పోస్ట్‌లు

నవంబర్ 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అరెస్టులు..ఆందోళనలు

చిత్రం
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల దీక్ష టెన్షన్ కలిగిస్తోంది ఛలో ట్యాంక్‌బండ్‌ ఆందోళన కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయినా ఎట్టి పరిస్థితుల్లో చేపట్టి తీరుతామని జేఏసీ, విపక్షాలు ప్రకటించాయి. తెలంగాణ అంతటా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరో వైపు సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పు ప్రకటించనుంది. దీంతో దేశమంతటా, రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక వివిధ పార్టీల నేతలతో పాటు ప్రజా, విద్యార్ధి సంఘాల నాయకులు, కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేశారు పోలీసులు. మఫ్టీలో ఉన్న పోలీసులు జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికుల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కార్మికులు తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా పోలీసులు అనుమతించక పోవడంతో ఉద్యోగాలకు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే వారు నానా అగచాట్లు పడుతున్నారు. రహదారులు మూసి వేసి, ట్రాఫిక్‌ మళ్లించడంతో కష్టాలు పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరి సర ప్ర...

అరుదైన కలయిక..అద్భుత వేడుక

చిత్రం
వారిద్దరూ అద్భుతమైన నటులు. వారి నటన అమోఘం. వారు చిటికేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు సూసైడ్ చేసుకునేందుకు రెడీగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. తాము అనుకున్నది చేయడం వారిద్దరి నైజం. దేశంలో  టాప్ మోస్ట్ హీరోస్ గా చెలామణి అవుతున్నారు. వారెవ్వరో కాదు తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్, నేచురల్ స్టార్ కమల్ హాసన్. వీరిద్దరూ ఒకే వేదికపై కలిశారు. సౌత్ స్టార్ కమల్ హాసన్ బర్త్ డే ను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వీరిద్దరికి సినిమా అవకాశాలను ఇచ్చి, గొప్ప నటులుగా తీర్చి దిద్దిన ఘనత ప్రముఖ దర్శకుడు బాలచందర్ దే. ఆయన భౌతికంగా లేక పోయినా, వీరిద్దరూ ఆయనను నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు. రజనీ కాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన పేరు రజనీకాంత్ గా మార్చింది మాత్రం బాలచందర్. ఇక అప్పటి నుంచి నేటి దాకా ఆయన తన హవాను కొనసాగిస్తున్నారు. ఇక కమల్ హాసన్ కు దేశ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చిన సినిమా మరో చరిత్ర. దానిని అన్ని భాషల్లోకి రిలీజ్ చేశారు. దీనిని హిందీలో ఏక్ దూజే కేలియే పేరుతో బాలచందర్ తీసిన సినిమా ఇండియాను షేక్ చేసింది. అందులో కమల్ హాసన్ నటన అమోఘం. అద్భుతం. ఇప్పటికీ ఎవరు గ్రీన్ సినిమాగా నిలిచి...

ఉద్యోగం కంటే వీఆర్‌ఎస్‌ బెటర్

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం మెలమెల్లగా ప్రభుత్వ అధీనంలో ఉన్న కంపెనీలను ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే పనిలో పడ్డది. తాజాగా ఎన్నో ఏళ్లుగా ప్రజలకు విశిష్టమైన రీతిలో సేవలు అందించిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ కంపెనీని ఎంటీఎన్ఎల్ కంపెనీతో కలిపేసింది. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే. వీటిని ప్రైవేట్ పరం కాకుండా ఉండేందుకు గాను ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి వారి సర్వీసెస్ ఆధారంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. దీంతో సర్కార్ నిర్ణయానికి ఊహించని రీతిలో భారీగా స్పందన లభించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 60000 మందికి పైగా దాటింది. టెలికం సెక్రటరీ అన్‌షూ ప్రకాశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కు పైగా ఉందన్నారు. ఇక ఎంటీఎన్‌ఎల్‌ కంపెనీకి  సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే దాదాపు 60,000 కు పైగా దాటే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఒక్క రోజుకే వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సం...

మృదు మధురం..శృతి రాగం

చిత్రం
భారతదేశంలో అరుదైన నటుడిగా పేరున్న నట దిగ్గజం కమల్ హాసన్ గారాల పట్టి, ముద్దుల కూతురు శృతి హాసన్ నటిగానే కాదు గాయనిగా కూడా రాణిస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమె ప్రిన్స్ మహేష్ బాబుతో నటించిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాను ప్రాంతీయ భాషల్లోకి దబ్ చేస్తున్నారు. దానిలో మన శృతి డబ్బింగ్ చెప్పడంతో పాటు కొన్ని పాటలు పాడింది. ఆ సినిమా హాలీవుడ్ కు చెందింది. అన్నా, ఎల్సా అనే అక్కా చెల్లెళ్ళ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ పూర్తి గా యానిమేషన్‌ తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు డిస్నీ సంస్థ ప్రతినిధులు. ఫ్రోజెన్‌ 2 హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు డబ్బింగ్‌ చెప్పారు. తెలుగులో నిత్యామీనన్‌ ఈ పనిని పూర్తి చేసింది. తమిళ వెర్షన్‌లో ఎల్సా పాత్రకు హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ డబ్బింగ్‌ చెప్పారు. అంతేకాదు స్వతహా గానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీ హాసన్ ‘ఫ్రోజెన్‌ 2’ తమిళ వెర్షన్‌ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు. ఈ ...

కంపెనీలతో టై అప్..ప్రాఫిట్ లో టాప్

చిత్రం
స్టార్ట్ అప్ లు, కంపెనీలకు మరింత ఆదాయం సమకూరేలా అమెరికా ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ సపోర్ట్ చేస్తోంది. దీంతో ఆయా కంపెనీలు తయారు చేసిన డిఫ్ఫరెంట్ ప్రోడక్ట్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. తాజాగా అమెజాన్‌ తన పోర్టల్‌లో కళా హాత్‌ పేరుతో ఓ స్టోర్ ను నిర్వహిస్తోంది. ఇందులో 280 రకాల కళా రూపాల తాలూకు ఉత్పత్తులు ఇప్పటికే నమోదు అయ్యాయి. 2020 చివరి నాటికి 500 రకాల కళా రూపాలను ఈ–కామర్స్‌ పోర్టల్‌లో పరిచయం చేయాలని ప్రయాన్ టార్గెట్ గా పెట్టుకుంది. కాటమరాన్‌ వెంచర్స్, అమెజాన్‌ల సంయుక్త కంపెనీ అయిన ప్రయాన్‌ దీనిని ప్రమోట్‌ చేస్తోంది. సాధారణంగా విక్రేతల నుంచి అమెజాన్‌ 16 శాతం కమిషన్‌ తీసుకుంటుంది. కళా హాత్‌ కింద నమోదైన విక్రేతలకు ఇది 8 శాతమే. ప్రతి క్లస్టర్‌లో కంపనీ ప్రతినిధి ఒకరు నిరంతరం ఉండి వారి వ్యాపార వృద్ధికి తోడ్పాటు అందిస్తారు. శిక్షణ కూడా ఇస్తోంది ప్రయాన్. చేనేత, హస్త కళాకారులకు స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. వారి ఉత్పత్తుల లిస్టింగ్, 3డీ మోడలింగ్‌ ప్రక్రియ అంతా కంపెనీ చూసుకుంటోంది. పోచంపల్లి ఇక్కత్, మంగళగిరి, కళంకారీ, పశీ్మనా, మధుబని, రోగన్, లిప్పన్‌ కామ్, ధరీజ్‌ వంటి సంప్రదాయ చేనేత వ్రస్తా...

టీఎస్ సర్కారుకు కోర్టు ఝలక్

చిత్రం
ఆర్టీసీ సమ్మె పై తీర్పు ఓ కొలిక్కి వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది. 5100 బస్సులకు పర్మిట్లు ఇచ్చే విషయంపై స్టేటస్ కో ఇచ్చింది. ఈ సందర్బంగా ప్రముఖ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. రూట్స్ ను ప్రైవేట్ చేసే ఆలోచన విరమించు కోవాలని సూచించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 14 వ సారి ఆర్టీసీపై సమీక్ష చేపట్టారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 35 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం, ఆర్టీసీ తో పాటు జేఏసీ చర్చలు జరపాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం లేనట్టు కనపడుతోందని చీఫ్ జస్టిస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సర్కార్ కు మరో షాక్ తగిలింది. కార్మికులకు సంబంధించి వాడుకున్న 768 .5 కోట్లు వెంటనే జమ చేయాలని షోకాజ్ నోటిస్ జారీ చేసింది. అయితే ఆర్టీసీ జేఏసీ సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చింది. ఈ దీక్షకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని సీపీ తెలిపారు. అన్ని విపక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకే అన్ని చోట్లా అరెస్టులు చేస్తున్న...

బీజేపీపై తలైవా ఫైర్

చిత్రం
భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే ఆయన కాషాయంతో స్నేహం నెరుపుతున్నారనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇదే విషయంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు తలైవా. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండ బద్ధలు కొట్టారు. రాజ్‌ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా   తిరువళ్లవర్‌ విగ్రహ వివాదంపై స్పందించారు. నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోందని రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయ రంగు వేయాలని చూస్తున్నారు. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు పులమ కండి. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెర లేపకండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయ వస్త్రం కట్టి, మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించారు. ఈ ఘటన ...

ఉద్దవ్ సెన్సేషన్ కామెంట్స్

చిత్రం
మరాఠాలో రాజకీయం హీటెక్కింది. అది ఎంత దాకా అంటే నువ్వెంత అనే దాకా వెళ్ళింది. ఏకంగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు. ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై థాక్రే మండి పడ్డారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధా లేనని, తనను దిగ్భ్రాంతి కలిగించాయని అన్నారు. 50-50 ఫార్ములాపై చర్చల్లో ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారని ఉద్ధవ్ వెల్లడించారు. బీజేపేనే తమ ముందు మోకరిల్లాలి కానీ, శివసేన వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఇరు పార్టీల మధ్య బంధం బలపడాలని కోరారని, నాటి చర్చల్లో స్వయంగా అమిత్‌షా వెంట ఫడ్నవిస్ కూడా ఉన్నారని చెప్పారు. అబద్ధాలు, నిందలతో తమపై ఆరోపణలు గుప్పించడం బాధాకరమని అన్నారు. అబద్ధాలు ఎవరు చెబుతున్నారో మహారాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. ప్రధాని మోదీపై తాము చేసినన్ని ఆరోపణలను కాంగ్రెస్ కూడా చేయలేదని ఫడ్నవిస్ చెప్పడం కూడా అబద్ధమేనని అన్నారు. మోదీపై కానీ, అమిత్‌షాపై కానీ తామెప్పుడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ లేదని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ ఇంత దిగజారుడుకు పాల్పడు తుందని అనుకోలేదన్నారు. ఆర్ఎస్ఎస్‌పై తమకు ఎంతో గౌరవం ఉందని, అబద్ధాలు ఎవరు చెప్పారో ఆర్ఎస్ఎస్ తేల్చు కోవాలన్నారు. రాముడు పేర...

గాంధీ ఫ్యామిలీకి కేంద్రం షాక్

చిత్రం
భారత దేశంలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చే పనిలో పడ్డది కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం. ప్రజల్లో తమదైన ముద్ర వేసుకున్న గాంధీ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రస్తుతం కల్పిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ను ఉపసంహరించు కోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం ఎస్పీజీని తొలగించి జెడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దాని కోసం త్వరలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. విపక్షాలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్ప...

కమలం కటీఫ్..శివసేనకు ఝలక్

చిత్రం
పొలిటికల్ కన్ ఫెసన్ కొనసాగుతోంది. మరాఠాలో రాజకీయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలతో పాటు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారిని కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాక పోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్నటి దాకా స్నేహితులుగా ఉన్న బీజేపీ, శివసేన పార్టీలు ఇప్పుడు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ చివరి దాకా ప్రయత్నాలు సాగించారు. అయినా ఫలితం లేక పోయింది. చెరో రెండున్నరేళ్లు అధికారాన్ని పంచు కుందామని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే సూచించారు. దీనిని ఎంత మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఫడ్నవిస్. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. మరాఠాలో గత 15 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. గవర్నర్‌ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం కల్పిస్తారా, లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అనేద...