పోస్ట్‌లు

నవంబర్ 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ట్రోలింగ్ పై మందన్న ఫైర్

చిత్రం
ఒక్కసారి సినిమా రంగంలోకి ఎంటర్ అయితే చాలు హీరోలకేమో కానీ వచ్చిన చిక్కంతా హీరోయిన్లకే. నటించడం సహజం. అలాగని వారికి ప్రైవసీ ఉంటుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా కామెంట్స్ చేసుకుంటూ పోవడం, ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ ఎక్కువై పోయింది. తాజాగా వీరి బారిన కన్నడ బ్యూటీ రష్మికా మందన్న కూడా పడింది. ఈ మేరకు ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించింది. సెలబ్రిటీల మైనంత మాత్రన తమ గురించి ఇంత నిర్దాక్షిణ్యంగా ట్రోలింగ్ చేయడం సరి కాదని, తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఒక నెటిజన్ ఆమె చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ చిన్న పిల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో నటి అవుతుందని ఎవరైనా ఊహించార అంటూ అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ ట్రోలింగ్ రష్మిక దృష్టికి రావడంతో ఆమె స్పందించింది. సెలబ్రిటీలను ట్రోలింగ్ చేయడం ద్వారా నెటిజన్లకు వస్తున్న లాభమేంటో నాకు తెలియడం లేదు. మేము మీకు ఎందుకు సాఫ్ట్ టార్గెట్స్ అవుతున్నాము. పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన మా మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తారా అంటూ ఫైర్ అయ్యింది. ట్రోలింగ్‌ను పట్టించు కోవద...

నటనలో రాణిస్తున్న జయశ్రీ

చిత్రం
తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ పరంగా మార్పులు చోటు చేసుకోవడంతో ఇప్పుడు సినిమా తీయడం అన్నది సులభంగా మారింది. మూవీ అంటేనే అదో కలల ఖార్ఖానా. పూర్తిగా సృజనాత్మకతకు సంబంధించిన అంశం. మూవీ అంటేనే 24 విభగాల సమ్మేళనం. రెండున్నర గంటల సినిమా చూడాలంటే ఆరు నెలలో లేదా ఏడాది పాటు వందలాది మంది టెక్నీషియన్స్ కష్టపడాల్సి ఉంటుంది. హిట్టయిందా సరి లేకపోతే వీరి శ్రమ వృధానే. ఇదో మాయాజాలం..జూదం కూడా. ఎందరో ఇందులోకి రావాలని నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ వేలాది మందిలో కొందరే హీరోలు..మరి కొందరు జీరోలే. ఎవరు ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో చెప్పలేం. అదంతా కష్టం మాటేమిటో కానీ అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. సినిమా అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్, డైరెక్టర్. ఒకప్పుడు హీరో డామినేషన్ ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారి పోయింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. స్టోరీ డామినేషన్ చేస్తోంది. ఇప్పుడు సక్సెస్ కావాలంటే కథలో దమ్ముండాలి. మాటలు పేలాలి. మ్యూజిక్ దుమ్ము రేపాలి. ఇదే సమయంలో ప్రధాన పాత్రలతో పాటు అతిథి పాత్రలు కూడా ముఖ్యమే. ఇలాంటి కేరెక్టర్స్ నటీమణుల్లో చాలా మంది వదిన, త...

సాగుతున్న..మహా..సస్పెన్స్

చిత్రం
మారాఠాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్‌ ముంచు కొస్తోంది. అయినా ఇరు పార్టీలు వెనక్కి తగ్గడం లేదు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచు కోవాలని డిమాండ్‌ చేస్తున్న శివసేన పట్టిన పట్టు వీడడం లేదు. రొటేషన్‌ పద్ధతిలో సీఎం పదవిని పంచు కోవడానికి సిద్ధపడితే బీజేపీతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని ఆ పార్టీ ప్రకటించింది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 182 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విస్తృతంగా ప్రచారం జరగడంతో శివసేనలో చీలికలు వస్తాయన్న ఆందోళన మొదలైంది. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ కుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు పార్టీ అధినేతకే కట్ట బెడుతూ ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి తరలించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొషియారిని కలుసుకున్నారు.  అసెంబ్లీ గడువు ముగిసేలోగా ప్రభుత్వ ఏర్పాటుకు...

చెలరేగిన రోహిత్..చిత్తైన బంగ్లా

చిత్రం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి పోయాడు. హిట్‌మ్యాన్‌ అంతా తానై నడిపించాడు. వందో మ్యాచ్‌లో శత గ్గొట్టే అవకాశం చేజారినా, భారీ సిక్సర్లతో చుక్కలు చూపించారు. తొలి మ్యాచ్‌తో బోల్తా పడ్డ భారత్‌ ఈ గెలుపుతో సమంగా నిలిచింది. రాజ్ కోట్ లో రెండో టీ-20 మ్యాచ్ బాంగ్లాదేశ్ జట్టుతో ఇండియా తలపడింది. రోహిత్‌ శర్మ మెరుపు బ్యాటింగ్‌ సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియాన్ని ముంచెత్తింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. మొహమ్మద్‌ నయీమ్‌ 36 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్‌ 30 పరుగులతో రాణించారు. భారత స్పిన్నర్‌ చహల్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 43 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు రోహిత్. శిఖర్‌ ధావన్‌ 27 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. సిరీస్‌ చేజార్చు కోకుండా ఉండాలంటే ఛేదించాల్సిన లక్ష్యాన్ని రోహిత్‌ సులువుగా మార్చేశాడు. 6 ఫోర్లు 6 సిక్సర్లతో బంగ్...

లక్కీ సుధీర్..లవ్లీ సినిమా

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద నవ్వులు పూయిస్తున్న వారంతా తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి టెలివిజన్‌ షోస్‌ ద్వారా ప్రేక్షకుల్లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ విడుదలకు సిద్ధమవుతోంది. రాజు గారి గది ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ, శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త శేఖర్‌ రాజు ఈ మూవీని నిర్మించారు. డిసెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్‌ వేర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు దర్శకుడు రాజశేఖర్ రెడ్డి. వినోదంతో పాటు వాణిజ్య అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. సుధీర్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుందన్నారు. సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పు కున్నాను అన్నారు నటి ధన్యా బాలకృష్ణ. నాకిది మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అ...

అమెరికాలో మనోళ్లు అదుర్స్

చిత్రం
ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక, వ్యాపార, క్రీడా రంగాలలో భారతీయులు అసాధారణమైన రీతిలో విజయాలు సాధిస్తున్నారు. ఇక ఐటీ సెక్టార్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది ఇండియా. అంతే కాదు ప్రపంచాన్ని శాసిస్తున్న పెద్దన్న, అమెరికాలో అత్యధికంగా మన ఇండియన్స్ తమ హవా కొనసాగిస్తున్నారు. అక్కడ పాలిటిక్స్ ను ప్రభావితం చేస్తున్నారు. తాజాగా నలుగురు ప్రవాస భారతీయులు అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరు ముస్లిం మహిళ కాగా, మరో వైట్‌ హౌజ్‌ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు. గజాలా హష్మీ వర్జీనియా స్టేట్‌ సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే, ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్‌ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గజాలా హష్మీ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజ్‌లో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. భారతీయ అమెరికన్లు ఎక్కువ...

జీతే రహో..సీజే సాబ్

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో అంతా తానే అయి చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకు చుక్కలు చూపిస్తున్నారు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు వైరల్ గా మారి పోయారు. నిజాయితీ, నిబద్దత, ప్రజల పట్ల అచంచలమైన ప్రేమ ఈ జస్టిక్ కు ఉన్నాయి. అందుకే ఆయన ధర్మాసనంలో ఉన్నారంటే అవతలి వారు ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నా భయపాడాల్సిందే. వణికి పోవాల్సిందే. ప్రతి అంశాన్ని పరిశీలించడం, కీలక తీర్పులు ఇచ్చే సమయంలో కొంత సంయమనం పాటించడం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన అట్టడుగు నుంచి వచ్చారు గనుక . జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పటి దాకా చీఫ్ జస్టిస్ గా రాజస్థాన్, కర్ణాటకలో పని చేశారు. రాఘవేంద్ర సింగ్ చౌహన్ ను రంజన్ గొగోయ్ నామినేట్ చేస్తే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేశారు. 24 డిసెంబర్ 1959 లో పుట్టారు. ఇప్పుడు ఆయనకు 59 ఏళ్ళు.13 నవంబర్ 1983 లో అడ్వొకేట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. క్రిమినల్, సర్వీస్ మేటర్స్ ఎక్కువగా చూశారు. 2005 లో రాజస్థాన్ హైకో...

తెగే దాకా తీగ లాగొద్దు

చిత్రం
ఓ వైపు కార్మికులు ..మరో వైపు ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ఇన్నేళ్ల సర్వీసులో ఇలాంటి అధికారులను చూడలేదు. అన్నీ అబద్దాలే. ఇది చట్ట వ్యతిరేకం. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. మీరు సమర్పించిన అఫిడవిట్లు తప్పుల తడకగా వున్నాయి. అసలు మంత్రి, ప్రభుత్వం ఉండీ ఏం ప్రయోజనం. ప్రజలు ఎన్నుకున్నది ఆస్తులు ధారాదత్తం చేసేందుకు కాదు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఇది. రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. అందరూ చట్టం ముందు సమానులే అన్న విషయం మరిచి పోయినట్టు ఉంది. చివరి అస్త్రం ప్రయోగించే అధికారం కోర్టుకు అంతిమంగా ఉందన్న సోయి సీఎం గుర్తించాలి. ఇదేదో రాజరిక వ్యవస్థ లాగా అనిపిస్తోంది. శాఖల మధ్య సమన్వయం లేదు. మీ నిర్వాకం వల్ల కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్షమాపణలు కాదు కావాల్సింది. సమస్యకు పరిష్కారం చేసే దిశగా చూడాలి. నీళ్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కార్మికులకు వేతనాలు చెల్లించ పోవడం దారుణం. ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని అంటే అర్థం ఇష్టానుసారం పాలన సాగించడానికి లైసెన్స్ లభించినట్టు కాదు. కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. శక్...

శ్రీముఖి తీరుపై నెటిజన్స్ ఫైర్

చిత్రం
బిగ్ బాస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫైనలిస్ట్ గా రాహుల్ గెలిచినా ఇంకా శ్రీముఖి ఫ్యాన్స్ జీర్ణించు కోలేక పోతున్నారు. చివరి సమయంలో పుంజుకున్న రాహుల్‌ టైటిల్‌ను దక్కించు కోగా శ్రీముఖి రెండో స్థానంలో నిలిచింది. ఇక రాహుల్‌ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్‌ అనుకున్న శ్రీముఖి రన్నరప్‌కే పరిమిత మవడం జీర్ణించు కోలేక పోతోంది. ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయట పెట్టింది. హోస్ట్‌ నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించ గానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు.  ఓటమిని ఎవరూ ఇష్ట పడరు. ముఖ్యంగా నేను అంటూ తన బాధను వెల్లగక్కింది. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచు కున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్య అతిథి చిరంజీవి కూడా రాహుల్‌ చెక్‌ మాత్రమే తీసుకున్నాడు. కానీ నువ్వు కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నావు అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ప్రజల తీర్పును శ్రీముఖి గౌరవించి నట్టులేదు. విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది అని ఆమె బిగ్‌బాస్‌ వేదికపై చెప్పుకొచ్చింది. అంటే రాహుల్ ఏం చేయక పోయినా, కేవలం అదృష్టం వల్...

స్టార్స్ మధ్య వార్

చిత్రం
ఈ సారి సంక్రాంతి పండుగకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. అదెక్కడంటే సినిమాల విడుదలకు సంబంధించి. బాక్సాఫీస్ వేదికగా జరిగే వార్ ప్రతీ ఏడాది ఉండేదే. సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి భారీ సినిమాలన్నీ పోటీ పడుతుంటాయి. పండగ సమయంలో రెండు, మూడు భారీ సినిమాలు విడుదలైనా కలెక్షన్లు బాగానే ఉంటాయని నిర్మాతలు భావిస్తుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఒకే రోజున రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. కలెక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓపెనింగ్స్, కలెక్షన్స్ దెబ్బ తింటాయని బయ్యర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాల విడుదల తేదీలు మార బోతున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురములో చిత్రం 11 న, సరిలేరు నీకెవ్వరు సినిమా 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. రెండు భారీ సినిమాల మధ్య రెండ్రోజుల గ్యాప్ రావడం ఇద్దరికీ మేలు చేస్తుందని భావిస్తున్నారు. మారిన విడుదల తేదీల గురించి ఆయా చిత్ర నిర్మాతలు త్వరలో అధ...

కోహ్లీ కన్న..మందాన్న మిన్న

చిత్రం
భారతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. ఈ రికార్డును ఏకంగా టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న క్రియేట్ చేసింది. ఇండియాకు ప్రపంచ మహిళా క్రికెట్ లో ఈ రూపకంగా మంచి పేరు తీసుకు వచ్చింది ఈ ప్లేయర్. అరుదైన రికార్డును బద్దలు కొట్టిన ఈ క్రికెటర్ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 63 బంతుల్లో 74 పరుగులు సాధించింది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగుల మైలు రాయిని చేరుకుంది. పురుషులు, మహిళల క్రికెట్‌లో కలిపి ఈ రికార్డు సాధించిన రెండో క్రికెటర్‌గా మందాన్న నిలిచింది. 48 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డు సాధించి టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ మొదటి స్థానంలో ఉండగా, మందాన్న 51 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలు రాయిని చేరుకొని రెండో స్థానంలో నిలిచింది. భారత పురుష క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లి కంటే కూడా మందాన్న రెండు వేల పరుగుల్ని ముందుగా సాధించడం విశేషం. కోహ్లి 53వ ఇన్నింగ్స్‌లో 2  వేల వన్డే పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఇక భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 52వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులు చ...

మొబైల్స్ క్రేజీ..అమ్మకాలు స్పైసీ

చిత్రం
కోట్లాది జనం ఇప్పుడు రేయింబవళ్లు మొబైల్స్ జపం చేస్తున్నారు. అవి లేకుండా, వాడకుండా ఉండలేక పోతున్నారు. ఇంటర్నెట్ సర్వీసెస్ పెరగడం, డేటా అత్యంత సులువుగా అందుబాటు లోకి రావడంతో స్మార్ట్ ఫోన్స్ కంపల్సరీగా మారింది. దీంతో ఆయా మొబైల్స్ తయారీదారులైన కంపెనీలకు లెక్కలేనంత ఆదాయం సమకూరు తోంది. ఆకట్టుకునే డిజైన్స్, కళ్ళు చెదిరే ఫీచర్స్ తో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియాలో 4 జీ స్మార్ట్ ఫోన్స్ విడుదలయ్యాక ఇప్పటి దాకా 530 మిలియన్ ఫోన్లను అమ్మేశారు. ఇది మొబైల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు. వీటిలో ఎక్కువగా చైనా కంట్రీకి చెందిన మొబైల్స్ ఉన్నాయి. వీటి విలువ సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు అంటే నమ్మగలమా. ఇది వాస్తవం కూడా. 2012లో ఇండియాలో మొదటి 4జీ స్మార్ట్‌ ఫోన్ విడుదలైంది. ఈ ఏడాది జూన్ 19 వరకు స్మార్ట్‌ఫోన్ తయారీ దారులు ఏకంగా 53 కోట్ల 4జీ ఫోన్లు విక్రయించినట్టు టెక్ ఆర్క్ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది భారత్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్లు విడుదల కాబోతున్నాయని, అయితే, 2022 తర్వాత కానీ జనాలు వాటిపై పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేదని పేర్కొంది. 2025 నాటికి దేశంలో సుమారు 300 మిలియన్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ...

సమ్మెపై సీజే సీరియస్..సర్కారు తీరుపై ఫైర్

చిత్రం
ఆర్టీసీసమ్మెపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నా 15 ఏళ్ళ సర్వీసు లో నేను మూడు రాష్ట్రాల్లో పని చేశా..కానీ ఇలాంటి అబద్దాలు చెప్పే ఐఏఎస్ అధికారులను ఎప్పుడూ చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు చీఫ్ జస్టిస్. కార్మికులు చేసున్న ఆందోళనను పరిష్కారించాలన్న ధ్యాస ఆర్టీసీ అధికారులకు, మంత్రికి, సీఎంకు లేనట్లుందని మండి పడింది. సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. కేంద్రానికి ఏపీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. ఆ వాటా టీఎస్‌ఆర్టీసీకి ఆటోమేటిక్‌గా బదిలీ కాదని వాదించింది. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా అనేది తలెత్తదని వివరణ ఇచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని, విభజన చేస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కేంద్రం వాదనపై స్పందించిన ఎస్కే జోషి, ఆర్టీసీ ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యుల్‌ 9 కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసినట్టు ఏజీ, ఆర్టీసీ ఎండీ కోర్టుకు వివరించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. అయితే వారి వ్యాఖ్యలపై స్పందించిన  హైకోర్టు, ఓ ...