పోస్ట్‌లు

సెప్టెంబర్ 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మధురం..అధరామృతం..పుల్లారెడ్డి స్వీట్స్ అదుర్స్..!

చిత్రం
తాతలు, తల్లిదండ్రులు, వారి పిల్లలు ఇలా ప్రతి తరం జి.పుల్లారెడ్డి స్వీట్స్ ను రుచి చూసిన వారే. ఇంతటి ప్రాచుర్యం పొందిన మిఠాయిలు ఈ దేశంలో ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకే ఒక్క సామాన్యమైన వ్యక్తి అసమాన్యమైన ..అసాధారణమైన..నభూతో న భవిష్యత్ అన్న రీతిలో సాధించిన అపురూపమైన గెలుపు గాథ ఇది. నాణ్యత, నమ్మకం, సేవ ఇవే పుల్లారెడ్డి సక్సెస్ కు మూల కారణం. దాదాపు 71 సంవత్సరాలు అంటే ఏడు దశాబ్దాలు గడిచి పోయాయి. కానీ తరాలు మారినా రుచిలో, శుచిల ో, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అప్రహతిహతంగా సాగి పోతూనే ఉన్నది. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేరున్న కర్నూల్ జిల్లాకు చెందిన జి. పుల్లారెడ్డి అనే వ్యక్తి మదిలో మెదిలిన ఈ ఆలోచనే, నేడు మాహా వృక్షమై వేలాది మందికి నీడనిస్తోంది. కోట్లాది మందికి మిఠాయిల రుచిని పంచుతోంది. ఒకప్పుడు సైకిల్ మీద పాల కోవాను తయారు చేసుకుని, ఇల్లిల్లు తిరుగుతూ రోడ్ల మీద అమ్ముకుంటూ ప్రారంభమైన పుల్లారెడ్డి దుకాణం ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందింది. అంతే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు ఆసరాగా ఉంటోంది. మిఠాయిలతో పాటు ప్రతి రోజు ప్రతి కుటుంబం నిత్యం వాడుకునే పచ్చళ్ళు, ...

సై..సైరా.. సురేందర్ రెడ్డి..!

చిత్రం
వంగా సందీప్ రెడ్డి. సుజీత్ రెడ్డి. నాగేశ్వర్ రెడ్డి..సురేందర్ రెడ్డి ..వీళ్లంతా ఇప్పుడు టాలీవుడ్ లో దమ్ము రేపుతున్న దర్శకులు. తాము తీసిన సినిమాలతో తెలుగు సినిమాకు కొత్త రేంజ్ తీసుకు వచ్చారు, ఇండియా వ్యాప్తంగా. తాజాగా సుజీత్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్ తో ఏకంగా 350 కోట్లతో సాహో సినిమా తీశాడు. అతి పెద్ద సాహసం చేశాడు. అంతేనా ఓవర్ సీస్ లో ఇప్పటికే రికార్డులను బ్రేక్ చేసింది ఈ మూవీ. ఏకంగా వసూళ్ళలో రెండో ప్లేస్ లో నిలిచింది. చరిత్ర తిరగ రాసింది. మరో వైపు ఇండియన్ మెగాస్టార్ చిరంజీవితో డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి  తాజాగా వైరల్ గా మారారు. ఆయన ఇప్పటికే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలో ఉన్నారు. పవర్ ఫుల్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ , హీరో ఓరియెంటెడ్ ఎక్కువగా ఉండేలా సినిమాలు తీయడంలో మనోడు ఎక్స్ పర్ట్. ఇప్పుడు చిరంజీవితో సైరా నరసింహ్మ రెడ్డి పేరుతో భారీ సినిమా తీస్తున్నాడు. అది కూడా పూర్తి అవుతుంది. దీని కోసం ఇప్పటికే బయ్యర్స్ పోటీ పడుతున్నట్లు, కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. చిరంజీవికి వున్న ఇమేజ్, భారీ తారాగణం తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించడం. సినిమాను రిచ్ గా తీయడం కూడా సినీ వర్గాల...

కాషాయం..బహుజనుల జపం..!

చిత్రం
ప్రపంచంలోనే సుదీర్ఘమైన రాజకీయ, పోరాట చరిత్ర కలిగిన తెలంగాణాలో అధికారం లోకి రావాలని బీజేపీ కంకణం కట్టుకున్నది. ఆ మేరకు చాప కింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రంలో రెండవ సారి కొలువు దీరిన కాషాయ సర్కార్ కు ఇప్పుడు అన్నీ తానే అయి నడిపిస్తున్న మోడీ, అమిత్ షా పరివారం ఎట్టి పరిస్థితుల్లో పవర్ లోకి రావాలని పార్టీ శ్రేణులకు హిత బోధ చేశారు. అందులో భాగంగానే అన్ని పార్టీలకు చెందిన వారు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా సరే పార్టీలోకి స్వాగతం పలకాలని., వారికి సముచిత ప్రాధాన్యత ఉంటుందని హై కమాండ్ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో సౌత్ ఇండియాలో కన్నడ నాట కొలువు దీరిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బలమైన టీఆర్ ఎస్ ను ఢీకొనేందుకు పావులు కదుపుతోంది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు, మాల, మాదిగలు, మైనార్టీలు, ఇతర కులాల వారున్నారు. గతంలో రెడ్డి , బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఉండేది ఆ పార్టీలో. ఇప్పుడు దాని ముద్రను పూర్తిగా చెరిపి వేశారు షా. తెలంగాణాలో, ఏపీలో బలమైన కేడర్ కలిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన వారంతా ఇప్పుడు బీజీపీ వైపు చూస్తున్నారు. వారిని కూడా అక్కున చేర్చుకుంటోంది.  పార్టీ పగ్గాల...

!..హుమైరా..వారెవ్వా..!

చిత్రం
ప్రతి నిత్యం యుద్ధ వాతావరణం నెలకొన్న జమ్మూ , కశ్మీర్ నుంచి ఓ మహిళ రాకెట్ లా దూసుకు వచ్చింది. తాను అందరిలాంటి దానిని కాదని, బంధనాలు తెంచుకుని , పరదాలను దాటుకుని , స్వేచ్ఛ గా తానేమిటో ..తన పవర్ ఏమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. నిత్యం కట్టుబాట్లు, కఠిన నియమాలు, తుపాకుల రణగొణ ధ్వనుల మధ్యన ఓ తెల్లటి పావురం ..పులిలా ..శివంగిలా దూసుకు వచ్చింది. ఆమెను చూసి కాశ్మీరీ మహిళలు స్ఫూర్తి పొందుతున్నారు. ఆమెను చూసి గర్విస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే హుమైరా ముస్తాక్. ఇప్పుడు సమున్నత భారత దేశంలో ఆమె వైరల్ గా మారారు. ఆమె సాధించిన ఘనత ఏమిటంటే మగాళ్లు సైతం భయానికి లోనయ్యే మోటార్ కార్ రేస్ లో దుమ్ము రేపడం. అత్యంత ప్రమాదకరమైన ఆటల్లో ఇది కూడా ఒకటి. వృత్తి రీత్యా మెడికల్ స్టూడెంట్ అయినప్పటికీ, ఈ కాశ్మీరీ క్రీడాకారిణికి మాత్రం మోటార్ రేస్ అంటే అభిమానం. అందుకే దానినే ఎంచుకున్నారు. రేయింబవళ్లు కష్టపడ్డారు. అనుకున్నది సాధించే దాకా నిద్ర పోలేదు హుమైరా. జీవితం పట్ల, తన గమ్యం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్న ఆమె..దేనినైనా సాధిస్తానని సవాల్ విసురుతోంది. రండి..పరదాలను దాటుకుని, మిమ్మల్ని మీరు బలోపేతం కమ్మంటూ పిలుపునిస్త...

పదవుల పందేరం..కుల సమీకరణలే కీలకం..?

చిత్రం
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండవ సారి కొలువు దీరిన తెలంగాణ రాష్ట్ర సమితి మహిళలకు కేబినెట్ లో చోటు లేకుండానే పాలన కొనసాగిస్తూ వచ్చింది. మొదటి సారి ప్రభుత్వం పూర్తయింది. పద్మా దేవేందర్ రెడ్డికి విప్ పదవితో సరిపెట్టారు. కానీ కేబినెట్ లో ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక భారీ మెజారిటీతో రెండో సారి అధికారాన్ని చేపట్టిన సమయంలోను మహిళల భాగస్వామ్యం లేకుండానే మంత్రివర్గంను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. మాహిళా సాధికారత, సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమంటూ చెప్పుకుంటూ వచ్చిన సర్కార్ ఆరేళ్ళు గడిచినా వారి గురించిన ఊసే లేకుండా పోయింది. కులాల సమీకరణాల ప్రాతి పదికన పదవుల పందేరం కొనసాగుతూ వచ్చింది. గతంలో ఏలిన పాలకులు రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తే దివంగత ఎన్ఠీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. కొత్తగా కొలువు దీరిన సర్కార్ అత్యధికంగా వెలమ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పుడు చిన్నజీయర్ స్వామితో ఉన్న సాన్నిహిత్యం తో మై హోమ్ జూపల్లి రామేశ్వర్ రావు తన హవాను నడిపిస్తున్నారు. ఏకంగా మీడియా సామ్రా...

!..శివన్ నీకు సలాం..!

చిత్రం
ఈ దేశం సాక్షిగా ..130 కోట్ల మంది నిన్ను చూసి గర్విస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిన..చంద్రయాన్ -2 ..చివరి క్షణాల్లో  లింక్ తెగి పోయినప్పుడు మీరు పడిన ఆవేదన..కార్చిన కన్నీళ్లు ..చిన్న పిల్లాడిలా బోరుమన్న తీరు ఎందరినో ఆలోచించేలా చేసింది. ఈ దేశం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న వాళ్ళు ఎందరో. గనుల్లో , కంపెనీలలో ఇలా చెప్పుకుంటూ పోతే, దేశ సరిహద్దులో ప్రాణాలు లెక్క చేయకుండా పహారా కాస్తున్న సైనికుల ముందు ఎంత. అవును ఎంతగా కష్టపడితే తయారవుతుంది. ఎంత మంది మెదళ్ళు వత్తిళ్లకు లోనై తీర్చి దిద్దితే చివరి నిమిషంలో కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అది దగ్గరుండి చూస్తేనే, అనుభవిస్తేనే తెలుస్తుంది. అవగతమవుతుంది. శివన్ మనలాంటి వ్యక్తే. కాక పోతే కస్టపడి చదువుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఇవ్వాళ జాతిగర్వించే సమున్నతమైన అంతరిక్ష పరిశోధనా కేంద్రంకు ఆయన చైర్మన్ గా ఉన్నారు. ఇది మామూలు పదవి కాదు. ఈ దేశపు పునాదుల్లో ఒక స్థంభం లాంటి సంస్థ అది. అక్కడ ప్రతి నిమిషం కోట్లాది రూపాయలతో సమానం. అందుకే దివంగత ప్రెసిడెంట్ కలాం ఇలాంటి శాస్త్రవేత్తలే ఈ దేశానికి కావాలని కోరారు. శివన్ ను వెన్నుతట్టి ప్రోత్స...

కొత్త కార్లు డీలా ..పాత కార్లు భళా..!

చిత్రం
మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తున్న, కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు డీలా పడ్డాయి. ఎప్పుడైతే నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటించారో, ఆరోజు నుంచి నేటి దాకా భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. నిజాలు ఒప్పుకున్నారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని త్వరలో అంతా సర్దుకుంటుందని నమ్మించే ప్రయత్నం చేస్తోంది విత్త మంత్రి. ప్రజలకు అందుబాటులో ఉంటూ విశిష్టరీతిలో సేవలు అందిస్తున్న బ్యాంకులను కలిపే ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు , ధర్నాలు , సమ్మెలు ఉద్యోగులు, సిబ్బంది చేపట్టారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను మోదీ అవలంభిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్ మెంట్ అంటూ ఊదరగొడుతున్న సర్కారు కనీసం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. దేశంలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్యమై పోయాయి. ఇదే పరిస్థితి ఇండియాలో కొంచెం మెరుగైన స్థితిలో ఉన్న ఆటోమొబైల్ రంగం క...

షావోమి సెన్సేషన్.. 5 ఏళ్ళల్లో 100 మిలియన్స్ ..అమ్మకాల్లో టాప్..!

చిత్రం
టెక్నాలజీ పెరగడంతో జనానికి అవసరాలు పెరిగి పోయాయి. దీంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అన్నది నిత్య అవసరంగా మారి పోయింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నోకియా, మోటరోలా, ఆపిల్ , సామ్ సంగ్ కంపెనీల మొబైల్స్ తో పాటు వివో, షావోమి , ఒప్పో, వన్ ప్లస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు వరల్డ్ మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఆపిల్ , సామ్ సంగ్ ల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. మొత్తం మొబైల్స్ మార్కెట్ ను చైనా దేశంలో తయారైన కంపెనీలకు చెందిన మొబైల్స్ డామినేట్ చేస్తున్నాయి. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్స్ లభిస్తుండడంతో దెబ్బకు దిగ్గజ కంపెనీల మొబైల్స్ అమ్మకాలు తగ్గి పోయాయి. ఇప్పుడు వరల్డ్ లోనే అతి పెద్ద మార్కెట్ అటు ఆఫ్ లైన్ లోను ఇటు ఆన్ లైన్ లోను ఇండియా ఉంటోంది. ఇక్కడి జనం విపరీతంగా ఏది పడితే అది కొనేందుకు పోటీ పడుతున్నారు. దీనిని చైనా కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇతర కంపెనీల మాటేమిటో కానీ ఈ  కంపెనీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంటోంది. ఇది మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది. తాజాగా చైనాకు చెందిన షావోమి స్మార్ట్ ఫోన్స్ , యాక్సెస్సరీస్ తో పాటు లెడ్ టీవీలను లాంచ్ చేసింది. ఈ కంపెనీ తయార...