పోస్ట్‌లు

అక్టోబర్ 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జూలు విదిల్చిన కలాలు .. సైరాకు బలాలు..!

చిత్రం
నీ దగ్గర కత్తులున్నాయా .. సమాజాన్ని భయపెట్టే తూటాలున్నాయా..ప్రపంచాన్ని భయపెట్టే ఆయుధాలు, అణుబాంబులు ఉన్నాయా ..పర్వాలేదు కానీ మొనదేరిన, పదునెక్కిన కలాలు మాత్రం ప్రాణం పోసుకుంటే మరింత ప్రమాదం అని రాజులు, డిక్టేటర్లు భయపడి పోయారు. కాలాలకు అంత బలమున్నది. అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నాడు ప్రజాకవి కాళోజి నారాయణ రావు. నిత్యం మెదళ్లతో కుస్తీ పడుతూ క్రియేటివిటీ కోసం తపన పడే వారిలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, గాయనీ గాయకులూ, ఆర్టిస్టులు, సృజనాత్మకతను కలిగినవారు ఉన్నారు. వీళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో చీకటి మయమై పోయేది. జీవితాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే రంగాలలో మొదటిది సినిమా రంగం. ఇక్కడ క్రియేటివిటీ కలిగిన వారికే ఎక్కువగా అవకాశాలు తలుపు తడుతాయి. సినిమా అంటేనే 24 కళలు ఉండాల్సిందే. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసే మూవీ సక్సెస్ కావాలంటే వందలాది మంది ఏక కాలంలో కష్టపడాల్సిందే. వీరందరిని సమన్వయం చేసుకుంటూ సినిమాను నడిపించాలి. లేకపోతే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. సినిమా అన్నది పూర్తిగా రిస్క్ తో కూడుకుని ఉంటుంది. స్టోరీ తో పాటు డైల...

సైరా సెన్సేషన్ ..మెగా బిగ్ హ్యాపీ

చిత్రం
తెలంగాణకు చెందిన డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరా నరసింహ్మ రెడ్డి భారీ వసూళ్లతో రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా కలెక్షన్లలో సునామి సృష్టిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి కొడుకు, నటుడు రామ్ చరణ్ నిర్మించారు. ఊహించని రీతిలో ఈ సినిమా మొదటి నుంచే హైప్ క్రియేట్ చేస్తూ దూసుకు వచ్చింది. సినిమా మార్కెట్ లో సైరా సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఓ రకంగా సురేందర్ రెడ్డికి భారీ హిట్ లభించినట్లయింది. మరో వైపు మెగా స్టార్ కు ఇది ఊహించని రీతిలో సంతోషాన్ని కలిగించింది. ఎక్కడ చూసినా జనం నుంచి ఆదరణ లభిస్తోంది. యువతీ యువకులు, పెద్దలు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున సైరా సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది ఈ మూవీ. తెలుగు సినిమా రంగానికి చెందిన అన్ని విభాగాలకు చెందిన వారంతా ఈ సినిమాను చూసి విస్తు పోయారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రశంశలతో ముంచెత్తారు. ప్రముఖ డైరెక్టర్లు త్రివిక్రం శ్రీనివాస్, సుకుమార్, హరీష్ శంకర్, ...

అమెజాన్ ..ఫ్లిప్ కార్ట్ ల మధ్య వార్

చిత్రం
భారతీయ ఈ కామర్స్ రంగంలో ఇప్పుడు ఎన్నడూ లేనంత పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులు, కొనుగోలుదారుల పంట పండుతోంది. ఓ వైపు భారతీయ ఆర్ధిక వ్యవస్థ అవస్థలు ఎదుర్కొంటుంటే ఇక్కడ మాత్రం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలు, నగరాల దాకా పోటీ పడి ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ ను దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఊహించని రీతిలో ఏకంగా అమెజాన్ లో భారీగా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాత్రం ఇంకా కొనుగోలు వివరాలు వెల్లడించలేదు. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ పేరుతో , ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో మరోసారి అమ్మకాలకు తెరతీశాయి. ఈ కామర్స్ కంపెనీలు మరో అమ్మకాల యుద్దానికి సిద్ధమయ్యాయి. దసరా పండుగ అయి పోవడంతో మరోసారి దీపావళి ఫెస్టివల్ ను టార్గెట్ చేసుకున్నాయి. ఇందు కోసం భారీ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాయి. కేవలం దీపావళి కోసమే మరో భారీ ఆఫర్స్ ప్రకటించాయి ఈ రెండు కంపెనీలు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో స్టార్ట్ చేస్తుండగా ..ఫ్లిప్ కార్ట్ మాత్రం బిగ్ దివ...

కళకళ లాడనున్న తిరుపతి రైల్వే స్టేషన్

చిత్రం
ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన పుణ్యక్షేత్రంగా తిరుమల వినుతికెక్కింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు ఆ శ్రీ వేంకటేశ్వరుడిని, పద్మావతి అమ్మ వార్లను దర్శించుకుంటారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. నిత్యం బస్సుల్లో, వాహనాల్లో, రాళ్ళల్లో, విమానాళ్ళల్లో ప్రయాణం చేస్తూనే ఉంటారు. రోజు రోజుకు రద్దీని తట్టు కోవడం కష్టంగా మారింది. అన్నిటికంటే రైల్వే శాఖ రోజూ వేలాది మందిని ఈ పుణ్య క్షేత్రం కోసం రైళ్లు నడుపుతోంది. అయినా రైళ్లు సరి పోవడం లేదు. జనాభా పెరగడం తో పాటు రోజూ తిరుమలను దర్శించుకునే వారిలో భక్తులు అనూహ్యంగా పెరిగి పోతున్నారు. వారికి వసతి సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. వేలాది మంది సిబ్బంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉచితంగా, నామ మాత్రం ఫీజులతో వసతులు కల్పిస్తున్నా అవి కూడా సరిపోవడం లేదు. దీంతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు రేల్వే శాఖను వేడుకుంటున్నారు. మెరుగైన సేవలు ఏర్పాటు చేయాలని, బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయింపులు జ...

ధోని ఆటగాడు కాదు మనసున్నోడు

చిత్రం
ఇండియాలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందిన ఝార్ఖండ్ డైనమేట్, డైనమిక్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఏది చేసినా సంచలనమే. టీమిండియాకు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన యోధుడిగా ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకుంటారు. ఎంత వత్తిళ్లు ఉన్నా సరే కూల్ గా తన పని తాను చేసుకుపోయే ఈ ఆటగాడు అంటే కోట్లాది మందికి చచ్చేంత ఇష్టం కూడా. వయసు పెరుగుతున్నా ఇంకా భారత జట్టుకు తన సేవలు అందజేస్తున్నారు. ఇండియా గెలుపులో ధోని కీలక పాత్ర పోషిస్తూనే అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో అగుపిస్తూ కాసులు వెనకేసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రపంచంలోని వంద మంది భారీ ఆదాయం కలిగిన ఆటగాళ్లలో మన ధోని కూడా ఒకడు. అంటే అర్థం ధోని ఆదాయం సగటున ఏడాదికి దాదాపు 100 కోట్లకు పైమాటే అన్నమాట. తమ ఆటతో అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో మొదటగా చెప్పాల్సి వస్తే కపిల్ దేవ్, బ్రియాన్ లారా, అజహరుద్దీన్, ధోని, రాహుల్ ద్రావిడ్, స్టీవ్ వా లాంటి వాళ్ళున్నారు. అయితే చాలా మందికి అజ్జు భాయి అనే సరికల్లా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే జ్ఞాపకం వస్తుంది. కానీ ఈ హైదరాబాదీ ఆటగాడు ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే గుప్త దానాలు చేస్తూ ఉంటాడు. పేద పిల్లల...

కథలు రాసేంత వరకే రాజులం.. ఆ తర్వాత బానిసలం ..త్రివిక్రం..!

చిత్రం
జీవితాన్ని ఆవిష్కరించాలన్నా, దాని గురించి చెప్పాలన్నా అది ఒక్కరికే సాధ్యం. అయితే కళాకారులైనా ఉండాలి లేదా చేయి తిరిగిన రచయితలైనా కావాలి. తెలుగు సినిమా పరిశ్రమలో క్రియేటివ్ కలిగిన వారు లెక్కించ లేనంత మంది కొలువుతీరి ఉన్నారు. ఒకప్పుడు సినిమా అంటే ఒక్కో విభాగానికి ఒక్కొక్కరు సహాయం అందించే వారు. అన్నిటికంటే డైరెక్టర్ దే కీలకంగా ఉండేది. కథ డామినేట్ చేసేది. కానీ ఇప్పుడు కాలం మారింది. సినిమా కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగా కొంత మేరకు హీరో డామినేటెడ్ సినిమాలు ఉండేవి. అది కూడా పోయింది. దాని స్థానంలో కొత్త వారు, కొత్త టాలెంట్ కలిగిన వాళ్ళు ఉప్పెనలా దూసుకు వచ్చారు. ఇందుకు టెక్ దిగ్గజం గూగుల్ కు కృతజ్ఞతలు చెప్పు కోవాలి. ఎందుకంటే అది యూట్యూబ్ ను కొనుగోలు చేశాక దాని స్వరూపమే మారి పోయింది. కోట్లాది వీడియోలు రోజూ ప్రపంచ వ్యాప్తంగా అప్ లోడ్ , డౌన్ లోడ్ అవువుతూనే ఉన్నాయి. అసలు సినిమా తీయాలంటే ఎక్కువ సమయం, కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం తలకు మించిన భారంగా మారింది. దీనికి చెక్ పెట్టింది యూట్యూబ్. ఒక్క పైసా ఖర్చు లేకుండానే టాలెంట్ వుంటే చాలు, చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే ఇంకేం అక్కర్ల...

ఎందుకిలా..ఎన్నాళ్లిలా..!

చిత్రం
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు కొంచెమైనా స్వేచ్ఛ ఉండేది. 14 ఏళ్ళ పాటు సుదీర్ఘమైన పోరాటానికి ఊపిరి పోసిన తెలంగాణ చివరకు ఎన్నో బలిదానాల, త్యాగాల సాక్షిగా నూతన రాష్ట్రంగా ఏర్పడింది. అయినా ఇక్కడ మాట్లాడటం నేరంగా మారింది. నిధులు, నీళ్లు, నియామకాల కోసం లక్షలాది మంది జనం రోడ్డెక్కారు. తమ విలువైన కాలాన్ని కోల్పోయారు. వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. భావించారు కూడా. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం సంక్షేమ పథకాల జపం చేస్తున్నది కానీ యువతీ యువకుల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇంకొందరు ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారైనా కనీసం ఉన్న పోస్టులలో కొన్నింటినైనా భర్తీ చేస్తారని అనుకున్నారు నిరుద్యోగులు. అయినా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. విపక్షాలు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇటు వైపు చూడడం లేదు. ఇక కొలువుల కోసం కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. రాను రాను కొలువుకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్హతలు ఉన్నా, వయసు రీత్...

ఉద్యమ కెరటం స్ఫూర్తి శిఖరం

చిత్రం
ప్రపంచ చరిత్రలో విస్మరించలేని పదం తెలంగాణ. పోరాటాలకు, ఆరాటాలకు, ఉద్యమాలకు, బలిదానాలకు, త్యాగాలకు చిరునామా ఈ ప్రాంతం. ఎందరో మహానుభావులు ఈ మట్టిలోంచి మొలకెత్తారు. ఉద్యమాలకు సారధ్యం వహించారు. ఇంకొందరు తామే చరిత్రను సృష్టించారు. ఈ నేల లోనే ఆత్మాభిమానం దాగి ఉన్నది. అందుకే ఇక్కడ జన్మించిన వాళ్ళు ఎవ్వరికీ తలవంచరు. కడుపులు కాలుతున్నా సరే అమ్ముడుపోరు. ఈ ప్రాంతానికి ఉద్విగ్నంగా చరిత్ర ఉన్నది. ఎనలేని కథ ఉన్నది. చెప్పుకుంటూ పోతే చరిత్ర నిండా అంతులేని గాయాలున్నవి. చెప్పుకోలేనంత దుఃఖం దాగి ఉన్నది. తెలంగాణకు తలమానికంగా ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో ప్రతి చోటా ఉన్నారు. తమ ప్రతిభా పాటవాలతో ప్రభావితం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకే ఒక్కడు జార్జ్ రెడ్డి. ఓయూలో చదువుకున్నాడు. వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. విప్లవ వాద విద్యార్థి సంఘాల నాయకుడుగా పని చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవ వాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడుగా కీలక పాత్ర పోషించారు. జార్జ్ రెడ్డి 1947, జనవరి 15 న కేరళలోని పాల్ఘాట్ లో పుట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రా...

చూస్తే చిన్నోడు ..డైరెక్టర్లలో గట్టోడు

చిత్రం
తెలుగు సినిమా సక్సెస్ ఫుల్ సినిమాలతో వర్ధిల్లుతోంది. వేలాది మందికి ఈ పరిశ్రమ కూడు పెడుతోంది. టాలెంట్ వుంటే చాలు ఈ రంగం ఛాన్స్ ఇస్తోంది. తెలుగు మూవీస్ స్టామినా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళింది. నిన్న మొన్నటి దాకా 20 కోట్లు అంటే మహా గొప్పగా భావించే వాళ్ళు. కానీ సీన్ మారింది. 100 కోట్ల రేంజ్ దాటేసింది. దీనికి అంతటికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా. ఓవర్సీస్ లలో కూడా మన తెలుగు సినిమాలు వసూళ్ళలో రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు హీరోలదే  డామినేషన్. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం సినిమాల స్వరూపాన్ని దర్శకులు డిసైడ్ చేస్తున్నారు. మూవీస్ సక్సెస్ లో డైరెక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి , సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, సతీష్ వేగ్నేశ, పరశురామ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. తాజాగా సక్సెస్ ఫుల్ దర్శకుల జాబితాలో మరొకరు ఉన్నారు..ఆయనే దాసరి మారుతి. లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేసే ఇతని టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. చూస్తే చిన్నోడిలా గా అగ...