అయ్యో మహేషా ఎందుకిలా


ఏందప్పా మచ్చా అంటూ రాయలసీమ యాసతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు, బిగ్ బాస్ పార్టిసిపెంట్ మహేష్ ఊహించని రీతిలో ఎలిమినేటి అయ్యాడు. మొన్న ముద్దుగుమ్మ, ప్రేమ పావురం పునర్నవి వెళ్లి పోగా ఈసారి నామినేషన్స్ లలో మహేష్ వంతు వచ్చింది. ఈ నామినేషన్స్ లలో ముగ్గురు రాహుల్, వరుణ్, మహేష్ లు ఉండగా రాహుల్ , వరుణ్ లు సేఫ్ కాగా మహేష్ ఎలిమినేట్ అయ్యాడంటూ బాధపడుతూ చెప్పారు హోస్ట్ అక్కినేని నాగార్జున. బిగ్ బాస్ పెట్టిన అన్ని టాస్క్ లలో మహేష్ పాల్గొన్నాడు. ప్రతి సారి నామినేషన్స్ లలో చేరుకున్నా సేఫ్ అవుతూ వచ్చారు. ఇదిలా ఉండగా స్టార్ టీవీ సమర్పిస్తున్న ఈ రియాల్టీ షో కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

తెలుగు బుల్లి తెరపై మిగతా ఛానల్స్ ప్రోగ్రామ్స్ కు  ఝలక్ ఇస్తూ రేటింగ్ లో దూసుకు పోతోంది. ఎంతైనా స్టార్ టీవీ రూటే సపరేట్ అంటున్నారు ఎంటర్టైన్మెంట్ వర్గాలు. ఇదిలా ఉండగా తెలుగులో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో ఇది మూడో ఎపిసోడ్. మొదటి బిగ్ బాస్ షో ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే రెండో బిగ్ బాస్ ఎపిసోడ్ ను నటుడు నాని హోస్ట్ చేశారు. కానీ అందరి కంటే భిన్నంగా నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ మూడో ఎపిసోడ్ మాత్రం స్టార్ మా టీవీకి లెక్కలేనంత పేరు తీసుకు వచ్చింది. అంతే కాకుండా పెట్టిన ఖర్చుకు రెట్టింపు డబ్బులు వచ్చాయి. ఈ ప్రోగ్రాం ను చైనా దిగ్గజ మొబైల్ కంపెనీలు ఒప్పు, వివో తో పాటు హైదరాబాద్ లో పేరున్న పలు కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి.

దీంతో పేరుతో పాటు ప్రచారం లభిస్తోంది. అంతే కాకుండా మా టీవీకి ఆదాయమూ సమకూరుతోంది. ఇదిలా ఉండగా తాజా ఎపిసోడ్ బిగ్ బాస్ లో కొంత ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. అందరూ మహేష్ వెళ్లిపోవడంపై భాధను వ్యక్తం చేశారు. ఓట్ల శాతంలో తేడా రావడంతో మహేష్ ఎలిమినేట్ కాక తప్పలేదు. మొత్తం మీద రాహుల్..రితికాల మధ్యనే ఫైనల్ ఉండబోతున్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి నటి పునర్నవి బాంబు పేల్చింది. తాను రాహుల్ ను ప్రేమించడం లేదని, తామిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేసింది. ఎవరు విజేతగా నిలుస్తారనేది త్వరలోనే తేలనుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!