పోస్ట్‌లు

అక్టోబర్ 11, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

‘చిప్కో’ను వరించిన ఇందిర అవార్డు

చిత్రం
దేశంలో ప్రముఖ సామాజిక వేత్తగా, కార్యకర్తగా పేరొందిన, చిప్కో మూవ్ మెంట్ వ్యవస్థాపకుడు చండీ ప్రసాద్ భట్ కు అరుదైన బహుమతి లభించింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇందిరాగాంధీ అవార్డు వరించింది. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్ళు. జాతీయ సమైక్యతను కాపాడటం, ప్రోత్సహించడంలో ప్రసాద్ చేసిన సేవలకు 2017–18 సంవత్సరానికి గాను ఇందిరా గాంధీ 31వ అవార్డు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం ఈ అవార్డును కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఇందిరా గాంధీ వర్ధంతి రోజు అక్టోబర్ 31న ఢిల్లీలోని జవహార్ భవన్ లో జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 10 లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రం అంద జేస్తారు. ఉత్తరాఖండ్ కు చెందిన భట్..1964లో గ్రామ స్వరాజ్య సంఘ్ ద్వారా చిప్కో మూవ్ మెంట్ ప్రారంభించారు. 1982లో కమ్యూనిటీ లీడర్​షిప్ కు గాను ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. అంతే కాకుండా 2013 లో గాంధీ శాంతి బహుమతిని భట్ అందుకున్నారు. 1934 లో ఆయన పుట్టారు. గాంధీయన్ మూవ్ మెంట్ ను ఆయన ముందుకు తీసుకు వెళుతున్నారు. 1964 లో గోపేశ్వర్ లో దశోలి గ్రామ స్వరా...

పల్లవించిన స్నేహం..విస్తు పోయిన ప్రపంచం

చిత్రం
నిన్నటి దాకా ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చిన ఇండియా, చైనా దేశాలు ఇప్పుడు అన్నిటిని మరిచి పోయి స్నేహమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అంటూ పాట పాడుకుంటున్నాయి. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సమావేశమయ్యారు. వీరిద్దరూ చెన్నయిలోని మహాబలిపురం లో సమావేశం కావడాన్ని ప్రపంచంలోని దేశాలన్నీ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. సముద్ర తీరంతో పాటు శిల్ప కళా నైపుణ్యానికి పెట్టింది పేరైన మహాబలిపురం అందాలను ప్రధాని దగ్గరుండి జిన్ పింగ్ కు చూపించారు. తానే గైడ్ గా మారి పోయి దాని చరిత్రను విడమరిచి చెప్పారు. ఇక్కడి భారత్ ఆతిథ్యం చూసి జిన్ పింగ్ ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం జిన్ పింగ్ ను సంతోషానికి లోను చేసింది. అంతా ఢిల్లీలో మీటింగ్ ఉంటుందని భావించారు. దానిని బ్రేక్ చేశారు ప్రధాని మోదీ. ఈ పీఎం కొలువు తీరాక అన్ని ప్రోటోకాల్స్ ను పక్కన పెట్టారు. ఎవరితోనైనా సరే బయట సమావేశం ఉండేలా చూస్తున్నారు. అంతే కాదు ఇక్కడికి వచ్చిన వారందరికీ భారతీయ వంటకాలను రుచి చూపిస్తున్నారు. జిన్ పింగ్ కు అపూర్వమైన రీతిలో స్వాగతం పలికారు ఇక్కడి నేతలు. జిన్ పింగ్ టూర్ లో చైనా నుం...

శాంతికి దక్కిన గౌరవం..అరుదైన పురస్కారం

చిత్రం
ఎవరూ ఊహించని విధంగా ఈసారి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ ఆలీకి లభించింది. అగ్ర దేశం అమెరికా కూడా విస్తు పోయింది ఈ నిర్ణయంతో. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇథియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని అబీ అలీ తగ్గించారు. అంతే కాకుండా ఆ దేశంతో శాంతి ఒప్పందం కూడా చేసుకున్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని తాము అహ్మద్ అలీని ఎంపిక చేయడం జరిగిందని ఓస్లోలోని నార్వే నోబెల్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది. కాగా ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్‌ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్‌ క్రౌన్స్‌ అంటే దాదాపు 9  కోట్ల 40 లక్షలు అందనున్నాయి. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతిని పురస్కరించుకొని వచ్చే డిసెంబర్‌ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అయితే ఈసారి తప్పకుండా స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి, 16 ఏళ్ల వయసున్న గ్రేటా థెన్‌బ...

జియోకు వోడా ఝలక్  

చిత్రం
టెలికాం రంగంలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే అంతా ఫ్రీ అంటూ కోట్లాది మంది కస్టమర్లను బురిడీ కొట్టించిన రిలయన్స్ జియో కంపెనీ, ఆదాయం సమకూరాక నెత్తిన శఠగోపం పెట్టింది. ఉచితం అంటూనే మరో వైపు ఇతర నెట్ వర్క్ టెలికాం కంపెనీలకు కాల్స్ చేసే సదుపాయాన్ని తొలగిస్తున్నట్లు ఆర్ఐఎల్ కంపెనీ ప్రకటించింది. దీంతో నిన్నటి దాకా ఫ్రీ డేటా పేరుతో ఫుల్ ఎంజాయ్ చేసిన వినియోగదారులు ఇప్పుడు అంబానీ సోదరులపై నిప్పులు చెరుగుతున్నారు. తమను నిలువునా మోసం చేశారంటూ మండిపడుతున్నారు. వోడా ఫోన్ , ఐడియా, టాటా , ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు ప్రస్తుతానికి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ జియో ఒక్కటే ఇలా వినియోగదారులపై అదనపు చార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజ కంపెనీగా ఉన్న మరో కంపెనీ వొడాఫోన్‌ ఐడియా జియోకు షాకిచ్చింది. ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ ను వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించిన కొద్ది గంటలకే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది. జియో చార్జీల వడ్డనతో కస్టమర్లను ఆగ్రహం తెప్పిస్తే వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర...

టాలీవుడ్ లో రకుల్ హల్ చల్

చిత్రం
టాలీవుడ్ లో ఉన్నట్టుండి మెరిసింది నటి రకుల్ ప్రీతీ సింగ్. ఢిల్లీ లో పుట్టిన ఈ అమ్మాయి గణితంలో ఎక్స్ పర్ట్. అందాలు ఆరబోయడంలోనూ నటించడంలోనూ మిగతా నటీమణుల కు  తీసిపోని రీతిలో అడుగులు వేస్తున్నది. అగ్ర నటులతో రకుల్ నటించింది. మెప్పించింది. తాజాగా మహిళా ఫ్యాన్స్ ఎక్కువ కలిగిన నవ మన్మధుడు అక్కినేని నాగార్జున తో కలిసి రాహుల్ రవీంద్రన్ తీసిన మన్మధుడు -2 కీ రోల్ పోషించారు. అన్ని సినిమాలు ఒక ఎత్తు కానీ ఈ మూవీ ఒక ఎత్తు. ఈ సినిమాలో తనకంటూ స్పెషాలిటీ, ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన నటిగా నటించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మాత్రం వసూళ్లను రాబట్టింది. ఇందులో కొంచం సీన్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయని ఫ్యాన్స్ అభ్యంతరం చెప్పారు. రకుల్ ప్రీతీ సింగ్ .. ప్రముఖ యాంకర్ ఝాన్సీతో కలిసి చేసిన రొమాన్స్ పై రాద్ధాంతం రేగింది. దీనికి సెన్సార్ వారు ఎలా సెర్టిఫికెట్ ఇచ్చారంటూ సినీ క్రిటిక్స్ ప్రశ్నించారు. అయినా సినిమా విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రకుల్ ఝాన్సీ ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటారు. ఇదే సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక నాగార్జున గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోయిన్స్ తో సాగించిన రొమాన్...

జస్టిస్ కోదండరాం కు సలాం

చిత్రం
కాసింత అధికారం వుంటే చాలు కోట్లు వెనకేసుకోవడం షరా మాములుగా మారింది. ఎక్కడ చూసినా అవినీతి అనకొండలు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నారు. ఏసీబీ అధికారులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నారు. విస్తు పోయేలా నోట్ల కట్టలు, లెక్కించ లేనంతగా బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లు దొరుకుతున్నవి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరాక దోపిడీ, దౌర్జన్యం, వివక్ష పెచ్చరిల్లి పోయింది. పోలీసుల దమనకాండ మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతి చాప కింద నీరులా పేరుకు పోయింది. మొత్తంగా చూస్తే నీతి, నిబద్దత కలిగిన అధికారులు, ఉన్నతాధికారుల్లో పది శాతం ఉన్నారు. ఇదే సమయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా, వృత్తిని దైవంగా భావిస్తూ పనిచేస్తున్న వారు ఈ సమాజంలో ఉన్నారు. తమ పనులు తామే చేసుకునే వారు కూడా లేక పోలేదు. ఇలాంటి అరుదైన సంఘటన తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తాను అత్యున్నతమైన పదవిలో ఉన్నప్పటికీ ఎలాంటి డాబు, దర్పాన్ని ప్రదర్శించలేదు. ఇంతగా చెప్పుకుంటున్న ఆయన ఎవరో కాదు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు లో జస్టిస్ గా ఉన్నారు కోదండరాం. ఆయన చేసిన పనితో దేశ ...

లుక్స్ పర్ఫెక్ట్ ..శ్రీముఖి బెస్ట్

చిత్రం
ప్రయోక్తగా ఇప్పటికే టాప్ రేంజ్ లో కొనసాగుతున్న శ్రీముఖి బిగ్ బాస్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. వినోద రంగంలో స్టార్ టీవీకి తిరుగు లేకుండా పోయింది. భారతీయ క్రికిట్ ప్రసార హక్కులను 1700 కోట్లకు చేజిక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఇటీవల తెలుగు బుల్లితెరపై మాటీవీ తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నది. దీనిని అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. సౌత్ ఇండియాలో స్టార్ టీవీ పాగా వేసింది. దాదాపు 300 కోట్లకు చేజిక్కించుకున్నట్లు వినోద రంగాలు పేర్కొంటున్నాయి. కోట్లాది రూపాయలు రోజుకు స్టార్ టీవీ గ్రూప్ కు వస్తున్నాయి. తెలుగు వినోద రంగంలో ఇప్పుడు స్టార్ మా టీవీ దుమ్ము రేపుతోంది. డిఫరెంట్ గా ప్రోగ్రామ్స్ రూపొందిస్తూ, సీరియల్స్ పరంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. స్టార్ టీవీ మూడో సారి స్టార్ట్ చేసిన బిగ్ బాస్ కు భారీ ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ లో రేటింగ్ మరింత పెరిగింది. ఈ రియాల్టీ షో లో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ, తదితరులు తమ ప్రతిభతో పోటాపోటీగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ లలో యాంకర్‌ శ్రీముఖి తళు...

మెరిసిన మిథాలీ..మనదే వన్డే సిరీస్

చిత్రం
పక్కా హైదరాబాదీ అమ్మాయి మిథాలీ రాజ్ మళ్ళీ మెరిసింది. ఇప్పటికే మహిళా క్రికెట్ లో పురుషుల అధిపత్యానికి తన ఆట తీరుతో చెక్ పెట్టింది. హైదరాబాద్ నుంచి ఎందరో ఆటగాళ్లు జాతీయ స్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో మహమ్మద్ అజాహారుద్దీన్, శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, లక్ష్మణ్, అర్షద్ అయూబ్, తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఇండియాకు మహిళా జట్టు తరపున మన మిథాలీ అటు అందంలోనూ ఇటు ఆటలోను తనదైన శైలితో దూసుకెళుతోంది. తాజాగా వడోదరలో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన రెండో వన్డేలో రాణించింది. ఇప్పటికే టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు అదే దూకుడుతో వన్డే సిరీస్‌ను వశం చేసుకుంది. భారత్‌ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు ను పూనమ్‌ రౌత్‌ అందుకుంది.  మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్‌ 82 బంతుల్లో 8 ఫోర్స్ తో 66 పరుగులు చేసింది. వీరిద్దరూ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ప్లేయర్స్ కు చుక్కలు చూపించారు. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆరం...

దిగ్గజ నేతలు..కలిసిన కత్తులు

చిత్రం
ప్రపంచం ఎంతో అతృతతో ఎదురు చూసే క్షణాలు రానే వచ్చాయి. అభివృద్ధిలో దూసుకు వెళుతున్న ఇండియా, చైనా దేశాధినేతలు చెన్నైలోని మహాబలిపురం లో కలుసుకున్నారు. అంతకు ముందు చైనా అధినేత జిన్ పింగ్ కు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తమిళనాడు ప్రభుత్వం స్వాగతం పలికింది. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై విమానాశ్రయం లో జిన్ పింగ్ కాలు మోపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించేందుకు ఈ సమావేశం ఉపయోగ పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రువును సైతం ఆత్మీయంగా పలకరించే సంప్రదాయం మొదటి నుంచి భారత్ పాటిస్తూ వస్తోంది. వ్యాపార, వాణిజ్య పరంగా చైనా, ఇండియా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరూ ఊహించని రీతిలో అందరిని విస్తు పోయేలా చేశారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన స్వతహాగా పూర్తిగా సాంప్రదాయ బద్దంగా పంచె, జుబ్బా, తువ్వాలుతో అచ్చం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అగుపించారు. ఎప్పుడూ షూట్, బూటుతో కనిపించే మోడీ పంచెకట్టుతో చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మొన్నటి దాకా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన చైనా ఉన్నట్టుండి తన వైఖరిని మార్చుకుంది. భేదాలన...

అందాల ఆరబోత..గుండెల్లో గిలిగింత

చిత్రం
ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు చూద్దామన్నా అగుపించడం లేదు. మొత్తం సినిమాల్లో ద్వందార్థాలు, జుగుస్సాకరమైన సన్నివేశాలు ఎక్కువై పోయాయి. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడం, కోట్లాది ప్రజలకు ఉచితంగా డేటా లభిస్తుండడంతో జనం వినోదానికి అలవాటు పడ్డారు. ప్రతి రోజు మొబైల్స్ కు బానిసలై పోయారు. కనెక్టివిటీ పెరిగాక బూతు మరింత ఎక్కువై పోయింది. గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువగా దీని గురించే సెర్చింగ్ చేస్తున్నారని దిగ్గజ కంపెనీ తెలిపింది. పాకిస్తాన్ ముందంజలో వుంటే మనం దాని వెనకే ఉండడం విస్తు పోయేలా చేసింది. తక్కువ పెట్టుబడితో ఇటీవలే విడుదలైన పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన గీత గోవిందం భారీ సక్సెస్ ను స్వంతం చేసుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పోటీపడి నటించారు. ఈ మూవీలో ముద్దు సీన్ ఎక్కువగా ఆకట్టుకుంది. అలాగే ఆర్ ఎక్స్ 100 సినిమా ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. ఇందులో నటి పాయల్ రాజపుత్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమె అందాల ఆరబోత కుర్రకారును, ఇతరులను మెస్మరైజ్ చేసింది. దీంతో ఆమె నటించిన మరో సినిమా ఆర్దీఎక్స్ లవ్ పేరుతో మూవీ విడుదలైంది. రిలీజ్ కంటే ముందే సినిమా కు ఎక్కువ పబ్లిసిటీ లభించింది...

విరాట్ విశ్వరూపం

చిత్రం
టీమిండియా సారథి మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ చేసి తనకు తిరుగు లేదని చాటాడు. ఇండియా మొదటి ఇన్నింగ్ ను అయిదు వికెట్లు కోల్పోయి 601 పరుగుల వద్ద ముగిస్తున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. దీంతో సౌత్ ఆఫ్రికా భారీగా పరులుఁగు చేయాల్సి ఉంది. మొదటి రోజు మయాంక్ అగర్వాల్ సెంచరీతో కదం తొక్కితే రెండో రోజు ఆటలో విరాట్ పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ తన రికార్డులను తానే అధిగమించాడు. 198 పరుగుల వద్ద ఈ సారథి 7000 పరుగులు పూర్తి చేశాడు. 336 బంతులు ఎదుర్కున్న కోహ్లీ 33 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 254 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టు భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో అత్యధిక మైలు రాయిని చేరుకున్నాడు. ఇండియా జట్టు తరపున సారథుల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ ఒక్కడే. ఇది కూడా ఓ రికార్డ్. రహానే స్థానంలో మైదానం లోకి దిగిన రవీంద్ర జడేజా కోహ్లీకి సపోర్ట్ గా ఉన్నాడు. అతను 104 బంతులు ఎదుర్కొని 91 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు , రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా కో...

ప్రజా నాయకుడు..పల్లెల పాలిట దేవుడు

చిత్రం
ఆయన జగమెరిగిన సామాన్యుడు. కోట్లాది మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన మహానుభావుడు అన్నా హజారే. ఆయన పూర్తి పేరు కిషన్ బాబూరావ్ హజారే. ముంబై లోని భింగార్ ఊరులో 1937 జూన్ 15 న జన్మించారు. ఇప్పుడు అన్నా హజారే కు 82  సంవత్సరాలు. నీళ్లు వృధా కాకుండా ప్రతి నీటి బొట్టును కాపాడు కోవాలని ఆయన పోరాటం చేస్తూ వచ్చారు. వాటర్ షెడ్స్ కు ప్రాణం పోశారు. అంతే కాకుండా ప్రజా పోరాటాలకు హజారే ముందు వరుసలో ఉన్నారు. అవినీతి పోవాలని, సామాన్యులకు సమాచార హక్కు ఉండాలని ఆయన ఉద్యమించారు. పోరాటం చేస్తున్న వారికి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన వివాహానికి దూరంగా ఉన్నారు. తన జీవితమంతా సామాజిక సమస్యలపై యుద్ధం చేస్తున్నారు. అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి అన్నా హజారే పాటుపడ్డారు. తను చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా 1990 లో పద్మశ్రీ,1992 లో పద్మ భూషణ్ అవార్డు లతో భారత ప్రభుత్వం   ఆయనను సత్కరించింది. 5 ఏప్రిల్ 2011 న లోక్ పాల్ అవినీతి నిరోధక చట్టాన్ని తేవాలని నిరవధిక నిరాహరదీక్ష చేపట్టారు. దేశమంతా దీనికి మద్దతు లభించింది. సర్కార్ దిగిరావడంతో దీక్ష విరమించారు. ప్రపంచంలో 100 మంది మేధావులలో అన...