పోస్ట్‌లు

జూన్ 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణ‌లో తీన్మార్..టీఆర్ఎస్ జోర్దార్

చిత్రం
ఎవ‌రైనా ఓట‌మిని తేలిగ్గా తీసుకుంటారు. ఇంకొంద‌రు నాయ‌కులు అస‌లు అప‌జ‌యాన్ని ఒప్పుకోరు. విజ‌యం సాధించే దాకా నిద్రపోరు. భార‌త‌దేశంలో అలాంటి కోవ‌కు చెందిన అగ్ర‌నేత‌ల్లో వేళ్ల మీద లెక్కించే వారు మాత్ర‌మే ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఒక‌రు. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచి నేడు రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యేంత దాకా..అడుగుల‌న్నీ గెలుపు వైపే. ఓట‌మి రుచించ‌దు. స‌క్సెస్‌లోని మ‌జాను కేసీఆర్ ఆస్వాదించినంత‌గా ఇంకెవ్వ‌రూ ఆస్వాదించ‌లేరు. ప‌క్కా ప్ర‌ణాళిక‌, పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశ‌నం చేయ‌డం. ద‌గ్గ‌రుండి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం. సీనియ‌ర్ల‌ను పుర‌మాయించ‌డం. కింది స్థాయి నుండి పై స్థాయి వ‌ర‌కు మానిటరింగ్ చేయ‌డం. డిజిట‌ల్ మీడియాతో పాటు సామాజిక మాధ్య‌మాల‌ను వాడుకోవ‌డం. ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఇంకే నేత‌కు తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో.  తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి మింగుడుప‌డ‌ని రీతిలో ఫ‌లితాలు వ‌చ్చాయి. ప్ర‌జా తీర్పును గౌర‌విస్తామంటూనే..ప్రాదేశిక ఎన్నిక‌ల్లో గులాబీ స‌త్తా ఏమిటో రుచి చూపించాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. పోయ...

డిడిఎస్ మ‌హిళా రైతుల‌కు అరుదైన పుర‌స్కారం

చిత్రం
తెలంగాణ‌కు చెందిన మ‌హిళా రైతులు తమ శ‌క్తి సామ‌ర్థ్యాలు ఏమిటో ప్ర‌పంచానికి చాటి చెప్పారు. భూమిని న‌మ్ముకుంటే న‌ష్టం వుండ‌ద‌ని, ప‌ర్యావ‌ర‌ణం కోసం పాటు పడాల‌ని ద‌క్క‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీకి చెందిన స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా రైతులు పిలుపునిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండానే ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో సాగు చేస్తున్నారు. మ‌నం మ‌రిచి పోయిన పాత కాలం నాటి గింజ‌ల‌న్నీ ఇక్క‌డ ల‌భిస్తాయి. తాజాగా యునైటెడ్ నేష‌న్స్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం ( యుఎన్‌డిపి) అంత‌ర్జాతీయ సంస్థ డిడీఎస్ కు చెందిన మ‌హిళా రైతులు మైస‌న‌గారి ర‌త్న‌మ్మ‌, బ్యాగ‌రి తుల్జ‌మ్మ‌, నాగ్వార్ సునంద‌మ్మ‌, ఎర్రోళ్ల క‌న‌క‌మ్మ‌, అంజ‌మ్మ‌, అనసూయల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈక్వెటార్ ప్రైజ్‌ను 2019 సంవ‌త్స‌రానికి ప్ర‌క‌టించింది. ఇది గ‌త కొన్నేళ్లుగా స‌తీష్ నేతృత్వంలో నిర్వ‌హిస్తున్న డీడీఎస్ సంస్థ‌కు ద‌క్కిన గౌర‌వంగా భావించాలి. ఆయ‌న ఎన్నో ఏళ్లుగా దీనినే అంటిపెట్టుకుని వున్నారు. వ్య‌వ‌సాయం దండ‌గ కాద‌ని పండ‌గ‌ని నిరూపించారు. వాస్త‌వానికి మ‌నం ఎక్క‌డికి వెళ్లినా నీళ్లుండ‌వు. ఒక‌వేళ వుంటే అదే వ‌రి అవే జొన్న‌లు లేదంటే సాగుకు డ‌బ్బులుండ‌వ...

మోస్ట్ పాపుల‌ర్ బ్రాండ్‌గా రిల‌య‌న్స్ జియో

చిత్రం
ఇండియా అంటే క్రికెట్ ఎలాగా..ఇపుడు భార‌తీయ ఖ్యాతిని ఖండంత‌రాల‌లో వెలిగి పోయేలా చేసిన ఘ‌న‌త ముఖేష్ అంబానీ అండ్ టీందే. ఇండియ‌న్స్ కు ఏమీ చేత కాద‌ని విర్ర‌వీగుతున్న అమెరికా, దాని మిత్ర దేశాలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది జియో. ప్ర‌పంచ టెలికాం రంగంలో ఇదో అద్భుత‌మైన రికార్డును స్వంతం చేసుకుంది. ప్రారంభించిన కొద్ది కాలంలోనే టెలికాం మార్కెట్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌కు చేరుకుంది. ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ..ఇండియా అంత‌టా విస్త‌రించింది. త‌క్కువ ఖ‌ర్చుకే మొబైల్ ఉండాల‌ని, ప్ర‌తి సామాన్యుడి చేతిలో త‌న కంపెనీ లోగోతో పాటు ఫోన్ ఉండాల‌న్న త‌న తండ్రి అంబానీ క‌ల‌ల‌ను కొడుకు సాకారం చేశారు. ఇపుడు ఎక్క‌డ చూసినా..ఎక్క‌డికి వెళ్లినా జియో కంపెనీనే క‌నిపిస్తోంది. ఫోన్ల‌తో పాటు నెట్ క‌నెక్ష‌న్ , వాయిస్ కాల్స్, ఇలా ప్ర‌తి యాక్సెస‌రీని రూపొందించింది ఈ కంపెనీ. మొద‌ట్లో లైట్‌గా తీసుకున్నాయి ప్ర‌త్య‌ర్థి కంపెనీలు. ఇండియ‌న్ టెలికాం ఇండ‌స్ట్రీలో తిరుగులేని ఆధిక్య‌త‌ను క‌లిగి వున్న ఎయిర్ టెల్ కంపెనీకి చుక్క‌లు చూపించింది జియో. ఇప్ప‌టికే 5 కోట్ల మందికి పైగా జియోలో స‌భ్యులై పోయారు. ప్ర‌తి భార‌తీయుడు అ...

యుఎస్ మిలియ‌నీయ‌ర్స్ ల‌లో మ‌నోళ్లే టాప్

చిత్రం
ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అన్న నానుడిని ఎన్ఆర్ఐ మ‌హిళ‌లు నిజం చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఇంటికే ప‌రిమిత‌మైన నారీమ‌ణులు ఇపుడు ప్ర‌పంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. అన్ని రంగాల‌లో త‌మ‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో వీరు పురుషుల‌కంటే ముందంజ‌లో ఉంటున్నారు. ముఖ్యంగా భార‌తీయ మ‌హిళ‌ల‌తో పాటు ప్ర‌వాస భార‌తీయ మ‌హిళ‌లు సైతం త‌మ‌కు సాటిరారెవ్వ‌రంటూ స‌వాల్ విసురుతున్నారు. ప్ర‌తి ఏటా అమెరికాలో ఎంత‌మంది ధ‌న‌వంతులు వున్నార‌నే దానిపై ఓ జాబితా రూపొందుతుంది. తాజాగా ప్ర‌క‌టించిన మిలియ‌నీర్ల‌లో యుఎస్ కోటీశ్వ‌రుల్లో మ‌న‌వాళ్ల‌కు చోటు సంపాదించారు.  అమెరికా టాప్ 80 మ‌హిళా ధ‌న‌వంతుల జాబితాలో స్థానం పొంద‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. యుఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ వుమెన్ -2019 పేరుతో ఫోర్బ్స్ విడుద‌ల చేసిన లిస్టులో అరిస్టా నెట్ వ‌ర్క్ ప్రెసిడెంట్, సిఇఓ జ‌య‌శ్రీ ఉల్లాల్, ఐటీ క‌న్స‌ల్టెన్సీ , అవుట్ సోర్సింగ్ కంపెనీ సింటెల్ కో ఫౌండ‌ర్ నీరజా సేథి, స్ట్రీమింగ్ డేటా కంపెనీ కాన్ ఫ్లుయెంట్ సిటిఓ, కో ఫౌండ‌ర్ నేహాలు జాబితాలోకి ఎక్కేశారు. అమెరికాలోని అతి పెద్ద పైక‌ప్పులు, ...

రీవ్స్ రియ‌ల్ స్టార్ - దాతృత్వంలో గ్రేట్

చిత్రం
ఒక్కొక్క‌రిది ఒక్కో క‌థ‌. హాలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ ఒక్క‌సారి వ‌స్తే చాలు..ఇక వందేళ్లు హాయిగా బ‌తికేయొచ్చు. క‌ళ్లు చెదిరే సంపాద‌న‌..లెక్క‌లేనంత మంది ఫాలోయింగ్. నీడ‌లా వెంటాడే ప‌బ్లిసిటీ. వీట‌న్నింటిని కాద‌నుకుని తాను ప‌డిన క‌ష్టాల‌ను గుర్తు చేసుకుంటూ ..ఆస్ప‌త్రులలో బాధితుల ఆరోగ్యం మెరుగు ప‌డేందుకు స‌హాయం చేస్తూ..త‌న జన్మ‌ను సార్థ‌కం చేసుకుంటున్నాడు ఈ హీరో. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ..జ‌నానికి దూరంగా ..తామేదో సూప‌ర్ హీరోస్ మంటూ ఫీల్ అయ్యే టాలీవుడ్ హీరోలు రీవ్స్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది. కియాను రీవ్స్ జీవితమంతా క‌ష్టాల‌మ‌య‌మే. మూడేళ్ల‌ప్పుడు తండ్రి నిర్దాక్షిణ్యంగా వ‌దిలేశాడు. ఆ త‌ర్వాత తాను ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించిన ప్రియురాలిని రోడ్డు యాక్సిడెంట్‌లో పోగొట్టుకున్నాడు. త‌న‌కు అండ‌గా ఉన్న స్నేహితుడిని కోల్పోయాడు.  త‌న చెల్లెలు రోగ పీడితురాలు. ఆమె కోలుకోవ‌డంతో కొంత ఊపిరి పీల్చుకున్నాడు. ఇన్ని అడ్డంకుల‌ను ఎదుర్కొన్న రీవ్స్..ఫీనిక్స్ ప‌క్షి లాగా అన్నింటిని దాటుకుని హాలీవుడ్‌లో టాప్ హీరోగా స్థానం పొందాడు. ఆయ‌న న‌టించిన ద మ్యాట్రిక్స్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లు కుమ్మ‌ర...