పోస్ట్‌లు

ఏప్రిల్ 21, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ధ‌నా ధ‌న్..జ‌న్ ధ‌న్ - భారీగా న‌గ‌దు జ‌మ

చిత్రం
ఎవ‌ర‌న్నారు జ‌నం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని. ఈ దేశం వంద కోట్ల‌కు పైగా జ‌నాభా వుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు కేవలం ఒకే ఒక్క రూపాయి చొప్పున జ‌మ చేస్తే చాలు..110 కోట్ల‌కు పైగా జ‌మ అవుతుంది. ఇది కూడా ఓ రికార్డే. ఆయా ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో భారీ ఎత్తున వ్య‌క్తిగ‌త‌, ఉమ్మ‌డి, క‌రెంట్ ఖాతాలు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా లాక‌ర్ల‌లో బంగారం, వెండి, వ‌జ్రాలు జ‌మ చేశారు ఇండియ‌న్స్. వీరితో పాటు ప్ర‌వాస భార‌తీయులు కూడా ప్ర‌త్యేకంగా త‌మ వారి కోసం డాల‌ర్లు పంపిస్తున్నారు. అవి కూడా వారి ఖాతాల్లో మూలుగుతున్నాయి. దీనిని గ‌మ‌నించిన ప్ర‌ధాని మోడీ అధికారంలోకి రాగానే వాటిపై క‌న్నేశారు. ఏకంగా మీరు జ‌మ చేయండి..మేము మీకు అంతే మొత్తంలో జ‌మ చేయ‌డంతో భారీగా జ‌న్ ధ‌న్ ఖాతాల‌లోకి వెల్లువ‌లా డ‌బ్బులు వ‌చ్చి ప‌డ్డాయి. పీఎం పిలుపుతో ల‌క్ష‌లాది మంది జ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చారు. తాము క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న డ‌బ్బుల‌ను జ‌మ చేస్తూ పోయారు. రికార్డు స్థాయిలో ల‌క్ష కోట్ల‌కు చేరువ‌ల్లో డిపాజిట్లు జ‌మ కావ‌డంతో అటు బ్యాంకులు, ఇటు వాటిని నియంత్రిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశ్చ‌ర్యానికి లోనైంది. 2014లో మొద‌టి సారిగా ...

అతి పెద్ద ప్యాసెంజ‌ర్స్ ఫ్ల‌యిట్ న‌డిపిన అయిషా - అర‌బ్ మ‌హిళ సాధించిన ఘ‌న‌త

చిత్రం
ఆకాశంలో ఎగ‌రాలంటే భ‌యప‌డ‌తాం. ఎప్పుడు కూలుతుందో..ఎప్పుడు ఎక్క‌డ ల్యాండ్ అవుతామో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుంటాం. ముస్లింలు అనేస‌రిక‌ల్లా క‌ట్టుబాట్లు అడ్డు వ‌స్తాయి. కానీ అర‌బ్ కంట్రీస్‌లో ఇపుడు ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అంటూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దుబాయిలోనైతే ఆ దేశ‌పు యువ‌రాజు అంద‌రికీ స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించారు. అన్ని రంగాల్లో పురుషుల‌తో స‌మానంగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు అక్క‌డి మ‌హిళ‌లు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ప్ర‌యాణికులు ప్ర‌యాణం సాగించే విమానాన్ని న‌డ‌పాలంటే ఎంత ధైర్యం..ద‌మ్ముండాలి. కానీ అర‌బ్‌కు చెందిన అయిషా అల్ మ‌న్సౌరీ అనే మ‌హిళా పైల‌ట్ ఏకంగా భారీ ట్రావెల‌ర్స్ ఉన్న ఏ380 విమానాన్ని న‌డిపించి ..రికార్డు సృష్టించింది. ప్ర‌పంచ విమాన‌యాన చ‌రిత్ర‌లో ఇదో అరుదైన రికార్డుగా భావించాల్సి ఉంటుంది. అన్ని విమానాల‌లో కంటే ఈ విమానానికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. దీనిలో ఎక్కువ మంది ప్ర‌యాణించేందుకు వీలుంది. అన్ని సౌక‌ర్యాలు ఇందులో ఉంటాయి. పురుషుకు ధీటుగా ..అయిషా అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శించి చ‌రిత్ర‌లోకి ఎక్కింది. ఎన్నో దేశాల ...

మార్పు సాధ్యమే..మౌనం వీడిన ప‌వ‌ర్ స్టార్

చిత్రం
ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన పార్టీ అధినేత‌..ప‌వ‌ర్ స్టార్ కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ మౌనం వీడారు. మార్పు అన్న‌ది ఒక్క‌సారిగా జ‌ర‌గ‌ద‌ని..అది మెల మెల్ల‌గా ప్రారంభ‌మ‌వుతుంద‌ని..ఆ విష‌యంలో ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో తేట‌తెల్ల‌మైంద‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌కంటే ముందే అటు తెలంగాణ‌లో ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల స‌మావేశాల్లో , రోడ్ షోల‌లో ప‌వ‌న్ పాల్గొన్నారు. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీని..ప‌వ‌ర్‌లోకి రావాల‌ని ..అప్పుడే కేబినెట్‌ను రూపొందించుకుంటున్న వైసీపీని ఆయ‌న టార్గెట్ చేశారు. ఎన్న‌డూ లేనంత‌గా అవినీతి, అక్ర‌మాలు బాబు పాల‌న‌లో చోటు చేసుకున్నాయ‌ని..త‌క్కువ ధ‌ర‌కే పేద‌ల నుండి భూములు లాక్కున్నార‌ని ..మార్కెట్ ధ‌ర చెల్లించ‌లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. తాను ఎవ్వ‌రి గురించి వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌న‌ని..కానీ త‌న‌ను ల‌క్ష్యంగా చేస్తూ కామెంట్స్ చేస్తే ఊరుకోన‌ని..తాట తీస్తానంటూ ప‌వ‌ర్ స్టార్ జ‌గ‌న్‌ను ఉద్ధేశించి ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. యువ‌తీ యువ‌కులు చైత‌న్య‌వంతం కావాల‌ని..స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యేంత దాకా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నాయ‌కులు నిద్ర పోరాదంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల...

ఎడిట‌ర్స్ ఛాయిస్ - మార‌ణ‌హోమాన్ని ఆప‌లేమా ..?

మాన‌వ‌త్వం త‌ల్ల‌డిల్లిన స‌మ‌యం ఇది. స‌భ్య స‌మాజం త‌లొంచు కోవాల్సిన ప‌రిస్థితి. అత్యంత దారుణ‌మైన సంఘ‌ట‌న ఇది. క‌న్నీళ్లు ఉబికి వస్తున్న వేళ‌..ఎన్ని శాంతి ప్ర‌వ‌చ‌నాలు ప‌లికినా జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగి పోయింది. ఘోర‌మే మిగిలింది. ఉగ్ర‌వాదం పెచ్చ‌రిల్లి పోయినా..ఆయా దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దులు చెరిగి పోయినా ఇంకా ఉగ్ర మూకలు త‌మ దాడులు ఆప‌డం లేదు. ఇది ముమ్మాటికి ఏలిన వారు..ప్ర‌స్తుత పాల‌కులే బాధ్య‌త వ‌హించాలి. ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం అని అనుకోవ‌డానికి వీలు లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగ్ర మూక‌లు ప్ర‌తి చోటా త‌మ స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసుకున్నారు. వారిని గుర్తించ‌డం అన్న‌ది క‌ష్టంగా మారింది. కోట్లాది రూపాయ‌లు శాంతి భ‌ద్ర‌త‌ల కోసం ఖ‌ర్చు చేస్తున్నాయి ఆయా దేశాలు . అయినా ఉగ్ర‌వాదం స‌మ‌సి పోవ‌డం లేదు. ఎక్క‌డ చూసినా ఏదో రూపకంగా దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. వీటిని క‌ట్ట‌డి చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి ఆయా దేశాల పోలీసులు. ఓ వైపు బాంబుల మోత‌..ఇంకో వైపు రాకెట్ల దాడులు..ఇంకో వైపు అణుబాంబుల ప్ర‌యోగాలు..ఇలా ఎక్క‌డిక‌క్క‌డ ఆధిప‌త్యం కోసం అంత‌ర్యుద్ధాలు మొద‌ల‌య్యాయి. కోట్లాది ప్ర‌జ‌లు స‌గానికి పైగా ...

దుర‌దృష్టం వెంటాడింది..అదృష్టం వెన్ను త‌ట్టింది - ధోనీ శ్ర‌మ వృధా

చిత్రం
దుర‌దృష్టం వెంట వుంటే..అదృష్టం ఎలా ద‌గ్గ‌రికి రాదో ధోనీని చూస్తే తెలుస్తుంది. స‌క్సెస్ ఫుల్ కెప్ట‌న్‌గా భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు అందించిన ఘ‌న‌త ఈ క్రికెట‌ర్‌దే. ఐపీఎల్ -12 టోర్నీలో భాగంగా చెన్నై జ‌ట్టు ఆఖ‌ర్లో టార్గెట్‌ను ఛేజ్ చేయ‌లేక చేతులెత్తేసింది. దీంతో ఒక్క ప‌రుగు తేడాతో బెంగ‌ళూరు ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యం సాధించింది. గెలుపున‌కు అతి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి బెంగ‌ళూరు బౌల‌ర్ల మ్యాజిక్ దెబ్బ‌కు బోల్తా ప‌డింది. టోర్నీలో వ‌రుస విజ‌యాలు సాధిస్తూ టాప్ పొజిష‌న్‌లో వున్న చెన్నై జ‌ట్టు రెండో సారి ఓట‌మి పాలైంది. ఆశ‌లు ఆవిరై పోయిన స‌మ‌యంలో బెంగ‌ళూరుకు అదృష్టం వ‌రించింది. ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రిత పోరులో బెంగ‌ళూరు అనూహ్య‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించిందిచెన్నై, బెంగ‌ళూరు క్రికెట్ అభిమానుల‌కు భ‌లే మ‌జా ల‌భించింది ఆట రూపంలో. ఇదీ మ్యాచ్ అంటే. ఇదీ క్రికెట్ అంటే. ధ‌నా ధ‌న్ ధోని దుమ్ము రేపాడు. మ‌రోసారి త‌న ప‌వ‌ర్ ఏమిటో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. టాస్ ఓడి కోహ్లి సేన ముందు బ్యాటింగ్‌కు దిగింది. పార్థివ్ ప‌టేల్ 37 బంతులు ఆడి రె...

దుమ్ము రేపిన స‌న్‌రైజ‌ర్స్ - ఓట‌మి పాలైన కోల్‌క‌తా

చిత్రం
హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంది. కేవ‌లం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ఈ జ‌ట్టు 9 వికెట్ల తేడాతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టును మ‌ట్టిక‌రిపించింది. టాస్ గెలిచి కోల్‌క‌తా జ‌ట్టుకు బ్యాటింగ్ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి కోల్‌క‌తా 159 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. హైద‌రాబాద్ జ‌ట్టులోని బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇరు జట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం కానుండ‌డంతో మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా ..ఉత్కంఠ భ‌రితంగా సాగుతుంద‌ని ఇరు జ‌ట్ల అభిమానులు ఆశించారు. వారి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. టోర్నీలో బ‌ల‌మైన జ‌ట్లుగా ఇరు జ‌ట్ల‌కు పేరుంది. కానీ ఏ కోశాన ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌గ‌లేదు. బెయిర్ స్టో కేవలం 43 బంతులు మాత్ర‌మే ఆడాడు. అంతేకాదు క‌ళ్లు చెదిరే షాట్ల‌ను బాదాడు. ఏడు ఫోర్లు ..నాలుగు బ్యూటిఫుల్ సిక్స‌ర్ల‌ను సాధించాడు. ఎలాంటి వ‌త్తిడి అంటూ లేకుండా సునాయ‌సంగా బ్యాట్ ఝులిపించాడు. స్టోకు తోడుగా మ‌రో వైపు డేవిడ్ వార్న‌ర్ రెచ్చి పోయాడు. బౌల‌ర్ల‌కు చుక్క‌లు చ...

మ‌హిళామ‌ణులు..స్ఫూర్తి శిఖ‌రాలు

చిత్రం
ఏదీ సుల‌భంగా ల‌భించ‌దు. అపార‌మైన వ‌న‌రులు..అంతులేని అవ‌కాశాలు ఎన్నో వుండొచ్చు. వాటిని అందిపుచ్చు కోవాలంటే కొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే. అన్నీ వుంటే విజ‌యం దానంత‌ట అదే ద‌క్కుతుంది. కానీ అల‌వోక‌గా సాధిస్తే అందులో మ‌జా ఏముంటుంది. కాలం మారింది..పురుషుల‌తో ధీటుగా మ‌హిళ‌లు రాణిస్తున్నారు. ప్ర‌తి రంగంలో త‌మ‌దైన అనుభ‌వాల‌ను ..విజ‌యాలుగా మారుస్తున్నారు. అలాంటి వారిలో ఇండియాకు చెందిన మ‌హిళామ‌ణులు ల‌క్షలాది మందికి స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు. వారెవ‌రో తెలుసు కోవాలంటే..ఈ క‌థ చ‌ద‌వాల్సిందే. మీరేం చేసినా ఓకే..కానీ భిన్నంగా చేయాలి. ఈ విష‌యం నేను మా అమ్మ గారి నుండి నేర్చుకున్నా. ఒక ఆంట్ర‌ప్రెన్యూర్‌గా ఇంత‌కంటే గొప్ప‌గా ఎవ‌రు చెబుతారు. దీని మీదే నేను నిల‌బ‌డి ఉన్నానని అంటోంది ..బెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా వినుతి కెక్కిన అనితా రాడ్డిక్ ఓ సంద‌ర్భంలో. ఐటీ, హెల్త్, లాజిస్టిక్, టెలికాం, త‌దిత‌ర రంగాల‌లో త‌మ‌దైన ముద్ర ఉండేలా క‌ష్ట‌ప‌డుతున్నారు. అర్పితా గ‌ణేష్ పేరు విన్నారా. ఇండియ‌న్ బ్రా లేడీగా ప్ర‌సిద్ధి చెందింది ఇండియాలో. బాలిక‌లు, మ‌హిళ‌లు లో దుస్తులు ధ‌రించాలంటే ఎంతో ఇబ్బంది ప‌డ‌తారు. ...

ద‌శ‌ల వారీగా ఎన్నిక‌లు - ఆశావ‌హుల్లో అభ్య‌ర్థులు

చిత్రం
తెలంగాణ‌లో పాల‌న పూర్తిగా స్తంభించి పోయింది. ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి ఎన్నిక‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. జ‌నానికి పాలు పోవ‌డం లేదు. రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంద‌న‌న్న ఆందోళ‌న మొద‌లైంది. గ్రామ పంచాయ‌తీల ఎన్నిక‌లు ముగిశాయి. తాగేందుకు నీళ్లు దొర‌క‌క పోయినా..సాగు, తాగు నీరంద‌క పోయినా..ప్ర‌తి ఊరులో మ‌ద్యం దొరుకుతోంది. బీర్లు, బార్లు బార్లా తెరిచే ఉంచుతున్నారు. ప్ర‌జ‌లంతా ఇపుడు భేదాలు మ‌రిచారు..విభేదాలు ప‌క్క‌న పెట్టారు. అంతా ఒకే చోట కూర్చుని తాగుతున్నారు. నీళ్లు లేక పోయినా ఉండ‌గ‌ల‌రేమో కానీ లేచిన‌ప్ప‌టి నుంచి ప‌డుకునే దాకా తాగ‌కుండా ఉండ‌లేక పోతున్నారు. అంతేనా డీజేలు, పాట‌ల‌తో హోరెత్తిస్తున్నారు. గ‌త ప‌ది నెల‌ల నుంచి ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక రాజ‌కీయ పార్టీ గురించి చ‌ర్చిస్తున్నారు. రాజ‌కీయం అంటే గులాబీ బాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే. అస‌లు ప్ర‌తిప‌క్షం అంటూ లేకుండా చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్షాలు విల‌విల‌లాడి పోతున్నాయి. ఎవ‌రు ఏ పార్టీ వైపు ఉన్నారో తెలియక ప్ర‌జ‌లు త‌ల‌లు బాదుకుంటున్నారు. నిన్న పంచాయ‌తీ లొల్లి పూర్త‌యితే..అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన...

పంతుళ్లు గ‌రం గ‌రం..ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం

చిత్రం
పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు ఇపుడు రోడ్డెక్కారు. త‌మ ప‌వ‌ర్ ఏమిటో..త‌మ ప్ర‌తాపం ఏమిటో త్వ‌ర‌లోనే తేలుస్తామంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు తెలంగాణ‌లో. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల రెవిన్యూ శాఖ‌లో అవినీతి పెరిగి పోయింద‌ని..దాంతో పాటే ఇక విద్యా శాఖను ప్ర‌క్షాళ‌న చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నిన్న‌టి దాకా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, పెన్ డౌన్లు చేప‌ట్టిన రెవిన్యూ శాఖ ఉద్యోగులు ఇపుడు మిన్న‌కుండి పోయారు. ఏదైనా స‌రే సంత‌కం కావాల‌న్నా..పేరు మార్చాల‌న్నా..పాసు పుస్త‌కాలు ఇవ్వాల‌న్నా..జ‌న‌న‌. మ‌ర‌ణ ప‌త్రాలు జారీ చేయాల‌న్నా చేతులు త‌డ‌పాల్సిందే. ఈ విష‌యం అంత‌ర్గ‌త స‌ర్వేలో కూడా నిజ‌మ‌ని తేల‌డంతో సీఎం సీరియ‌స్ గా తీసుకున్నారు. రెవిన్యూ శాఖ‌లో మార్పులు చేసేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఆ శాఖ‌ను వ్య‌వ‌సాయ శాఖ‌లో విలీనం చేస్తామంటూ ప్ర‌క‌టించారు. ఓ రైతు చేసిన ఫిర్యాదుపై సీఎం తీవ్రంగా స్పందించారు. వేలాది రూపాయ‌లు జీతాలు ఇస్తున్నా ఎందుకు అవినీతి , అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారో అర్థం కావ‌డం లేదంటూ కామెంట్స్ చేశారు. దీంతో సీఎం త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించు కోవాల‌ని రెవిన్యూ ...

ఇంట‌ర్ దెబ్బ‌కు ఠారెత్తిన స్టూడెంట్స్

చిత్రం
ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు 2019లో తెలంగాణ ప్ర‌భుత్వానికి తీర‌ని త‌ల‌వంపులు తెచ్చాయి. హెచ్ ఎండిఏ క‌మిష‌న‌ర్‌గా ఉన్న జ‌నార్ద‌న్ రెడ్డిని తీసుకు వ‌చ్చి విద్యా శాఖ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయినా విద్యా శాఖ తీరు మార‌లేదు. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంట‌ర్ స్టూడెంట్స్‌, పేరెంట్స్ ఆందోళ‌న‌ల‌కు దిగినా క‌నీసం విద్యా శాఖ మంత్రి ఏ ఒక్క మాట మాట్ల‌డ‌క పోవ‌డం శోచ‌నీయం. కేజీ టు పీజీ అంటూ నెట్టుకు వ‌స్తున్న స‌ర్కార్ రిజ‌ల్ట్స్ విష‌యంలో ఇంత‌వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద పేరెంట్స్ ..బాధిత విద్యార్థులు భారీ ఎత్తున చేరుకున్నారు. త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ గగ్గోలు పెట్టారు. ఏకంగా కార్య‌ద‌ర్శి అశోక్ కుమార్‌పై దాడి చేసినంత ప‌నిచేశారు. అయినా చ‌ర్య‌లు లేవు. గ‌తంలో అనుభ‌వం ఉన్న సంస్థ‌ను కాద‌ని వేరే శాఖ‌కు అప్ప‌గించ‌డం ..లెక్క‌లేన‌న్ని త‌ప్పులు దొర్ల‌డం..ర్యాంక‌ర్లు అనుకున్న స్టూడెంట్స్‌కు త‌క్కువ మార్కులు రావ‌డం..చాలా మంది ఫెయిల్ కావ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇంట‌ర్ శాఖ హ‌డావుడిగా ఈ ఫ‌లితాల‌ను ఎందు...