పోస్ట్‌లు

నవంబర్ 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆరోపణలు అవాస్తవం..విచారణకు సిద్ధం

చిత్రం
ప్రజా వేగుల పేరుతో చేసిన ఫిర్యాదులు అత్యంత అవమానకరమైనవిగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి దాకా నియమ నిబంధనలకు లోబడే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అంతా పని చేస్తున్నారని చెప్పారు. ఎప్పుడూ లెక్కలు తప్పలేదన్నారు. స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం స్పష్టం చేశారు. టాప్‌ మేనేజ్‌మెంట్‌ అనైతిక విధానాలకు పాల్పడు తోందంటూ ప్రజా వేగులు ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ అనైతిక విధానాలకు పాల్పడు తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నీలేకని చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంత...

సినీ దిగ్గజం..50 ఏళ్ళ ప్రస్థానం

చిత్రం
బిగ్..బి.. ఆ రెండు పదాలు పలికితే చాలు భారతీయుల గుండెలు అల్లాడి పోతాయి. కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఆ అరుదైన నటుడు, లివింగ్ లెజెండ్, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. కొన్నేళ్లుగా సినీ ప్రియులను అలరిస్తూ వస్తున్నారు. తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. హిందీ సినీ జగత్తులో అమితాబ్ బచ్చన్ తన 50 ఏళ్ల ప్రస్ధానాన్ని పూర్తి చేసుకున్నారు. సాథ్‌ హిందుస్తానీ చిత్రంతో బాలీవుడ్‌లో ఆయన అడుగు పెట్టారు. తన నటనతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూత లూగించారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ అమితాబ్‌ నటనకు సినీ ప్రియులు నీరాజనాలు పలికారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో పలు బ్లాక్‌ బస్టర్లు అందించారు. అమితాబ్ తన నట ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో అమితాబ్‌ ఎంట్రీ సీన్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందంటే అతిశ యోక్తి కాదు.బిగ్‌బీ తొలి మూవీ సాథ్‌ హిందుస్తానీ 1969 నవంబర్‌ 7న విడుదలై నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐదు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న అమితాబ్‌ తన నట వారసునిగా అభిషేక​ బచ్చన్‌ను పరిశ్రమకు అందించారు. ఈ  సందర్భంగా ఆయన కుమా...

మళ్ళీ అల్లిపురంకే అవకాశం

చిత్రం
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అల్లిపురం వేంకటేశ్వర రెడ్డికి మరో సారి అదృష్టం వరించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మన్‌గా వెంకటేశ్వర్‌ రెడ్డి కొనసాగ నున్నారు. ఎల్బీ స్టేడియం లోని తన చాంబర్‌లో   రెండో సారి చైర్మన్‌గా అల్లిపురం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం శాట్స్‌ తొలి చైర్మన్‌గా పీఠమెక్కిన ఆయన ఇటీవలే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. రెడ్డిది ఉమ్మడి పాలమూరు జిల్లా. మొదటి నుంచి వెంకటేశ్వర్ రెడ్డికి క్రికెట్ అంటే ప్రాణం. జిల్లాలో ఈ మాత్రం క్రికెట్ ఆటకు జనాదరణ ఉందంటే అది ఆయన చలవ వల్లనే. చిన్నారులు, యువతీ యువకులు ఎందరినో వెలుగులోకి తీసుకు వచ్చారు. 30 ఏళ్లకు పైగా క్రికెట్ కోసం ఎనలేని కృషి చేశాడు. ఓ వైపు డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తూనే క్రికెట్ ను శ్వాసగా మార్చుకున్నాడు. లెక్క లేనన్ని క్రికెట్ టోర్నమెంట్స్ చేపట్టాడు. ఆయనను అంతా క్రికెట్ వెంకట్ అని పిలుస్తారు. అధికార పార్టీలో కీలక పాత్ర పోషించారు. అయన కేసీఆర్ కు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. శాట్స్ చైర్మన్ పదవి కోసం బలమైన పోటీ ఏర్పడినా సీఎం అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డికే పగ్...

మనోళ్లు మహానుభావులు

చిత్రం
సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది పుస్తకాలే. జీవితాన్ని, లోకాన్ని ఆవిష్కరించే అరుదైన సన్నివేశం ఒక్క రచయితలు, కవులు, కళాకారులకు మాత్రమే దక్కుతుంది. సాహిత్య పరంగా భారత దేశం సమున్నతమైన శిఖరాలను అధిరోహించింది. వేలాది మంది తమ ప్రతిభా పాటవాలతో అద్భుతమైన రచనలు వెలుగులోకి తీసుకు వచ్చారు. ఇదంతా క్రియేటివిటీకి సంబంధించింది. ఇక ఇండియా పరంగా చూస్తే అత్యుత్తమమైన, ఎన్నదగిన 10 మంది రైటర్స్ ను ఓ సంస్థ ఎంపిక చేసింది. వారిలో మొదటి ప్లేస్ దక్కించుకున్నారు చేతన్ భగత్. ఆర్ట్, లిటరేచర్, సైన్స్, తదితర రంగంలో ఎందరో రాణిస్తున్నారు. ఈ దేశంలో కుల, మతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 20 భాషల్లో సాహిత్యం విరాజిల్లుతోంది. ది న్యూ యార్క్ టైమ్స్ 2008 లో ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ లో టాప్ రైటర్ గా చేతన్ భగవత్ ను ఎంపిక చేసింది. ఆథర్, స్క్రీన్ రైటర్, కాలమిస్ట్, టీవీ పెర్సనాలిటీ గా పేరొందారు. టూ స్టేట్స్ , హాఫ్ గర్ల్ ఫ్రెండ్, వన్ ఇండియన్ గర్ల్ పేరుతో పుస్తకాలు రాశారు. రెండో ప్లేస్ లో అమ్రితా ప్రీతం నిలిచారు. పోయెట్రీ, లిటరేచర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచారు. ఆమె రచనా శైలీ ఎందరినో ఆకట్టుకుంది. మరో ఎన్నదగిన ర...

తొలగని ప్రతిష్టంభన..తప్పని నిరీక్షణ

చిత్రం
తమ డిమాండ్ల సాధన కోసం అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మరోసారి సీఎం ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికైనా సంఘాల మాటలు పక్కన పెట్టి, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. కేసీఆర్ డెడ్ లైన్ ను ససేమిరా అన్నారు కార్మికులు. సమస్యలు పరిష్కరించే దాకా ఆందోళన విరమించమని బాధితులు తేల్చి చెప్పారు. ఇక చర్చలు కాదు కదా, అసలు ఆర్టీసీనే ఉండదని ప్రభుత్వం అంటోంది. డిమాండ్లలో వేటిని అంగీకరిస్తారో, వేటిని తిరస్కరిస్తారో తర్వాత, ముందు చర్చలకు పిలవండి అని కార్మిక సంఘాలు అంటున్నాయి. అసలు సమ్మె ఎప్పుడు ముగుస్తుందోనని తెలంగాణ జనం ఎదురు చూస్తోంది. ప్రభుత్వం ముందే ప్రకటించినట్టు ప్రైవేటు బస్సులతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 5,100 రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మిగతా రూట్లను ఆర్టీసీకి వదిలేయాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కేవలం 1,700 మంది మాత్రమే మిగిలారు. బస్సులు నడవాలంటే 23 వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. గత్యంతరం లేక మిగతా రూట్లను కూడా ప్రైవేటు బస్సులతోనే నడిపించాలని నిర్ణయి...

మరాఠాలో న్యూ ట్విస్ట్..గడ్కరీకి ఛాన్స్..?

చిత్రం
డెడ్ లైన్ విధించినా మరాఠాలో రాజకీయాలలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. రోజు కో ట్విస్ట్ ఇస్తూ బీజేపీ, శివ సేన పార్టీలు జనాన్ని మరింత ఉత్కంఠకు లోను చేస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. అయినా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. సీఎం ఫడ్నవీస్‌ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో భేటీ కావటం, బీజేపీ, శివ సేన తెర వెనుక చర్చలు, బీజేపీ నేతలు గవర్నర్‌ భగత్‌సింగ్‌ను కలవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. వీరిలో ప్రస్తుత సీఎం ఫడ్నవిస్ లేక పోవడం విస్తు పోయేలా చేసింది. గవర్నరును కలవటంపై తమకు ఆహ్వానం లేదని శివసేన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెర వెనక పరిణామాలు చాలానే జరుగుతున్నాయి. ప్రతిష్టంభన తొలగాలంటే గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్‌ చీఫ్‌ భావిస్తున్నారనేది రాజకీయ వర్గాల సమాచారం. దీనికి శివసేన తేలిగ్గా అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఆది నుంచీ శివసేనతో గడ్కరీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దివంగత అధ్యక్షుడు బాల్‌ థాకరేకు గడ్కరీ అత్యంత సన్నిహితుడు. థాకరే జీవించి ఉన్న రోజుల్లో గడ్కరీ ఆయన నివాసం మాతోశ్రీకి తరచూ వెళ్లేవారు. బీజేపీ, శివ సేన ల మధ్య ఎప్...

భారతీయ కలాలకు లోకం ఫిదా

చిత్రం
దేశాన్ని కాషాయ మయం చేయాలని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవతి పునరాలోచించేలా జనం కోసం నిలబడిన భారతీయ ప్రతిభావంతులు, రచయితలకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్‌ నవలలు రాసిన మొదటి 100 మందిలో,  ప్రముఖ భారతీయ రచయితలు ఆర్‌.కే.నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్‌ రష్దీ, విక్రమ్‌ సేత్‌లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాల సాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్‌ రాసిన ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ ధింగ్స్‌ పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్‌కే నారాయణ్‌ రాసిన స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ సెక్షన్‌లో, సల్మాన్‌ రష్దీ రాసిన ది మూర్స్‌ లాస్ట్‌ సై రూల్‌ బ్రేకర...

జగన్ రెడ్డి నిర్ణయం..విశిష్ట సేవలకు పురస్కారం

చిత్రం
తన తాత రాజా రెడ్డి లోని పట్టుదల, తండ్రి రాజా శేఖర్ రెడ్డి లోని తెగువను పుణికి పుచ్చుకున్న ప్రస్తుత ఏపీ సియంగా ఉన్న సందింటి జగన్ మోహన్ రెడ్డి అసాధారణమైన రీతిలో జనరంజకమైన పాలనను కొనసాగిస్తూ ఇతరులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. తనను నమ్ముకున్న వారికి సముచితమైన రీతిలో గుర్తింపు ఇస్తున్నారు. కష్ట కాలంలో తన వెంట ఉన్న నటులు పృథ్వీ రాజ్, ఆలీ, మండలి బుద్ధ ప్రసాద్, రోజా, లక్ష్మి పార్వతి, విజయ సాయి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులకు పదవులను కట్టబెట్టారు. ఇదే సమయంలో జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా వివిధ రంగాలలో విశిష్టమైన రీతిలో సేవలు అందించిన 100 మందికి లైఫ్ టైం అవార్డులతో సత్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పురస్కారం కింద 10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు. సామాజిక, సేవా రంగాలు, సామాజిక ప్రాజెక్టులక...

లక్ష్మీ పార్వతికి కీలక పోస్ట్

చిత్రం
తాను మాటల సీఎం ను కాదని, చేతల మనిషినని చేసి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. తాను పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ, తనకు అండగా ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి సముచితమైన రీతిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాబోయే కాలంలో మరో అయిదేళ్ల పాటు ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు. మరో వైపు విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తాను మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయకుండానే పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు ఈ యువ నేత. తన గెలుపు కోసం కష్టపడిన ఎమ్మెల్యే రోజా, ప్రముఖ హాస్య నటులు ఆలీ, పృథ్వీ రాజ్ లకు కీలక పదవులు కట్టబెట్టారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మి పార్వతి కి కీలక పదవి అప్పగించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆమెను ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.1962, ఆగష్టు 10 న జన్మించింది. సాహిత్యంలో ఆమెకు మంచి పట్టుంది. తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవిత చరిత్ర రాసే ఉద్దేశముతో ఆయన్ను కలుసుకున్నది. రామారావ...

విప్లవ స్ఫూర్తి..జార్జి రెడ్డి దిక్సూచి

చిత్రం
ప్రవహించే ఉత్తేజం జార్జి రెడ్డి. అతడు మరణించినా ఆ రూపం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన ఆ యోధుడి పేరు ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉన్నది. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నా యకుడుగా ఎదిగాడు జార్జిరెడ్డి. అలాంటి ఆదర్శ నీయమైన విద్యార్థి నేత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. దళం జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పోస్టర్స్ కు జనాదరణ లభిస్తోంది. చరిత్ర మరిచి పోయిన లీడర్ అనే విషయాన్ని ట్రైలర్ లో బాగా హైలెట్ చేశారు. ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టు కుంటోంది. ప్రసుతం ట్రెండింగ్ లో ఉంది. పోస్టర్ కూడా దుమ్ము రేపుతోంది.1965 నుంచి 1975 దాకా ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ రెడ్డి జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి డైనమిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా దీనిని రూపొందించాడు డైరెక్టర్. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచి...

రిస్క్ తోనే ఇన్వెస్ట్ చేశా

చిత్రం
టాటా గ్రూప్ ఆఫ్ కంపీనీస్ చైర్మన్ రతన్ టాటా చేసిన కామెంట్స్ సంచలనం కలిగించింది. ఆస్తులు, డబ్బులు ఎన్ని ఉన్నా పెట్టుబడి పెట్టాలనే రూల్ ఏమీ లేదన్నారు. ఒక స్థాయికి వచ్చాక ప్రతిదీ రిస్క్ తో కూడుకుని ఉంటుందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టార్ట్ అప్ లలో పెట్టుబడులు పెట్టానని టాటా చెప్పారు. నేను మొదట్లో వీటి పట్ల కొంత దూరంగా ఉన్నా. అనుకోకుండా స్టార్టప్‌ ఇన్వెస్టరుగా మారానని తెలిపారు. టాటా గ్రూప్‌లో కీలక హోదాలో ఉన్నప్పుడు స్టార్టప్‌ సంస్థల పట్ల చాలా ఆసక్తి కరంగా అనిపించేది. అయితే వాటిని కాస్త అంటరానివి గానే చూసే వాణ్ని. ఎందుకంటే ఏదో ఒకటి, ఎక్కడో ఒక చోట టాటా గ్రూప్‌నకు ప్రయోజనాల వైరుధ్యం ఉండేదన్నారు. అయితే చైర్మన్ గా రిటైర్ అయ్యాక ఫ్రీడమ్ లభించింది. దీంతో ఆసక్తికరంగా అనిపించిన సంస్థల్లో నా సొంత డబ్బును కొద్దీ కొద్దిగా ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించానని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ రిస్కు తీసుకున్నా అన్నారు. పెట్టుబడులు పెడుతున్నా కదా అని నా దగ్గర బోలెడంత డబ్బు ఉందని అనుకోవద్దు అని రతన్‌ టాటా చెప్పుకొచ్చారు. స్టార్టప్స్‌ ప్రమోటర్లలో కసి, వినూత్న ఐడియాలు, అవి అందించే పరిష్కార మార్గాలు వంట...

మహీంద్రాకు భారీ లాభం

చిత్రం
ఐటీ సెక్టార్ లో టాప్ పొజిషన్ లో ఉన్న టెక్ మహీంద్రా కంపెనీకి భారీ లాభం సమకూరింది. ఈ ఆర్థిక ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో 1,124 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం  1,064 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించినట్లు టెక్‌ మహీంద్రా ఎండి, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్య కలాపాల ఆదాయం 8,630 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో 9,070 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఇక డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 14 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 128 కోట్ల డాలర్లకు పెరిగాయి. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 4 శాతం పెరిగింది. డిజిటల్‌ విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 12 శాతం ఎగసింది. నిర్వహణ లాభం 7 శాతం తగ్గి 501 కోట్లకు చేరింది. ఏటీఅండ్‌టీ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని ఈ క్యూ2లో కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ కొత్తగా  5,749 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,522 కు పెరిగింది. అమెరికాకు చెందిన బార్న్‌ గ్రూప్‌ కంపెనీని 671 కోట్లకు టెక్‌ మహీంద్రా అనుబంధ సంస్థ, పీటీఈ లిమిటెడ్‌ కొనుగోలు చేయనున్నది. న...

సేనకు పవార్ పంచ్

చిత్రం
మరాఠాలో సీఎం కుర్చీ పీటముడి ఇంకా వీడలేదు. ఏదైనా ఇస్తామంటున్న బీజేపీ ఆ ఒక్కటి అడుగొద్దంటోంది. దీంతో ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని శివసేన పావులు కదుపుతోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో నైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పీఠాన్ని అధిష్టించాలని భావిస్తున్న శివ సేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్సీపీ మద్దతు కోసం శివ సేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ నెరిపిన దౌత్యం ఫలించలేదు. ప్రభుత్వంలో చేరేది లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెగేసి చెప్పారు. ప్రజా తీర్పునకు అనుగుణంగా తాను, తన మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించాలను కోవడం లేదు. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు.  కొన్ని రోజుల పాటు నేను ముంబైలో ఉండటం లేదు. పుణె, సతారా, కరాద్‌ ప్రాంతాల్లో పర్యటించబోతున్నాను అని శరద్‌ తెలిపారు. శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌తో భేటీ అనంతరం మాట్లాడారు. మర్యాద పూర్వకంగా శరద్‌తో భేటీ అయినట్టు రౌత్‌ చెప్తున్నప్పటికీ.. బీజేపీ రహిత ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోరేందుకు ఆయన పవార్‌తో భేటీ అయినట్...