పోస్ట్‌లు

సెప్టెంబర్ 15, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

నెట్టింట్లో పేపర్ బాయ్ హల్ చల్..!

చిత్రం
పేపర్ బాయ్ అంటే ఇదేదో తెలుగు సినిమా ఆనుకుంటే పొరపాటు పడినట్లే . పట్టుమని 19 ఏళ్ళు కూడా నిండని ఆ యువకుడి మదిలో మెదిలిన ఐడియా ఇవ్వాళ అంతర్జాలంలో హల్ చల్ చేసేస్తోంది. ఒక్కో స్టార్ట్ అప్ ఒక్కో బ్రాండ్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంటూ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. నిప్పులు చిమ్ముకుంటూ నేనెగిరి పోతే నిబిడాక్షర్యంతో మీరే మీరే అంటూ మహాకవి శ్రీ శ్రీ ని గుర్తుకు తెస్తున్నాడు బెంగళూర్ కు చెందిన వెంకట్ కార్తీక్ రాజా. ఇదే వయసు కలిగిన యువకులంతా సోషల్ మీడియాలోనే లేదా స్మార్ట్ ఫోన్స్ లలో బూతు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటే ఇతను మాత్రం పది మందికి దారి చూపించేలా కత్తి లాంటి ఆలోచనను ఆచరణలోకి తీసుకు వచ్చాడు. ఎక్కడా టైం ను వేస్ట్ చేయకుండా తాను ఏది అనుకున్నాడో అదే చేశాడు. సక్సెస్ అయ్యాడు. పొద్దున్న లేస్తేనే చాలా మంది ఇళ్లల్లోకి వచ్చే పేపర్లన్నీ వేసేది  పిల్లలే. అందుకే మనోడు తన విన్నూతమైన ఐడియాకు పేపర్ బాయ్ అని పేరు పెట్టాడు. ఏదైనా సాధించాలన్నా, లేదా ఇతరులకంటే భిన్నంగా బిజినెస్ లో రాణించాలన్నా మన ప్రోడక్ట్ పేరు అందరికీ అర్థమయ్యేలా, త్వరగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అదే ఒక బ్రాండ్ ను క్రియేట్ చేస్తుంది. అందరిలాగే తనక...

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..కలవర పడుతున్న అధినేతలు

చిత్రం
దాయాదులైన పాకిస్తాన్, ఇండియాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై నిప్పులు చెరుగుతున్నారు. స్వతహాగా మాజీ క్రికెట్ సారధి కావడంతో వార్ ఎలా మొదలు పెట్టి ఎలా ముగించాలో తనకు బాగా తెలుసునంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎప్పుడైతే ఇండియా జమ్మూ , కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నదో అప్పటి నుంచి పాకిస్తాన్ గుర్రుగా ఉంటోంది. ఇండియాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. మరో వైపు ఎన్నడూ లేని విధంగా తమ దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికానేనంటూ సంచలన కామెంట్స్ చేశారు ఇమ్రాన్ ఖాన్. ఆయన అమెరికాలో ఇటీవల పర్యటించారు కూడా. ఇదే సందర్భంలో తమ దేశంలో తీవ్రవాదులు ఉన్నారంటూ దీనికి గత పాలకులే కారణమంటూ వెల్లడించారు.  భారత్ పాక్ చేస్తున్న దురాగతాలను, కవ్వింపులకు పాల్పడుతూ దేశంలో అస్థిరత కలిగించేలా, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులకు దిగబడటం పై పక్కా ఆధారాలతో సహా నిరూపించింది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు ...

అంబానీలకు నోటీసులు - దిగ్గజ కంపెనీలకు గుబులు..!

చిత్రం
భారత దేశ వ్యాపార రంగంలో తనకంటూ ఓ బ్రాండ్, ఇమేజ్ స్వంతం చేసుకున్న రిలయన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన ముకేశ్ , అనిల్ అంబానీలు కేంద్ర ఆదాయ పన్ను శాఖ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆయిల్, టెలికాం. లాజిస్టిక్స్, డిజిటల్ టెక్నాలజీ, జ్యుయలరీ , ఫ్యాషన్స్, ఈ కామర్స్ , తదితర రంగాలలో టాప్ పొజిషన్ లో ఉన్న సదరు కంపెనీకి లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయని, దానికి సంబంధించిన లెక్కలు సరిగా లేవంటూ ఐటీ నోటీసులు జరీ చేసింది. ఒక్కసారిగా ఇండియన్ మార్కెట్ ఈ ఒకే ఒక్క వార్తతో కుదుపునకు లోనైంది. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఆర్ ఐ ఎల్ శాసిస్తోంది. ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతోంది. తాజాగా విదేశాల్లో బిగ్ కంపెనీలపై కన్నేసింది. అక్కడ కూడా టేకోవర్ చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. రోజు రోజుకు బిజినెస్ పెంచుకుంటూ పోవడంతో రిలయన్స్ షేర్స్ అమాంతం పెరిగాయి. ఇటీవలే ముంబై లో జరిగిన సమావేశంలో ముకేశ్ ఇండియాను పరుగులు పెట్టేలా చేస్తామని, అది ఇంటర్ నెట్ లో సంచలనం కలిగిస్తుందని చెప్పారు. అంతే కాకుండా అతి తక్కువ ధరకు డైరెక్ట్ టూ హోమ్ సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా ...

నల్లమల - తెలంగాణకే తలమానికం - దేశానికే గర్వకారణం

చిత్రం
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపే ప్రసక్తి లేదంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు శాసన సభలో ప్రకటించారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా, లేదా కుట్రలు పన్నినా ఇక సాగవని హెచ్చరించారు. గత కొంత కాలంగా నల్లమల ఆందోళనలతో, ధర్నాలతో, నిరసనలతో అట్టుడుకుతోంది. అడవి బిడ్డలు, చెంచులు, గిరిజనలు, మేధావులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకు పడ్డారు. మరో వైపు బాధితులు అమ్రాబాద్, నాగర్ కర్నూల్ లో బంద్ స్వచ్చందంగా చేపట్టారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంతకం చేశాడంటూ విపక్షాలు ఆరోపణలు చేశాయి. దానిని ఆయన ఖండించారు. తాను తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి ఉన్నానని, ఇక్కడ ప్రతి గూడెం, ఇంటికి తిరిగానని ఇదంతా విపక్షాలు కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపణ చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధినేత కోదండ రామ్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమల రావు యురేనియం తవ్వకాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. అంతే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ వ...

విహారం తీరని విషాదం ..కన్నీళ్లను మిగిల్చిన గోదారి..!

చిత్రం
నిండు కుండలా ప్రవహిస్తున్న గోదావరి తీరని విషాదాన్ని మిగిల్చింది. విలువైన ప్రాణాలు పోయేలా చేసింది. అతిపెద్ద ఘోరం జరిగి పోయింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనికంతటికి పర్యాటక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. పర్యాటకులను ఎక్కించుకున్నపుడు అన్నీ సక్రమంగా ఉన్నాయో చూసు కోవాల్సిన భాద్యత బోటు నిర్వాహకులపై ఉంటుంది. ఈ విషాదానికి కేంద్ర బిందువుగా తూర్పు గోదావరి జిల్లా మారింది. ఉన్నతాధికారులు, మంత్రి, ప్రజా ప్రతినిధులు హుటా హుటిన ప్రమాద సంఘటన చోటు చేసుకున్న దేవీపట్నం మండలం కచ్చులూరుకు తరలి వెళ్లారు. సహాయక చర్యలలో మునిగి పోయారు. ఇక్కడే పర్యాటక బోటు గల్లంతైంది. ప్రమాద సమయంలో ఆ బోటు లో  దాదాపు 61  మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. నిన్నటి దాకా గోదావరి ఉగ్ర రూపాన్ని చూపించింది. ప్రమాదపు స్థాయిని దాటుకుని ప్రవహించింది. ఎగువన కురుస్తున్న వర్షాల దెబ్బకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దివిసీమ తీవ్ర ఇబ్బందులకు లోనైంది. ఇదే సమయంలో పర్యాటక శాఖ అధికారులు ఎందుకు బోటు ను అనుమతి ఇచ్చారో తెలియడం లేదు. ఒకవేళ ఇచ్చిన...

విమర్శల జగడం..ఆరోపణల పర్వం..ఏపీ రాజకీయం

చిత్రం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో కొలువు తీరిన వైకాపా ముచ్చటగా 100 రోజులు పూర్తి చేసుకుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఆయనకు కుడి, ఎడమల బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి , ఆళ్ళ రామ కృష్ణా రెడ్డిలు పని చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తోంది వైసీపీ. తాను అనుకున్నాడంటే చాలు అమలు చేయడం అన్నది హాబీగా మార్చేసుకున్నారు ఏపీ సీఎం. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అంటూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. మరో అడుగు ముందుకు వెళుతూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నది. పల్నాడులో చలో ఆత్మకూర్ కు శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత బాబు. ఇదే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశంలో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్ర బాబు కు జగన్ మోహన్ రెడ్డి కంట్లో నలుసుగా తయారయ్యాడు. పో...

నిర్మలమ్మ నిర్ణయం..హోసింగ్ కు ఊతం..!

చిత్రం
డీలా పడి, కునారిల్లి పోయిన గృహ నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోసింగ్ కు వరాలు ప్రకటించారు ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఈ రంగం బల పడనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్య తరగతి ఇళ్లకు ఏకంగా 20 వేల కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో ఉన్నది. ఆర్థిక వృద్ధి రేటు ఎన్నడూ లేనంతగా దిగి పోయింది. దీనికి కాయకల్ప చికిత్స చేసేందుకు విత్త మంత్రి రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్క దిద్ది, ఉద్దీపన చర్యలు చేపట్టే పనిలో పడింది. ఆర్ధిక మంద గమనం పెరుగుతూ ఉండటం ప్రభుత్వాన్ని బెంగకు గురి చేస్తోంది. దీని వల్ల దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. దేశ ప్రజల్లో గణనీయంగా కొనుగోలు నశించింది. ప్రత్యేక పథకాలు, రాయితీలు ఇవ్వగలిగితే కొంత మేర సంక్షోభం నుంచి గట్టెక్క వచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన. అందుకే ప్రతి అవకాశాన్ని పరిగణలోకి తీసుకుంటోంది. మొదటగా ఎగుమతులను పెంచడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్క వచ్చు. ఇవ్వన్నీ అమ...

ఆ రూపం అపురూపం..ఆమె జ్ఞాపకం మధురం..!

చిత్రం
భారతీయ సినీ జగత్తులో మరిచి పోలేని జ్ఞాపకం మధుబాల. ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో సావిత్రి..బాలీవుడ్ లో మధుబాల గొప్ప నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. 1933 లో పుట్టిన ఆమె 1969 లో మృతి చెందారు. 1950 ల నుండి 1960 కాలంలో ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. వీటిలో ఎక్కువ భాగం కావ్య స్థాయిని పొందాయి. తన సమకాలికులైన నర్గీస్, మీనా కుమారిలతో పాటు అత్యంత ప్రతిభావంతులైన హిందీ చిత్ర నటీమణులలో ఒకరిగా మధుబాల విస్తృత గౌరవాన్ని పొందారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల పదకొండు మంది సంతానంలో ఈమె ఐదవ వ్యక్తి. ఇదే సమయంలో మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత తన కుటుంబాన్ని ముంబైకి మార్చారు. ముంతాజ్ తొమ్మిది సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. మొదటి సారి నటించిన చిత్రం బసంత్ బాక్స్-ఆఫీస్ వద్ద విజయవంతమైంది. బాలనటిగా ఆమె అనేక చిత్రాలలో నటించడాన్ని కొనసాగించారు. నటీమణి దేవికా రాణి ఆమె నటనకు, సామర్ధ్యానికి ముగ్దులై ఆమెకు మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు. మధుబాల త్వరగానే ఒక విశ్వసనీయమైన వృత్తి పరమైన నటిగా కీర్తిని సంపాదించు...