పోస్ట్‌లు

జనవరి 3, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అక్షరాస్యతలో అధమ స్థానం

చిత్రం
విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు అందుకోలేక పోతోంది తెలంగాణ రాష్ట్రం. విద్యా శాఖ పూర్తిగా గాడి తప్పింది. అసమర్థులైన అధికారులు తిష్ట వేయడంతో ఈ గతి పట్టింది. ఈరోజు వరకు వేలాది ఖాళీలున్నా నేటికీ ఆరేళ్ళు కావస్తున్నా భర్తీ చేసిన పాపాన పోలేదు. బడులు, కాలేజీలు, యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థలు ఇప్పటికే పనిచేయడం మానేశాయి. మొత్తం ఇంచార్జీల సార్లతో నడుస్తున్నాయి. ఇక కేజీబీల సంగతి చెప్పనక్కర్లేదు. విద్యా శాఖ కార్యదర్శి ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి. తాజాగా దేశ వ్యాప్తంగా ట్రైబల్ లిటరసీ గురించి ఏ రాష్ట్రం ఏ పొజిషన్ లో వుందో కేంద్ర సర్కార్ వెల్లడించింది. నిన్నటి దాకా బీరాలు పలికిన విద్యాశాఖాధికారులు విస్తు పోయేలా షాక్ ఇచ్చింది. చదువులో చాలా వెనుకబడి ఉన్నదన్న విషయాన్ని స్పష్టం చేసింది. కేవలం 49.5 శాతం అక్షరాస్యత రేటుతో మొత్తం 31 రాష్ర్టాల్లో 30వ స్థానంలో నిలిచింది. ఎస్టీల్లో లిటరసీ రేటు దేశంలో సగటున 59 శాతం ఉండగా, తెలంగాణలో దాదాపు పదిశాతం తక్కువ​ నమోదైంది. అతి తక్కువ అక్షరాస్యతతో కింది నుంచి మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. గిరిజనులను అక్షరాస్యులను చేసేందుకు కేం...

యుద్ధ మేఘాలు..ఆగని దాడులు

చిత్రం
ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తూనే ఉన్నది. ఇప్పటికే ఆ దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, రివల్యూషనరీ గార్డ్‌ కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమాని ఈ దాడుల్లో మృతి చెందారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌ ఆదేశాల మేరకు బాగ్దాద్‌ విమానాశ్రయం సమీపంలో సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగన తలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్‌ అల్‌ షాబి పారా మిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు బాగ్దాద్‌ మీడియా వెల్లడించింది. సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో సులేమాని మరణించారని ధ్రువీకరించింది. ఇదిలా ఉండగా ట్రంప్ ఇరాన్ పై నిప్పులు చెరిగారు. విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్‌ అల్‌ ఖుద్స్‌ చీఫ్‌ జనరల్‌ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడుల...

ఎగిరి పోతే ఎంత బావుంటుందో

చిత్రం
ఒకప్పుడు గగనతలంలో ప్రయాణం అన్నది ఓ అంతులేని కల. కానీ అదిప్పుడు కళ్ళముందు సాక్షాత్కారం అవుతోంది. మానవ మేధస్సుకు విమానయానం ఓ మచ్చుతునుక. ప్రపంచ మంతటా దేశాల మధ్య సరిహద్దులు చెరిగి పోయాయి. విమానాల రాకపోకలతో మనుషుల మధ్య బంధాలు బలపడ్డాయి. ఇప్పుడు చేతుల్లో కాసులుంటే చాలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజాగా ఇండియా నుంచి అధికంగా ఇతర దేశాలకు వెళ్లారు. అంతే కాకుండా మన హైదరాబాద్ నుంచి భారీగా బయలుదేరారు. నగరం నుంచి అనేక జాతీయ, అంతర్జాతీయ నగరాలకు పెరిగిన విమాన సదుపాయాలతో ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.  ఇక్కడి నుంచి 55 ప్రధాన నగరాలకు నేరుగా ఫ్లైట్‌ కనెక్టివిటీ ఉంది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చార్జీల పైన ఇస్తున్న రాయితీలు, ఆఫర్లు కారణంగా జర్నీ చేసేందుకు మనోళ్లు తెగ ముచ్చట పడుతున్నారు. ఫ్లైట్‌ చార్జీలు రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ చార్జీలతో సమానంగా ఉంటున్నాయి. దీంతో గంటల తరబడి రైళ్లలో ప్రయాణం చేసే కంటే ఫ్లయిట్ జర్నీ బాగుంటుందని జనం దీనికే ప్రయారిటీ ఇస్తున్నారు. పోయిన ఏడాది హైదరాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి 2.13 కోట్ల మంది పయనించగా వారిలో 1.74 కోట్ల మంది డొమెస్ట...

ఇక నుంచి దిశ..భరోసా

చిత్రం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను చేతల మనిషినని ఇప్పటికే నిరూపించుకున్నారు. ప్రియాంక రెడ్డి దారుణ ఘటన నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఏపీలో ఎలాంటి అఘాయిత్యాలు, దారుణాలు, వేధింపులు జరగకుండా ఉండేందుకు, మహిళలు, బాలికలకు భరోసా కల్పించేలా అత్యంత కఠినమైన చట్టాన్ని రూపొందించారు. ఈ మేరకు శానసభలో బిల్లును ప్రవేశ పెట్టారు. దానికి వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. జగన్ తీసుకు వచ్చిన ఆ చట్టమే దిశ. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ మేరకు జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ–2019’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ చట్టం పరిరక్షణ ప్రత్యేకాధికారి కృతికా శుక్లా స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు, ప్రత్యేక మహిళా పోలీస్‌ స్టేషన్, బోధనాస్పత్రుల్లో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఆస్పత్రుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు.   మహిళలు, చిన్నార...

ఇక నుంచి ఆరోగ్యాంధ్రప్రదేశ్

చిత్రం
ఏపీ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. అడిగితేనే ఇవ్వని పాలకులు ఉన్న ఈ రోజుల్లో అన్నీ అడగకుండానే ఇచ్చేస్తూ తాను మాటల సీఎం కానని, చేతల సీఎం అంటూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు సందింటి జగన్ మోహన్ రెడ్డి. పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఆయన, విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి సారించారు. ఈ దేశం లో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ఓ సంచలనం. 28 రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ పథకం అమలు కావాలని జగన్ కోరారు. ఇందు కోసం వెయ్యి రూపాయలు వైద్య ఖర్చులు దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఏపీలోని పశ్చిమ గోదావరిలో ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును.ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికామని చెప్పారు. కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం ప్రారంభించిన రెండో కార్యక్రమం ఇది. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఆరోగ్యశ్రీ సేవలు 2,059కి పెంచుతూ పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఇది అన్నింటికన్నా సంతృప్తిని ఇచ్చే కార్యక్రమం. ఇంతకు ముందు మహానేత రాజశేఖరరెడ్డి.. దేశ ఆరోగ్య చర్రితలోనే ఒక విప్లవాత్మక పథకంగా ఆరోగ్యశ్...

అమరావతికి నో ఛాన్స్

చిత్రం
జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్నట్టు గానే చేసేస్తున్నారు. ఎవ్వరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా తాను అనుకున్నది చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే బ్లూ ప్రింట్ కూడా రెడీ కావడం తో ఇక అనుమానాలకు తెర దించినట్లయింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తన పూర్తి నివేదికను సమర్పించింది. ఇది పూర్తిగా అమరావతి ఎంత మాత్రం కేపిటల్ సిటీకి అనువు కాదంటూ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌ ఫీల్డ్‌ మెగా సిటీల నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలి పోయాయని బీసీజీ వెల్లడించింది. అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్ట దాయకమని.. సంపదంతా ఒకే చోట పోగై మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది.  అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభ దాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని స్పష్టం చేసింది. అప్పు చేసి ఒకే చోట లక్ష కోట్లకు పైగా ఖర్చు పెడితే.. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని తేల్చి చెప్పింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం చేయవచ్చని పేర్కొంది. ప్రప...

ఏపీ బ్లూ ప్రింట్ రెడీ

చిత్రం
తాను అనుకున్నట్టు గానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఏపీపై తన ముద్ర ఉండేలా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు నిపుణులతో సమగ్ర ప్రణాళిక రూపొందింది. ఇందు కోసం ఏర్పాటు చేసిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని స్పష్టం చేసింది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్దికి ఓ స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది. మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. రాజధాని విషయంలో వివిధ దేశాల్లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆర్థిక భారం తదితర అంశాలను పరిగణనల...

జేడీయూకు బంపర్ ఆఫర్

చిత్రం
ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ మిత్రపక్షం జేడీయూను శాంత పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. జేడీయూని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ గత కొంత కాలంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కక పోవడం, ఎన్‌ఆర్‌సీ, రానున్న అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు వంటి అంశాలపై జేడీయూ, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిషోర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీట్ల ఒప్పదంలో సింహ భాగం తామే పోటీ చేస్తామని, బీజేపీ ప్రతిపాదనకు తలొగ్గేది లేదంటూ తేల్చి చెప్పారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి విపక్షాలకు చేతులు కలిపేందుకు కూడా నితీష్‌ సిద్ధంగా ఉన్నారంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వెంటనే తేరుకున్న మోదీ, షా ద్వయం నష్ట నివారణ చర్యలను చేపట్టిం...

మరాఠాలో పవార్ దే పవర్

చిత్రం
నిన్నటి దాకా అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరాఠాలో చక్రం తిప్పడం చేస్తూనే ఉన్నారు. మొదటి నుంచీ అపారమైన రాజకీయ అనుభవం కలిగిన ఈ నాయకుడు ఏది చేసినా అది సంచలనమే. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శరద్‌ పవార్‌.. ప్రభుత్వంలోనూ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన మంత్రులకు కీలక శాఖలను అప్పగించేందుకు శివసేన చీఫ్‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. కాగా శాఖల కేటాయింపు కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు పర్యావరణ, పర్యాటక శాఖ ఇస్తారని సమాచారం. సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ శాఖ కావాలని పట్టుబట్టినా శివసేన అంగీకరించలేదని తెలుస్తోంది. కాగా ...

కేరళకు కేంద్రం షాక్

చిత్రం
కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ సర్కార్ తనకు ఎదురు తిరిగే ప్రతి రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే బీజేపీని పూర్తిగా వ్యతిరేకించే పార్టీలు కొలువు తీరిన ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ ఇప్పటికే నో చెప్పేసింది. తాజాగా కేరళ రాష్ట్ర సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దేశ గణతంత్ర దినోత్సవం వేడకల్లో తమ శకటాన్ని ప్రదర్శించాలనుకున్న కేరళ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. శకట ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించింది. వివిధ కారణాలతో శకటాన్ని అనుమతించడం లేదని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేర‌ళ‌లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి వివాదాస్పద చట్టాలను కేరళ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా పబ్లిక్‌డే పరేడ్‌లో తమ శకటా...