పోస్ట్‌లు

అక్టోబర్ 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ద్రవ్య లోటుపై రాజన్ ఆవేదన

చిత్రం
నిన్నటి దాకా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ చిలుక పలుకులు పలుకుతూ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. కానీ బయటకు అంతా సవ్యంగానే ఉందని అగుపిస్తున్నా లోలోపట మాత్రం భారతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయిందని విపక్షాలు, ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మోడీ పట్టించు కోవడం లేదు. ఇదే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టార్ ప్రమాదకరంగా తయారైందని హెచ్చరించారు. భారత ద్రవ్య లోటు సవ్యంగా లేదని స్పష్టం చేశారు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి రాజన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆసియాలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9 శాతం ఉండగా, క్రమ క్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడి పోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటోందని రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకు...

తమిళ సినిమాను షేక్ చేస్తున్న బిజిల్

చిత్రం
ఇండియాలో తెలుగు, తమిళ్ సినిమాలు పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. నిన్న బాహుబలి, సాహో, గద్దలకొండ గణేష్, సైరా సినిమాలు కలెక్షన్స్ లలో సునామి సృష్టిస్తుండగా తాజాగా తమిళ్ లో సినిమా విడుదల కాకుండానే సంచలనం కల్గిస్తోంది బిజిల్. ఇది పూర్తిగా ఆట ప్రధానంగా సాగే సినిమా. సన్ టీవీ యాజమాన్యం దీని రైట్స్ కొనుగోలు చేసింది. అయితే ఎంత మొత్తానికి తీసుకుందన్న వైషయాన్ని వెల్లడించలేదు. ఈ మూవీలో ప్రముఖ యాక్టర్, రైజింగ్ స్టార్ గా పేరున్న విజయ్ తో పాటు అందాల తార నయనతార నటించారు. ట్రైలర్ ను దర్శకుడు అత్లీ విడుదల చేశాడు. యూట్యూబ్ ను షేక్ చేస్తూ ఒకే ఒక్క రోజులోనే కోటిన్నరకు పైగా బిజిల్ ను చూశారు. దీంతో మూవీ విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తోందనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బిజిల్ సినిమాకు అత్లీ దర్శకత్వం వహించారు. కలపతి అఘోరామ్, ఎస్. గణేష్, ఎస్. సురేష్ లు నిర్మించారు. దీనికి కథను అత్లీ, రమణ గిరివాసన్ సమకూర్చారు. విజయ్, నయనతార తో పాటు వివేక్, ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, కాతిర్, యోగి బాబు నటించారు. బిజిల్ సినిమాకు సంగీతాన్ని దిగ్గజ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ అందించారు. కెమెరా విభాగాన్ని జీక...

అయ్యో మహేషా ఎందుకిలా

చిత్రం
ఏందప్పా మచ్చా అంటూ రాయలసీమ యాసతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు, బిగ్ బాస్ పార్టిసిపెంట్ మహేష్ ఊహించని రీతిలో ఎలిమినేటి అయ్యాడు. మొన్న ముద్దుగుమ్మ, ప్రేమ పావురం పునర్నవి వెళ్లి పోగా ఈసారి నామినేషన్స్ లలో మహేష్ వంతు వచ్చింది. ఈ నామినేషన్స్ లలో ముగ్గురు రాహుల్, వరుణ్, మహేష్ లు ఉండగా రాహుల్ , వరుణ్ లు సేఫ్ కాగా మహేష్ ఎలిమినేట్ అయ్యాడంటూ బాధపడుతూ చెప్పారు హోస్ట్ అక్కినేని నాగార్జున. బిగ్ బాస్ పెట్టిన అన్ని టాస్క్ లలో మహేష్ పాల్గొన్నాడు. ప్రతి సారి నామినేషన్స్ లలో చేరుకున్నా సేఫ్ అవుతూ వచ్చారు. ఇదిలా ఉండగా స్టార్ టీవీ సమర్పిస్తున్న ఈ రియాల్టీ షో కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. తెలుగు బుల్లి తెరపై మిగతా ఛానల్స్ ప్రోగ్రామ్స్ కు  ఝలక్ ఇస్తూ రేటింగ్ లో దూసుకు పోతోంది. ఎంతైనా స్టార్ టీవీ రూటే సపరేట్ అంటున్నారు ఎంటర్టైన్మెంట్ వర్గాలు. ఇదిలా ఉండగా తెలుగులో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో ఇది మూడో ఎపిసోడ్. మొదటి బిగ్ బాస్ షో ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే రెండో బిగ్ బాస్ ఎపిసోడ్ ను నటుడు నాని హోస్ట్ చేశారు. కానీ అందరి కంటే భిన్నంగా నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ ...

సమ్మెపై స్పందించిన పెద్దన్న..ఏపీలో ఆర్టీసీ జేఏసీకి మద్దతు

చిత్రం
తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ కు , పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దన్న కేశవరావు ఆర్టీసీ సమ్మెపై లేటుగా అయినా లేటెస్ట్ గా స్పందించారు. అయితే ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ ను అభినందిస్తున్నట్లు చెబుతూనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి సానుభూతితో పరిశీలించాలని హితవు పలికారు. కార్మికుల ఆత్మహత్యలు తనను ఎంతగానో వేదనకు గురి చేశాయని, చావులు, బలిదానాలు, ఆత్మహత్యలు ఏ సమస్యలను పరిష్కరించ లేవని అన్నారు. కేశవరావు ప్రస్తుతం అధికార పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్నారు. పరిస్థితులు చేయిదాటి పోక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింప చేయాలని, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందన్నారు. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని కేశవరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని పేర...

నడిగర్ సంఘం..సంక్షేమమే లక్ష్యం

చిత్రం
తమిళ సినీ రంగంలో నడిగర్ సంఘం ఓ సెన్సేషనల్. దీనిపై ఎక్కడా లేనంత క్రేజ్ ఉన్నది. దీనిలో సభ్యత్వం ఉండడం, పదవులు దక్కించు కోవడం ఇటు సినిమా రంగాన్ని, రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తోంది. ఇందులో ఉన్న డబ్బులను మిస్యూజ్ చేస్తున్నారంటూ ప్రస్తుత సంఘం నేతలు నాజర్, విశాల్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు మిగతా నటులు. విశాల్ తమిళనాడుకు చెందిన వాడు కాదని, తెలుగు వాడైన విశాల్ కు నడిగర్ సంఘం లో పోటీ చేసేందుకు అర్హుడు కాదంటూ ధ్వజమెత్తారు. ఈ సమస్యపై ఇరు వర్గాలుగా వీడి పోయారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మరో అడుగు ముందుకేసి కోర్టు తలుపులు తట్టారు. తమ ప్యానల్లోని సభ్యులు ఎవరూ ఒక్క పైసా తీసుకోలేదని, గతంలో ఎన్నికైన పాలకవర్గమే అవినీతి, అక్రమాలకు పాల్పడిందంటూ ధ్వజమెత్తారు నటుడు విశాల్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా తాను ఇక్కడే ఉన్నానని, తన పోటీని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. ఇదిలా ఉండగా తాజాగా చెన్నైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నడిగర్‌ సంఘంలో సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయని ఆ సంఘ సభ్యులు సంఘ రిజిస్ట్రార్‌ శాఖకు, రాష్ట్ర సచివాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దక్షిణ భారత నటీ...

ఇక దాదానే సుప్రీం

చిత్రం
ప్రపంచంలోని క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రెసిడెంట్ కావడం అంటే అమెరికా ప్రెసిడెంట్ కావడం కంటే ఎక్కువ. ఎందుకంటే ఇండియా అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. ఇక్కడ ఈ ఆటకున్నంత క్రేజ్ ఏ ఆటకు లేదు. ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇక్కడి క్రికెటర్లకు ఉన్నంత డిమాండ్ ఏ ఆటగాడికి లేదు. కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు ఎక్కడికి వెళ్లినా రాచ మర్యాదలు, సకల సౌకర్యాలు ఉంటాయి. వీరి తర్వాతే సినీ సెలబ్రెటీలు. ఒకప్పుడు సామాన్యులైన వీరంతా ఇప్పుడు దేశాన్ని, రాజకీయాలను, ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అయితే మిగతా దేశాలలో ఇక్కడున్నంత క్రేజ్ అక్కడ ఉండదు. ఇదిలా ఉండగా బెంగాల్ కు చెందిన సౌరబ్ గంగూలీ అంటేనే ఇండియాలో చెప్పలేనంత క్రేజ్. ప్రస్తుతం దాదా కన్ను బిసిసిఐ పై పడింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా వ్యవహరిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ బోర్డు కోశాధికారిగా ఎంపిక కానున...

దివాళా అంచున దేశం..?

చిత్రం
గత పాలకుల వైఫల్యం, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం 130 కోట్ల సమున్నత భారతం పాలిట శాపంగా మారింది. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దివాళా అంచున నిలబడ్డది. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక, కళా, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ కునారిల్లి పోయాయి. దేశానికి దిశా నిర్దేశం చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద వున్న కోట్లాది రూపాయలను ప్రస్తుత సర్కార్ కు ఇటీవలే సమకూర్చింది. నెలనెలా దినదినగండం అర్దాయుస్సు లాగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులలో పెదాలు, సామాన్యులు, ప్రజలు కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ దొంగలు, ఎగవేతదారులకు దోచి పెట్టారు. తాజాగా 70 వేల కోట్లు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఏ ముహూర్తాన నోట్ల రద్దు ప్రకటించారో అప్పటి నుంచి నేటి దాకా భారత ఆర్ధిక రంగం గాడిన పడలేదు. అమెరికా పర్యటన సందర్బంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత రంగాలు మరింత బలపడేందుకు జీఎస్టీ ద్వారా విధించిన పన్నులను తగ్గించింది. దీంతో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ మార్కెట్ రంగం, స్టాక్ మార్కెట్ సెక్టార్స్ రాకెట్ కంటే వేగంగా దూసుకు వెళ్లాయి. తర్వాత డీలా పడ్డాయి...

ఇదేనా కోరుకున్న తెలంగాణా..?

చిత్రం
తెలంగాణా మరోసారి తన అస్తిత్వం కోసం ఎదురు చూస్తున్నది. తెలంగాణా అంటేనే మహత్తరమైన చరిత్ర. విస్మరించలేనటువంటి ఘనమైన వారసత్వం కలిగి ఉన్నది. దీనిని తేలిగ్గా తీసుకోలేం..తీసి పారేయటానికి ఇదేదో నమీబియానో లేదా ఇథియియోపియానో కాదు. ప్రగతి శీలత కలిగిన, బుద్ది జీవులు, మేధావులు, కవులు, కళాకారులు, నిబద్దత కలిగిన సమూహంతో పాటు, బలిదానాలు, త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాలకు ఊపిరి పోసుకున్నది ఈ తెలంగాణ. అపారమైన వనరులు, అంతులేని జలవనరులు, సంపదత్వం కలిగిన ప్రాంతం ఇది. దీని గురించి చెప్పాలంటే పది దశాబ్దాలు సరి పోవు. సుదీర్ఘమైన పోరాటంతో, దోపిడీ, వివక్ష నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం ప్రపంచ చరిత్ర గతినే మార్చి వేసింది. అంతటి ఘనమైన కథ ఉన్నది దీనికి. తెలంగాణ అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక్కడ ఉన్నంత ఆత్మీయత, అనుబంధం, ఆథిత్యం ఇంకెక్కడా అగుపించదు. అందుకే తెలంగాణ అంటే ఎందరికో ఇష్టం..స్ఫూర్తి కూడా. లోకపు వాకిట నెత్తుటి సంతకం చేసిందీ తెలంగాణ. నివురు గప్పిన నిప్పులా, నింగిని చీల్చే మిస్సైల్ లా, నేలను ముద్దాడే ఆయుధంలా నిటారుగా నిలబడ్డది. దీనిని ముట్టుకోవాలని చూసిన వాళ్ళు నామ రూపాలు లేకుండా పోయారు. చరిత్ర గమనంలో ...

వేణు గానం..ఆనంద గీతం 

చిత్రం
తెలుగు సినిమాలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరున్న వారిలో జి.ఆనంద్ ఒకరు. అమెరికా అమ్మాయి సినిమాలో ఆయన పాడిన ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక అనే పాట ఇప్పటికీ ఎప్పటికీ మరిచి పోలేం. ఎన్నో సినిమాలకు తన గాత్రంతో అరువిచ్చి ఆకట్టుకున్నారు. తాను ఓ సంగీతపు సంస్థను నెలకొల్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన అసలు పేరు గేదెల ఆనంద్ రావు. 2500 కు పైగా సినిమా పాటలు పాడారు. ఎందరినో గాయనీ గాయకులను పరిచయం చేశారు. దాదాపు ఏడు వేలకు పైగా ఇతర దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. దీంతో  కొన్ని సినిమాలకు పాటలు పాడే అవకాశాన్ని కోల్పోయారు. అంతే కాకుండా దాదాపు కొన్నేళ్లుగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ తదితర భాషల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు ఎస్.పి. బాలసుబ్రమణ్యం. ఆయనను దాటుకుని పాటలు రావడం అంటే అది అదృష్టమని చెప్పాలి. నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు అవకాశాలు కల్పిస్తున్నారు జి.ఆనంద్.    పుట్టిన జిల్లాపై ప్రేమతో జిల్లాలో ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ఆయన తప్పనిసరిగా హాజరవుతుంటారు. చాలా మంది వర్ధమాన గాయనీ గాయకులు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తమ...

ఉద్యోగాల ఊసేది..దేశానికి దిక్కేది..!

చిత్రం
భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిందని, ఉద్యోగాల కల్పన అన్నది కలగానే మిగిలిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ రోజు వరకు పరిస్థితిని చక్కదిద్ద కుండా కాకమ్మ కబుర్లు చెబుతూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారంటూ ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను ద్రుష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కోట్లాది యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రభుత్వం చంద్రుడిని చూడాలని చెబుతోందని ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2ను ఉటంకిస్తూ రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో డోక్లాం ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారా అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. లాతూర్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. 2017లో చైనా దళాలు భారత భూభాగంలో ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ ఇది మేకిన్‌ ఇండియా కాదని మేకిన్‌ చైనా అని ఎద్దేవా చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను ప్రస్తావించ కుండ...

టీమిండియాదే టెస్ట్ సిరీస్

చిత్రం
విరాట్ కోహ్లీ నాయకత్వం లోని భారత జట్టు స్వదేశం లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. పూణే వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఫాలో ఆన్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా ను 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్‌ చేసి మ్యాచ్‌ గెలుపొందింది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగి పోవడంతో సఫారీల ఇన్నింగ్స్‌ టీ బ్రేక్‌ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌ ౪౮ పరుగులు చేయగా, బావుమా 38 , ఫిలిండర్‌ 37, మహరాజ్‌ 22 మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా పెవీలియన్ బాట పట్టారు. దీంతో   కోహ్లి టీమ్ ఇన్నింగ్స్‌137 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్, కోహ్లీ, పుజారా, రెహానే లు రాణించడంతో భారీ స్కోర్ చేసింది. సౌత్ ఆఫ్రికా ఫాలో ఆన్ ఆడింది. ఇక దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మార్కరమ్‌ను తొలి వికెట్‌గా ఇషాంత్‌ ఔట్‌ చేస్తే, డిబ్రుయిన్‌ ను ఉమేశ్‌ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. సాహా అద్భుతమైన క్యాచ్‌తో డిబ్రుయిన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 21 పరుగులకే సఫారీలు రెండు వికెట్లు కోల్పోగా డుప్లెసిస్‌ అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఆపై ఎల్గర్‌, డీ...

మోగనున్న పెళ్లి బాజా.. ఒక్కటవనున్న ఆనం..అసద్..!

చిత్రం
ప్రపంచంలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ కు కేరాఫ్ గా నిలిచింది అందమైన భాగ్యనగరం. వీరెవ్వరో కాదు ఒకరు టీమిండియా జట్టుకు మాజీ సారథి, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజహరుద్దీన్ కాగా మరొకరు ప్రపంచ టెన్నిస్ స్టార్, అందమైన క్రీడాకారిణి సానియా మీర్జా. ఈ రెండు కుటుంబాల మధ్యన దాదాపు కొన్నేళ్ల బంధం ఇమిడి ఉన్నది. అజారుద్దీన్ కు ఇద్దరు కొడుకులు. అయితే ఒక బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇదిలా ఉండగా అజ్జు భాయ్ కొడుకు అసదుద్దీన్..సానియా మీర్జా చెల్లెలు ఆనమ్‌మీర్జా  ఏడాదిగా ప్రేమించుకుంటూ ఉన్నారు. త్వరలో వీరిద్దరికి పెళ్లి జరగనున్నది. ఈ రెండు ఫ్యామిలీస్ హైదరాబాద్ లో ఏకంగా షాపింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు. వచ్చే డిసెంబర్ నెలలో షాదీ జరిపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. మొదట నేనే ఆనమ్‌మీర్జా కు ప్రపోజ్ చేశా. ఇద్దరి మధ్య బాండింగ్ కొన్నేళ్లు సాగింది అని చెప్పాడు అసదుద్దీన్. ఆమె ఆలోచించకుండానే ఒకే చెప్పిందని తెలిపారు. తన తండ్రి లాగానే అసదుద్దీన్ కూడా బెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా ఉన్నాడు.  ప్రస్తుతం వీరిద్దరి గురించిన ప్రేమ వ్యవహారం హైదరాబాద్ లో హల్ చల్ ...

బిగ్ బాస్ పై వీడని ఉత్కంఠ..ఎవరికి దక్కేనో ప్రైజ్ మనీ

చిత్రం
తెలుగు బుల్లి తెరపై ఇప్పుడు బిగ్ బాస్ ఓ సంచలనం. ఎంతో ఆసక్తిగా నడుస్తోంది బిగ్ బాస్ -3 ప్రోగ్రాం. దీంతో ఫైనల్ కు ఎవరు చేరుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కొద్దీ రోజుల్లో బిగ్ బాస్ పూర్తి కాబోతున్నది. మిగతా వినోదపు ఛానల్స్ కంటే ఎక్కువగా ఈసారి స్టైలిష్‌గా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అందరిని విస్తు పోయేలా చేశారు. ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చి ఎపిసోడ్‌ను అత్యంత వినోద కరంగా మార్చేశారు. ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్స్‌ను ముందుగా చూపించారు.  ఫీల్ ది ఫిజ్ అనే టాస్క్‌లో బాబా భాస్కర్, అలీ, వ‌రుణ్‌లు పాల్గొన‌గా గేమ్ టైగా ముగిసింది. దీంతో టాస్క్ విజేత‌గా అలీ నిలిచారు. వితికా, వరుణ్‌లు స్విమ్మింగ్‌ పూల్‌లో కాసేపు చర్చ జరిపారు. వరుణ్‌ను ఎత్తుకొని పూల్‌లో పడేసేందుకు వితికా గట్టి ప్రయత్నం చేసింది. కానీ అది ఆమెకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నాగార్జున ఇంట్లో ఉన్న సభ్యులకు ట్రెజర్‌ హంట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇంట్లో దాచిన వస్తువులను  పట్టుకోవాలని సూచించారు. దీంతో అందరూ వాటిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అలీ రాజా నే ఎక్కువ వస్తువులను కనిపెట్టాడు. మిగతా సభ్యులు ఒక వస్తువును మాత్రం ...

కమేడియన్ శ్రీనివాస్ రెడ్డికి జగన్ గిఫ్ట్

చిత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారంతో పాటు వైఎస్సార్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు శ్రీనివాస్ రెడ్డి. హాస్య నటుడిగా, హీరోగా ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్నారు. తన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఒక్కరొక్కరికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. తనను నమ్ముకుని, తన ఉన్నతి కోసం పాటుపడిన వారికి అరుదైన పదవులు కట్టబెట్టారు ఏపీ సీఎం. అంతకు ముందు వైసీపీకి తెలుగుసినిమా రంగంలో చాలా మంది చేయిచ్చారు. కానీ కొంత మంది నటులు మాత్రమే జగన్ వెంట నడిచారు. వారిలో ముందు వరుసలో నిలిచారు కమెడియన్స్ ప్రుత్వి రాజ్, ఆలీ, శ్రీనివాస్ రెడ్డి తో పాటు డాక్టర్ రాజశేఖర్, జీవిత, తదితరులు ఉన్నారు. ఇటీవలే ఆలీకి, పృథ్వీ రాజ్ కు ప్రోటోకాల్ ఉన్న పదవులు కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ కు చైర్మన్ గా పృథ్వీ ని నియమించారు. ఇప్పటికే ఆయన భాద్యతలు చేపట్టారు. దాని ప్రక్షాళన కూడా స్టార్ట్ చేసారు. గతంలో అందులో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డికి  ‘తిరుమల శ్రీవేంకటేశ్వర ...

మనోడు మామూలోడు కాదప్పా - కృష్ణా రెడ్డి గెలుపు కథ 

చిత్రం
  మామూలోడు కాదు మన కేవీ కృష్ణారెడ్డి. ఆంట్రపెన్యూయిర్, ట్రావెలర్ , ఫోటోగ్రాఫర్, ఐఐటీయన్, బెస్ట్ సక్సెస్ ఫుల్ సీఇఓ కూడా. ఇడియా ల్యాబ్ పేరుతో ఐటీ కంపెనీని హైదరాబాద్ లో ఏర్పాటు చేశాడు. వెబ్ సొల్యూషన్స్, టెక్నాలాజీ పరంగా కన్సల్టెన్సీ కూడా సేవలు అందిస్తోంది ఈ కంపెనీ. స్వతహాగా ఐఐటీ పూర్తి చేయడంతో మనోడి మెదడు పాదరసం లా పని చేసింది. తాను జాబ్ చేస్తే తనకు, ఫ్యామిలీకి మాత్రమే సంతోషం. తానే ఓ కంపెనీ పెడితే వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఎన్నో కుటుంబాలకు ఆధారం ఇచ్చినట్లవుతుందని ఆలోచించాడు. కేవీ కృష్ణారెడ్డిది అనపర్తి ప్రాంతం. ఐఐటీ బాంబే లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో పూర్తి చేశాడు. ఎస్టీవివి ఐటీ కంపెనీకి కన్సల్టెంట్ గా ఉన్నాడు. ప్రపంచంలోనే ఎంతో పేరు గాంచిన సెర్చింగ్ దిగ్గజ కంపెనీ రీడిఫ్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని చేశాడు. స్క్సివ్ ఇంటర్నెట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా చీఫ్ టెక్నీకల్ ఆఫీసర్ గా కృష్ణారెడ్డి పని చేశారు. ఇడియా వెబ్ సొల్యూషన్స్ కు సిఇఓ గా ఉన్నారు. ఇదే కంపెనీ పేరుతో ఫౌండేషన్ స్థాపించాడు. తాజాగా చెన్నైలో భారీ ఎత్తున వర్క్ జోన్ బిజినెస్ సె...

తెలంగాణాలో టెన్షన్ టెన్షన్..డ్రైవర్ మృతి..పరిస్థితి ఉద్రిక్తం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కార్మికులు బస్సులపై దాడికి పాల్పడ్డారు. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పువ్వాడ ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు. దీంతో పోలీసులు మరింత భద్రత పెంచారు. పరిస్థితి అదుపు తప్పడంతో అర్ధరాత్రి మెరుగైన చికిత్స కోసం శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించారు. కంచన్ బాగ్ లో ఉన్న డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతకు ముందు కోదండరాం, అశ్వత్థామ రెడ్డి, నారాయణ, తమ్మినేని వీరభద్రం, తదితర నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మోహరించారు. ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల బాద్యులు అక్కడికి చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తనను తాను అర్పించుకున్నాడు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ...