దిశ చట్టం చారిత్రాత్మకం

మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ చట్టం చారిత్రాత్మకమని ఆ రాష్ట్ర సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టించేలా రాష్ట్రంలో ఈ చట్టం తీసుకొచ్చామన్నారు. ప్రతి మహిళకు భద్రత, భరోసా కల్పిస్తూ దీన్ని రూపొందించామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిర్వహించి.. శిక్ష ఖరారు చేసినప్పుడు మాత్రమే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నిరోధానికి, సత్వర న్యాయం కోసం రూపొందించిన ‘ఏపీ దిశ’ బిల్లుపై చర్చ జరిగింది. దిశ చట్టం విప్లవాత్మక నిర్ణయమని, దీనిపై దేశమంతా చర్చ జరుగుతుందని జగన్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రక్రియ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం అవసరమన్నారు. దిశ చట్టంలో చేస్తున్న సవరణలు రాష్ట్రపతి వరకు వెళ్తున్నందున దేశమంతా తెలిసి చర్చ జరుగుతుందని.. ఆ దిశగా మిగతా రాష్ట్రాలు ఆలోచించేందుకు మనం శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ కొత్త చట్టంతో నేరం జరిగిన తర్వాత ఏడు పని ...