పోస్ట్‌లు

మార్చి 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏపీలో రాజు ఎవ్వ‌రో..పీఠం ద‌క్కేదెవ‌రికో -బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా..ప‌వ‌న్ కు ద‌క్కేనా - వెల్ల‌డించ‌నున్న మిష‌న్ చాణ‌క్య

చిత్రం
దేశ మంత‌టా ఓ వైపు యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటే..స‌రిహ‌ద్దులో కాల్పుల మోత మోగుతుంటే..మ‌రో వైపు ఎండ వేడిమి కంటే ఎక్కువ‌గా ఎన్నిక‌ల వాతావర‌ణం అగ్గి కంటే ఎక్కువ మండుతోంది. బీజేపీ స‌ర్కార్ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎక్క‌డ కూడా త‌న‌కు ఎదురే లేకుండా చేయాల‌ని అనుకుంటోంది. ఇందు కోసం అమిత్ షా చాప కింద నీరులా త‌న ప్లాన్‌ను వ‌ర్క‌వుట్ చేసేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు. నిన్న‌టి దాకా చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగిన టీడీపీ..బీజేపీలు ఇపుడు ఒక‌రినొక‌రు తిట్టుకోవ‌డంతోనే స‌రిపెడుతున్నారు. దేశ రాజ‌కీయాలు మ‌రింత రంజుగా మారాయి. ఎవ‌రు ఎటు వైపు వెళుతున్నారో తెలియ‌డం లేదు. బిజేపియేత‌ర పార్టీల‌న‌న్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌ల బాజా మోగ‌నుంది. ఇప్ప‌టి నుంచే చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. లెక్క‌కు మించి స‌ర్వేలు చేయించారు. మ‌రో వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడిన‌ని నిరూపించుకున్నారు. జ‌నం కోసం పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. ప్ర‌తిప‌క్ష న...

స‌ద్గురుతో సంభాష‌ణం..జీవితం ఆనంద‌మ‌యం..!

చిత్రం
ఇపుడంతా యోగుల కాలం. ఆధ్యాత్మిక‌వేత్త‌ల అడుగు జాడ‌లతో భార‌త‌దేశం పునీత‌మ‌వుతోంది. ఓ వైపు యుద్ధపు మేఘాలు క‌మ్ముకుంటున్నా..మ‌రో వైపు భ‌క్తి ప్ర‌ప‌త్తులు య‌ధాలాపంగా కొన‌సాగుతూనే వున్నాయి. పుణ్య‌క్షేత్రాలు వేద మంత్రాలతో పునీత‌మ‌వుతున్నాయి. యోగా..ధ్యానం ..జీవితం..ఆనంద‌మ‌యం కావ‌డానికి ఎన్నో ప్ర‌యోగాలు..మ‌రెన్నో అడుగులు నిరాటంకంగా కొన‌సాగుతూనే వున్నాయి. ఈ స్థ‌లం ఎంద‌రికో నీడ‌నిచ్చింది. మ‌రికొంద‌రికి బ‌తుకునిచ్చింది. ప్రపంచానికి మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూనే..నిరంత‌రం ఇబ్బందులకు గురి చేసే కాలాన్ని ఎలా ఒడిసి ప‌ట్టుకోవాలో..జీవితాన్ని ఎలా సంతోష‌మ‌యంగా మార్చుకోవాలో ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువుగా వినుతికెక్కిన జ‌గ్గీ వాసుదేవ‌న్ ఆచ‌రణాత్మ‌కంగా చూపిస్తున్నారు. వ‌య‌సు పెరిగే కొద్దీ రోగాల బారిన ప‌డ‌తాం. లేవాల‌న్నా..న‌డ‌వాల‌న్నా ఎన్నో ఇబ్బందులు..మాన‌సికంగా..శారీర‌కంగా క‌ష్టాలు..వీట‌న్నింటిని కాద‌ని ఆయ‌న పిల్లాడిలా గెంతుతారు..ఆడ‌తారు..పాడ‌తారు..క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాలో చెబుతారు. జ‌గ్గీతో మాట్లాడుతూ వుంటే ప్ర‌పంచాన్ని మ‌రిచి పోతాం. మ‌నం మ‌న నుండి దూర‌మై పోతాం..క‌ల్మ‌షం లేని లోక‌పు దారుల్...

ఐఎంఎఫ్ చీఫ్ ఎక‌న‌మిస్ట్‌గా గీతా గోపినాథ్ ..!

చిత్రం
అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యున్న‌త‌మైన సంస్థ‌గా పేరొందిన అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త‌గా ఇండియాకు చెందిన గీతా గోపినాథ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఐఎంఎఫ్‌కు భార‌త్ త‌ర‌పున ఓ మ‌హిళ ఆర్థిక‌వేత్త ప్ర‌ధాన ప‌ద‌విని చేప‌ట్ట‌డం ఇదే మొద‌టిసారి. ఆర్థిక రంగంలో ఆమెకు అపార‌మైన అనుభ‌వం ఉన్న‌ది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక‌ప‌ర‌మైన వ్య‌వ‌హారాల‌లో ఎంతో ప్ర‌భావితం చూపే ఐఎంఎఫ్ సంస్థ‌కు ఓ మ‌హిళ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం మ‌హిళా సాధికార‌త‌కు నిద‌ర్శ‌నం. ఈ దేశ‌పు మ‌హిళ‌లంద‌రికి ల‌భించిన అరుదైన గౌర‌వంగా భావించాల్సి ఉంటుంది. గీతా గోపినాథ్‌ది ప‌శ్చిమ బెంగాల్. 8 డిసెంబ‌ర్ 1971లో కోల్‌క‌త్తాలో జ‌న్మించారు. ఇండియ‌న్ అమెరిక‌న్ ఆర్థిక‌వేత్త‌గా ఉన్నారు. ప్ర‌పంచంలో ఉన్న‌త‌మైన యూనివ‌ర్శిటీగా పేరొందిన హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ అండ్ ఎకన‌మిక్స్ విభాగానికి ప్రొఫెస‌ర్‌గా ..హెడ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్ అండ్ మాక్రో ఎక‌న‌మిక్స్ ప్రోగ్రాం, నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఎక‌న‌మిక్ రిసెర్చ్ కు కో డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేర‌ళ రాష్ట ప్ర‌భుత్వ ముఖ్య‌...