స్మృతి ఫైర్..రాహుల్ డోంట్ కేర్

ఏదో రకంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ దేశంలో వైరల్ అవుతున్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే అంటూ కాంగ్రెస్ అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అత్యాచార ఘటనల నేపథ్యంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు రేపిస్టులను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఈ క్రమంలో రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ ఎంపీలు పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచార పర్వాలు కొనసాగడం గురించి రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇది మేకిన్‌ ఇండియా కాదు. రేపి ఇన్‌ ఇండియా అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఓ యువతిపై అత్యాచారం చేసినా  స్పందించడం లేదన్నారు రాహుల్ గాంధీ. ఈ విషయంపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మహిళలపై అత్యాచారాలకు పాల్పడాలంటూ ఓ నాయకుడు పిలుపునివ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. తన వ్యాఖ్యలతో రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారు. ఆయనను శిక్షించాల్సిందే. తన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేశారు. మగవాళ్లంతా రేపిస్టులు కారు. రాహుల్‌ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. 50 ఏళ్ల వయస్సు పైబడుతున్నా రాహుల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నా అని మండిపడ్డారు.

అదే విధంగా మరో బీజేపీ ఎమ్మెల్యే లోకేత్‌ ఛటర్జీ స్పందిస్తూ..పరిశ్రమల అభివృద్ధికై ప్రధాని మోదీ మేకిన్‌ ఇండియా అంటే రాహుల్‌జీ మాత్రం రేపిన్‌ ఇండియా అంటున్నారు. మహిళలపై అత్యాచారాలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇది భారత మహిళలకు, భరతమాతకు ఘోర అవమానం అన్నారు. ఈ సమయంలో రాహుల్‌ సభలో లేరు. ఆయన వచ్చే సరికే లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం రాహుల్ మీడియాతో  మాట్లాడారు. రేపిన్‌ ఇండియా వ్యాఖ్యలపై తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!