పోస్ట్‌లు

డిసెంబర్ 3, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అనంతం..అద్భుతం..ఆదాయం

చిత్రం
సామాజిక మాధ్యమం అందుబాటులోకి వచ్చాక ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళు, సామాన్యులు సైతం అందుబాటు లోకి, వెలుగు లోకి వస్తున్నారు. ఇదంతా వాళ్లలో ఉన్న ప్రతిభ, అంతులేని నైపుణ్యం కూడా. అన్నీ ఉన్నా అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదే సమయంలో సాంకేతిక నైపుణ్యంలో చోటు చేసుకున్న మార్పులు కోట్లాది మందిని కనెక్ట్ అయ్యేలాగా చేస్తోంది. దీంతో అపరిమితమైన అవకాశాలు తలుపు తడుతున్నాయి. టాలెంట్ ఉండి పలు భాషల్లో కొంచెం పట్టు సాధించ గలిగితే చాలు లక్షలు వెనకేసు కోవచ్చు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. మరికొందరు ఋషులు, యోగులు, స్వాములుగా, మార్గ నిర్దేశకులుగా, జాతికి జీవం పోసేలా తమను తాము మల్చుకుంటున్నారు.  ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు న్యూమరాలజిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్కులు కేవలం సమాజ సేవకే తమ విలువైన కాలాన్ని, జీవితాన్ని వినియోగిస్తున్నారు. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న వారికీ మేలు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాధన ద్వారా తాము నేర్చుకున్న మంచి అంశాలు, విషయాలను పామరులకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. అలాంటి వార...

యువరాజుతో కరచాలనం చిన్నారి ఆనందం

చిత్రం
సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరు అనామకులు ఒక్క రోజులోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోపే ప్రపంచమంతటా పాపులర్ అయి పోతున్నారు. తాజాగా అబుదాబిలో జరిగిన సంఘటన ఓ చిన్నారిని హైలెట్ గా మార్చేసింది. అదేమిటంటే అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ కొద్ది రోజుల కిందట ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతనితో కరచాలనం  చేసేందు కోసం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్‌లో నిలబడింది. ఆ యువరాజ వారి కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడ సాగింది. అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన యువరాజు చివరకు ఆ చిన్నారికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వ కుండానే వెళ్లి పోయాడు. దీంతో ఆ చిన్నారి హృదయం తీవ్రంగా గాయపడింది. తన వంతు రాగానే యువరాజు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వ లేదని ఎంతగానో బాధ పడింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రపంచమంతటా చర్చనీయాంశం కావటంతో వెంటనే ఆ యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్‌ మషీత్‌ అల్‌ మజ్‌రౌవీ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులను సందర్శించి సంభ్రమాశ్చ...

ఎంత తిడితే అంత ఆనందం

చిత్రం
ఇదేమిటి అనుకుంటున్నారా..అవును మీరు చూస్తున్నది కరెక్టే. తెలుగు, తమిళ్ సినిమా రంగాల్లో తన సంగీతంతో మెస్మరైజ్ చేస్తూ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్. తనకు పొగడ్తల కంటే తిట్టే వారినే ఎక్కువగా ఇష్టపడతానని అంటున్నాడు. ప్రసంశలు ఉన్న చోటే విమర్శలు కూడా ఉంటాయి. విమర్శలను విశ్లేషించు కుంటూ ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ కెరీర్లో ముందుకు సాగి పోవాలనుకుంటున్నాను అంటున్నారు తమన్‌. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథా నాయికలుగా నటించారు. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ పలు విశేషాలు పంచుకున్నారు. వెంకీమామ ఒక ఎమోషనల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా రఫ్‌ వెర్షన్‌ చూసి నేను కంట తడి పెట్టుకున్నాను. ఇందులోని ఎమోషన్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుందని అనుకుంటున్నాను. మామా, అల్లుడా అన్నట్లు వెంకటేష్, నాగచైతన్య ఇద్దరూ పోటీ పడి నటించారు. ఫస్ట్‌ హాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా, సెకండాఫ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. వ...

అజ్జూ ఋణం తీర్చుకున్న దాదా

చిత్రం
రియల్లీ యూ ఆర్ గ్రేట్ దాదా. దమ్మున్నోడు. డైనమిక్ లీడర్. అంతే కాదు ఎవ్వరికీ జవాబుదారీ ఇవ్వాల్సిన పరిస్థితులు తీసుకు రాకుండానే తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీ. తనను నమ్ముకున్న వారికి, తనకు అవకాశం ఇచ్చిన వారికి సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నాడు ఈ తాజా ప్రెసిడెంట్. మహమ్మద్ అజహరుద్దీన్ అద్భుతమైన ఆటగాడు. అంతే కాదు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పినట్టు ఈ మాజీ ఆటగాడు ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరం. ఒకవేళ అనుకోని రీతిలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఇరుక్కోక పోయి ఉనింటే ఇవ్వాళ బిసిసిఐకి దిశా నిర్దేశనం చేసే స్థాయిలో ఉండేవాడు. ఈ హైదరాబాదీ పేరుతో ఎన్నో రికార్డులు నమోదు అయి ఉన్నాయి. ఒకానొక దశలో ఇండియన్ క్రికెట్ జట్టులోకి అనూహ్యంగా వచ్చాడు. తక్కువ సమయంలోనే ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. బొంబాయి క్రికెటర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. ప్రపంచం దోషిగా నిలబెట్టిన సమయంలో క్రికెట్ దిగ్గజాలు సిద్దు, కపిల్ దేవ్ , గంగూలీ తోడుగా ఉన్నారు. ఆయన వెనుకే నిలబడ్డారు. ఇప్పటికీ అజహరుద్దీన్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తు...

ఆల్ఫాబెట్ సిఇఓగా పిచాయ్

చిత్రం
ప్రపంచం లోనే దిగ్గజ సంస్థకు కార్య నిర్వహణ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయ సాంకేతిక మేధావి సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కీలకమైన ప్రకటన వెలువడింది కూడా. ఇప్పటికే గూగుల్ కంపెనీకి సిఇఓ గా ఉన్న అరుదైన, అద్భుతమైన ఈ వ్యక్తి ఏది చేసినా, ఏది మాట్లాడినా ఓ సంచలనమే. కొద్ది సేపట్లోనే అది వైరల్ గా మారుతుంది కూడా. ఇప్పటికే భారీ వేతనాన్ని అందుకుంటున్న సిఇఓలలో సుందర్ పిచాయ్ మొదటి ప్లేస్ లో ఉన్నారు. ఐటీ పరంగా గూగుల్ ను టాప్ రేంజ్ లో నిలబెట్టేందుకు, కొత్త టెక్నాలజీని అప్ డేట్ చేయడం. ఈ ప్రపంచం నివ్వెర పోయేలా ఆవిష్కరణలకు సాంకేతిక జోడించడంలో సుందర్ అందరి కంటే ముందంజలో ఉన్నారు. నిత్యం ప్రపంచ అభివృద్ధి కోసం పరితపించే ఈ ఇండియన్ టెక్కీ దిగ్గజం తన చరిత్రను తానే అధిగమిస్తున్నాడు. ఇది కూడా ఓ రికార్డు గానే భావించాలి. గూగుల్ లో సిఇఓ గా చేరక ముందు సుందర్ పిచాయ్ ఆల్ఫా బెట్ ఐటీ కంపెనీలో విధులు చేపట్టాడు. తాజాగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక రంగంలో ఐటీ పరంగా గూగుల్ సంస్థకు దరిదాపుల్లో కంపెనీలు లేక పోయినా భవిష్యత్తులో ఏ కంపెనీ తమను దాటి వేళ్ళ కూడదనే రీతిలో వర్క...

ఖాకీల వేట..చిక్కని నిత్యానంద

చిత్రం
వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్‌ ఆరోపణల నేపథ్యంలో స్వామి ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని  నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు  ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల  నేపథ్యంలో  ఈ చర్య తీసుకున్నారు. బాలికల అపహరణ, కిడ్నప్ లాంటి ఇతర క్రిమినల్ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్‌ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు. అంతే కాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్న...

పెద్ద ఎత్తున ఉద్యోగుల ఇంటిబాట

చిత్రం
కొన్నేళ్లుగా దేశానికి విశిష్టమైన రీతిలో సేవలు అందించిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు దివాళా అంచున నిలబడింది. దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్వంత స్థలాలు ఈ టెలికాం సంస్థకు ఉన్నాయి. అందుకేనేమో మోడీ కంపెనీ ఉద్దీపన పేరుతో అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆసరా కోసం అర్రులు చాస్తున్నాయి. ఇక బ్యాంకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పేదలు, సామాన్యులు కస్టపడి దాచుకున్న డబ్బులన్నీ వ్యాపారులు, బడాబాబులు, కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్స్ జేబుల్లోకి వెళ్లి పోయాయి. దీంతో అన్ని ప్రభుత్వ బ్యాంకులు నేల చూపులు చూస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలలో ఎక్కువగా నష్ట పోయింది మాత్రం కోట్లాది సామాన్య ప్రజలు మాత్రమే. జాతీయ స్థాయి ఆర్ధిక వృద్ధి రేటు కూడా మందగమనంలో సాగుతోంది. దీంతో భారతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ప్రధాని, విత్త, హోమ్ శాఖా మంత్రులతో కలిసి అత్యవసర సమావేశం చేపట్టారు. అయినా మార్పు మాత్రం రాలేదు. ఇంకో వైపు బ్లాక్ మనీని అరికడతామని, విదేశాల్లో దాచుకున్న దొంగల భరతం పడతానని బీ...

ఈ లోకం మహిళలకు శాపం

చిత్రం
లోకం తనదారిన తాను వెళుతోంది. తరతరాలుగా ఈ ప్రపంచం మారుతూ వచ్చినా, ఎంతో అభివృద్ధి సాధించినా, సాంకేతిక పరంగా మార్పులు చోటు చేసుకున్నా మహిళల పట్ల పురుషుల ఆలోచనల్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. ఇది సభ్య సమాజం మొత్తం తలొంచు కోవాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా ప్రపంచ ఆరోగ్య సమస్థ మహిళలు, బాలికలు, చిన్నారులపై వరల్డ్ వైడ్ గా శారీరకంగా, మానసికంగా వేధింపులకు లోనవుతు న్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. వారిపై వివక్ష చూపడమేనని తెలిపింది. స్త్రీలను గౌరవించడం, వారిపై హింసను నిరోధించడంపై డబ్ల్యూహెచ్‌వో ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. మహిళల భద్రతకు మొదటి స్థానం కల్పించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వారికి ఎలాంటి హాని చేయ కూడదని హితవు పలికింది. వారి గోప్యతను కాపాడాలని, భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వారిపై ఏ మాత్రం వివక్ష చూపించొద్దని కోరింది. అందు కోసం కార్యక్రమాలను రూపొందించాలని పేర్కొంది. నిర్దేశ...

వెండి తెరపై గల్లీ బాయ్

చిత్రం
బిగ్ బాస్ పుణ్యమా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ అయిపోయిన తెలంగాణ పోరడు, సింగర్ రాహుల్ సింప్లి గంజ్ కు అదృష్టం వరించింది. ఇప్పటికే బిగ్ బాస్ హీరో గా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు త్వరలో బిగ్ స్క్రీన్ మీద అగుపించ బోతున్నాడు. నిన్న మొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగిన ఓ గల్లీబాయ్‌కి బిగ్‌స్క్రీన్‌పై నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ప్లేబ్యాక్‌ సింగర్‌గా చిత్ర సీమకు పరిచయమైన ఈ కుర్రాడు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌–3 విజేతగా నిలిచాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్‌ స్టార్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ రాహుల్‌ను వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. పక్కా లోకల్‌ బాయ్‌గా అభిమానులకు దగ్గరైన రాహుల్‌కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అగ్రనటులు ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నిన్నటి దాకా బుల...

జగన్ కు లాయర్ల జేజేలు

చిత్రం
విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, తాను మాత్రం మడమ తిప్పేది లేదంటూ ముందుకే సాగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. పేదల సంక్షేమమే తన ధ్యేయమంటూ వందలాది కార్యక్రమాలు, జనం కోసం విన్నూతమైన రీతిలో పథకాలు ప్రవేశ పెడుతున్నారు. తనదైన శైలిలో పాలనను గాడిలో పెడుతూనే అధికారులు, మంత్రివర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ సహాయం అంద జేస్తామని ఎన్నికల ప్రచారం చేపట్టిన సందర్భంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు  ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకాన్ని జగన్‌ ప్రారంభించారు. లబ్ధిదారులైన న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ పథకం కింద జూనియర్‌ న్యాయ వాదులకు ప్రతినెలా 5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ న్యాయవాదులకు ప్రతినెలా 5,000 చొప్పున స్టైఫండ్‌ ఇవ్వడం పట్ల పలువురు న్యాయవాదులు జగన్ మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి 100 కోట్ల ...

ఏడు వేల క్లబ్ లో టేలర్

చిత్రం
న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టేలర్‌ సెంచరీ సాధించాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఏడువేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం రాస్‌ టేలర్‌ 7,023 టెస్టు పరుగులతో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఏడువేల పరుగులు సాధించిన 51వ క్రికెటర్‌ టేలర్‌ కాగా, న్యూజిలాండ్‌ తరఫున ఆ ఫీట్‌ సాధించిన రెండో క్రికెటర్‌. అంతకు ముందు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాత్రమే కివీస్‌ తరఫున ఆ మార్కును చేరాడు. ఫ్లెమింగ్‌ తన కెరీర్‌లో 111 మ్యాచ్‌లకు గాను 189 ఇన్నింగ్స్‌లు ఆడి 7,172 పరుగులతో ఉన్నాడు. కివీస్‌ తరఫున ఏడు వేల టెస్టు పరుగుల క్లబ్‌లో చేరిన క్రికెటర్‌గా టేలర్‌ గుర్తింపు సాధించాడు. ఇప్పటి వరకూ 96 టెస్టులు ఆడిన టేలర్‌ 19 సెంచరీలు, 32 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో 228 వన్డేలు ఆడగా 8, 376 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 95 మ్యాచ్‌లు ఆడి 1,743 పరుగులతో ఉన్నాడు. ఇటీవల ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ వేగవంతంగా ఏడు వేల టెస్టు పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు ...

బిసిసిఐపై దాదా ఎఫెక్ట్

చిత్రం
ఇటీవల బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు విజయవంతం కావడంతో సాధ్య మైనన్ని డే అండ్‌ నైట్‌ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మొగ్గు చూపుతున్నాడు. ఈ విషయాన్ని దాదా గతంలోనే చెప్పినా, మరొకసారి పింక్‌ బాల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై స్పష్టత ఇచ్చాడు. అసలు పింక్‌ బాల్‌ టెస్టులను ఆడించాలనే యోచనకు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని స్టేడియాలకు తీసుకు రావాలనే ఉద్దేశమే ప్రధాన కారణమన్నాడు. ఇక నుంచి విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఆడే ప్రతీ టెస్టు సిరీస్‌లో ఒక పింక్‌ బాల్‌ మ్యాచ్‌ను ఉండేలా చూస్తామన్నాడు. పింక్‌ బాల్‌ టెస్టు సక్సెస్‌ కావడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని ముందుకు తీసుకెళ్లడమే నా తదుపరి లక్ష్యం. ప్రతీ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్‌ టెస్టు కావాలని నేను అనను. ఒక టెస్టు సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ డే అండ్‌ నైట్‌ జరగాలి. నా యొక్క అనుభవాన్ని ఉపయోగించి మిగతా చోట్ల ఎలా పింక్‌ బాల్‌ నిర్వహించాలనే దాని కోసం యత్నిస్తా. టెస్టు మ్యాచ్‌కు ఐదు వేల మంది మాత్రమే వస్తే ఏ క్రికెటర్‌ మాత్రం ఆడటానికి ఇష్ట పడతాడు. అలా ఆడాలంటే ఏ క్రికెటర్‌ ఇష్టంతో ఆడడ...

నివాస్ పై నిషేధం

చిత్రం
అండర్‌-19 క్రికెట్‌ టోర్నమెంట్‌లు ఆడేందుకు వయసు దాచి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డునే తప్పు దారి పట్టించే యత్నం చేసిన ఢిల్లీ క్రికెటర్‌ ప్రిన్స్‌ రామ్‌ నివాస్‌ యాదవ్‌పై నిషేధం వేటుపడింది. ఈ మేరకు రామ్‌ నివాస్‌ యాదవ్‌ దొంగ సర్టిఫికేట్‌ ఇచ్చాడనే విషయం తాజాగా వెలుగు చూడటంతో అతనిపై నిషేధం విధిస్తూ బీసీసీఐ  నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిషేధం రెండేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని బోర్డు తెలిపింది. దీంతో 2020-21, 2021-22 సీజన్‌లలో దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే అవకాశాన్ని రామ్‌ నివాస్‌ కోల్పోయాడు. అతను వయసుతో బోర్డును, రాష్ట్ర అసోసియేషన్‌ను తప్పు దోవ పట్టించే యత్నం చేశాడు. దీనిపై బీసీసీఐ నుంచి మాకు సమాచారం అందింది. అందుకే అతనిపై విచారణ చేపట్టగా తప్పు చేసినట్లు తేలింది అని డీడీసీఏ తెలిపింది. నివాస్ 1996, జూన్‌ 10వ తేదీన పుడితే, బీసీసీఐకి ఇచ్చిన సర్టిఫికేట్‌లో 2001, డిసెంబర్‌ 12వ తేదీన పుట్టినట్లు ఉంది. ఈ విషయం అతని సెకండరీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికేట్‌లో బట్ట బయలు అయ్యింది. ఏకంగా ఐదు ఏళ్ల తేడాతో బోర్డునే బురిడీ కొట్టించాలని చూడటంతో బీసీసీఐ సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ క్రికెట్‌ ...

మళ్ళీ మెరిసిన మెస్సీ

చిత్రం
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్‌ డి ఓర్‌’ అవార్డును అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీ మరోసారి ఎగరేసుకు పోయాడు. ఈ అవార్డు కోసం పోర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోతో పాటు డచ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ వాన్‌ దిజ్క్‌లు పోటీ పడ్డారు. అయితే వీరిద్దర్నీ వెనక్కి నెట్టిన మెస్సీ బ్యాలర్‌ డి ఓర్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇలా తన ఫుట్‌బాల్‌ కెరీర్‌లో బ్యాలన్‌ డి ఓర్‌ అవార్డును మెస్సీ సాధించడం ఆరోసారి. ఫలితంగా రొనాల్డో రికార్డును మెస్సీ బ్రేక్‌ చేశాడు. రొనాల్డో ఐదుసార్లు మాత్రమే బ్యాలన్‌ డి ఓర్‌ అవార్డును అందుకోగా, మెస్సీ దాన్ని సవరిస్తూ ‘సిక్సర్‌’ కొట్టాడు. 2009, 2010, 2011, 2012, 2015, 2019ల్లో బ్యాలన్‌ డి ఓర్‌ పురస్కారాన్ని మెస్సీ దక్కించు కున్నాడు. ఇక రొనాల్డో 2008, 2013, 2014, 2016, 2017ల్లో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల కేటగిరిలో అమెరికా సాకర్‌ ప్లేయర్‌ మెగాన్‌ రాపినో బ్యాలన్‌ డీ ఓర్‌ పురస్కారాన్ని అందు కున్నారు. తాజాగా మెస్సీ బ్యాలన్‌ డి  ఓర్‌ పురస్కారాన్ని అందు కోవడం ఇంగ్లండ​ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ ...

ఇంటెల్ డిజైన్ తో ఉపాధి

చిత్రం
హైదరాబాద్ ఇప్పుడు అన్ని ఐటీ, ఈ కామర్స్ కంపెనీలకు కేరాఫ్ గా మారింది. దీంతో వెలది మంది ప్రతిభావంతులకు భారీగా అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ ఇండియా డిజైన్, ఇంజనీరింగ్‌ సెంటర్‌ను మన నగరంలో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపు టడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెల కొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సిబ్బంది పరంగా కొత్త సెంటర్‌ ఏడాదిలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుందని ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజా ఎం కోడూరి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సా స్కేల్‌ సూపర్‌ కంప్యూటర్‌ అభివృద్ధిలో హైదరాబాద్‌ కేంద్రం పాలు పంచు కుంటుందని కూడా వెల్లడించారు. ఈ సూపర్‌ కంప్యూటర్‌ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపు దిద్దుకుంటుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే ఈ రంగంలో 30,000 పై చిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. 5,000 కోట...

పల్లెకు పోదాం చలో చలో

చిత్రం
అన్ని కంపెనీలు పల్లెల బాట పడ్డాయి. అసలైన వ్యాపారం ఇక్కడే జరుగుతోంది. దీంతో నిన్నటి దాకా పట్టించుకోని పల్లెలు ఇప్పుడు కళకళ లాడుతున్నాయి. తాజాగా వెహికిల్స్ కోసం పల్లెవాసులు క్యూ కడుతున్నారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రియల్ ఎస్టేట్ దందా ఎక్కువై పోయింది. ప్రతి ఊరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అడ్డాగా మారి పోయింది. తాజాగా ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ కు వాహనదారులు, కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. సిటీ కల్చర్ గ్రామీణులపై పడుతోంది. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా, లేటెస్ట్ గా సమృద్ధిగా కురిశాయి. ఆటోమొబైల్స్ కంపెనీలన్నీ పల్లె పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్‌ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారి పోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామ...

దిశ మరణం బాధాకరం

చిత్రం
హైదరాబాద్ నగర శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన దిశ కుటుంబ సభ్యులను హీరో మంచు మనోజ్‌ పరామర్శించారు. శంషాబాద్‌లోని దిశ ఇంటికి వెళ్లిన మనోజ్‌ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇళ్లలో మగవాళ్లు ఆడవాళ్లపై చేయి చేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఇది చెడు సంప్రాదాయానికి దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దిశ నిందితులకు ఊరి శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. అలాగే మనోజ్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో ఓ సందేశాన్ని ఉంచారు. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలని, వారిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో తాను మాట్లాడిన వీడియోను కూడా మనోజ్‌ పోస్ట్‌ చేశారు. ఇవాల్టి నుంచి మనస్ఫూర్తిగా ఆడవాళ్లందరిని గౌరవిద్దాం. ఈ విషయాన్ని అందరూ తమ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. అమ్మాయిలకు ఐ లవ్యూ చెప్పడంలో తప్పు లేదు. కానీ వారు ఒప్పుకోక పోయినా ఇబ్బంది పెట్టడం తప్పు. అమ్మాయి నచ్చలేదని చెపితే, థాంక్యూ అమ్మా అని త...

అత్యాచారం..అయ్యో పాపం

చిత్రం
ప్రఖ్యాత నటి అత్యాచార వీడియో లీకైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అత్యాచారం జరిగిన రెండేళ్ల తర్వాత వీడియో లీకవడం గమనార్హం. బిగ్గెస్ట్‌ టీవీ రియాలిటీ షో బిగ్‌ బ్రదర్‌  ఆధారంగా స్పెయిన్‌లో ‘గ్రాన్‌ హెర్మానో’ షో టెలికాస్ట్ అవుతోంది. 2017లోని సీజన్‌లో స్పానిష్‌ నటి కార్లోటా ప్రాడో పాల్గొంది. ఆ హౌస్‌లోకి ఆమె ప్రియుడు జోస్‌ మారియా లోపెజ్‌ కూడా వచ్చాడు. వీరిద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా కలిసి మెలిసి ఉండే వారు. ఇదిలా ఉండగా ఓ నాడు ఇంటి సభ్యులంతా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అందరూ మద్యం సేవించి మత్తులో ఎక్కడి వారక్కడే స్పృహ లేకుండా పడి పోయారు. ఈ క్రమంలో కార్లోటాపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. దీంతో షో నియమాలు ఉల్లంఘించిన కారణంగా మారియా లోపెజ్‌ను షో నుంచి పంపించేశారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్లోటాను ఓ గదిలోకి పిలిపించి కెమెరాల్లో రికార్డైన అత్యాచార వీడియోను చూపించారు. అది చూసి స్థానువైపోయిన కార్లోటా..ఆపండి.. ప్లీజ్‌.. నావల్ల కాదు, దయచేసి ఆపేయండి అంటూ చేతులెత్తి వేడుకుంది. రోదిస్తున్న హృదయంతో, కన్నీళ్లతో అర్తించింది. అయినా సరే,...

జియో లవర్స్ కోసం మూవీస్

చిత్రం
అంతా ఉచితమే. ఏదీ కట్టకండి. డిజిటల్ మీడియా పుణ్యమా అంటూ దిగ్గజ కంపెనీలు బంపర్ ఆఫర్లు, గిఫ్టులు, కూపన్లు, ఆకట్టుకునే టారిఫ్ లతో హోరెత్తిస్తున్నాయి. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్ ఇలా ప్రతి కంపెనీ వీడియో స్ట్రీమింగ్ మీద దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు చూస్తే భారీ వ్యాపారం జరుగుతోంది సోషల్, డిజిటల్ మీడియా ద్వారా. కోట్లాది రూపాయల దందా సైలంట్ గా కొనసాగుతోంది. దీంతో బడా కంపెనీలన్నీ డిజిటల్ మీడియా జపం చేస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా చూస్తే మొత్తం మీడియా బిజినెస్ లో దాదాపు 60 శాతానికి మించి ఇండియాలోనే జరుగుతోంది. దీంతో దిగ్గజ కంపెనీలన్నీ భారత్ బాట పడ్డాయి. ఇక ఇప్పటికే ఇండియా వ్యాపారంలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ కంపెనీ డిజిటల్ మీడియా మీదే ఎక్కువ కాన్సెన్ట్రేషన్ చేస్తోంది. దీని బిజినెస్ ఊహించని రీతిలో పెరుగుతూ పోతోంది. ఓ వైపు మిగతా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు జియో కొడుతున్న దెబ్బకు లబోదిబో మంటున్నాయి. చేసేది లేక సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దెబ్బకు కునారిల్లి పోయాయి. ఇంకో వైపు వోడా ఫోన్ కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో చెల్లించ లేమంటూ కోర్టును ఆశ్రయించింది. అయి...

ఫీనిక్స్‌కు పెటా అవార్డు

చిత్రం
వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హాలీవుడ్ సూపర్ స్టార్. లక్షలాది మంది అభిమానుల ఆరాధ్య దైవం జోక్విన్ ఫీనిక్స్ కెరీర్లో అరుదైన పురస్కారం దక్కింది. ఆయన ఇటీవలే నటించిన జోకర్ సినిమా ప్రపంచాన్ని ఊపేస్తోంది. కోట్లాది డాలర్లు కురిపిస్తోంది. ఇదిలా ఉండగా జోకర్‌ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ జోక్విన్ ఫీనిక్స్ పీపుల్స్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌ 2019 'పర్సన్ ఆఫ్ ద ఇయర్‌' అవార్డుకు ఎంపిక అయ్యాడు. ప్రముఖ హాలీవుడ్‌ మేగజీన్‌ ది హాలీవుడ్ రిపోర్ట్‌ ప్రకారం, ఫీనిక్స్ మూడు సంవత్సరాల వయస్సు నుంచే శాకాహారిగా ఉన్నాడు. స్వతహాగా జంతు ప్రేమికుడైన అతడు. 'వీగన్‌' ఆహార శైలికి అలవాటు పడి, దీర్ఘకాలం నుంచి జంతు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇదే విషయాన్ని పెటా అధ్యక్షుడు ఇంగ్రీడ్‌ న్యూకిర్క్ ప్రస్తావిస్తూ. నిరంతరం జంతు హక్కుల కోసం పోరాడేందుకు ఎల్ల వేళలా ముందుండే వ్యక్తి జోక్విన్ ఫీనిక్స్ అని అన్నారు. జంతువుల సంరక్షణ కోసం ఎటువంటి సంకోచం లేకుండా పాటుపడే వ్యక్తి అని కొనియాడారు. కాగా వన్యప్రాణులను సర్కస్‌లో ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు రావడం...