పోస్ట్‌లు

మార్చి 31, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

చ‌క్రం తిప్పేదెవ్వ‌రు..ఢిల్లీ కోట‌పై పాగా వేసేదెవ్వ‌రు..? - పోటీ ర‌స‌వ‌త్త‌రం జ‌నం ఉత్కంఠ భ‌రితం

చిత్రం
క‌మ‌లం విక‌సించేనా..హ‌స్తం హ‌వా న‌డిచేనా..ప్రాంతీయ పార్టీల జెండా ఎగ‌రేనా..! వంద కోట్ల భార‌తావ‌ని ఉత్కంఠ‌తతో ఎదురు చూస్తోంది. కొద్ది రోజుల్లో ఎవ‌రు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటార‌నేది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మున్న‌త జాతి అంతా ఒకే తాటిపై నిలిచింది. ఈసారి ఎన్నిక‌లు ..స‌మ‌ర్థ‌త‌కు..నీతికి..నిజాయితీకి..అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు , యువ‌తీ యువ‌కులు త‌మ భ‌విష్య‌త్ బాగుండాల‌ని స‌ముచిత నిర్ణ‌యం తీసుకునేందుకు సమాయ‌త్తం అవుతున్నారు. తాయిలాలు, స‌బ్సిడీలు..సంక్షేమ ప‌థ‌కాలు ఎర వేసి ఓట్లు రాబ‌ట్టుకునే పార్టీల‌కు చుక్క‌లు చూపిస్తామంటున్నారు. దేశ‌మంతటా మోడీ గాలి వీసినా చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు త‌మ హ‌వాను కొన‌సాగించాయి. ఎన్ని ప్ర‌య‌త్నాలు మోడీ, అమిత్ షా చేసినా ఢిల్లీ కోట‌పై క‌మ‌లం జెండా ఎగుర వేయ‌లేక పోయారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కోసం ప్ర‌పంచమంతా త‌న వైపు తిప్పుకునేలా చేసిన ఘ‌న‌త ఒక్క అర‌వింద్ కేజ్రివాల్‌కే ద‌క్కుతుంది. ప్ర‌పంచంలోనే అత్యంత భారీ ప్ర‌జాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాలో 17వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం...

గూగుల్ మెచ్చిన కుర్రాడు - అబ్దుల్లా అద‌ర‌హో - కోటి 20 ల‌క్షల వార్షిక వేత‌నం

చిత్రం
ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని భార‌తీయ విద్యార్థుల‌కు అపార‌మైన అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. లెక్క‌లేనంత మందికి ఐటీ దిగ్గ‌జ కంపెనీలు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ఇండియాతో పాటు అమెరికాలో అత్య‌ధికంగా ఐటీ ప్రొఫెస‌న‌ల్స్ మ‌న‌వాళ్లే ఉన్నారు. ఐఐటీ, ట్రిబుల్ ఐటీ , ఎన్ఐటీ, ఇత‌ర కాలేజీల‌నే గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బైజూ త‌దిత‌ర కంపెనీల‌న్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ దేశంలో ఐఐటీల‌కు వున్నంత క్రేజ్..పోటీ ఇంకే కళాశాల‌ల‌కు లేదు. కేంద్ర స‌ర్కార్ భారీ ఎత్తున నిధుల‌ను ఖ‌ర్చు చేస్తోంది. స‌గ‌టున ఒక్కో విద్యార్థికి ఐఐటీల‌ల్లో కోర్సులు పూర్త‌య్యేంత దాకా కోటిన్న‌ర రూపాయ‌ల‌కు పైగా కేటాయిస్తోంది. నాణ్య‌వంత‌మైన బోధ‌న‌..అద్భుత‌మైన వాతావ‌ర‌ణం..ఎలాంటి వ‌త్తిళ్లు లేని త‌ర‌గ‌తి గ‌దులు..భిన్న‌మైన బోధ‌న‌..వెర‌సి విద్యార్థుల‌ను భావి భార‌త టెక్కీలుగా తీర్చిదిద్ద‌డంలో ఈ విద్యాల‌యాలు నిమ‌గ్న‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ స్థాయిలో ఏ విశ్వ విద్యాల‌య‌మైనా ఇండియ‌న్ ఐఐటీ స్టూడెంట్స్ అంటేనే మొద‌టి ప్ర‌యారిటి ఇస్తున్నాయి. ఎక్కువ శాతం ఐటీ , ఈ కామ‌ర్స్ కంపెనీల‌న్నీ ఇంజ‌నీరింగ్ లో టాప్‌ల...

ఎన్నిక‌ల సంగ్రామం - హీటెక్కిన ప్ర‌చారం

చిత్రం
దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌లు యుద్ధ రంగాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. కేంద్రంలో ప‌వ‌ర్‌లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన క‌మ‌ల‌నాథుల గుండె గొంతుక అమిత్ షా చాప కింద నీరులా చ‌క్రం తిప్పుతున్నారు. త‌మ‌కు రావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ తీసుకు వ‌చ్చేందుకు ఆప‌రేష‌న్‌ను స్టార్ట్ చేశారు. ఏ పార్టీ వారైనా స‌రే ..ఏ స్థానంలో ఉన్నా స‌రే గెలుపు గుర్రాల‌పైనే దృష్టి పెడుతున్నారు. దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు జాతీయ స్థాయి పార్టీల‌ను ఒకింత క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల‌లో ప్రాంతీయ పార్టీలు కొలువుతీరి వున్నాయి. స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని జాతీయ స్థాయిలోని స‌ర్వేలు తేట‌తెల్లం చేశాయి. దీంతో స్వ‌యంగా దేశ ప్ర‌ధాని .బీజేపీ ర‌థ‌సార‌థి న‌రేంద్ర మోడీ విప‌క్షాల‌ను టార్గెట్ చేశారు. ఓ ఛాయ్ వాలాను అందించిన ఈ దేశం మ‌రోసారి చౌకీదార్‌గా ఉండే త‌న‌కు అవ‌కాశం ఇవ్వండ‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల న‌గారా మోగింది. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌తో పాటు విప‌క్షా...