ఖాకీలపై కన్హయ్య కన్నెర్ర
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులను అసభ్యంగా దూషించడం, నిందించడం వల్ల జాతి సమస్యలు పరిష్కారం కావని విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ స్పష్టం చేశారు. తమను జాతి విద్రోహులుగా పిలిచినంత మాత్రాన దేశం బాగుపడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్యూలో ముసుగులు ధరించిన దుండుగులు దాడి చేసి పలువురు విద్యార్థులు, టీచర్లను తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ తల పగిలి తీవ్ర రక్తస్రావమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనను నిరసిస్తూ జేఎన్యూ విద్యార్థులు ర్యాలీలు చేపడుతుండగా పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఆయిషీ ఘోష్ సహా జేఎన్యూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మాట్లాడారు. మమ్మల్ని ఎంతగా అసభ్యంగా తిట్టాలనుకుంటే అంతగా తిట్టండి. జాతి విద్రోహులు అని పిలవండి. అయితే వీటి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీకు భద్రత చేకూరదు. కనీస అవసరాలు తీరవు. మీరెందుకు ఇంతగా విసుగెత్తి పోతున్నారో నేను అర్థం చేసుకోగలను. కనిపించ కుండా పోయిన వాళ్లను కనిపెట్టడం పోలీసులకు కుదరడంలేదు గానీ... జేఎన్యూ చెత్తడబ్బాల్లో 3 వేల కండోమ్లు దొరికాయట. అసలు వాళ్లు అంత కచ్చితంగా ఎలా లెక్క పెట్ట గలిగారో అంటూ ఘాటు విమర్శలు చేశారు. తుక్డే గ్యాంగ్ అంటూ తమను విమర్శిస్తున్న వాళ్లను ఉద్దేశించి... జేఎన్యూలో ప్రవేశం అంత సులభంగా ఏమీ లభించదని గుర్తు పెట్టుకోండని హితవు పలికారు.
బీజేపీ నేత ఙ్ఞాన్ దేవ్ అహుజా జేఎన్యూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..అక్కడ రోజూ 3 వేల బీరు క్యాన్లు దొరుకుతాయి. 2 వేల మద్యం బాటిళ్లు ఉంటాయి. పది వేల కాల్చేసిన సిగరెట్ పీకలు.. 4 వేల బీడీలు, 50 వేల మాంసపు ఎముకలు, 2 వేల చిప్స్ కవర్లు, 3 వేల కండోమ్లు, 5 వందల అబార్షన్ ఇంజక్షన్లు ఉంటాయి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన జేఎన్యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ కోసం రెండేళ్ల పాటు వెదికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసును విచారించిర సీబీఐ దానిని క్లోజ్ చేసింది. మొత్తం మీద ఢిల్లీ యూనివర్సిటీ ప్రస్తుతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీనిని నివారించడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలం చెందింది.
ఈ సందర్బంగా విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మాట్లాడారు. మమ్మల్ని ఎంతగా అసభ్యంగా తిట్టాలనుకుంటే అంతగా తిట్టండి. జాతి విద్రోహులు అని పిలవండి. అయితే వీటి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీకు భద్రత చేకూరదు. కనీస అవసరాలు తీరవు. మీరెందుకు ఇంతగా విసుగెత్తి పోతున్నారో నేను అర్థం చేసుకోగలను. కనిపించ కుండా పోయిన వాళ్లను కనిపెట్టడం పోలీసులకు కుదరడంలేదు గానీ... జేఎన్యూ చెత్తడబ్బాల్లో 3 వేల కండోమ్లు దొరికాయట. అసలు వాళ్లు అంత కచ్చితంగా ఎలా లెక్క పెట్ట గలిగారో అంటూ ఘాటు విమర్శలు చేశారు. తుక్డే గ్యాంగ్ అంటూ తమను విమర్శిస్తున్న వాళ్లను ఉద్దేశించి... జేఎన్యూలో ప్రవేశం అంత సులభంగా ఏమీ లభించదని గుర్తు పెట్టుకోండని హితవు పలికారు.
బీజేపీ నేత ఙ్ఞాన్ దేవ్ అహుజా జేఎన్యూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..అక్కడ రోజూ 3 వేల బీరు క్యాన్లు దొరుకుతాయి. 2 వేల మద్యం బాటిళ్లు ఉంటాయి. పది వేల కాల్చేసిన సిగరెట్ పీకలు.. 4 వేల బీడీలు, 50 వేల మాంసపు ఎముకలు, 2 వేల చిప్స్ కవర్లు, 3 వేల కండోమ్లు, 5 వందల అబార్షన్ ఇంజక్షన్లు ఉంటాయి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన జేఎన్యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ కోసం రెండేళ్ల పాటు వెదికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసును విచారించిర సీబీఐ దానిని క్లోజ్ చేసింది. మొత్తం మీద ఢిల్లీ యూనివర్సిటీ ప్రస్తుతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీనిని నివారించడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలం చెందింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి