఆశీస్సులతో, దాతలు, అభిమానులు, భక్తులు, కులమతాలకు అతీతంగా తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో అన్నదాన కోసం ఎందరినో భక్త బాంధవులను సంప్రదించడం జరిగింది. చాలా మంది తమకు తోచిన రీతిలో స్పందించారు. ఆర్ధిక, హార్థిక పరంగా చేయూతను అందించా...

దీపికకు కంగనా సపోర్ట్

చిత్రం
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకు మరో నటి కంగనా రనౌత్ బాసటగా నిలిచారు. ఆమె నగరానికి వచ్చారు. తన తాజా చిత్రం ప్రమోషన్‌ సహా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అదే క్రమంలో సిటీకి చెందిన ఫిక్కీ లేడీస్‌ క్లబ్‌ దిపార్క్‌ హోటల్‌లో నిర్వహించిన ముఖాముఖిలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తనదైన రీతిలో స్పందించారు. జేఎన్‌యూ యూనిర్సిటీలో ఇటీవల జరిగిన దాడిలో గాయపడ్డ బాధితులను దీపిక పరామర్శించడాన్ని ఎందుకు తప్పుపట్టాలి. తనకు నచ్చిన చోటుకి వెళ్లడం ఆమె ప్రాథమిక హక్కు కదా. తనకేది మంచిదో తనకి బాగా తెలుసు. రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన దాడులకు రాజకీయ రంగు పులిమి జాతీయ సమస్యగా చేయవద్దని నేను కోరుతున్నా. హైదరాబాద్‌ సిటీతో పాటు ఇక్కడ లభించే ముత్యాలంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి పెరల్స్‌ నా దగ్గర చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడకు వచ్చినప్పుడల్లా బిర్యానీ, ఆంధ్రా రసం, బగారా బైగాన్, కొబ్బరి పాయసం..వంటివి రుచి చూడకుండా వెళ్లను. నేను రచనలో శిక్షణ పొంది ఉన్నప్పటికీ దర్శకత్వం అంటేనే నాకిష్టం. డైరెక్టర్‌కి ఆల్‌ రౌండ్‌ లీడర్‌ షిప్‌ లక్షణాలు కావాలి. అది చాలా ఛాలెంజింగ్‌ రోల్‌. ఐ లవ్‌ డైరెక్టర్‌ జాబ్‌. టైటానిక్, జురాస...

పల్లె బాట పట్టిన నగరం

చిత్రం
సంక్రాంతి పండుగ దెబ్బకు మహానగరం పల్లె బాట పట్టింది. రైళ్లు, బస్సులు, విమానాలు, వాహనాలు ప్రయాణీకులతో నిండి పోయాయి. రహదారులపై వాహనాలు నిలిచి పోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ కోసం రెండు రోజులు ముందుగానే బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రధాన రైల్వే స్టేషన్‌లతో పాటు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌  ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లు, బస్సులు కిక్కిరిసి పోయాయి. మరోవైపు పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు రైల్వేతో సహా, ఆర్టీసీ, ప్రైవేట్‌ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ప్రైవేట్‌ రైళ్లలో ప్రత్యేక చార్జీలను విధించారు. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు పెంచగా, రాష్ట్రంలోని ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో 10 నుంచి 20 శాతం వరకు చార్జీలను పెంచారు. ఇక ప్రైవేట్‌ బస్సులు యథావిధిగా దారి దోపిడీ సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలను రెట్టింపు చేశాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 20 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. ...

మోడీకి సుప్రీం ఝలక్

చిత్రం
బీజేపీకి కొత్త ఏడాది అంతగా వర్కవుట్ అవుతున్నట్టు లేదు. ఓ వైపు దేశమంతటా మెలమెల్లగా ప్రతికూల వాతావరణం చోటు చేసుకుంటోంది. కన్నడ నాట సక్సెస్ అయినప్పటికీ మరాఠాలో మాత్రం చిరకాల మిత్రుణ్ణి కోల్పోయింది. అంతే కాదు ఏకంగా శరద్ పవార్ చాణక్యం ముందు మోడీ, అమిత్ షాల పాచికలు పారలేదు. తాజాగా మరో షాక్ తగిలింది సుప్రీం కోర్టు ద్వారా. ఇంటర్నెట్‌ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం ఇంటర్నెట్‌ ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ బిజినెస్‌ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపి వేయ కూడదని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారం లోగా సమీక్షించాలని కశ్మీర్‌ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్‌ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. అది ఒక వైభవోజ్వల మహా యు...

కంపెనీలు భళా..అమ్మకాలు డీలా

చిత్రం
ఒక్కో కంపెనీకి ఘనమైన చరిత్ర ఉంది. కానీ వాహనాల అమ్మకాల్లో మాత్రం ఆశించినంతగా వాహనం ప్రియులు, కొనుగోలుదారులను ఆకట్టుకోలేక పోయాయి. దేశీయంగా చూస్తే ఆర్ధిక రంగం పూర్తిగా గాడి తప్పింది. దీనిని ఓ క్రమ పద్ధతిలోకి తీసుకు వచ్చేందుకు దేశ ఆర్థిక శాఖా మంత్రి సీతారామన్ నానా తంటాలు పదుహానది. అయినా ఈ రంగం దిగి రానంటోంది. జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా అన్ని రంగాలు దిగాలు పడ్డాయి. దిక్కు తోచని స్థితిలోకి వెళ్లి పోయాయి. ఇదిలా ఉండగా వాహనాల రంగం కూడా పూర్తిగా కుదేలైంది. ఎన్ని ఆఫర్లు, గిఫ్టులు ప్రకటించినా అమ్ముడు పోలేదు. ఎన్ని డిజైన్లు రూపొందించినా అమ్మకాలు మాత్రం పెరగలేదు. దేశీయ మార్కెట్లో మరోసారి వాహనాల విక్రయాలు మందగించాయి. ఇప్పటికే వరుస త్రైమాసికాల్లో భారీగా పడిపోతున్న వాహన విక్రయాలు గత మాసంలో క్షీణతను నమోదు చేసాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం. దేశీయ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 1.24 శాతంక్షీణించి 2,35,786 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 2,38,753 యూనిట్లుగా వుంది. దేశీయ కార్ల అమ్మకాలు 8.4 శాతం తగ్గి 1,42,126 యూనిట్...

ఇక యుద్ధం తప్పదా

చిత్రం
ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలను కలవర పరుస్తోంది. ఇప్పటికే ఇరాన్ పై క్షిపణులతో దాడులకు పాల్పడిన అమెరికాకు అదే రీతిలో జవాబు ఇచ్చింది ఇరాన్. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తార స్థాయికి చేరుకున్నాయి. తమ జనరల్‌ ఖాసిం సులేమానీని హత మార్చినందుకు గానూ ఇరాన్‌.. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. పన్నెండు బాలిస్టిక్‌ క్షిపణులతో అమెరికా వైమానిక స్థావరాలపై విరుచుకు పడింది. కాగా ఇరాన్‌ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. అంతే గాకుండా యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు జారీ చేశారు. ఈ మేరకు..అంతా బాగుంది..ఇరాక్‌లో ఉన్న రెండు సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి.. అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ మా దగ్గర ఉంది. రేపు నేను కూడా ఓ ప్రకటన చేస్తాను అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు...

ఖాకీలపై కన్హయ్య కన్నెర్ర

చిత్రం
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులను అసభ్యంగా దూషించడం, నిందించడం వల్ల జాతి సమస్యలు పరిష్కారం కావని విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ స్పష్టం చేశారు. తమను జాతి విద్రోహులుగా పిలిచినంత మాత్రాన దేశం బాగుపడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో ముసుగులు ధరించిన దుండుగులు దాడి చేసి పలువురు విద్యార్థులు, టీచర్లను తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తల పగిలి తీవ్ర రక్తస్రావమైన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనను నిరసిస్తూ జేఎన్‌యూ విద్యార్థులు ర్యాలీలు చేపడుతుండగా పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఆయిషీ ఘోష్‌ సహా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ మాట్లాడారు.  మమ్మల్ని ఎంతగా అసభ్యంగా తిట్టాలనుకుంటే అంతగా తిట్టండి. జాతి విద్రోహులు అని పిలవండి. అయితే వీటి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీకు భద్రత చేకూరదు. కనీస అవసరాలు తీరవు. మీరెందుకు ఇంతగా విసుగెత్తి పోతున్నారో నేను అర్థం చ...